రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం..
మద్దతు ధరకు అదనంగా రు.500 బోనస్ ఇస్తాం..
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల మే 17:
ధాన్యం తూకంలో కోత లేకుండా సేకరిస్తున్నాం. రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపికి అమ్ముడు పోయింది. గెలిచినా..ఓడినా..చరిత్రలో నిలుస్తా.బీ అర్ ఎస్ పాలనలో వరి వేస్తే ఉరి.. కేవలం సన్న రకాలు సాగు. చేయాలి....ధాన్యం కొనుగోలు చేయం అని తూములు కూడా బందు చేసిండ్రు అని అన్నారు.
ఇంకా, ఐదేళ్లు పూర్తి అయిన పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయలేదు.కెసిఆర్ సన్నరకాలు సాగుచేస్తే ఏవిధమైన ప్రోత్సాహం ఇవ్వలేదు.ఏక మొత్తంగా ఇవ్వాల్సిన రుణ మాఫీ విడతల వారీగా అమలు చేసింద్రు.
ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వాలని బీ అర్ ఎస్ నాయకులు రైతు దీక్ష చేపట్టడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది..రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి.డీజిల్ ధరలు పెరిగినాయి.
పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా క్వింటాల్ కు 3000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది.
యూ పీ ఏ పాలనలో 2004 లో ధాన్యం క్వింటాల్ కు రు.450 మద్దతు ధర 2014 వరకు రు.1350 మూడింతలు పెరిగింది.
ఎన్ డీ ఏ పదేళ్ల పాలనలో కేవలం 1350 నుండి రు.2,200 పెంచింది. స్వామి నాథన్ సిఫార్సులు పరిగణలోకి తీసుకోవడం లేదు.
రైతులకు మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులకు అండగా నిలువాలని రు.500 బోనస్ ప్రకటిస్తే ఎట్లా ఇస్తారు అని విమర్షిస్తున్నరు.
పీ డీ ఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా, రీ సైక్లింగ్ అరికట్టబడాలి.మొదటి విడతగా రైతుకు కూడా సన్నరకాల సాగు కు బోనస్ అందిస్తాం.
సన్న రకాల సాగు ఖరీఫ్ లోనే చేస్తారు.. ఈ విషయం కెసిఆర్ కు తెలుసో తెలియదో.. అందరూ 500 బోనస్ అమలు సాధ్యమా అని అనుకున్నారు.
బోనస్ అమలు కు చర్యలు చేపడుతున్నాం.
ఖరీఫ్ పంట నాటికి రెండు లక్షలు రుణ మాజీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డీ నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందించి, చర్యలు చేపడుతున్నం.
రైతులకు అండగా నిల్చెందుకు రైతు భరోసా అమలు చేసినం.రుణ మాఫీ చేయబోతున్నాం. ప్రభుత్వం అప్పు తీసుకు వచ్చి అయినా రుణ మాఫీ చేస్తుంది.
బీ అర్ ఎస్ రైతులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. ఐదేళ్ల లో పూర్తి స్థాయిలో రుణ మాఫీ. చేయలేదు. గతంలో క్వింటాల్ కు 10 కిలోలు అదనపు తూకం వెసిండ్రు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కోత లేకుండా సేకరిస్తోంది.ఈ ఏడాది అదనంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినం.
కల్లాల వద్ద ఇబ్బందులు లేకుండా
తడిసిన సేకరించెలా, రైతులు ఆందోళన పడకుండా చర్యలు చేపడుతున్నాం.
రైతులకు అండగా నిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును బీ అర్ ఎస్ జీర్ణించుకోలేక, ఉనికి కాపాడుకోవాలని దీక్షలు చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.
డెడ్ స్టోరోజి నుండి కుండా నీరు విడుదల చేసి పంటలను కాపాడినం.విద్యుత్ గతేడాది కన్న ఏడాది 50 శాతం అదనంగా వినియోగం ఉన్నది.
ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలిచెందుకు క్వింటాల్ కు మద్దతు ధర రు.3000 ఇస్తాం.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కోట్లాది మంది కి ఉపాధి కల్పిస్తున్నది. ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం.. పాలనలో పారదర్శక త కోసం.సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చినం.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బిజెపి కి కుదువ బెట్టిండ్రు.కాంగ్రెస్ ను గెలువకుండ అడ్డకునెందుకు బీ అర్ ఎస్ పార్టీ, బిజెపి కి అమ్ముడు పోయింది. పదేళ్లలో బిజెపి ప్రజల కోసం ఎం పథకాలు ప్రవేశ పెట్టింది.. ..బిజెపి కి ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే ఆలోచన లేదు..
బిజెపి కి సిద్దాంతం ఉన్నదా..?
కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం చేయడం మినహా.. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తుందా.. బోనస్ ఇస్తుందా.. ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నదా..అని జీవన్ రెడ్డీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో పని చేస్తుంది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్.భారతదేశ అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు.
రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే తపనతో నిజామాబాద్ నుండి పోటీ చేసిన.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేసిన, గెలిస్తే అర్జునుడిని అవుతా..ఓడితే అభిమన్యుడిని అవుతా..గెలిచినా..గెలువకపోయిన చరిత్రలో నిలిచిపోతా..అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుంది ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 3 ( ప్రజా మంటలు)
చదువుతోపాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపిన విద్యార్తులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. తల్లితండ్రులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సైతం క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడలతో మానసిక స్థైర్యం పెంపండడమే కాకుండా, చదువు పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుందన్నారు. జూన్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని జగిత్యాల కు... ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై కవిత ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు):
ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై భారీగా ఫీజుల భారం మోపుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి 30 నుండి 40 శాతం వరకు ఫీజులు పెంచడం దోపిడీ చర్య అని విమర్శించారు.శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆమె,... “కాళేశ్వరం పై లక్ష కోట్లు ఆరోపణలు అసత్యం – మేడిగడ్డ పునరుద్ధరణ ఎందుకు చేయట్లేదు?”: జీవన్ రెడ్డి ఫైర్
జగిత్యాల, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు):
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై “లక్ష కోట్లు కొట్టుకుపోయాయి” అనే వ్యాఖ్యలు ఆశ్చర్యకరమని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.... సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి డా చంద్రశేఖర్ గౌడ్
జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)
సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి అని జిల్లా గ్రంధాలే మాజీ చైర్మన్ డా చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 317 వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని గొల్లపెల్లి రోడ్ బైపాస్ దారిలో ఉన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు... శ్రీ గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి
జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు) పట్టణంలోని మంచి బావి దగ్గర గుండు హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తాజామాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆడువాల జ్యోతి లక్ష్మణ్ వారి వెంట ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు సమస్యలు తెలుసుకోవచ్చు- మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి
జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు 40వ వార్డులో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమంలో హాజరై ఆయన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వార్డు సభల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి,... ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గొప్ప కార్యక్రమం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్... తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు
వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం?
భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.చరిత్రలో రాణి... టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన జగిత్యాల టిఎన్జీఓ లు
కరీంనగర్ ఏప్రిల్ 1(ప్రజా మంటలు)ఇటీవల టిఎన్జీఓ కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో రెండవ సారి రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ని జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జగిత్యాల టిఎన్జీఓ లు ఘనంగా సన్మానించారు.
కరీంనగర్... కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు.
. హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ
జగిత్యాల మార్చి 31 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శాస్త్రి పదవి విరమణ మంగళవారం జరగగా ఆలయ ఆవరణలో రాజన్న శాస్త్రి పద్మ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో సురేందర్ తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు.
ఈ... తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ
హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.... 