లోకసభ ఎన్నికలకు సంబంధించి...సోమవారం పోలింగ్ కు మొదలైన పోలింగ్ సామగ్రి పంపిణీ.
- పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు ) :
జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పంపిణీ ప్రక్రియ మొదలైంది.
ఇందుకుగాను జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా నేతృత్వంలో సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం.
సోమవారం నాటి పోలింగ్ ప్రక్రియకు ముందురోజు ప్రక్రియను ఆదివారం ఉదయం 7 గంటలనుండే ప్రారంభించారు.
మధ్యాహ్నం నుండి పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్ళాయి.
జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవ ర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుఏర్పాటు చేసారు.
ఓటింగ్ యంత్రాలు, సిబ్బందిని తరలించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు. అందులో సెక్టార్ అధికారులకు 80 కార్లు, పోలింగ్ సిబ్బంది తరలించేందుకు 85 బస్సులు, 139 మినీ బస్సులు, 22 ఇతర వాహనాలున్నాయి.
పోలింగ్ అనంతరం ఓటింగ్ యంత్రాలు తరలించేందుకు 7 కంటేనర్లను సిద్ధంగా ఉంచారు.
- జిల్లాలో ఎన్నికల విధుల్లో 1104 మంది పోలింగ్ అధికారులు,
- 1104 సహాయ పోలింగ్ అధికారులు,
- 2208 మంది ఇతర సిబ్బంది,
- 116 మంది మైక్రో అజ్జర్వర్లు పాల్గొంటున్నారు.
నియోజకవర్గాల వారీగా....
- కోరుట్లలో 1261,
- జగిత్యాలలో 1227,
- ధర్మపురి 1014,
చొప్పదండి పంపిణీ నియోజకవర్గంలోని
- మల్యాల, కొడిమ్యాల మండలాల్లో 517 మంది,
వేములవాడ నియోజకవర్గంలోని
- మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో 431 మంది
అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
ధర్మపురి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జగిత్యాల కేంద్రంలో ఆర్డీవో పి. మధుసూదన్, కోరుట్ల నియోజకవర్గంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్ లు పర్యవేక్షణ గావిస్తున్నారు.
జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష జగిత్యాల పంపిణీ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది కలిసి తరలివెళ్లే వాహనాలను పర్యవేక్షణ చేశారు.
ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేరాల నియంత్రణకు,కమ్యూనిటీ భద్రతకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయి. సీసీ కెమెరాలు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ జనవరి 21 (ప్రజా మంటలు)
నూతన సాంకేతికత ను గ్రామాల్లో ఉపయోగించి దాతల సహకారంతో 2లక్షల రూపాయల విలువగల సి సి కెమెరాలు ఏర్పాటు అభినందనీయం. సిసి కెమెరాల ఏర్పాటు తో పాటు వారు నిర్వహణ చాలా ముఖ్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
నేరాల నియంత్రణ,గ్రామంలో కొత్త వ్యక్తుల రాకపోకలు చిత్రించి,అనుమానాస్పద... 25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు
సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజామంటలు) :
గాంధీఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి ఓ మహిళ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. కార్డియోథోరాసిస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సర్జరీ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ. వాణితో కలిసి సీటీసర్జరీ హెచ్ఓడీ ప్రొ. రవీంద్ర బుధవారం మీడియాకు వెల్లడించారు.
వివరాలు ఇవి...ఆసిఫాబాద్కు చెందిన పల్లవి (25) పలు... శంకరాచార్యులు – మహంత్ యోగి వివాదం : హోదా, ధర్మం, క్షమాపణ ప్రశ్న
(ప్రత్యేక కథనం)
ఉత్తరప్రదేశ్లో జ్యోతిర్పీఠ శంకరాచార్యులు మరియు సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న వాదనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ వివాదం కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, హిందూ ధర్మంలో ఉన్న శంకరాచార్యుల హోదా, మహంత్ స్థానం, ధార్మిక మర్యాదలు వంటి అంశాలను మళ్లీ ప్రశ్నార్థకంగా నిలబెట్టింది.
శంకరాచార్యులు – హిందూ ధర్మంలో... 25వ వార్డ్ కు చెందిన పలువురు బిజెపిలో చేరిక
జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డ్ కి చెందిన గుండేటి సాయి మరియు 25 వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన... డిప్యూటీ సీఎం ను కలిసిన బీసీ నేతలు
ధర్మపురి జనవరి 21 ( ప్రజా మంటలు)పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కు ధర్మపురి కి విచ్చేసినతెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ కలసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం వినతి పత్రం అందించారు
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42... శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో పూజలు చేసిన డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్
బుగ్గారం జనవరి 21 (ప్రజా మంటలు) శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా బుగ్గారం మండలంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో బుగ్గారం బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర పద్మశాలి మహిళా ఉపాధ్యక్షురాలు సింగం... మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.
జగిత్యాల జనవరి 21 ( ప్రజా మంటలు)మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని పునరుద్దరించాలని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు.
జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో ఉపాధి హామీ వర్కర్స్ తో విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ... ట్రంప్ ప్రతిపాదించిన “Board of Peace” – ప్రపంచ నాయకులకు ఆహ్వానం,
(ప్రత్యేక కథనం)
యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తాజా లేఖలో ప్రపంచ దేశాధినేతలను “Board of Peace” (ప్రపంచ శాంతి బోర్డు) అనే కొత్త అంతర్జాతీయ శాంతి సంస్థలో భాగస్వాములుగా చేరమని ఆహ్వానించారు. ఈ బోర్డు గాజా సహారా వివాదానికి సమాధానాలు కనుగొనడమే ధ్యేయంగా ప్రారంభమౌతుందన్నట్లు వెల్లడించారు, తదుపరి ఇతర అంతర్జాతీయ సంఘర్షణలకు... అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ధర్మపురి జనవరి 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటు శుద్ధ త్రాగునీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని... రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు
జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన 8 మంది స్కౌట్స్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడే రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్కు ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచింది
ఈ రాష్ట్రస్థాయి పరేడ్కు సంబంధించిన శిక్షణ మరియు రిహార్సల్స్... ప్రయాగ్రాజ్లో చెరువులో పడిన శిక్షణ విమానం
ప్రయాగ్రాజ్ జనవరి 21(ప్రజా మంటలు):
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగర శివారులో శిక్షణ విమానం కూలిపోయింది. నగరానికి సమీపంలోని ఓ చెరువులో విమానం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
విమానం శిక్షణ ప్రయాణంలో భాగంగానే ప్రమాదానికి గురైనట్లు... టీ20 ప్రపంచకప్లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్
ఢిల్లీ / ఢాకా జనవరి 21(ప్రజా మంటలు):
రానున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ‘సీ’ గ్రూప్లో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన లీగ్ మ్యాచ్లు కోల్కతా, ముంబైలో నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో, ... 