రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం..

మద్దతు ధరకు అదనంగా  రు.500 బోనస్ ఇస్తాం..

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల మే 17:

ధాన్యం తూకంలో కోత లేకుండా సేకరిస్తున్నాం. రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపికి అమ్ముడు పోయింది. గెలిచినా..ఓడినా..చరిత్రలో నిలుస్తా.బీ అర్ ఎస్ పాలనలో వరి వేస్తే ఉరి.. కేవలం సన్న రకాలు సాగు. చేయాలి....ధాన్యం కొనుగోలు చేయం అని తూములు కూడా బందు చేసిండ్రు అని అన్నారు.

ఇంకా, ఐదేళ్లు పూర్తి అయిన పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయలేదు.కెసిఆర్ సన్నరకాలు సాగుచేస్తే ఏవిధమైన ప్రోత్సాహం ఇవ్వలేదు.ఏక మొత్తంగా ఇవ్వాల్సిన రుణ మాఫీ విడతల వారీగా అమలు చేసింద్రు.

ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వాలని బీ అర్ ఎస్ నాయకులు రైతు దీక్ష చేపట్టడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది..రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి.డీజిల్ ధరలు పెరిగినాయి. 

పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా క్వింటాల్ కు 3000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది.

యూ పీ ఏ పాలనలో 2004 లో ధాన్యం క్వింటాల్ కు రు.450 మద్దతు ధర 2014 వరకు రు.1350 మూడింతలు పెరిగింది.

ఎన్ డీ ఏ పదేళ్ల పాలనలో కేవలం 1350 నుండి రు.2,200 పెంచింది. స్వామి నాథన్ సిఫార్సులు పరిగణలోకి తీసుకోవడం లేదు.

రైతులకు మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులకు అండగా నిలువాలని రు.500 బోనస్ ప్రకటిస్తే ఎట్లా ఇస్తారు అని విమర్షిస్తున్నరు.

పీ డీ ఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా, రీ సైక్లింగ్ అరికట్టబడాలి.మొదటి విడతగా రైతుకు కూడా సన్నరకాల సాగు కు బోనస్ అందిస్తాం. 

సన్న రకాల సాగు ఖరీఫ్ లోనే చేస్తారు.. ఈ విషయం కెసిఆర్ కు తెలుసో తెలియదో.. అందరూ 500 బోనస్ అమలు సాధ్యమా అని అనుకున్నారు.

బోనస్ అమలు కు చర్యలు చేపడుతున్నాం.

ఖరీఫ్ పంట నాటికి రెండు లక్షలు రుణ మాజీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డీ నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందించి, చర్యలు చేపడుతున్నం.

రైతులకు అండగా నిల్చెందుకు రైతు భరోసా అమలు చేసినం.రుణ మాఫీ చేయబోతున్నాం. ప్రభుత్వం అప్పు తీసుకు వచ్చి అయినా రుణ మాఫీ చేస్తుంది.

బీ అర్ ఎస్ రైతులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. ఐదేళ్ల లో పూర్తి స్థాయిలో రుణ మాఫీ. చేయలేదు. గతంలో క్వింటాల్ కు 10 కిలోలు అదనపు తూకం వెసిండ్రు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కోత లేకుండా సేకరిస్తోంది.ఈ ఏడాది అదనంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినం.

కల్లాల వద్ద ఇబ్బందులు లేకుండా
తడిసిన సేకరించెలా, రైతులు ఆందోళన పడకుండా చర్యలు చేపడుతున్నాం.

రైతులకు అండగా నిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును  బీ అర్ ఎస్  జీర్ణించుకోలేక, ఉనికి కాపాడుకోవాలని దీక్షలు చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.

డెడ్ స్టోరోజి నుండి కుండా నీరు విడుదల చేసి పంటలను కాపాడినం.విద్యుత్ గతేడాది కన్న ఏడాది 50 శాతం అదనంగా వినియోగం ఉన్నది.

ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలిచెందుకు క్వింటాల్ కు మద్దతు ధర రు.3000 ఇస్తాం.

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కోట్లాది మంది కి ఉపాధి కల్పిస్తున్నది. ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం.. పాలనలో పారదర్శక త కోసం.సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చినం.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బిజెపి కి కుదువ బెట్టిండ్రు.కాంగ్రెస్ ను గెలువకుండ అడ్డకునెందుకు బీ అర్ ఎస్ పార్టీ, బిజెపి కి అమ్ముడు పోయింది. పదేళ్లలో బిజెపి ప్రజల కోసం ఎం పథకాలు ప్రవేశ పెట్టింది.. ..బిజెపి కి ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే ఆలోచన లేదు..

బిజెపి కి సిద్దాంతం ఉన్నదా..? 

కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం చేయడం మినహా.. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తుందా.. బోనస్ ఇస్తుందా.. ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నదా..అని జీవన్ రెడ్డీ ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో పని చేస్తుంది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్.భారతదేశ అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు.

రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల  ప్రజలకు  సేవ చేయాలనే తపనతో నిజామాబాద్ నుండి పోటీ చేసిన.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేసిన, గెలిస్తే అర్జునుడిని అవుతా..ఓడితే అభిమన్యుడిని అవుతా..గెలిచినా..గెలువకపోయిన చరిత్రలో నిలిచిపోతా..అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ

కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ...
Read More...
State News 

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత    బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి...
Read More...
Local News  Sports 

జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం

జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం జగిత్యాల, సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు): విద్యార్థుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో విద్యార్థులకు చదరంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని ఎమ్మెల్సీ ఎల్‌. రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...
Local News 

రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత 

 రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత  జగిత్యాల సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కళాధర్ శనివారం జగిత్యాలలో దేహం చాలించారు. వారి పార్థివ దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహ దానం చేశారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మంచాల కృష్ణ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం కళాధర్...
Read More...
Local News 

జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ...

జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ... జగిత్యాల సెప్టెంబర్ 6(ప్రజా మంటలు): జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. గత కొంతకాలంగా పోలీస్ సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కిరణ్ కుమార్‌పై వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో...
Read More...
State News 

సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ కరీంనగర్, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య, అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్...
Read More...
National 

270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం

270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు): బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ...
Read More...
Local News 

గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం

గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:గోవుల సంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ సాయి అపార్ట్‌మెంట్‌ వాసులు ఏర్పాటు చేసిన గోశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్...
Read More...
Local News 

నూకపల్లి సరస్వతీ ఆలయం వద్ద జగిత్యాల డైలీ వాకర్స్ సందడి

నూకపల్లి సరస్వతీ ఆలయం వద్ద జగిత్యాల డైలీ వాకర్స్ సందడి కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు.. ఆటపాటలతో ఉత్సాహం జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్వామి మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మల్యాల మండలం నూకపల్లిలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయ సన్నిధిలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది వాకర్స్ తమ...
Read More...
Local News 

ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం : మంత్రి లక్ష్మణ్ కుమార్

ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం : మంత్రి లక్ష్మణ్ కుమార్    ధర్మపురి, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్‌లో నిర్వహించిన ధర్మపురి మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గాల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి మంత్రి...
Read More...
Local News 

తుమ్మేనాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

తుమ్మేనాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం    ధర్మపురి సెప్టెంబర్ 5( ప్రజా మంటలు )మండలంలోని "తుమ్మేనాల" ప్రాథమిక పాఠశాలలో  ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న "సముద్రాల శిరీష"  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా  ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఎంపికైంది.     శనివారం జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ జిల్లా విద్యాధికారి...
Read More...
Local News 

సమస్యల పరిష్కారం కోసం ఛలో హైదరాబాద్

సమస్యల పరిష్కారం కోసం ఛలో హైదరాబాద్ జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు)జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ల పిలుపు మేరకు సెప్టెంబర్ 10న నిర్వహించనున్న...
Read More...