గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
గుంజపడుగులో పోలీసు టికెటింగ్ -ప్రహరీ గోడ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ
గొల్లపల్లి మే 15 (ప్రజా మంటలు) :
గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన చిన్న గొడవ, చిలికి చిలికి గాలివానగా మారి, పోలీసు పికెటింగ్ ఏర్పాటుకు దారితీసింది. రెండు కుటుంబాల మధ్య ఉన్న చిన్న ప్రహరీ గోడ విషయంలో తలెత్తిన వివాదం ఇరు! కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు గ్రామంలో పీకేటింగ్ ఏర్పాటు చేశారు. రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఈ ఘంటకు బాధ్యులైన ఇరువర్గాలకు చెందిన పదిమందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై చిర్ర సతీష్ తెలిపారు ఈ సంఘటన బుధవారం మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
గొల్లపల్లి మండలం లోని గుంజపడుగు లో ఒక చిన్న విషయంలో జరిన గొడవ కారణంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐ చిర్ర సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, గుంజపడుగు గ్రామానికి చెందిన కళ్లెం తిరుపతి, పస్తం శారదల కుటుంబాల మధ్య ఉన్న ప్రహరీ గోడకు సంబంధించి గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ, మాట మాట పెరిగి తిరుపతి, శారదను అసభ్యంగా దూషించడంతో ఘర్షణకు దారితీసింది.
బాధిత మహిళ కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని తిరుపతి ఇంటి వద్దకు వెళ్లగా,తిరుపతి కుటుంబసభ్యులు కలిసి గోడవపడ్డారు. అక్కడ రెండు వర్గాల వారు, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తిరుపతికి సంబంధించిన ఇల్లు ఇల్లును, బాధిత మహిళ కుటుంబ సభ్యులు పాక్షకంగా ధ్వంసం చేశారు. దీంతో కోపద్రిక్తులైన తిరుపతి కుటుంబ సభ్యులు శారద అన్నదమ్ములైన సమ్మయ్య, పోశయ్య పోసేలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్య చికిత్సల నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించి, వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న ఎస్ఐ చిర్ర సతీష్, తన సిబ్బందితో కలిసి గ్రామాని సందర్శించి, ఇరు వర్గాలతో మాట్లాడి గొడవ తాత్కాలికంగా సద్దుమనిగేందుకు ప్రయత్నించారు. అయితే రెండు వర్గాలు తమ బంధుమిత్రులతో కలిసి మళ్ళీ, బాహబహికి దిగడంతో, శాంతి భద్రతలను అదుపులోకి తేవడానికి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సంఘటన స్థలాన్ని ధర్మపురి సిఐ రామ నరసింహారెడ్డి పరిశీలించారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి, తిరుమలేష్, శ్రీకాంత్, తోపాటు ఇరు వర్గాల చెందిన మరో ఏడుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-----
More News...
<%- node_title %>
<%- node_title %>
నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి - కల్వకుంట్ల కవిత
సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన... హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 28:
హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం... జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక... సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం
హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):
ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.... రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్
జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు)
కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్... బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు):
బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ను హైదరాబాద్లో... ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.
జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :
జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల... హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు షాక్.. వెంటనే తొలగించాలని సీఎస్కు ఆదేశం
కోర్టు ధిక్కార కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఇప్పుడు రెండు మార్గాలేనా?
హైదరాబాద్, జూలై 27:
హైదరాబాద్లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా (HYDRAA) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని... సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం
జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) సనాతనంగా సుసంపర్ణమైన వర్షాల కోసమే మహాభారత అంతర్గత శ్రీమత్ విరాట పర్వసప్తాహం నిర్వహించబడేదని నంబి వేణుగోపాల ఆచార్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య చే శ్రీమత్ విరాటపర్వసప్తాహం ప్రారంభమైంది.
ఆగస్టు ఒకటవ తేదీ శనివారం వరకు ఈ కార్యక్రమం... ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్..
సెల్యూట్ టు ది లీడర్...
నేడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా కాదు అక్షరాల 2278.14 కోట్లు.
అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్.
అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు...
రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్... కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు
గుంతకల్ జూలై 26 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ పాత గుంతకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లు అందరికీ నివాళులర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి ఓల్డ్ టౌన్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, బిజెపి సీనియర్ నాయకురాలు మరియు ఎఫ్సీఐ స్టేట్ డైరెక్టర్... గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం. మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం.
జగిత్యాల, జులై 26(ప్రజా మంటలు)
సిరిసిల్ల రాజేంద్ర శర్మ (9348422113)
చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం... ప్రజల కొరకే మనమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం.. అంటూ శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పూర్వ విద్యార్థులు "మిత్ర ఫౌండేషన్" పేరుతో సేవా సంస్థకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల గీత విద్యాలయంలో విద్యనభ్యసించిన... 