గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

On
గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

గుంజపడుగులో పోలీసు టికెటింగ్ -ప్రహరీ గోడ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ

గొల్లపల్లి మే 15 (ప్రజా మంటలు) :

గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన చిన్న గొడవ, చిలికి చిలికి గాలివానగా మారి, పోలీసు పికెటింగ్ ఏర్పాటుకు దారితీసింది. రెండు కుటుంబాల మధ్య ఉన్న చిన్న ప్రహరీ గోడ విషయంలో తలెత్తిన వివాదం ఇరు! కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా,  ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు గ్రామంలో పీకేటింగ్ ఏర్పాటు చేశారు.  రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఈ ఘంటకు బాధ్యులైన ఇరువర్గాలకు చెందిన పదిమందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై చిర్ర సతీష్ తెలిపారు ఈ సంఘటన బుధవారం మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

 గొల్లపల్లి మండలం లోని గుంజపడుగు లో ఒక చిన్న విషయంలో జరిన గొడవ కారణంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐ చిర్ర సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, గుంజపడుగు గ్రామానికి చెందిన కళ్లెం తిరుపతి, పస్తం శారదల కుటుంబాల  మధ్య ఉన్న ప్రహరీ గోడకు సంబంధించి గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ, మాట మాట పెరిగి  తిరుపతి, శారదను అసభ్యంగా దూషించడంతో ఘర్షణకు దారితీసింది.

బాధిత మహిళ కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని తిరుపతి ఇంటి వద్దకు వెళ్లగా,తిరుపతి కుటుంబసభ్యులు కలిసి గోడవపడ్డారు. అక్కడ రెండు వర్గాల వారు, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తిరుపతికి సంబంధించిన ఇల్లు ఇల్లును, బాధిత మహిళ కుటుంబ సభ్యులు పాక్షకంగా ధ్వంసం చేశారు. దీంతో కోపద్రిక్తులైన తిరుపతి కుటుంబ సభ్యులు  శారద అన్నదమ్ములైన సమ్మయ్య, పోశయ్య పోసేలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్య చికిత్సల నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించి, వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.   

సమాచారం తెలుసుకున్న ఎస్ఐ చిర్ర సతీష్, తన సిబ్బందితో కలిసి గ్రామాని సందర్శించి, ఇరు వర్గాలతో మాట్లాడి  గొడవ తాత్కాలికంగా సద్దుమనిగేందుకు ప్రయత్నించారు. అయితే రెండు వర్గాలు తమ బంధుమిత్రులతో కలిసి మళ్ళీ, బాహబహికి దిగడంతో, శాంతి భద్రతలను అదుపులోకి తేవడానికి  పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సంఘటన స్థలాన్ని ధర్మపురి సిఐ రామ నరసింహారెడ్డి పరిశీలించారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి, తిరుమలేష్,  శ్రీకాంత్, తోపాటు ఇరు వర్గాల  చెందిన మరో ఏడుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

-----

Tags
Join WhatsApp

More News...

Local News  Crime 

భైంసాలో అనుమానాస్పద సంబంధంపై ఘోర హత్య

భైంసాలో అనుమానాస్పద సంబంధంపై ఘోర హత్య నిర్మల్ డిసెంబర్ 09: నిర్మల్ జిల్లా భైంసాలో ప్రేమ సంబంధం తీవ్ర విషాదానికి దారితీసింది. నందన టీ పాయింట్ వద్ద 27 ఏళ్ల అశ్వినిని ఆమె ప్రియుడు నగేష్ కత్తితో దారుణంగా హత్య చేశాడు. రెండేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అశ్విని, నగేష్‌తో ప్రేమలో పడి అతనితో కలిసి నివసిస్తోంది. ఉపాధి కోసం అశ్వినికి...
Read More...
Local News  State News 

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు సికింద్రాబాద్,  డిసెంబర్ 08 (ప్రజామంటలు): :    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని  సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ...
Read More...

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన
Read More...

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*    జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ *కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు....
Read More...

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్ ** జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు)   భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ...
Read More...

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు) సర్పంచ్  ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్  పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్  గ్రామంలో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా  సి.ఐ సుధాకర్  మాట్లాడుతూ....
Read More...

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం 

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం  జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి...
Read More...
National  Filmi News 

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్ కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్‌ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం...
Read More...
National  State News 

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు): తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3...
Read More...
Local News 

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు): జగిత్యాల ఇందిరాభవన్‌లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్‌గా ఉన్న రామస్వామి...
Read More...
State News 

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,” తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్‌పల్లి ప్రెస్ మీట్ కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు): మేడ్చల్–మల్కాజ్‌గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లిలో జరిగిన...
Read More...
State News 

“ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్

“ఏం సాధించారని సంబరాలు “స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు” హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు): ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల...
Read More...