లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.

- క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.

On
లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 10( ప్రజా మంటలు )

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు.

శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ...

జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని జిల్లా ఎస్పి తెలిపారు.

తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నాం.శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 2247 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ,ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికరితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 97 రూట్ మొబైల్స్, 20 క్విక్ రియాక్షన్ టీమ్స్ ( క్యూ ఆర్ టీ)/ స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ , కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ హోమ్ గార్డ్స్ -800 మంది, సి ఐడి- పోలీస్- అంతే కాకుండా పోలింగ్ స్టేషన్లో ఎన్ సి సి / ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ కూడా ఉపయోగిస్తామని అన్నారు.

  1. జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు :
  • జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషను లు 927,
  • సాధారణ పోలింగ్ స్టేషన్లు 807,
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 120.

జిల్లా వ్యాప్తంగా 8,19,838 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో పురుషులు 3,92,257 మంది, మహిళ లు 4,27,546 మంది, ట్రాన్స్ జెండర్స్ 35 మంది ఉన్నారని అన్నారు.  

  1. స్వాధీన పరుచుకున్న వివరాలు :

ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 2,21,53,310 /- రూపాయలు.

లిక్కర్ లీటర్ల లో 2769 సుమారుగా అంచనా విలువ 14,43,015/- రూపాయలు.

ఇతర సామాగ్రి: సుమారుగా అంచన విలువ 67,45,011 /- రూపాయలు.

గోల్డ్:1.506 కె జి లు సుమారుగా అంచన విలువ 90,00,000 /- రూపాయలు.

గంజాయీ: 15.81 కె జి లు సుమారుగా అంచన విలువ 3,95,000/- రూపాయలు.

*సీజ్ చేసినా నగదు, లిక్కర్, గంజా గోల్డ్, ఇతర వస్తువుల విలువ మొత్తం విలువ 3,97,36 ,336 /- రూపాయలు*

*జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేయబడిన వ్యక్తులు 612.* 

గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను మరియు అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేయడమైనదని, రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగింది.

246 ఎన్ బి డబ్లు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అన్నారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనాలపై కఠినంగా ఉన్నామన్నారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు జిలాల్లో ఎన్నికల నియామావళి ఉల్లంఘన కేసులు 06 నమోదు కావడం జరుగుతుందన్నారు.

*లైసెన్సుడు ఆయుధముల డిపాజిట్:* ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా లైసెన్సు కలిగిన ఆయుధములు అన్నియు డిపాజిట్ కొరకు అండర్ సెక్షన్ 144 .సి ఆర్. పి సి అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది , ఇప్పటికే జిల్లా లో ఉన్న మొత్తం 45 ఆయుధములు డిపాజిట్ కాబడినవి.

ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారు స్థానికంగా ఎవరు ఉందరాదని, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ళలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు, రాజకీయ పార్టీల వారు ఉండకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.   

జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి గారు కోరారు.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Tags

More News...

National  Local News  State News  Spiritual  

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి   (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494) వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ధ ఏకాదశి, జలకృత ఏకాదశి, అజల ఏకాదశి, భద్రకాళి ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఏడాదిలో పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ప్రత్యేకతను కల్పిస్తూ... ఏడాది పొడవునా ఉండే ఒకో ఏకాదశికి ఒకో పేరు పెట్టడం జరిగింది....
Read More...
Local News 

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు రాయికల్ మే 22 :   తాట్లవాయి గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన పంచముఖ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా, మండల పూజ కార్యక్రమం నిర్వహించారు.రాయికల్ మండల తాజా మాజీ ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేంధర్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజుతో పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించి 41 వ రోజు అయినందున హనుమాన్...
Read More...
Local News 

భూకబ్జాదారులపై గాంధీనగర్  పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

భూకబ్జాదారులపై గాంధీనగర్  పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట డివిజన్ లోని పలు ప్రభుత్వ భూములను కొందరు కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదుచేస్తే, తనపై దాడికి ప్రయత్నించారని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి ఆరోపించారు. ఐడీహెచ్ కాలనీలోని ప్రభుత్వానికి చెందిన ఆలయ భూమిని కొందరు కబ్జాకు యత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే...
Read More...
Local News 

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ మే22 (ప్రజామంటలు):   హనుమాన్ జయంతి వేడుకలను తార్నాక లోని గణపతి దేవాలయంలో గురువారం  బండ శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆంజనేయుని ప్రత్యేక పూజ లో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి భగవంతుడు...
Read More...
Local News 

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి. త్వరలో డివిజన్ల వారిగా పాదయాత్రలు  *ఎంపీ అనిల్ కుమార్, ఆదం సంతోష్ వెల్లడి.. సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు) : రాబోవు జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ లు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంచార్జ్...
Read More...
Local News 

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు 

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు  గొల్లపల్లి మే 22 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని దమ్మన్నపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన 16 వ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కీ.శే పాదం...
Read More...
Local News 

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సికింద్రాబాద్ మే 22(ప్రజా మంటలు):: సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ డివిజన్ ఏసిపిగా సి సి ఎస్  నుంచి బదిలీ పై వచ్చిన కె శశాంక్ రెడ్డి గురువారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.  1995 బ్యాచ్ కు చెందిన శశాంక్ రెడ్డి గతంలో మారేడుపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా, పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా...
Read More...
Local News 

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్                                                                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల, మే-22(ప్రజా మంటలు)    మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.  గురువారం జిల్లాకలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా...
Read More...
Local News 

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మే 22 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే క్వార్టర్లో మున్సిపల్ అధికారులతో జగిత్యాల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్   జగిత్యాల పట్టణంలో వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  అభివృద్ధి పనుల పురోగతి పై చర్చించారు, వివిధ కారణాలతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు తిరిగి...
Read More...
Local News 

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ                                           సిరిసిల్ల . రాజేంద్ర శర్మ  మల్యాల మే 22 ( ప్రజా మంటలు)    కొండగట్టు  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అర్థరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 22( ప్రజా మంటలు)    భాగ్యరెడ్డి వర్మ  జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ ప్రధాన  కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  భాగ్యరెడ్డివర్మ  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ... దళిత ఉద్యమానికి పునాదులు వేసిన ప్రముఖ...
Read More...
Local News 

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్ మే 21 (ప్రజామంటలు) : టెక్నాలజీ రంగంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయి చౌరస్తాలోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వర్దంతి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే...
Read More...