కుమారి సంగనభట్ల ప్రతీక్షకు ప్రతిభా పురస్కారం.

On
కుమారి సంగనభట్ల ప్రతీక్షకు ప్రతిభా పురస్కారం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

ధర్మపురి మే 12( ప్రజా మంటలు)

ధర్మపురి పట్టణానికి చెందిన ఆంగ్లో వేదిక్ పాఠశాలలో 2023- 24 విద్యా సంవత్సరంలో ఎస్ ఎస్ సి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి సంగనభట్ల ప్రతీక్షకు శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం వారిచే సోమవారం ప్రతిభా పురస్కారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రతీక్ష తల్లిదండ్రులు సంగనభట్ల శ్రీనివాస్ ప్రతిభ మరియు నిత్యాన్నదాన సత్రం బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా తమ పాఠశాల నుండి 10/10 జిపిఏ సాధించిన సందర్భంగా కుమారి ప్రతీక్షను పాఠశాల కరస్పాండెంట్ సంగనభట్ల దినేష్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సన్మానించారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ అడ్లూరి పాఠశాల కరస్పాండెంట్ కు, 10 / 10 జి పి ఏ సాధించిన కుమారి ప్రతీక్షకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags