లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.

- క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.

On
లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 10( ప్రజా మంటలు )

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు.

శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ...

జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని జిల్లా ఎస్పి తెలిపారు.

తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నాం.శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 2247 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ,ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికరితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 97 రూట్ మొబైల్స్, 20 క్విక్ రియాక్షన్ టీమ్స్ ( క్యూ ఆర్ టీ)/ స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ , కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ హోమ్ గార్డ్స్ -800 మంది, సి ఐడి- పోలీస్- అంతే కాకుండా పోలింగ్ స్టేషన్లో ఎన్ సి సి / ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ కూడా ఉపయోగిస్తామని అన్నారు.

  1. జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు :
  • జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషను లు 927,
  • సాధారణ పోలింగ్ స్టేషన్లు 807,
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 120.

జిల్లా వ్యాప్తంగా 8,19,838 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో పురుషులు 3,92,257 మంది, మహిళ లు 4,27,546 మంది, ట్రాన్స్ జెండర్స్ 35 మంది ఉన్నారని అన్నారు.  

  1. స్వాధీన పరుచుకున్న వివరాలు :

ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 2,21,53,310 /- రూపాయలు.

లిక్కర్ లీటర్ల లో 2769 సుమారుగా అంచనా విలువ 14,43,015/- రూపాయలు.

ఇతర సామాగ్రి: సుమారుగా అంచన విలువ 67,45,011 /- రూపాయలు.

గోల్డ్:1.506 కె జి లు సుమారుగా అంచన విలువ 90,00,000 /- రూపాయలు.

గంజాయీ: 15.81 కె జి లు సుమారుగా అంచన విలువ 3,95,000/- రూపాయలు.

*సీజ్ చేసినా నగదు, లిక్కర్, గంజా గోల్డ్, ఇతర వస్తువుల విలువ మొత్తం విలువ 3,97,36 ,336 /- రూపాయలు*

*జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేయబడిన వ్యక్తులు 612.* 

గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను మరియు అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేయడమైనదని, రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగింది.

246 ఎన్ బి డబ్లు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అన్నారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనాలపై కఠినంగా ఉన్నామన్నారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు జిలాల్లో ఎన్నికల నియామావళి ఉల్లంఘన కేసులు 06 నమోదు కావడం జరుగుతుందన్నారు.

*లైసెన్సుడు ఆయుధముల డిపాజిట్:* ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా లైసెన్సు కలిగిన ఆయుధములు అన్నియు డిపాజిట్ కొరకు అండర్ సెక్షన్ 144 .సి ఆర్. పి సి అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది , ఇప్పటికే జిల్లా లో ఉన్న మొత్తం 45 ఆయుధములు డిపాజిట్ కాబడినవి.

ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారు స్థానికంగా ఎవరు ఉందరాదని, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ళలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు, రాజకీయ పార్టీల వారు ఉండకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.   

జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి గారు కోరారు.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Crime 

భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి

భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) : భవన నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కూలీ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహాంకాళి పోలీసులు తెలిపిన వివరాలు..పాన్ బజార్ లో ఓ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గత నెల 28న నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ...
Read More...
Local News  State News 

హైదరాబాద్ ను సేఫరాబాద్ గా మార్చాలనేది తమ లక్ష్యం : సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి

హైదరాబాద్ ను సేఫరాబాద్ గా మార్చాలనేది తమ లక్ష్యం : సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి    సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) : హైదరాబాద్‌ను సేఫరాబాద్ గా మార్చాలన్న లక్ష్యంతో సర్వేజనా ఫౌండేషన్ రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీకాత్మకంగా యమలోకం నుంచి వచ్చిన యమధర్మరాజును రంగంలోకి దింపారు. రసూల్‌పురా జంక్షన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని నగరంలోని 365...
Read More...
Local News 

గాంధీనగర్ సర్పంచ్‌గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీనగర్ సర్పంచ్‌గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు): మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత, సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ ప్రజల ఏకాభిప్రాయంతో కేతిరి లక్ష్మారెడ్డి సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. సర్పంచ్ బరిలో నలుగురు అభ్యర్థులు కేతిరి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకన్న, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి దయాకర్ నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ,...
Read More...
Local News 

ముల్కనూరులో కాకతీయ టయోటా ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’

ముల్కనూరులో కాకతీయ టయోటా ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’ భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు)  : మండలంలోని ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం వద్ద ఈ నెల 3, 4 తేదీల్లో (సోమ,మంగళ) కాకతీయ టయోటా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయని సేల్స్ మేనేజర్...
Read More...

రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం

రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం    సారంగాపూర్ డిసెంబర్ 3 (ప్రజా మంటలు)మండల రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం  ఏకగ్రీవంగా ఎన్నిక కాగా  జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ని సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలవగా వడ్డరకాలని నూతన...
Read More...

సిలెండర్ బుడ్డీల దొంగ అరెస్ట్ _సిలిండర్లు స్వాధీనం

సిలెండర్ బుడ్డీల దొంగ అరెస్ట్ _సిలిండర్లు స్వాధీనం   జగిత్యాల డిసెంబర్ 3(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పరిధిలో డోమెస్టిక్ వంట గ్యాస్ బుడ్డిలను దొంగిలిస్తున్న దొంగ వివరాలను డిఎస్పీ రఘు చందర్ వెల్లడించారు. జగిత్యాల పట్టణానికి చెందిన షేక్ సుమేర్ అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా ఇండ్లలోకి దూరి బయట ఉంచుతున్న వంట గ్యాసు బుడ్డిలను దొంగిలిస్తున్న క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు సిసి...
Read More...

దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ డిసెంబర్ 3 (ప్రజా మంటలు)దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గల దివ్యాంగుల బదిరుల ఆశ్రమ పాఠశాలలో లో మహిళలు పిల్లలు,దివ్యాంగులు వయోవృద్ధుల సాధికారత...
Read More...
Local News 

నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్

నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి:  కలెక్టర్ బి. సత్యప్రసాద్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి డిసెంబర్ 03 (ప్రజా మంటలు):  గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం గొల్లపెల్లి మండల కేంద్రం తొ పాటు చిల్వకోడూర్, తిరుమలాపూర్ గ్రామంలో  పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ తీరును...
Read More...
Local News 

గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా  నామినేషన్ దాఖలు చేసిన నల్ల నీరజ _సతీశ్ రెడ్డి 

గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా  నామినేషన్ దాఖలు చేసిన  నల్ల నీరజ _సతీశ్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్  03, (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో  సర్పంచ్ అభ్యర్థిగా నల్ల నీరజ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు  అనంతరం ఆమె మాట్లాడుతూ   నన్ను గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తా అని  స్థానికంగా తాను ప్రజల్లోనే ఉంటూ గ్రామ యువత సమక్షంలో
Read More...
National  State News 

నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు

నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు ప్రైవేటు స్లీపర్ బస్సులకు గట్టి దెబ్బ — అన్ని రాష్ట్రాలకు NHRC కీలక ఆదేశాలు ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకుంటున్న ఘోర ప్రమాదాలు అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచాయి. ఈ నేపథ్యంలో జాతీయ...
Read More...
State News  Crime 

చాంద్రాయణగుట్టలో రెండు మృతదేహాలు కలకలం — డ్రగ్స్ అధిక మోతాదే కారణమా?

చాంద్రాయణగుట్టలో రెండు మృతదేహాలు కలకలం — డ్రగ్స్ అధిక మోతాదే కారణమా? హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం హడలెత్తించింది. రోమన్ హోటల్ ఎదుట నిలిపివున్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించగా, మృతులను జహంగీర్ (24), **ఇర్ఫాన్ (25)**గా గుర్తించారు....
Read More...
Local News  State News 

నిజాయితీకి నిదర్శనం: రోడ్డుపై దొరికిన రూ.400ను పోలీసులకు అప్పగించిన ఇద్దరు విద్యార్థులు

నిజాయితీకి నిదర్శనం: రోడ్డుపై దొరికిన రూ.400ను పోలీసులకు అప్పగించిన ఇద్దరు విద్యార్థులు హన్మకొండ, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): హన్మకొండ నగరంలోని పెగడపల్లి డబ్బాలు జంక్షన్ వద్ద ఇద్దరు చిన్నారులు చూపించిన నిజాయితీ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఏకశిల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పూజిత మరియు లిథివిక్ తమ బడికి వెళ్లే మార్గంలో రహదారిపై పడిఉన్న రూ.400 నగదు కనిపించడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడే...
Read More...