లోకసభ ఎన్నికలకు సంబంధించి...సోమవారం పోలింగ్ కు మొదలైన పోలింగ్ సామగ్రి పంపిణీ.

- పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.

On
లోకసభ ఎన్నికలకు సంబంధించి...సోమవారం  పోలింగ్ కు మొదలైన పోలింగ్ సామగ్రి పంపిణీ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు ) : 

జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పంపిణీ ప్రక్రియ మొదలైంది.

ఇందుకుగాను జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా నేతృత్వంలో సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం.

సోమవారం నాటి పోలింగ్ ప్రక్రియకు ముందురోజు ప్రక్రియను ఆదివారం ఉదయం 7 గంటలనుండే ప్రారంభించారు.

మధ్యాహ్నం నుండి పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్ళాయి.

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవ ర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుఏర్పాటు చేసారు.

ఓటింగ్ యంత్రాలు, సిబ్బందిని తరలించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు. అందులో సెక్టార్ అధికారులకు 80 కార్లు, పోలింగ్ సిబ్బంది తరలించేందుకు 85 బస్సులు, 139 మినీ బస్సులు, 22 ఇతర వాహనాలున్నాయి.

పోలింగ్ అనంతరం ఓటింగ్ యంత్రాలు తరలించేందుకు 7 కంటేనర్లను సిద్ధంగా ఉంచారు.

  • జిల్లాలో ఎన్నికల విధుల్లో 1104 మంది పోలింగ్ అధికారులు,
  • 1104 సహాయ పోలింగ్ అధికారులు,
  • 2208 మంది ఇతర సిబ్బంది,
  • 116 మంది మైక్రో అజ్జర్వర్లు పాల్గొంటున్నారు.

నియోజకవర్గాల వారీగా....

  • కోరుట్లలో 1261,
  • జగిత్యాలలో 1227,
  • ధర్మపురి 1014,

చొప్పదండి పంపిణీ నియోజకవర్గంలోని

  • మల్యాల, కొడిమ్యాల మండలాల్లో 517 మంది,

వేములవాడ నియోజకవర్గంలోని

  • మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో 431 మంది

అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

ధర్మపురి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జగిత్యాల కేంద్రంలో ఆర్డీవో పి. మధుసూదన్, కోరుట్ల నియోజకవర్గంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్ లు పర్యవేక్షణ గావిస్తున్నారు.

జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష జగిత్యాల పంపిణీ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది కలిసి తరలివెళ్లే వాహనాలను పర్యవేక్షణ చేశారు.

ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags
Join WhatsApp

More News...

State News 

డీఏ ప్రకటన కంటితుడుపు చర్యే

డీఏ ప్రకటన కంటితుడుపు చర్యే       హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు): ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన డీఏ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్) అధ్యక్షుడు వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజేటీఎఫ్ కోశాధికారి ఘనపురం దేవేందర్, రాష్ట్ర నాయకులు ఎస్.కే. మస్తాన్‌తో కలిసి మాట్లాడారు. 2023...
Read More...
Local News 

మాజీ మంత్రి తలసాని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి : కోట నీలిమ

మాజీ మంత్రి తలసాని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి : కోట నీలిమ సికింద్రాబాద్,  జనవరి 12 (ప్రజా మంటలు ):  సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. తలసాని అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. తలసాని వ్యాఖ్యలకు నిరసనగా బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు....
Read More...
Local News 

సీతాఫల్మండిలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు

సీతాఫల్మండిలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు సికింద్రాబాద్, జనవరి 12 (ప్రజామంటలు): భారతీయ జనతా పార్టీ సీతాఫల్మండి డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు రాచమల్ల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు కనికట్ల హరి, మాజీ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు మాట్లాడుతూ… ప్రజలు ముగ్గులు, పిండి వంటకాలు, పతంగులతో పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో హైరిస్క్ శస్త్రచికిత్స విజయవంతం

గాంధీ ఆసుపత్రిలో హైరిస్క్ శస్త్రచికిత్స విజయవంతం సికింద్రాబాద్,  జనవరి 12 ( ప్రజా మంటలు):  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అత్యంత హైరిస్క్ శస్ర్త చికిత్సను చేసిన వైద్యులు రోగి ప్రాణాలను కాపాడారు. వివరాలు ఇవి..ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (56) గత 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 6న అర్ధరాత్రి గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. రోగికి గుండె సంబంధిత...
Read More...

లక్ష్మణ్ కుమార్ ప్రశ్నలకు జాబితాతో సమాధా నం ఇచ్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

లక్ష్మణ్ కుమార్ ప్రశ్నలకు జాబితాతో సమాధా నం ఇచ్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, జనవరి 12 (ప్రజా మంటలు): బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన హయాంలో ధర్మపురి మున్సిపాలిటీ ఏర్పాటు, డబుల్ రోడ్లు, హైవే అభివృద్ధి, ఇంటర్నల్ రోడ్లు, బ్రిడ్జిల...
Read More...
Local News 

TPUS రాష్ట్ర అధ్యక్షునిగా వోడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక

TPUS రాష్ట్ర అధ్యక్షునిగా వోడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు): జిల్లా: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు వోడ్నాల రాజశేఖర్ రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వోడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై అంకితభావంతో పనిచేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం...
Read More...
Local News 

మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులుగా బీర్పూర్ తిరుపతి

మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులుగా బీర్పూర్ తిరుపతి గొల్లపల్లి జనవరి 12 (ప్రజా మంటలు):  బుగ్గారం మండల సర్పంచ్ ల ఫోరం ఎన్నికలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ సమక్షంలో సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి.మండలంలోనీ సర్పంచులు  సమావేశమై మండల ఫోరం అధ్యక్షులుగా  సర్పంచ్ బీర్ పూర్ తిరుపతి...
Read More...
Local News 

ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి 

ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి  ఇబ్రహీంపట్నం జనవరి 12(ప్రజా మంటలు దగ్గుల అశోక్ )   ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి  హిందూ సేన  ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఫోనుకంటి చిన్న వెంకట్  స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఈ...
Read More...

ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొని విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొని విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులు తయారు చేసిన తినుబండారాలు, స్వీట్ల ను పరిశీలించి విద్యార్థులను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి...
Read More...
Local News 

జగిత్యాలలో C.C రోడ్ పనుల పరిశీలన: అక్రమ కట్టడాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం

జగిత్యాలలో C.C రోడ్ పనుల పరిశీలన: అక్రమ కట్టడాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ ఎల్ గార్డెన్ సమీపంలో నిధులు మంజూరైన సి.సి రోడ్ నిర్మాణ పనులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల నాణ్యత, వెడల్పు అంశాలపై ఆయన ఆరా తీశారు. మున్సిపల్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన...
Read More...
Local News 

జగిత్యాలలో వయోవృద్ధుల  డే కేర్ సెంటర్ ప్రారంభం

జగిత్యాలలో వయోవృద్ధుల  డే కేర్ సెంటర్ ప్రారంభం జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు): జిల్లాలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటీజేన్స్(వృద్ధుల)కోసం బైపాస్ రోడ్డులో వయో వృద్ధుల సంక్షేమ శాఖ తరపున డే కేర్ సెంటర్ ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి బి.నరేశ్ మాట్లాడుతూ వృద్దులు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ డే కేర్...
Read More...
Local News  State News 

అలిశెట్టి అక్షరాలు… సమాజ హితాన్ని కోరాయి

అలిశెట్టి అక్షరాలు… సమాజ హితాన్ని కోరాయి జగిత్యాల, జనవరి 12 (ప్రజా మంటలు): అలిశెట్టి ప్రభాకర్ రచనలు కణికల వంటివని, ఆయన సాహిత్యం సమాజ హితాన్ని కోరుతూ ప్రజలను చైతన్యవంతులను చేసిందని సినీ కథా రచయిత, అలిశెట్టి జీవిత సాఫల్య పురస్కార గ్రహీత పెద్దింటి అశోక్ కుమార్ అన్నారు. యువతరానికి అలిశెట్టి సాహిత్యం నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం కళాశ్రీ...
Read More...