రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం..

మద్దతు ధరకు అదనంగా  రు.500 బోనస్ ఇస్తాం..

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల మే 17:

ధాన్యం తూకంలో కోత లేకుండా సేకరిస్తున్నాం. రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపికి అమ్ముడు పోయింది. గెలిచినా..ఓడినా..చరిత్రలో నిలుస్తా.బీ అర్ ఎస్ పాలనలో వరి వేస్తే ఉరి.. కేవలం సన్న రకాలు సాగు. చేయాలి....ధాన్యం కొనుగోలు చేయం అని తూములు కూడా బందు చేసిండ్రు అని అన్నారు.

ఇంకా, ఐదేళ్లు పూర్తి అయిన పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయలేదు.కెసిఆర్ సన్నరకాలు సాగుచేస్తే ఏవిధమైన ప్రోత్సాహం ఇవ్వలేదు.ఏక మొత్తంగా ఇవ్వాల్సిన రుణ మాఫీ విడతల వారీగా అమలు చేసింద్రు.

ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వాలని బీ అర్ ఎస్ నాయకులు రైతు దీక్ష చేపట్టడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది..రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి.డీజిల్ ధరలు పెరిగినాయి. 

పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా క్వింటాల్ కు 3000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది.

యూ పీ ఏ పాలనలో 2004 లో ధాన్యం క్వింటాల్ కు రు.450 మద్దతు ధర 2014 వరకు రు.1350 మూడింతలు పెరిగింది.

ఎన్ డీ ఏ పదేళ్ల పాలనలో కేవలం 1350 నుండి రు.2,200 పెంచింది. స్వామి నాథన్ సిఫార్సులు పరిగణలోకి తీసుకోవడం లేదు.

రైతులకు మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులకు అండగా నిలువాలని రు.500 బోనస్ ప్రకటిస్తే ఎట్లా ఇస్తారు అని విమర్షిస్తున్నరు.

పీ డీ ఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా, రీ సైక్లింగ్ అరికట్టబడాలి.మొదటి విడతగా రైతుకు కూడా సన్నరకాల సాగు కు బోనస్ అందిస్తాం. 

సన్న రకాల సాగు ఖరీఫ్ లోనే చేస్తారు.. ఈ విషయం కెసిఆర్ కు తెలుసో తెలియదో.. అందరూ 500 బోనస్ అమలు సాధ్యమా అని అనుకున్నారు.

బోనస్ అమలు కు చర్యలు చేపడుతున్నాం.

ఖరీఫ్ పంట నాటికి రెండు లక్షలు రుణ మాజీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డీ నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందించి, చర్యలు చేపడుతున్నం.

రైతులకు అండగా నిల్చెందుకు రైతు భరోసా అమలు చేసినం.రుణ మాఫీ చేయబోతున్నాం. ప్రభుత్వం అప్పు తీసుకు వచ్చి అయినా రుణ మాఫీ చేస్తుంది.

బీ అర్ ఎస్ రైతులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. ఐదేళ్ల లో పూర్తి స్థాయిలో రుణ మాఫీ. చేయలేదు. గతంలో క్వింటాల్ కు 10 కిలోలు అదనపు తూకం వెసిండ్రు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కోత లేకుండా సేకరిస్తోంది.ఈ ఏడాది అదనంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినం.

కల్లాల వద్ద ఇబ్బందులు లేకుండా
తడిసిన సేకరించెలా, రైతులు ఆందోళన పడకుండా చర్యలు చేపడుతున్నాం.

రైతులకు అండగా నిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును  బీ అర్ ఎస్  జీర్ణించుకోలేక, ఉనికి కాపాడుకోవాలని దీక్షలు చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.

డెడ్ స్టోరోజి నుండి కుండా నీరు విడుదల చేసి పంటలను కాపాడినం.విద్యుత్ గతేడాది కన్న ఏడాది 50 శాతం అదనంగా వినియోగం ఉన్నది.

ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలిచెందుకు క్వింటాల్ కు మద్దతు ధర రు.3000 ఇస్తాం.

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కోట్లాది మంది కి ఉపాధి కల్పిస్తున్నది. ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం.. పాలనలో పారదర్శక త కోసం.సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చినం.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బిజెపి కి కుదువ బెట్టిండ్రు.కాంగ్రెస్ ను గెలువకుండ అడ్డకునెందుకు బీ అర్ ఎస్ పార్టీ, బిజెపి కి అమ్ముడు పోయింది. పదేళ్లలో బిజెపి ప్రజల కోసం ఎం పథకాలు ప్రవేశ పెట్టింది.. ..బిజెపి కి ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే ఆలోచన లేదు..

బిజెపి కి సిద్దాంతం ఉన్నదా..? 

కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం చేయడం మినహా.. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తుందా.. బోనస్ ఇస్తుందా.. ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నదా..అని జీవన్ రెడ్డీ ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో పని చేస్తుంది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్.భారతదేశ అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు.

రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల  ప్రజలకు  సేవ చేయాలనే తపనతో నిజామాబాద్ నుండి పోటీ చేసిన.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేసిన, గెలిస్తే అర్జునుడిని అవుతా..ఓడితే అభిమన్యుడిని అవుతా..గెలిచినా..గెలువకపోయిన చరిత్రలో నిలిచిపోతా..అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

Tags