పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం
పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం
96 లోక్ సభ స్థానాలకు 1717 మంది అభ్యర్థుల పోటీ
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 525 మంది పోటీ
204 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల నిర్వహణ
ఇక జూన్ 4న బయట పడనున్న అభ్యర్థుల భవితవ్యం
(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ - 99481 33539)
జగిత్యాల మే 13:
నాలుగవ విడత పది రాష్ట్రాల్లోని 96 లోకసభ స్థానాల ఎన్నికలు సోమవారం ముగిశాయి. వాటితో పాటు మూడు రాష్ట్రాల్లోని 204 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు నిర్వహించారు.
ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్ సభ స్థానాలకు గాను 1717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్ము కాశ్మీర్ లో ఒక లోక్ సభ స్థానం, ఆంధ్ర ప్రదేశ్ లో - 25, తెలంగాణలో - 17, ఉత్తర ప్రదేశ్ లో - 13, మహా రాష్ట్ర లో - 11, మధ్య ప్రదేశ్ లో - 8, పశ్చిమ బెంగాల్ లో - 8, బీహార్ లో - 5, ఒడిస్సా లో - 4, ఝార్ఖండ్ లో - 4, మొత్తం : 96 లోక్ సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. వీటితో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని - 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిస్సా లోని - 28 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ లోని సికింద్రాబాద్ కంటోన్ మెంట్ లోని ఒక అసెంబ్లీ స్థానానికి కూడా సోమవారం ఎన్నికలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జూన్ 4 ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. అప్పటి దాకా అభ్యర్థులతో పాటు, ఓటర్లు కూడా ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.....
కాగా ఇట్టి ఎన్నికల్లో అక్కడక్కడ చెదురు - మొధురు సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల అల్లర్లు జరిగాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
లిక్కర్ కేసు తీర్పు: నిర్దోషిగా కవిత: తెలంగాణ రాజకీయాలలో మలుపు?
ప్రత్యేక కథనం
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు కోర్టు నిర్దోషిగా తీర్పు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఈ కేసు మొదటి నుంచీ కేంద్రంలోని Bharatiya Janata Party రాజకీయ కక్షసాధింపే అంటూ ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలపై సీబీఐ, ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో “ఇది వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయమా?”... రుణభారం తగ్గిందా? కాళేశ్వరం విషయంలో అసలు నిజం ఏమిటి?
: హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో “రుణభారం తగ్గింది” అని చెబుతోంది. వడ్డీ రేటు తగ్గించామని, ఇన్స్టాల్మెంట్లు (EMI) తక్కువయ్యాయని చెప్పడం ప్రజలకు కొంత ఊరట కలిగించే విషయం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే — నిజంగా రుణం తగ్గిందా? లేక కేవలం చెల్లింపు విధానం మారిందా?... మెట్పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు
మెటుపల్లి, ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
మెట్పల్లిలో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ మెట్పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి యారా రేణుక మరియు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. గోవర్ధన్ రెడ్డి లను కలిశారు.ప్రస్తుతం మెట్పల్లి కోర్టులో కేసులు అధికంగా పెండింగ్లో ఉన్నాయని,... బడిపిల్లల కథలకు ఆహ్వానం జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము
జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవో) స్కూల్ ఎడ్యుకేషన్ జగిత్యాల జిల్లా... సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల ఫిబ్రవరి 27 ( ప్రజా మంటలు)రాష్ట్ర స్తాయి సీఎం కప్ లో కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అభినందించారు
సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ కిక్ బాక్సింగ్ విభాగంలో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పాల్గొని ఏ హర్షిత్... విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరేందుకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్
జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు)పిఎం పోషణ్ తనిఖీ లో భాగంగా కెజిబివి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
'పిఎం పోషణ్' తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ (బాలికల) విద్యాలయం (కేజీబీవీ) ను ఆకస్మికంగా సందర్శించారు.... తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై TRTF ఆగ్రహం – ఉపాధ్యాయ హక్కులకు గొడ్డలి పెట్టినట్టేనా?
హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం 2026” నివేదికపై తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (TRTF) తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన ఈ నివేదిక ప్రభుత్వ విద్యా వ్యవస్థ పునాదులను దెబ్బతీసేలా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్,... ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చీట్
న్యూఢిల్లీ ఫిబ్రవరి 27:
(ప్రజా మంటలు ప్రత్యేక కథనం)ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను రద్దు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.ఈ మేరకు సీబీఐ ప్రత్యేక... న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర: NCERT క్లాస్–8 పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:
క్లాస్–8 సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థను అవినీతిగ్రస్త సంస్థగా చిత్రీకరించడం వెనుక “లోతైన, పద్ధతిగల కుట్ర” ఉందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.స్వయంచాలకంగా (సుయో మోటు) కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం,ఈ పాఠ్యాంశాలు చిన్న వయసు విద్యార్థుల “అమాయక మనసుల్లో”... నాగర్ కర్నూలు జిల్లా లో పసికందు మృతికి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్
జగిత్యాల ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు)నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామము మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మౌనికను కాలుతో తన్ని ఆ చిన్నారి మరణానికి కారణమైన అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బిసి ఎస్సి ఎస్టి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆ చిన్నారి ఆత్మకు శాంతి... పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ
జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)మేడిపెల్లి, కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా గురువారం మేడిపెల్లి కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం లో పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్... ఇంటర్మీడియట్ పరీక్షలు – భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు
జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినటట్లు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు.
పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ పరీక్షా... 