లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.

- క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.

On
లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 10( ప్రజా మంటలు )

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు.

శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ...

జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని జిల్లా ఎస్పి తెలిపారు.

తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నాం.శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 2247 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ,ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికరితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 97 రూట్ మొబైల్స్, 20 క్విక్ రియాక్షన్ టీమ్స్ ( క్యూ ఆర్ టీ)/ స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ , కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ హోమ్ గార్డ్స్ -800 మంది, సి ఐడి- పోలీస్- అంతే కాకుండా పోలింగ్ స్టేషన్లో ఎన్ సి సి / ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ కూడా ఉపయోగిస్తామని అన్నారు.

  1. జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు :
  • జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషను లు 927,
  • సాధారణ పోలింగ్ స్టేషన్లు 807,
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 120.

జిల్లా వ్యాప్తంగా 8,19,838 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో పురుషులు 3,92,257 మంది, మహిళ లు 4,27,546 మంది, ట్రాన్స్ జెండర్స్ 35 మంది ఉన్నారని అన్నారు.  

  1. స్వాధీన పరుచుకున్న వివరాలు :

ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 2,21,53,310 /- రూపాయలు.

లిక్కర్ లీటర్ల లో 2769 సుమారుగా అంచనా విలువ 14,43,015/- రూపాయలు.

ఇతర సామాగ్రి: సుమారుగా అంచన విలువ 67,45,011 /- రూపాయలు.

గోల్డ్:1.506 కె జి లు సుమారుగా అంచన విలువ 90,00,000 /- రూపాయలు.

గంజాయీ: 15.81 కె జి లు సుమారుగా అంచన విలువ 3,95,000/- రూపాయలు.

*సీజ్ చేసినా నగదు, లిక్కర్, గంజా గోల్డ్, ఇతర వస్తువుల విలువ మొత్తం విలువ 3,97,36 ,336 /- రూపాయలు*

*జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేయబడిన వ్యక్తులు 612.* 

గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను మరియు అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేయడమైనదని, రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగింది.

246 ఎన్ బి డబ్లు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అన్నారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనాలపై కఠినంగా ఉన్నామన్నారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు జిలాల్లో ఎన్నికల నియామావళి ఉల్లంఘన కేసులు 06 నమోదు కావడం జరుగుతుందన్నారు.

*లైసెన్సుడు ఆయుధముల డిపాజిట్:* ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా లైసెన్సు కలిగిన ఆయుధములు అన్నియు డిపాజిట్ కొరకు అండర్ సెక్షన్ 144 .సి ఆర్. పి సి అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది , ఇప్పటికే జిల్లా లో ఉన్న మొత్తం 45 ఆయుధములు డిపాజిట్ కాబడినవి.

ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారు స్థానికంగా ఎవరు ఉందరాదని, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ళలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు, రాజకీయ పార్టీల వారు ఉండకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.   

జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి గారు కోరారు.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా లో 37 మoది బాల కార్మికులకు విముక్తి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 1 ప్రజా (మంటలు)బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి  సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా  ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం...
Read More...

44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం 

44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం  జగిత్యాల ఫిబ్రవరి 1 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగ జగిత్యాల పట్టణంలోని 44వ వార్డ్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్మూర్ పద్మ-శ్రీకాంత్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు  డా .బోగ శ్రావణి  ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, బీజేవైఎం...
Read More...
Local News  State News 

కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం

కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం సికింద్రాబాద్,  ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):  కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గంలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీల...
Read More...
Local News  Spiritual  

స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll

స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆదివారం  ఉదయం నుంచి పాల కావడి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు పాలకావడిని భుజాన ధరించి ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం...
Read More...

బ్రాహ్మణ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రంలు బాధ్యులకు అందజేత 

బ్రాహ్మణ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రంలు బాధ్యులకు అందజేత  జగిత్యాల ఫిబ్రవరి 1 (ప్రజా మంటలు) ఉమ్మడి కరీంనగర్ జిల్లా (బాస్ )బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ జనగామ నాగరాజు జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆదివారం చేరుకొని అఖిల బ్రాహ్మణ  అర్చక సేవా సంఘము అధ్యక్షులు సిరిసిల్ల పార్థసారథి శర్మను జిల్లా కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం లో కలిసి బ్రాహ్మణ...
Read More...
National  Comment  International  

ఎప్స్టీన్ ఫైల్ వివాదం: నిజాల కంటే రాజకీయ ఆయుధంగా మారుతున్న వైనం

ఎప్స్టీన్ ఫైల్ వివాదం: నిజాల కంటే రాజకీయ ఆయుధంగా మారుతున్న వైనం — రాజకీయ విశ్లేషణ ఎప్స్టీన్ ఫైల్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావన రావడం దేశ రాజకీయాల్లో మరో కొత్త వివాదానికి తెరలేపింది. న్యాయపరంగా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, ఈ అంశం ఇప్పుడు ప్రతిపక్షాల చేతుల్లో ఒక రాజకీయ ఆయుధంగా మారుతున్న తీరే అసలు చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఈ వ్యవహారంలో అసలు ప్రశ్న...
Read More...
National 

2026-27 బడ్జెట్ : స్టాక్ మార్కెట్ ప్రతిస్పందన

2026-27 బడ్జెట్ : స్టాక్ మార్కెట్ ప్రతిస్పందన న్యూఢిల్లీ ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు): నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్ 2026-27 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 75 నిమిషాల తన ప్రసంగం, సామాన్యులను, స్టాక్ మార్కెట్లను ఆకట్టుకోలేక పోయింది. దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగాలు, పన్ను సంస్కరణలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది. Union Budget 2026-27...
Read More...
Local News  Spiritual  

పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం

పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం లక్షలాది భక్తులతో మహాజాతర విజయవంతం ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు): ఎల్కతుర్తి మండల కేంద్రంలోని దామేర  బీమదేవరపల్లి  మండలంలో   ముల్కనూర్ ప్రాంతం మరోసారి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. జనవరి 28. 29. 30. ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి కూడా లక్షలాది భక్తులు   తండోప  తండాలుగా  తరలివచ్చారు. గ్రామాల  నలుమూలల నుంచి   మాత్రమే...
Read More...
Local News  Crime 

పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి

పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు) ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పొలంలో నాటు వేస్తూ బీహార్ కు చెందిన ఓ వలస కార్మికుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సదరు వ్యక్తి, శనివారం పనిలో ఉండగానే ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు....
Read More...

గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ములుగు, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు): గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యకు మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ...
Read More...

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన       ధర్మపురి, జనవరి 31 (ప్రజా మంటలు):ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 15 వార్డులకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇంచార్జీలను కూడా నియమించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ...
Read More...

రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు

రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు హైదరాబాద్, జనవరి 31 (ప్రజా మంటలు): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ నిరసనలలో భాగంగా రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే...
Read More...