ఓటరుగా నమోదైన వారు తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలి

- ఓటు అమూల్యమైనది -డాక్టర్ ఎ. అశోక్.

On
ఓటరుగా నమోదైన వారు తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలి

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల ఏప్రిల్ 25 ( ప్రజా మంటలు) : 

18 సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరిగెల అశోక్ కోరినారు.

జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్ల అవగాహన నిమిత్తమై స్వీప్ కార్యక్రమం లో భాగంగా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో రంగోలి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటర్లను చైతన్యపరిచే వివిధ రకాల రంగవల్లులను విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలో తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి కె లక్ష్మీనారాయణ,శ్రీనివాస గౌడ్ మెప్మ ఏ.వో., జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ కె రవికుమార్, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ బి. అశోక్, డాక్టర్ డి. ప్రకాష్ మరియు కళాశాల అధ్యాపకులు ఏ లక్ష్మణ్ ,ఎన్ సందీప్, కే వేణు, కే సత్తయ్య, కే శ్రీనివాస్, పి తిరుమల్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags