నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి?  తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?

On
నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి?  తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?

నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి?  తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు

గతంలో గెలిచిన 42 సీట్లు నిలబెట్టుకోలేని బిజేపి

కూటమిలో లేని ప్రాంతీయ పార్టీల మాటనే నెగ్గుతుందా ?

(సిహెచ్ వి ప్రభాకర్ రావు)

హైదరాబాద్ మె 13 :

నాల్గవ దశ ఎన్నికలు పూర్తయిన తరువాత పోసింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు, ఈ దశలో బిజేపికి అనుకున్నన్ని సీట్లు రావడం సాధ్యంకాదనే అంచనాకు వచ్చారు. పది రాష్ట్రాలలో, 96 పార్లమెంట్ స్థానాలలో జరిగిన ఎన్నికల్లో గతంలో 42 స్థానాలను గెలుచుకొన్న బిజేపి, ఈసారి తన సీట్లను నిలుపుకోవడానికి తీవరపయత్నాలే చేసింది. బిజేపి మళ్ళీ అధికారంలోకి రావడానికి స్వంతంగా కానీ ఎన్ ది ఏ కూటమి కూడా, అధికారంలోకి రావడానికి కావాల్సిన 272 సీట్లు రావడామే కష్టమనే వార్తలు వస్తున్నాయి. ఈదశలో ఏ కూటమిలో లేని పార్టీలు గెలిచే సీట్లతో పాటు, తెలుగు రాష్ట్రాలలోని టిడిపి, వై ఎస్ ఆర్ సి పి లతో పాటు, తెలంగాణలో బి ఆర్ ఎస్ గెలిచే సీట్లు కూడా ప్రధానం కానున్నాయి.

 

ఎప్పుడు బిజేపికి మద్దతు ప్రకటిస్తు, స్వతంత్రంగా వ్యవహరించే ఒరిస్సా లోని బిజూ జనతాదళ్ గత (2019) ఎన్నికల్లో రాష్ట్రంలోని 20 సీట్లలో 12 సీట్లు గెలిచండి. బిజేపి 8 సీట్లు గెలిచింది.  ఈసారి బిజూ జనతాదళ్ తొ పొత్తుపెట్టుకోవాలన్న బిజేపి ఆశలు అడియాసలే అయ్యాయి.ఇంతవరకు ఒరిస్సాలో జరిగిన ఎన్నికల్లో బిజేపి ప్రదర్శన  అనుకున్నంత గొప్పగా లేదని చెప్పకొంటున్నారు.

 

బిజేపికి కానీ ఎన్ ది ఏ కి  స్వంతంగా అనుకొన్నాన్ని సీట్లు రానపుడు, ఇండియా కూటమికి కూడా అదే పరిస్థితి వచ్చినపుడు, ఏ కూటమిలో లేని ఈ పార్టీలతో పాటు పశ్చిమ బెంగాల్ లో టి ఎం సి గెలిచే స్థానాలు, ఆయా పార్టీలు వ్యవహరించే తీరు దేశ రాజకీయాలను మార్చానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో వైఎస్ ఆర్ సిపి కాంగ్రెస్ తో కలవడానికి  ఆసక్తి చూపకపోవచ్చని, అలాగే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బిజేపిటో జాతకట్టక పోవచ్చు.  కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మాట మార్చే అవకాశం ఉంది.

 

ఇప్పటి వరకు పూర్తయిన ఎన్నికల్లో 380 సీట్లలో బిజేపి అనుకూల మైన చోట కూడా కొంత నష్టం జరగనుందనే వార్తలు వస్తున్నాయి. గత 2019 ఎన్నికల్లో బిజేపి, రాజస్తాన్ లోని 25, గుజరాత్ లోని 26 సీట్లు, మధ్యప్రదేశ్ లోని 29 సీట్లలో 28 సీట్లు గెలుచుకోండి. అంటే మొత్తం 80 సీట్లలో 79 సీట్లు గెలుచుకోంది, కానీ ఈసారి ఈ రాజస్తాన్, గుజరాత్ లలో బలమైన రాజ్ పుత్ (క్షత్రీయులు) లు బలంగా బిజేపిని వ్యతిరేకించడం, పార్టీలోని అంతర్గత విభేదాలు పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో అధికారం చేజిక్కించుకొన్న బిజేపి, అప్పుడే అంతర్గత విభేదాలతో గతంలో సాధించినాన్ని సీట్లు సాధించకపోవచ్చని తెలుస్తుంది. గతంలో ఈ మూడు రాష్ట్రాలలో 2019 లో గెలుచుకొన్న 79 సీట్లలో కనీసం 20-25 సీట్ల నష్టం జరగవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

దక్షిణాన  కర్ణాటక తో పాటు తెలంగాణలో మాత్రమే కొంత ఉనికిని చాటుకొన్న బిజేపి, ఈసారి కూడా తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా గెలవలేదనే అనుకొంటున్నారు. అయినా, తమిళనాడు, కేరళలో కనీసం ఒకటి రెండు స్థానలైనా గెలుస్తుందని ఇంకా బిజేపి నమ్ముతోంది. గత ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లలో, 27 సీట్లు గెలుచుకొన్న బిజేపి, ఈసారి అక్కడ అధికారంలో లేకపోవడమే కాకుండా, ప్రజ్వల రెవన్న ఉదంతం రెండవసారి జరిగిన పోలింగ్ పై పెద్ద ప్రభావమే చూపుతుందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చుతుందనే నమ్మకంతో ఓటర్ల లో కూడా మార్పు వచ్చిందని అనుకొంటున్నారు. ఈ పరిస్థితులలో బిజేపి కర్ణాటకలో కనీసం 10-12 సీట్లు కోల్పోవచ్చని భావిస్తున్నారు.

 

ఈ పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ తప్ప అన్నీ పార్టీలు అవసరం అయితే బిజేపి తో పెట్టుకోవచ్చని, టిడిపి, బి ఆర్ ఎస్, వి ఎస్ ఆర్ సి పి తమలోని విభేదాలను పక్కన పెట్టి అధికారంలోకి రావడానికి కూడా వెనుకడక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పార్టీలు కాంగ్రెస్ కూటమికి కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చని, అధికారం కొరకు వీరంతా ఆకలితో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అధికార, ప్రతిపక్ష కూటమీలు రెండు కూడా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అనుకొన్నాన్ని సీట్లు రాబట్టుకొనే దిశలో లేవని అనుకొంటున్నారు. అలాంటప్పుడు బిజూ జనతాదళ్ తో పాటు, తెలుగు రాష్ట్రాల పార్టీలే కీలకం కానున్నాయి.

ఇక ముందు జరగబోయే మూడు దశల ఎన్నికల్లో 164 సీట్లలో ఎవరెన్ని సీట్లను గెలుచుకొంతరనే దానిపైనే ఏ కూటమి అధికారంలోకి రావడం అన్నది తెలిపోతుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లలో గతంలో గెలిచిన సీట్లను నిలుపుకోలేని పార్టీ, హర్యానా, డిల్లీ, పంజాబ్ లలో కూడా గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను కూడా కొల్పవనున్నదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మప్రధాని మోడి అనుకున్నతళులు, హిందూత్వం, ముస్లిం, రామ మందిరం అంశాలు బజని రక్షించలేకపోవచ్చని, కానీ ఎటు కానీ మద్యంతర పార్టీలు కాపాడుతాయన్న ధైర్యంతో బిజేపి-ఆర్ ఎస్ ఎస్ లు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.      

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు సికింద్రాబాద్,  డిసెంబర్ 08 (ప్రజామంటలు): :    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని  సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ...
Read More...

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన
Read More...

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*    జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ *కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు....
Read More...

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్ ** జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు)   భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ...
Read More...

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు) సర్పంచ్  ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్  పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్  గ్రామంలో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా  సి.ఐ సుధాకర్  మాట్లాడుతూ....
Read More...

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం 

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం  జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి...
Read More...
National  Filmi News 

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్ కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్‌ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం...
Read More...
National  State News 

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు): తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3...
Read More...
Local News 

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు): జగిత్యాల ఇందిరాభవన్‌లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్‌గా ఉన్న రామస్వామి...
Read More...
State News 

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,” తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్‌పల్లి ప్రెస్ మీట్ కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు): మేడ్చల్–మల్కాజ్‌గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లిలో జరిగిన...
Read More...
State News 

“ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్

“ఏం సాధించారని సంబరాలు “స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు” హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు): ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల...
Read More...
Local News 

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్ మెట్టుపల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత బలోపేత చర్యలు తీసుకుంటానని కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలు వెంకట రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం మెట్టుపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన...
Read More...