మనమంతా మోడీ కుటుంబం

- పీఎఫ్ఐ ముక్త్ జగిత్యాల కావాలి. - జీవన్ రెడ్డి పై ఎలాంటి ఆరోపణలు లేవు ఆయన సోదరునిపైనే అన్ని ఆరోపణలు

On
మనమంతా మోడీ కుటుంబం

జగిత్యాల ఏప్రిల్ 12( ప్రజా మంటలు ) : 

మనమంతా మోడీ కుటుంబం సభ్యులమని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు.

శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల భావి వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షులు మోర పెల్లి సత్యనారాయణ రావు తో కలిసి చాయ్ పై చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు.

నిజాంబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టీ జీవన్ రెడ్డి పై ఎలాంటి ఆర్థిక ఆరోపణలు లేవని ఆయన సోదరుని పైనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

పిఎఫ్ఐ ముక్త్ జగిత్యాల కావాలని పేర్కొన్నారు.

జగిత్యాల ప్రాంతంలో జాతీయ భావాలు ఎక్కువ అని ఆయన గుర్తు చేశారు. 47 సంవత్సరాల సుదీర్ఘ కాలము జీవితము రాజకీయాల్లో కొనసాగిన టి. జీవన్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

తాను తన ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ఎంపీగా పనిచేశానని రెండు సంవత్సరాల కోవిడ్తోనే జరిగిపోయిందని అన్నారు. ఈ తక్కువ సమయంలోనే 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏ విధంగా మార్చిందో అందరికి తెలుసునని ఆయన అన్నారు.

అయోధ్యలో బాలరామ మందిరం నిర్మించుకున్నామని అదేవిధంగా మధురలో శ్రీకృష్ణ జన్మ స్థలంలోనే న్యాయస్థానం ద్వారా, ప్రజాస్వామ్యబద్ధంగా భవ్యమైన శ్రీకృష్ణ మందిరం నిర్మాణం జరుపుకుందామని ఆయన తెలిపారు.

Tags