ఉపాధ్యాయుల పై లాఠీ చార్జీ చేయించిన అర్డీఓ పై చర్యలు తీసుకోవాలి- పి.ఆర్.టి.యూ డిమాండ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 14 (ప్రజా మంటలు )
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లో సజావుగా పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వ హించిన ఉపాద్యాయులు, ఎన్నికల నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన 5 రోజుల భత్యం ఇవ్వాలని నియోజక వర్గ ఎన్నికల అధికారి అయిన స్థానిక ఆర్డీవోని కోరడం జరిగిందని, అలాగే సిద్దిపేట, గజ్వేల్ తదితర ప్రాంతాలలో 5 రోజులు చెల్లించిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతిగా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులపై అసహనంతో పోలీసులతో లాఠీ చార్జి చేయించడాన్ని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్ నాధ్ రెడ్డి ,ఆనంద్ రావు లు తీవ్రంగా ఖండించారు.
న్యాయంగా తమకు రావాల్సిన వేతన బత్యాలను ఇవ్వాలని అడిగిన వారిపై పోలీసుతో బలప్రయోగం చేయడం అత్యంత దారుణం అని పత్రిక ప్రకటన విడుదల చేసారు.
ఉపాధ్యాయులు ఎన్నికల విధుల పట్ల ఎంతో అంకిత భావం తో పనిచేస్తారని పొగిడిన అధికారులే, పనులు ముగించు కున్నాక సరియైన రెమ్యునరేషన్ ఇవ్వకుండా పోలీసులతో లాఠీ చార్జీ చేయడం అత్యంత బాధకరం అని నిబంధనల ప్రకారం 5 రోజుల రెమ్యునరేషన్ చెల్లించ కుండా ఈ ఘటనకు కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు ని పత్రికప్రకటన ద్వారా కోరారుఅలాగే రాష్ట్ర వ్యాపితంగా ఒకేరకమైన రెమ్యునరేషన్ చెల్లించాలని విజ్ఞప్తి చేసారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
