రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం..
మద్దతు ధరకు అదనంగా రు.500 బోనస్ ఇస్తాం..
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల మే 17:
ధాన్యం తూకంలో కోత లేకుండా సేకరిస్తున్నాం. రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపికి అమ్ముడు పోయింది. గెలిచినా..ఓడినా..చరిత్రలో నిలుస్తా.బీ అర్ ఎస్ పాలనలో వరి వేస్తే ఉరి.. కేవలం సన్న రకాలు సాగు. చేయాలి....ధాన్యం కొనుగోలు చేయం అని తూములు కూడా బందు చేసిండ్రు అని అన్నారు.
ఇంకా, ఐదేళ్లు పూర్తి అయిన పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయలేదు.కెసిఆర్ సన్నరకాలు సాగుచేస్తే ఏవిధమైన ప్రోత్సాహం ఇవ్వలేదు.ఏక మొత్తంగా ఇవ్వాల్సిన రుణ మాఫీ విడతల వారీగా అమలు చేసింద్రు.
ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వాలని బీ అర్ ఎస్ నాయకులు రైతు దీక్ష చేపట్టడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది..రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి.డీజిల్ ధరలు పెరిగినాయి.
పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా క్వింటాల్ కు 3000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది.
యూ పీ ఏ పాలనలో 2004 లో ధాన్యం క్వింటాల్ కు రు.450 మద్దతు ధర 2014 వరకు రు.1350 మూడింతలు పెరిగింది.
ఎన్ డీ ఏ పదేళ్ల పాలనలో కేవలం 1350 నుండి రు.2,200 పెంచింది. స్వామి నాథన్ సిఫార్సులు పరిగణలోకి తీసుకోవడం లేదు.
రైతులకు మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులకు అండగా నిలువాలని రు.500 బోనస్ ప్రకటిస్తే ఎట్లా ఇస్తారు అని విమర్షిస్తున్నరు.
పీ డీ ఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా, రీ సైక్లింగ్ అరికట్టబడాలి.మొదటి విడతగా రైతుకు కూడా సన్నరకాల సాగు కు బోనస్ అందిస్తాం.
సన్న రకాల సాగు ఖరీఫ్ లోనే చేస్తారు.. ఈ విషయం కెసిఆర్ కు తెలుసో తెలియదో.. అందరూ 500 బోనస్ అమలు సాధ్యమా అని అనుకున్నారు.
బోనస్ అమలు కు చర్యలు చేపడుతున్నాం.
ఖరీఫ్ పంట నాటికి రెండు లక్షలు రుణ మాజీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డీ నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందించి, చర్యలు చేపడుతున్నం.
రైతులకు అండగా నిల్చెందుకు రైతు భరోసా అమలు చేసినం.రుణ మాఫీ చేయబోతున్నాం. ప్రభుత్వం అప్పు తీసుకు వచ్చి అయినా రుణ మాఫీ చేస్తుంది.
బీ అర్ ఎస్ రైతులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. ఐదేళ్ల లో పూర్తి స్థాయిలో రుణ మాఫీ. చేయలేదు. గతంలో క్వింటాల్ కు 10 కిలోలు అదనపు తూకం వెసిండ్రు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కోత లేకుండా సేకరిస్తోంది.ఈ ఏడాది అదనంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినం.
కల్లాల వద్ద ఇబ్బందులు లేకుండా
తడిసిన సేకరించెలా, రైతులు ఆందోళన పడకుండా చర్యలు చేపడుతున్నాం.
రైతులకు అండగా నిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును బీ అర్ ఎస్ జీర్ణించుకోలేక, ఉనికి కాపాడుకోవాలని దీక్షలు చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.
డెడ్ స్టోరోజి నుండి కుండా నీరు విడుదల చేసి పంటలను కాపాడినం.విద్యుత్ గతేడాది కన్న ఏడాది 50 శాతం అదనంగా వినియోగం ఉన్నది.
ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలిచెందుకు క్వింటాల్ కు మద్దతు ధర రు.3000 ఇస్తాం.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కోట్లాది మంది కి ఉపాధి కల్పిస్తున్నది. ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం.. పాలనలో పారదర్శక త కోసం.సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చినం.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బిజెపి కి కుదువ బెట్టిండ్రు.కాంగ్రెస్ ను గెలువకుండ అడ్డకునెందుకు బీ అర్ ఎస్ పార్టీ, బిజెపి కి అమ్ముడు పోయింది. పదేళ్లలో బిజెపి ప్రజల కోసం ఎం పథకాలు ప్రవేశ పెట్టింది.. ..బిజెపి కి ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే ఆలోచన లేదు..
బిజెపి కి సిద్దాంతం ఉన్నదా..?
కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం చేయడం మినహా.. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తుందా.. బోనస్ ఇస్తుందా.. ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నదా..అని జీవన్ రెడ్డీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో పని చేస్తుంది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్.భారతదేశ అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు.
రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే తపనతో నిజామాబాద్ నుండి పోటీ చేసిన.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేసిన, గెలిస్తే అర్జునుడిని అవుతా..ఓడితే అభిమన్యుడిని అవుతా..గెలిచినా..గెలువకపోయిన చరిత్రలో నిలిచిపోతా..అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన
ధర్మపురి, జనవరి 31 (ప్రజా మంటలు):ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 15 వార్డులకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇంచార్జీలను కూడా నియమించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ... రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, జనవరి 31 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
ఈ నిరసనలలో భాగంగా రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే... PRTU–TS ఆధ్వర్యంలో టెట్ రద్దు కోసం చలో ఢిల్లీ - పోస్టర్ ఆవిష్కరణ
జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు):
ఎఐజాక్ట్ పిలుపు మేరకు, పీఆర్టీయూ–టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్ రద్దు మరియు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్తో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న “చలో ఢిల్లీ” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినిపెల్లి... పౌరహక్కుల దినోత్సవానికి పూర్తి స్థాయి అధికారులు గైర్హాజరు
గొల్లపల్లి, జనవరి 31 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట్ గ్రామంలో శనివారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమానికి మండల స్థాయి పూర్తి అధికారుల హాజరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కల్పించాల్సిన కీలక అధికారులు హాజరు కాకపోవడంపై గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పౌరహక్కుల దినోత్సవం వంటి... కేసీఆర్పై రాజకీయ వేధింపులకు నిరసనగా ఆందోళనలకు పిలుపు
జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారిని సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్యేనని జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ... ఘనంగా జంతు సంక్షేమ పక్షోత్సవంనిర్వహణ
జగిత్యాల జనవరి 31 ( ప్రజా మంటలు)జంతు సంక్షేమ పక్షోత్సవం కార్యక్రమం లో భాగంగా జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల పురానిపేట జగిత్యాల లో జరిగిన కార్యక్రమం అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్. లత గారు మరియు జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.ప్రకాష్ పాల్గొన్నారు... రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
జగిత్యాల జనవరి 31 (ప్రజా మంటలు)లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల, మరియు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు రోజు సందర్భంగా స్థానిక ఆర్డిఓ ఆఫీస్ ముందర హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.
రోడ్డు ప్రమాదాలను నివారించడo, ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడo,ప్రజలు... జగిత్యాల బల్దియా పై కాంగ్రెస్ జండా ఎగరవేయాలి :: mlc వెంకట్
జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర PCC ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్... UGC కుల విచక్షణ నిరోధక రూల్స్ – అగ్రవర్ణ రాజకీయాల అసలు ముఖం
(ప్రత్యేక వ్యాసం)
పూర్వ నేపథ్యం – అమలు కాని న్యాయం
2012లో యూనివర్సిటీల్లో కుల ఆధారిత వివక్షను నిర్మూలించేందుకు UGC ప్రత్యేక రూల్స్ రూపొందించింది. కానీ అవి చట్టాలుగా ఉన్నా, ఆచరణలో అమలుకాకుండా అగ్రవర్ణాల ఒత్తిడితో మూలకు నెట్టబడ్డాయి. దళితులు, BC, ST విద్యార్థులపై అవమానాలు, వేధింపులు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ప్రభుత్వాలు, యూనివర్సిటీ... బెంగళూరులో విషాదం: కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య
బెంగళూరు జనవరి 30 (ప్రజా మంటలు):
వ్యాపార వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాన్ఫిడెంట్ గ్రూప్ యజమాని, చైర్మన్ అయిన సీజే రాయ్ (57) శుక్రవారం బెంగళూరు సెంట్రల్ ప్రాంతంలోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనతో వ్యాపార వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా... ఫోన్ట్యాపింగ్ కేసు: కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు
హైదరాబాద్ జనవరి 30 (ప్రజా మంటలు):
ఫోన్ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు.
ఎర్రవల్లి ఫామ్హౌస్లో విచారణకు అనుమతి ఇవ్వలేమని సిట్ స్పష్టం చేసింది. తమ రికార్డుల్లో... ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలి: రాంచందర్ రావు
▶ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపణ▶ జగిత్యాలలో ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి: అరవింద్▶ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది.
జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ శంఖారావం... 