గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో పోలీసుల పహారా -గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
గుంజపడుగులో పోలీసు టికెటింగ్ -ప్రహరీ గోడ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ
గొల్లపల్లి మే 15 (ప్రజా మంటలు) :
గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన చిన్న గొడవ, చిలికి చిలికి గాలివానగా మారి, పోలీసు పికెటింగ్ ఏర్పాటుకు దారితీసింది. రెండు కుటుంబాల మధ్య ఉన్న చిన్న ప్రహరీ గోడ విషయంలో తలెత్తిన వివాదం ఇరు! కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు గ్రామంలో పీకేటింగ్ ఏర్పాటు చేశారు. రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఈ ఘంటకు బాధ్యులైన ఇరువర్గాలకు చెందిన పదిమందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై చిర్ర సతీష్ తెలిపారు ఈ సంఘటన బుధవారం మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
గొల్లపల్లి మండలం లోని గుంజపడుగు లో ఒక చిన్న విషయంలో జరిన గొడవ కారణంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐ చిర్ర సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, గుంజపడుగు గ్రామానికి చెందిన కళ్లెం తిరుపతి, పస్తం శారదల కుటుంబాల మధ్య ఉన్న ప్రహరీ గోడకు సంబంధించి గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ, మాట మాట పెరిగి తిరుపతి, శారదను అసభ్యంగా దూషించడంతో ఘర్షణకు దారితీసింది.
బాధిత మహిళ కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని తిరుపతి ఇంటి వద్దకు వెళ్లగా,తిరుపతి కుటుంబసభ్యులు కలిసి గోడవపడ్డారు. అక్కడ రెండు వర్గాల వారు, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తిరుపతికి సంబంధించిన ఇల్లు ఇల్లును, బాధిత మహిళ కుటుంబ సభ్యులు పాక్షకంగా ధ్వంసం చేశారు. దీంతో కోపద్రిక్తులైన తిరుపతి కుటుంబ సభ్యులు శారద అన్నదమ్ములైన సమ్మయ్య, పోశయ్య పోసేలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్య చికిత్సల నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించి, వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న ఎస్ఐ చిర్ర సతీష్, తన సిబ్బందితో కలిసి గ్రామాని సందర్శించి, ఇరు వర్గాలతో మాట్లాడి గొడవ తాత్కాలికంగా సద్దుమనిగేందుకు ప్రయత్నించారు. అయితే రెండు వర్గాలు తమ బంధుమిత్రులతో కలిసి మళ్ళీ, బాహబహికి దిగడంతో, శాంతి భద్రతలను అదుపులోకి తేవడానికి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సంఘటన స్థలాన్ని ధర్మపురి సిఐ రామ నరసింహారెడ్డి పరిశీలించారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి, తిరుమలేష్, శ్రీకాంత్, తోపాటు ఇరు వర్గాల చెందిన మరో ఏడుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-----
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..
.
ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు)
శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది.
దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2... దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక... ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి
భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (ప్రజామంటలు) :
మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొమ్ముల అంజి (20) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇందిరానగర్ దాటాక మోడల్ స్కూల్ ఎదుట బైక్పై వెళ్తున్న అంజిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన... జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల
హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వచ్చే ఏడాది జరగనున్న ఎస్ఐఆర్, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
నగర పరిధిలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయ కుటుంబాల చిన్నారులతో స్కై ఫౌండేషన్ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, ఆటవస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటవస్తువులు, బహుమతులు అందుకోవడంతో చిన్నారులు అపారమైన... కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం
బెంగళూరు డిసెంబర్ 25:
కర్ణాటకలో ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 1:30–2:00 గంటల మధ్య చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలో ప్రయాణికులతో ఉన్న బస్సు మంటల్లో చిక్కడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. అధికారులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త అడ్డుగా ఉన్నాడని హత్య..అక్రమ సంబంధంతో భార్య దారుణం
అచ్చంపేట డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళే ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా తేలడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో నివాసం... క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –
క్రైస్తవులకు శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
క్రిస్మస్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.... కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖల్ల సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు 50 మంది నాయకులు
బుగ్గారం డిసెంబర్ 25 (ప్రజా మంటలు):శేఖల్ల గ్రామానికి చెందిన సర్పంచ్ పర్సా రమేష్, ఉపసర్పంచ్ నార్ల బుచ్చయ్యతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారందరికీ కాంగ్రెస్... శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ డిసెంబర్ 25:శంషాబాద్ నుంచి హైదరాబాద్లోని జలవిహార్కు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొనడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మందికి... తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి
కడలూరు, డిసెంబర్ 24:
తమిళనాడులోని కడలూరు జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తిట్టకుడి ప్రాంతం సమీపంలోని తిరుచ్చి హైవేపై రాత్రి సుమారు... కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఆయిలన్న కురుమ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు మెమొంటో... 