గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

On
గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

గుంజపడుగులో పోలీసు టికెటింగ్ -ప్రహరీ గోడ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ

గొల్లపల్లి మే 15 (ప్రజా మంటలు) :

గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన చిన్న గొడవ, చిలికి చిలికి గాలివానగా మారి, పోలీసు పికెటింగ్ ఏర్పాటుకు దారితీసింది. రెండు కుటుంబాల మధ్య ఉన్న చిన్న ప్రహరీ గోడ విషయంలో తలెత్తిన వివాదం ఇరు! కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా,  ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు గ్రామంలో పీకేటింగ్ ఏర్పాటు చేశారు.  రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఈ ఘంటకు బాధ్యులైన ఇరువర్గాలకు చెందిన పదిమందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై చిర్ర సతీష్ తెలిపారు ఈ సంఘటన బుధవారం మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

 గొల్లపల్లి మండలం లోని గుంజపడుగు లో ఒక చిన్న విషయంలో జరిన గొడవ కారణంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐ చిర్ర సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, గుంజపడుగు గ్రామానికి చెందిన కళ్లెం తిరుపతి, పస్తం శారదల కుటుంబాల  మధ్య ఉన్న ప్రహరీ గోడకు సంబంధించి గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ, మాట మాట పెరిగి  తిరుపతి, శారదను అసభ్యంగా దూషించడంతో ఘర్షణకు దారితీసింది.

బాధిత మహిళ కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని తిరుపతి ఇంటి వద్దకు వెళ్లగా,తిరుపతి కుటుంబసభ్యులు కలిసి గోడవపడ్డారు. అక్కడ రెండు వర్గాల వారు, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తిరుపతికి సంబంధించిన ఇల్లు ఇల్లును, బాధిత మహిళ కుటుంబ సభ్యులు పాక్షకంగా ధ్వంసం చేశారు. దీంతో కోపద్రిక్తులైన తిరుపతి కుటుంబ సభ్యులు  శారద అన్నదమ్ములైన సమ్మయ్య, పోశయ్య పోసేలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్య చికిత్సల నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించి, వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.   

సమాచారం తెలుసుకున్న ఎస్ఐ చిర్ర సతీష్, తన సిబ్బందితో కలిసి గ్రామాని సందర్శించి, ఇరు వర్గాలతో మాట్లాడి  గొడవ తాత్కాలికంగా సద్దుమనిగేందుకు ప్రయత్నించారు. అయితే రెండు వర్గాలు తమ బంధుమిత్రులతో కలిసి మళ్ళీ, బాహబహికి దిగడంతో, శాంతి భద్రతలను అదుపులోకి తేవడానికి  పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సంఘటన స్థలాన్ని ధర్మపురి సిఐ రామ నరసింహారెడ్డి పరిశీలించారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి, తిరుమలేష్,  శ్రీకాంత్, తోపాటు ఇరు వర్గాల  చెందిన మరో ఏడుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

-----

Tags
Join WhatsApp

More News...

Local News 

వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు 

వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు  జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు) జగిత్యాల  రూరల్ మండలం తక్కలపల్లి గ్రామ శివారులో తుమ్మచెట్టు కు నిప్పంటుకొని అదే మార్గంలో వస్తున్న బైరి వేణు ,కడారి భరత్ లు గాయాలపాలు అయినారు. ఇట్టి విషయంపై జిల్లా కేంద్రం విజయపురి కాలనీకి చెందిన సంబుమహేష్( 29) తండ్రి మల్లయ్య సోమవారం  తుమ్మచెట్టు కాలడానికి కారకులైన మిట్టపల్లి...
Read More...
Local News 

ఎంవి నరసింహారెడ్డి అస్తమయం 

ఎంవి నరసింహారెడ్డి అస్తమయం  జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ రావు బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి ఈరోజు సోమవారం సాయంత్రం 7 గంటలకు జగిత్యాలలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన నాలుగు వేదాలు మరియు ఉపనిషత్తులు జోక్స్ బ్యాంక్ జోక్స్ టానిక్ లాంటి హాస్య రచనల పుస్తకాలు,...
Read More...
National  Comment 

మమతా కాంగ్రెస్ గూటికి చేరితే... బీజేపీ వ్యూహానికి అతిపెద్ద ఎదురుదెబ్బ?

మమతా కాంగ్రెస్ గూటికి చేరితే... బీజేపీ వ్యూహానికి అతిపెద్ద ఎదురుదెబ్బ? న్యూ డిల్లీ జూన్ 08 : భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలిస్తున్నాయా? ఢిల్లీలో జరిగిన INDIA కూటమి సమావేశం తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రతిపక్ష శక్తుల ఐక్యత తప్పనిసరి అనే...
Read More...
Local News 

మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాల వితరణ 

మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాల వితరణ  జగిత్యాల జూన్ 7( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాలు అందజేయబడినవి. 2025 26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ యందు 1000 మార్కులకు గాను 982 ఎంపీసీ విభాగం నందు సాధించిన జి సుప్రీత్, ఎస్ ఎస్ సి నందు పి .  హాసినిశర్మ 600/578 మార్కులు సాధించగా...
Read More...
Local News 

హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం

హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం జగిత్యాల జూన్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే సామూహిక పారాయణం నిర్వహించబడుచున్నది. కాగా ఈ సంవత్సరము నుండి నూతనంగా ఎస్  ఎస్ఎస్సి ,ఇంటర్మీడియట్, డిగ్రీ నందు 90% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి శ్రీకారం చుట్టారు....
Read More...
State News  Crime 

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు....
Read More...
Local News  State News  Crime 

నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం

నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు): నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని...
Read More...
Local News 

కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం  సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్    జగిత్యాల  జూన్2- ( ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27...
Read More...
Local News 

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo 

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo  మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల...
Read More...
Local News 

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ,ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ,టౌన్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)ఎంపికైన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని   రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన “సేవా పథకం”లకు ఎంపికైన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత,...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు జగిత్యాల జూన్ 02 (ప్రజా మంటలు): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థిని, విద్యార్థులు...
Read More...