ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.
- ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు )
శనివారం జిల్లా కేంద్రంలో 300 మంది జిల్లా పోలీస్, కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంబించారు. ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ మంచి నీళ్ళ బావి నుండి తీన్ ఖని,టవర్ సర్కిల్, న్యూ బస్ స్టాండ్ ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో 10 ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరిగిందని అన్నారు.
జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లా కి రావడం జరిగింది అని అన్నారు. మద్యం,నగదు మరియు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఫ్లాగ్ మార్చ్ లో అడిషనల్ ఎస్పీ లు వినోద్ కుమార్, భీం రావ్, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, డిఎస్పీలు రవీంద్ర కుమార్,రఘు చందర్, ఇన్స్పెక్టర్లు వేణుగోపాల్, ఆరిఫ్ అలీ, రవి , రామ్ నరసింహారెడ్డి ఖాన్ , ఆర్.ఐ లు వేణు ,రామకృష్ణ ,జనిమియా మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం
హైదరాబాద్ ఏప్రిల్ 25 (ప్రజా మంటలు);
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా జాగృతి నేత కేసీఆర్పై నేరుగా, నిర్భయంగా విరుచుకుపడ్డారు. “ఇవ్వాళ ఉన్నది మన కేసీఆర్ కాదు… మారిన మనిషి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ఇప్పుడు ప్రజలను పట్టించుకోని పాలకుడిగా మారిపోయాడని విమర్శించారు.నీళ్లు, నిధులు,... ఘనంగా సత్య సాయి ఆరాధన మహోత్సవ వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు)భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయము నగర సంకీర్తన అల్పాహార వితరణ రుద్ర పారాయణము రుద్రాభిషేకము మధ్యాహ్నం అర్హులైన వారికి వీల్ చైర్ ల పంపిణీ దుస్తుల... జగిత్యాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులకు కౌన్సిల్ ఆమోదం
జగిత్యాల ఏప్రిల్ 24 ( ప్రజా మంటలు) పురపాలక సంఘం కార్యాలయంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన కో-ఆప్షన్ ఎన్నికకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగినది.
ఇట్టి సమావేశము కౌన్సిల్ సమావేశములో వీరబత్తిని పద్మజ, గట్టు సతీష్, తస్లీం సుల్తాన మరియు మహమ్మద్ అబ్దుల్ కదీర్ అలియాస్ ముజ్జు భాయి... సహకార సంఘాలపై నామినేటెడ్ విధానం వెనక్కి తీసుకోవాలి: పిఎసిఎస్ మాజీ అధ్యక్షుల డిమాండ్
జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (DCCB)లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానం తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని పిఎసిఎస్ తాజా మాజీ అధ్యక్షులు తీవ్రంగా విమర్శించారు.
జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పోతారం పిఎసిఎస్... వరి ధాన్యం కుప్పలను పరిశీలించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
సారంగాపూర్ ఏప్రిల్ 24 (ప్రజా మంటలు) మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని వరి ధాన్య కుప్పలను రైతులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నిన్న కురిసిన పడగళ్ల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తొందరగా... కవిత కొత్త పార్టీ: ఆశలు, ఆశయాలు – తెలంగాణ రాజకీయాలకుకొత్త దిశా?
హైదరాబాద్ ఏప్రిల్ 25:తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం తెరలేపేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నారు. మునీరాబాద్లో అట్టహాసంగా ఏర్పాటు చేసిన సభలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న ఈ పరిణామం, కేవలం ఒక పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు – ఇది తెలంగాణ రాజకీయ వ్యవస్థలో మార్పు అవసరంపై మరోసారి చర్చను తెరపైకి తెస్తోంది.... ట్రా"ఫికర్" పై నిద్రలేచిన జగిత్యాల మున్సిపాలిటీ
జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు) జగిత్యాలలో నానాటికి ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాపారస్తులు తమ దుకాణాల ముందు ప్రదర్శన కోసం ఎన్నో వస్తువులను ఉంచడంతో రోడ్డు పైన నడిచే పాదాచార్లకు వాహనాలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులదే బాధ్యత అన్నట్లుగా మున్సిపల్... జగిత్యాలలో RTC సమ్మెకు జీవన్ రెడ్డి మద్దతు | ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు
జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
పట్టణంలోని RTC డిపో ముందు జరుగుతున్న RTC కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, RTC కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరమని, ఈ పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఫలితమని విమర్శించారు.... కాలేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి కుట్రలకు చెంప దెబ్బ* *ఎవరు ఔనన్నా కాదన్నా* *తెలంగాణకు ప్రాణేశ్వరం ముమ్మాటికీ కాళేశ్వరమే* తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్
* జగిత్యాల ఏప్రిల్ 22 ( ప్రజా మంటలు) కాలేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సందర్భంగా ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో తాసిల్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నాయకులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* ఘోష్ కమిషన్... ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా… ఏప్రిల్ 24న గ్రాండ్ రిలీజ్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
‘పరమపద సోపానం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అర్జున్ అంబటి హీరోగా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు నిర్మించగా, నాగ శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ... ఈ రోజు ఉదయం10 గంటలకు సభాస్థలి పరిశీలించనున్న కవిత
:హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు.
ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం... వెయ్యి ఏండ్లయినా బీఆర్ఎస్ మారదు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, “వెయ్యి ఏండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదు” అని మండిపడ్డారు.బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలనే తప్పు పడుతోందని... 