పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం

On
పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం

పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం

96 లోక్ సభ స్థానాలకు 1717 మంది అభ్యర్థుల పోటీ

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 525 మంది పోటీ

204 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల నిర్వహణ

ఇక జూన్ 4న బయట పడనున్న అభ్యర్థుల భవితవ్యం


(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ - 99481 33539)

జగిత్యాల మే 13: 
నాలుగవ విడత పది రాష్ట్రాల్లోని 96 లోకసభ స్థానాల ఎన్నికలు సోమవారం ముగిశాయి. వాటితో పాటు మూడు రాష్ట్రాల్లోని 204 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు నిర్వహించారు.
ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్ సభ స్థానాలకు గాను 1717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్ము కాశ్మీర్ లో ఒక లోక్ సభ స్థానం, ఆంధ్ర ప్రదేశ్ లో - 25, తెలంగాణలో - 17, ఉత్తర ప్రదేశ్ లో - 13, మహా రాష్ట్ర లో - 11, మధ్య ప్రదేశ్ లో - 8, పశ్చిమ బెంగాల్ లో - 8, బీహార్ లో - 5, ఒడిస్సా లో - 4, ఝార్ఖండ్ లో - 4, మొత్తం : 96 లోక్ సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. వీటితో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని - 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిస్సా లోని - 28 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ లోని సికింద్రాబాద్ కంటోన్ మెంట్ లోని ఒక అసెంబ్లీ స్థానానికి కూడా సోమవారం ఎన్నికలు జరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జూన్ 4 ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. అప్పటి దాకా అభ్యర్థులతో పాటు, ఓటర్లు కూడా ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.....

కాగా ఇట్టి ఎన్నికల్లో అక్కడక్కడ చెదురు - మొధురు సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల అల్లర్లు జరిగాయి.

Tags
Join WhatsApp

More News...

State News 

ఫోన్‌ట్యాపింగ్ కేసు: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు

ఫోన్‌ట్యాపింగ్ కేసు: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు హైదరాబాద్ జనవరి 30 (ప్రజా మంటలు): ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణకు అనుమతి ఇవ్వలేమని సిట్ స్పష్టం చేసింది. తమ రికార్డుల్లో...
Read More...
National 

ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలి: రాంచందర్ రావు

ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలి: రాంచందర్ రావు ▶ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపణ▶ జగిత్యాలలో ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి: అరవింద్▶ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది. జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ శంఖారావం...
Read More...

అందుబాటులో  ఉండనున్న జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు

అందుబాటులో  ఉండనున్న జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు జగిత్యాల జనవరి 30 ( ప్రజా మంటలు)  రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ఖర్టాడే కాళీచరణ్ సుదామ రావు జగిత్యాల జిల్లాకు నియమించబడగా జగిత్యాల లోని అతిథి గృహంలో  సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రజలు,...
Read More...

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి 

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  జగిత్యాల/ కోరుట్ల/ మెట్పల్లి జనవరి 30 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, జగిత్యాల, కోరుట్ల,మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు...
Read More...

ఆధార్  సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత

ఆధార్  సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత             జగిత్యాల జనవరి 30 (ప్రజా మంటలు)  జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరము లో  శుక్రవారం రోజున   జిల్లా  కలెక్టర్, బి. సత్యప్రసాద్,  ఆదేశాల క్రమము జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత   జిల్లాలోని ఆధార్ సెంటర్ ఆపరేటర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.    యు ఐ డి ఏ ఐ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలని ఎవరైనా...
Read More...
State News 

సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత

సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత మేడారం, జనవరి 30 (ప్రజా మంటలు): సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. కాకతీయుల వంటి రాజులతో పోరాడిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు తమ జాతి కోసం నిలబడి పోరాడిన వీరవనితలని అన్నారు. గోవిందరాజు, పడిగిద్దరాజు వంశానికి చెందిన గొప్ప...
Read More...
Local News 

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి గొల్లపల్లి, జనవరి 30 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన స్టార్ బిర్యాణి సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఘటన వివరాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు. గతంలో కూడా యాజమానికి చెందిన టెంట్ సామగ్రి అగ్ని ప్రమాదంలో నష్టపోయిందని, ఇప్పుడు బిర్యాణి సెంటర్...
Read More...
Local News 

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు : జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు : జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం కరీంనగర్, జనవరి 30 (ప్రజా మంటలు): హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీలా మాట్లాడటం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ మాట్లాడారు. వీణవంకలో...
Read More...
Local News  State News 

మారేడు ఆకుపై అమ్మవార్లు…

మారేడు ఆకుపై అమ్మవార్లు… జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు): జగిత్యాలకు చెందిన చిత్రకారుడు, కళాశ్రీ గుండేటి రాజు తన ప్రత్యేక కళా నైపుణ్యంతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నారు. పవిత్రమైన మారేడు ఆకుపై సమ్మక్క–సారక్క అమ్మవార్ల ప్రతిమలను తన కుంచెతో అద్భుతంగా చిత్రీకరించి భక్తుల మనసులు గెలుచుకున్నారు. శుక్రవారం సమ్మక్క–సారక్క ఇద్దరూ గద్దెపై కొలువుదీరిన సందర్భంగా, అపారమైన భక్తితో...
Read More...
State News 

తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు

తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు హైదరాబాద్, జనవరి 30 (ప్రజా మంటలు): రాజకీయాలకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన… రాష్ట్రానికి జరుగుతున్న తీవ్రమైన జల ద్రోహాన్ని దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పరిస్థితిని...
Read More...

భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే

భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26 భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ స్థితిని సంఖ్యలతో స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వ ప్రచార వాదనలకు భిన్నంగా, ఈ సర్వే భారత ఆర్థిక నిర్మాణంలో ఉన్న బలహీనతలను బహిర్గతం చేస్తోంది. ఎగుమతులు–దిగుమతులు: అసమతుల్యత స్పష్టం ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం, భారత...
Read More...
State News 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత  హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత బాధాకరమైన అంశంపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా లేదని అన్నారు....
Read More...