గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

On
గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

గుంజపడుగులో పోలీసు టికెటింగ్ -ప్రహరీ గోడ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ

గొల్లపల్లి మే 15 (ప్రజా మంటలు) :

గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన చిన్న గొడవ, చిలికి చిలికి గాలివానగా మారి, పోలీసు పికెటింగ్ ఏర్పాటుకు దారితీసింది. రెండు కుటుంబాల మధ్య ఉన్న చిన్న ప్రహరీ గోడ విషయంలో తలెత్తిన వివాదం ఇరు! కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా,  ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు గ్రామంలో పీకేటింగ్ ఏర్పాటు చేశారు.  రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఈ ఘంటకు బాధ్యులైన ఇరువర్గాలకు చెందిన పదిమందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై చిర్ర సతీష్ తెలిపారు ఈ సంఘటన బుధవారం మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

 గొల్లపల్లి మండలం లోని గుంజపడుగు లో ఒక చిన్న విషయంలో జరిన గొడవ కారణంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐ చిర్ర సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, గుంజపడుగు గ్రామానికి చెందిన కళ్లెం తిరుపతి, పస్తం శారదల కుటుంబాల  మధ్య ఉన్న ప్రహరీ గోడకు సంబంధించి గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ, మాట మాట పెరిగి  తిరుపతి, శారదను అసభ్యంగా దూషించడంతో ఘర్షణకు దారితీసింది.

బాధిత మహిళ కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని తిరుపతి ఇంటి వద్దకు వెళ్లగా,తిరుపతి కుటుంబసభ్యులు కలిసి గోడవపడ్డారు. అక్కడ రెండు వర్గాల వారు, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తిరుపతికి సంబంధించిన ఇల్లు ఇల్లును, బాధిత మహిళ కుటుంబ సభ్యులు పాక్షకంగా ధ్వంసం చేశారు. దీంతో కోపద్రిక్తులైన తిరుపతి కుటుంబ సభ్యులు  శారద అన్నదమ్ములైన సమ్మయ్య, పోశయ్య పోసేలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్య చికిత్సల నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించి, వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.   

సమాచారం తెలుసుకున్న ఎస్ఐ చిర్ర సతీష్, తన సిబ్బందితో కలిసి గ్రామాని సందర్శించి, ఇరు వర్గాలతో మాట్లాడి  గొడవ తాత్కాలికంగా సద్దుమనిగేందుకు ప్రయత్నించారు. అయితే రెండు వర్గాలు తమ బంధుమిత్రులతో కలిసి మళ్ళీ, బాహబహికి దిగడంతో, శాంతి భద్రతలను అదుపులోకి తేవడానికి  పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సంఘటన స్థలాన్ని ధర్మపురి సిఐ రామ నరసింహారెడ్డి పరిశీలించారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి, తిరుమలేష్,  శ్రీకాంత్, తోపాటు ఇరు వర్గాల  చెందిన మరో ఏడుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

-----

Tags
Join WhatsApp

More News...

Local News 

TPUS జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా.సంజయ్

TPUS జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నిక కావడంతో, నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డా....
Read More...
Local News 

ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల. డిసెంబర్ 28, (ప్రజా మంటలు): ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. టీచర్స్ భవన్‌లో పీఆర్‌టీయూటీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి...
Read More...
Local News  State News 

ఆమనగల్లో జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత

ఆమనగల్లో జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత నగర్ కర్నూలు, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): నగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జనావాసాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా మైసిగండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆమన్ గల్...
Read More...

మెట్‌పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి, ఒకరి పరిస్థితి విషమం

మెట్‌పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి, ఒకరి పరిస్థితి విషమం మెటుపల్లి డిసెంబర్ 27 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా...
Read More...
Local News 

గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు

గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు సికింద్రాబాద్, డిసెంబర్ 27 (ప్రజామంటలు):   సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మెట్రో స్టేషన్, ఎంసీహెచ్  బస్ షెల్టర్ ప్రాంతాల్లో అక్రమంగా పార్కింగ్ చేసిన 12 వాహనాలకు ఫైన్ వేసి, అక్కడి నుంచి తొలగించారు. అలాగే ఏండ్ల తరబడిగా గాంధీ మెట్రో స్టేషన్, ఆసుపత్రి మెయిన్ గేట్, ఫుట్ పాత్ ప్రాంతాల్లో తిష్ట వేసుకొని ఉన్న యాచకులను 3...
Read More...
Local News 

డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు హనుమండ్ల జయశ్రీ వినతి

డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు హనుమండ్ల జయశ్రీ వినతి జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, అవసరమైన మౌలిక...
Read More...
Local News  State News 

పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు

పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు నాగర్ కర్నూల్, డిసెంబర్ 27 (ప్రజా మంటల): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆమె, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వట్టెం రిజర్వాయర్,...
Read More...
Local News  State News 

జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటల): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.252లోని నిబంధనలు వేలాది మంది జర్నలిస్టుల ఉపాధికి ముప్పుగా మారాయని ఆరోపిస్తూ, శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు...
Read More...

అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్     జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు)అర్బన్ మండల అంబారిపేట  శ్రీవెంకటేశ్వర స్వామి వారి మీద  రూపొందించిన భక్తి పాట ను, శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ చానల్ నుజగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన పాట రచన సిరికొండ...
Read More...
Local News 

అల్లిపూర్ నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపిన  తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్

అల్లిపూర్ నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపిన  తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల (రూరల్),డిసెంబర్ 27 ప్ర(జా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎంబరీ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్‌లతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళలు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ వారిని శాలువాలతో సత్కరించి...
Read More...
Local News 

అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్) డిసెంబర్ 27 (ప్రజా మంటలు): జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భక్తి పాటను, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ ఛానల్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది. భక్తి పాట రూపకల్పనలో కీలకంగా పనిచేసిన...
Read More...
Local News 

సారంగాపూర్‌లో మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ వేడుకలలో ఎమ్మెల్యే డా సంజయ్

సారంగాపూర్‌లో మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ వేడుకలలో ఎమ్మెల్యే డా సంజయ్ సారంగాపూర్, డిసెంబర్ 27 – ప్రజా మంటలు: సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలోజు వేణుగోపాల్ – శోభ దంపతులను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ...
Read More...