రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం..
మద్దతు ధరకు అదనంగా రు.500 బోనస్ ఇస్తాం..
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల మే 17:
ధాన్యం తూకంలో కోత లేకుండా సేకరిస్తున్నాం. రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపికి అమ్ముడు పోయింది. గెలిచినా..ఓడినా..చరిత్రలో నిలుస్తా.బీ అర్ ఎస్ పాలనలో వరి వేస్తే ఉరి.. కేవలం సన్న రకాలు సాగు. చేయాలి....ధాన్యం కొనుగోలు చేయం అని తూములు కూడా బందు చేసిండ్రు అని అన్నారు.
ఇంకా, ఐదేళ్లు పూర్తి అయిన పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయలేదు.కెసిఆర్ సన్నరకాలు సాగుచేస్తే ఏవిధమైన ప్రోత్సాహం ఇవ్వలేదు.ఏక మొత్తంగా ఇవ్వాల్సిన రుణ మాఫీ విడతల వారీగా అమలు చేసింద్రు.
ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వాలని బీ అర్ ఎస్ నాయకులు రైతు దీక్ష చేపట్టడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది..రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి.డీజిల్ ధరలు పెరిగినాయి.
పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా క్వింటాల్ కు 3000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది.
యూ పీ ఏ పాలనలో 2004 లో ధాన్యం క్వింటాల్ కు రు.450 మద్దతు ధర 2014 వరకు రు.1350 మూడింతలు పెరిగింది.
ఎన్ డీ ఏ పదేళ్ల పాలనలో కేవలం 1350 నుండి రు.2,200 పెంచింది. స్వామి నాథన్ సిఫార్సులు పరిగణలోకి తీసుకోవడం లేదు.
రైతులకు మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులకు అండగా నిలువాలని రు.500 బోనస్ ప్రకటిస్తే ఎట్లా ఇస్తారు అని విమర్షిస్తున్నరు.
పీ డీ ఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా, రీ సైక్లింగ్ అరికట్టబడాలి.మొదటి విడతగా రైతుకు కూడా సన్నరకాల సాగు కు బోనస్ అందిస్తాం.
సన్న రకాల సాగు ఖరీఫ్ లోనే చేస్తారు.. ఈ విషయం కెసిఆర్ కు తెలుసో తెలియదో.. అందరూ 500 బోనస్ అమలు సాధ్యమా అని అనుకున్నారు.
బోనస్ అమలు కు చర్యలు చేపడుతున్నాం.
ఖరీఫ్ పంట నాటికి రెండు లక్షలు రుణ మాజీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డీ నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందించి, చర్యలు చేపడుతున్నం.
రైతులకు అండగా నిల్చెందుకు రైతు భరోసా అమలు చేసినం.రుణ మాఫీ చేయబోతున్నాం. ప్రభుత్వం అప్పు తీసుకు వచ్చి అయినా రుణ మాఫీ చేస్తుంది.
బీ అర్ ఎస్ రైతులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. ఐదేళ్ల లో పూర్తి స్థాయిలో రుణ మాఫీ. చేయలేదు. గతంలో క్వింటాల్ కు 10 కిలోలు అదనపు తూకం వెసిండ్రు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కోత లేకుండా సేకరిస్తోంది.ఈ ఏడాది అదనంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినం.
కల్లాల వద్ద ఇబ్బందులు లేకుండా
తడిసిన సేకరించెలా, రైతులు ఆందోళన పడకుండా చర్యలు చేపడుతున్నాం.
రైతులకు అండగా నిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును బీ అర్ ఎస్ జీర్ణించుకోలేక, ఉనికి కాపాడుకోవాలని దీక్షలు చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.
డెడ్ స్టోరోజి నుండి కుండా నీరు విడుదల చేసి పంటలను కాపాడినం.విద్యుత్ గతేడాది కన్న ఏడాది 50 శాతం అదనంగా వినియోగం ఉన్నది.
ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలిచెందుకు క్వింటాల్ కు మద్దతు ధర రు.3000 ఇస్తాం.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కోట్లాది మంది కి ఉపాధి కల్పిస్తున్నది. ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం.. పాలనలో పారదర్శక త కోసం.సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చినం.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బిజెపి కి కుదువ బెట్టిండ్రు.కాంగ్రెస్ ను గెలువకుండ అడ్డకునెందుకు బీ అర్ ఎస్ పార్టీ, బిజెపి కి అమ్ముడు పోయింది. పదేళ్లలో బిజెపి ప్రజల కోసం ఎం పథకాలు ప్రవేశ పెట్టింది.. ..బిజెపి కి ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే ఆలోచన లేదు..
బిజెపి కి సిద్దాంతం ఉన్నదా..?
కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం చేయడం మినహా.. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తుందా.. బోనస్ ఇస్తుందా.. ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నదా..అని జీవన్ రెడ్డీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో పని చేస్తుంది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్.భారతదేశ అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు.
రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే తపనతో నిజామాబాద్ నుండి పోటీ చేసిన.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేసిన, గెలిస్తే అర్జునుడిని అవుతా..ఓడితే అభిమన్యుడిని అవుతా..గెలిచినా..గెలువకపోయిన చరిత్రలో నిలిచిపోతా..అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్యేను కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కే. రాజశేఖర్, డైరెక్టర్ సాయి కృష్ణ మర్యాద పూర్వక భేటీ చేశారు. ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు... ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ
కార్యక్రమంలో భాగంగా... జమాత్ ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఫారన్ క్లినిక్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ప్రారంభం
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జమాత్ ఏ ఇస్లామీ హింద్ జగిత్యాల ఆద్వర్యం లో ఫారన్ క్లినిక్ ను ఫ్యామిలీ హెల్త్ కేర్ ను ప్రారంభించిన తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్,జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రతి సొసైటీ సేవ... ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్
జగిత్యాల (రూరల్), నవంబర్ 19 (ప్రజా మంటలు):
జమాత్ ఏ ఇస్లామీ హింద్ – జగిత్యాల విభాగం ఆద్వర్యంలో ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఫారన్ ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్, జగిత్యాల... బిహార్ ముఖ్యమంత్రిగా 10 వ సారి నితీష్ కుమార్కు ఎన్నిక
20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం
పాట్నా, నవంబర్ 19 (ప్రజా మంటలు):
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమాఖ్య సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదే సమావేశంలో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, విజయ్... సింగరేణి భవన్ ముట్టడి… కల్వకుంట్ల కవిత అరెస్ట్!
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):
సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ నగరంలోని సింగరేణి భవన్ను ముట్టడించారు. ఆమెతో పాటు జాగృతి కార్యకర్తలు, హెచ్ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు... “మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి “జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)భారత రత్న , దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ చేయాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు .
అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా,మండల... దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ _ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల నవంబర్ 19(ప్రజా మంటలు)దేశ సమగ్రత కోసం,పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన ఉక్కుమహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిర చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు.ఎమ్మేల్యే మాట్లాడుతూదేశ... శ్రీ సత్య సాయిబాబా శతజయంతి సందర్భంగా పుట్టపర్తికి ప్రధాని విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి
పుట్టపర్తి నవంబర్ 19 ( ప్రజా మంటలు)శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవ వేడుకలలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.. FCI Ap Director వనగొందివిజయలక్ష్మిబీజేపీ పార్టీ లో కష్టపడి... అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి
స్వచ్ఛంద సేవా సంస్థ సాయం
మహబూబ్నగర్, నవంబర్ 18 (ప్రజా మంటలు):
మహబూబ్నగర్లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. అంత్యక్రియల ఖర్చు కూడా చేయలేని దారిద్య్రం ఒక తండ్రిని 8 గంటలపాటు తన చిన్నారి మృతదేహంతో స్మశానంలోనే కూర్చోబెట్టింది.
ఎంతో కష్టాల్లో కుటుంబం
ప్రేమ్ నాగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్... లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్జీని ఏపీ ఎన్కౌంటర్లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ
హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):
మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల మావోయిస్టుల లొంగుబాట్లు వేగం పుంజుకోవడంతో, పైస్థాయి నాయకులకు మాత్రమే ప్రత్యేక రిహాబిలిటేషన్ సదుపాయాలు కల్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం విరుద్ధ దిశగా భారీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
ఇలాంటి సమయంలోనే మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బతీసే లొంగుబాటు జరగబోతోందని విశ్వసనీయ... ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం
బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిశీలన
(సిహెచ్.వి. ప్రభాకర్ రావు)
బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు... 