ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం - జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ 

- పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలి.

On
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం - జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ 

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349483/9348422113)

 

జగిత్యాల మే 11 (ప్రజా మంటలు) : 

జిల్లాలో స్వేచ్ఛయుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా జిల్లాకు వచ్చిన పోలీస్ అధికారులు,సిబ్బందితో జిల్లా కేంద్రం లొని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు.    

ఎన్నికల విధులకు వచ్చిన సెంట్రల్ ఆర్మూడ్ ఫోర్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల ప్రాముఖ్యతను వివరిస్తూ, ఎన్నికల విధులు ఏవిధంగా పకడ్బందీగా నిర్వహించాలి అని, సిబ్బంది చేయవలసిన, చేయకూడని విధుల గురించి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ క్షుణ్ణంగా వివరించారు.

పట్టణములో పోలీసు సిబ్బంది,కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా కొన సాగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...

  • పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్లరాదన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా ఉండాలని, అనవసర విషయాలు చర్చించవద్దన్నారు.
  • పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే ఏ చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు.
  • ఓటర్లు ఎవ్వరూ కూడా సెల్ ఫోన్ లు, మందుగుండు సామాగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, పోలింగ్ బూతు లోనికి తీసుకువెళ్లారాదని, సెల్ఫీలు దిగడం నిషేదం అన్నారు.
  • పోలింగ్ ముగిసిన తరువాత ఉన్నతాధికారాలు ఆదేశాలు లేనిదే ఎవ్వరూ కూడా తమ విధులనుండి వెళ్లరాదన్నారు.
  • ఎవరైనా చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భారత ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తామన్నారు.
  • ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగటానికి ఆస్కారం ఉన్న వెంటనే సంబంధిత యస్.హెచ్.ఒ. లకు, రూట్ మొబైలు అధికారికి సమాచారం అంధించాలన్నారు. ఎట్టి పరిస్తుతుల్లోనూ పోలింగ్ అధికారి అనుమతి లేనిది పోలింగ్ స్టేషన్ లోనికి వెళ్లారాదని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లు వినోద్ కుమార్, భీం రావ్, ఏ ఎస్పి శివం ఉపాధ్యాయ, డిఎస్పీలు రవీంద్ర కుమార్,రఘు చందర్, ఉమామహేశ్వర రావు,రంగా రెడ్డి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నాగేశ్వర రావు, వేణుగోపాల్, ఆరిఫ్ అలీ ఖాన్ , రవి , రామ్ నరసింహారెడ్డి,సురేష్,నవీన్ , ఆర్.ఐ లు వేణు ,రామకృష్ణ ,జానిమియా మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు.

Tags