నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి? తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?
నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి? తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు
గతంలో గెలిచిన 42 సీట్లు నిలబెట్టుకోలేని బిజేపి
కూటమిలో లేని ప్రాంతీయ పార్టీల మాటనే నెగ్గుతుందా ?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ మె 13 :
నాల్గవ దశ ఎన్నికలు పూర్తయిన తరువాత పోసింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు, ఈ దశలో బిజేపికి అనుకున్నన్ని సీట్లు రావడం సాధ్యంకాదనే అంచనాకు వచ్చారు. పది రాష్ట్రాలలో, 96 పార్లమెంట్ స్థానాలలో జరిగిన ఎన్నికల్లో గతంలో 42 స్థానాలను గెలుచుకొన్న బిజేపి, ఈసారి తన సీట్లను నిలుపుకోవడానికి తీవరపయత్నాలే చేసింది. బిజేపి మళ్ళీ అధికారంలోకి రావడానికి స్వంతంగా కానీ ఎన్ ది ఏ కూటమి కూడా, అధికారంలోకి రావడానికి కావాల్సిన 272 సీట్లు రావడామే కష్టమనే వార్తలు వస్తున్నాయి. ఈదశలో ఏ కూటమిలో లేని పార్టీలు గెలిచే సీట్లతో పాటు, తెలుగు రాష్ట్రాలలోని టిడిపి, వై ఎస్ ఆర్ సి పి లతో పాటు, తెలంగాణలో బి ఆర్ ఎస్ గెలిచే సీట్లు కూడా ప్రధానం కానున్నాయి.
ఎప్పుడు బిజేపికి మద్దతు ప్రకటిస్తు, స్వతంత్రంగా వ్యవహరించే ఒరిస్సా లోని బిజూ జనతాదళ్ గత (2019) ఎన్నికల్లో రాష్ట్రంలోని 20 సీట్లలో 12 సీట్లు గెలిచండి. బిజేపి 8 సీట్లు గెలిచింది. ఈసారి బిజూ జనతాదళ్ తొ పొత్తుపెట్టుకోవాలన్న బిజేపి ఆశలు అడియాసలే అయ్యాయి.ఇంతవరకు ఒరిస్సాలో జరిగిన ఎన్నికల్లో బిజేపి ప్రదర్శన అనుకున్నంత గొప్పగా లేదని చెప్పకొంటున్నారు.
బిజేపికి కానీ ఎన్ ది ఏ కి స్వంతంగా అనుకొన్నాన్ని సీట్లు రానపుడు, ఇండియా కూటమికి కూడా అదే పరిస్థితి వచ్చినపుడు, ఏ కూటమిలో లేని ఈ పార్టీలతో పాటు పశ్చిమ బెంగాల్ లో టి ఎం సి గెలిచే స్థానాలు, ఆయా పార్టీలు వ్యవహరించే తీరు దేశ రాజకీయాలను మార్చానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో వైఎస్ ఆర్ సిపి కాంగ్రెస్ తో కలవడానికి ఆసక్తి చూపకపోవచ్చని, అలాగే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బిజేపిటో జాతకట్టక పోవచ్చు. కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మాట మార్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు పూర్తయిన ఎన్నికల్లో 380 సీట్లలో బిజేపి అనుకూల మైన చోట కూడా కొంత నష్టం జరగనుందనే వార్తలు వస్తున్నాయి. గత 2019 ఎన్నికల్లో బిజేపి, రాజస్తాన్ లోని 25, గుజరాత్ లోని 26 సీట్లు, మధ్యప్రదేశ్ లోని 29 సీట్లలో 28 సీట్లు గెలుచుకోండి. అంటే మొత్తం 80 సీట్లలో 79 సీట్లు గెలుచుకోంది, కానీ ఈసారి ఈ రాజస్తాన్, గుజరాత్ లలో బలమైన రాజ్ పుత్ (క్షత్రీయులు) లు బలంగా బిజేపిని వ్యతిరేకించడం, పార్టీలోని అంతర్గత విభేదాలు పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో అధికారం చేజిక్కించుకొన్న బిజేపి, అప్పుడే అంతర్గత విభేదాలతో గతంలో సాధించినాన్ని సీట్లు సాధించకపోవచ్చని తెలుస్తుంది. గతంలో ఈ మూడు రాష్ట్రాలలో 2019 లో గెలుచుకొన్న 79 సీట్లలో కనీసం 20-25 సీట్ల నష్టం జరగవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
దక్షిణాన కర్ణాటక తో పాటు తెలంగాణలో మాత్రమే కొంత ఉనికిని చాటుకొన్న బిజేపి, ఈసారి కూడా తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా గెలవలేదనే అనుకొంటున్నారు. అయినా, తమిళనాడు, కేరళలో కనీసం ఒకటి రెండు స్థానలైనా గెలుస్తుందని ఇంకా బిజేపి నమ్ముతోంది. గత ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లలో, 27 సీట్లు గెలుచుకొన్న బిజేపి, ఈసారి అక్కడ అధికారంలో లేకపోవడమే కాకుండా, ప్రజ్వల రెవన్న ఉదంతం రెండవసారి జరిగిన పోలింగ్ పై పెద్ద ప్రభావమే చూపుతుందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చుతుందనే నమ్మకంతో ఓటర్ల లో కూడా మార్పు వచ్చిందని అనుకొంటున్నారు. ఈ పరిస్థితులలో బిజేపి కర్ణాటకలో కనీసం 10-12 సీట్లు కోల్పోవచ్చని భావిస్తున్నారు.
ఈ పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ తప్ప అన్నీ పార్టీలు అవసరం అయితే బిజేపి తో పెట్టుకోవచ్చని, టిడిపి, బి ఆర్ ఎస్, వి ఎస్ ఆర్ సి పి తమలోని విభేదాలను పక్కన పెట్టి అధికారంలోకి రావడానికి కూడా వెనుకడక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పార్టీలు కాంగ్రెస్ కూటమికి కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చని, అధికారం కొరకు వీరంతా ఆకలితో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అధికార, ప్రతిపక్ష కూటమీలు రెండు కూడా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అనుకొన్నాన్ని సీట్లు రాబట్టుకొనే దిశలో లేవని అనుకొంటున్నారు. అలాంటప్పుడు బిజూ జనతాదళ్ తో పాటు, తెలుగు రాష్ట్రాల పార్టీలే కీలకం కానున్నాయి.
ఇక ముందు జరగబోయే మూడు దశల ఎన్నికల్లో 164 సీట్లలో ఎవరెన్ని సీట్లను గెలుచుకొంతరనే దానిపైనే ఏ కూటమి అధికారంలోకి రావడం అన్నది తెలిపోతుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లలో గతంలో గెలిచిన సీట్లను నిలుపుకోలేని పార్టీ, హర్యానా, డిల్లీ, పంజాబ్ లలో కూడా గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను కూడా కొల్పవనున్నదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మప్రధాని మోడి అనుకున్నతళులు, హిందూత్వం, ముస్లిం, రామ మందిరం అంశాలు బజని రక్షించలేకపోవచ్చని, కానీ ఎటు కానీ మద్యంతర పార్టీలు కాపాడుతాయన్న ధైర్యంతో బిజేపి-ఆర్ ఎస్ ఎస్ లు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కొత్త విద్యా విధానం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 08 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విద్యా విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో... రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత * జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)
జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో“జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026” బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026 బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్... విద్యుత్ సమస్య ఎదురైన వెంటనే సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 1912 ను సంప్రదిస్తే త్వరతగతిన సమస్యని పరిష్కరిస్తాం ఏఈ. సంతోష్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు) విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తైసిల్ చౌరస్తాలో 'ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వినియోగ దారులకు అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై ఏఈ సంతోష్, రాంజీ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని, నాణ్యమైన విద్యుత్
వినియోగదారులకు... జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ కరువు హై కోర్ట్ న్యాయవాది వి.రఘునాథ్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)నేడు మన దేశంలో న్యాయం కోసం ఆరాటపడే జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని సీనియర్ హై కోర్టు న్యాయవాది వి.రఘునాథ్ అన్నారు. జగిత్యాలలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడారు.
దేశంలో నాలుగవ స్తంభం జర్నలిస్ట్ లని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయవాదులను, జర్నలిస్టులను... జాతీయ సదస్సులో పాల్గొన్న వెనుగుమట్ల ఉపాధ్యాయుడు
గొల్లపల్లి జనవరి 8 (ప్రజా మంటలు) నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా భాగస్వామ్యంతో అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్టీసీ) అనే సంస్థ ‘ఈనాడు’తో కలిసి గురువారం హైదరాబాద్లో ‘శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకెళ్లడంలో సమాచార పాత్ర - వికసిత్ భారత్-2047 నిర్మాణం’ అనే ఇతివృత్తంతో,మాజీ ఉపరాష్ట్రపతి
సైన్స్... మేడారం జాతరకు కేసీఆర్కు ఆహ్వానం
సిద్ధిపేట, జనవరి 08 (ప్రజా మంటలు):మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును జాతరకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర మహిళా మంత్రులు ఆహ్వానించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ... బ్రాహ్మణులపై దాడికి నిరసనగా డిజిపి కి బ్రాహ్మణ సంఘాల నాయకుల ఫిర్యాదు.
హైదరాబాద్ జనవరి 8 ( ప్రజా మంటలు)బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో గోదావరి హారతి అర్చకులుగా పనిచేస్తున్న బ్రహ్మశ్రీ దీక్షిత్ సాయి కళాధర్ శర్మ పై మూడు రోజుల క్రితం కొందరు దుండగులు పథకం ప్రకారం దారుణంగా దాడి చేశారు పరుష పదజాలంతో దూషిస్తూ చాలా ఘోరంగా పిడిగుద్దులతో దాడి చేశారు.
ఇటీవల... శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా విశ్వక్సేన ఇష్టి గణపతి అభిషేకం
జగిత్యాల జనవరి 8 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ ధనుర్మాస ఉత్సవ సందర్భంగా లోక కళ్యాణార్థమై భగవత్ భాగవత ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై, గురు వారం 8 వ రోజు నవహనీక, ఏకకుండాత్మక, విశ్వ క్షేనఇష్టి మూలమంత్ర హవనం , గణపతి... భోలక్పూర్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటన
సికింద్రాబాద్, జనవరి 8 (ప్రజా మంటలు):
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం భోలక్పూర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలతో ఆయన ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్థానికులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా, కేవలం పది నిమిషాల్లోనే ఒక యువతి... కవితపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు)::
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఆనంద్, మాధవి మీడియాతో మాట్లాడారు.
అగ్గిపెట్టె... సమస్యల అధ్యయనానికి జాగృతి మరో 12 కమిటీలు
హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై లోతైన అధ్యయనం చేసి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ రూపొందించాలనే లక్ష్యంతో జాగృతి సంస్థ మరో 12 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 32 కమిటీలను ప్రకటించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం తాజాగా ఈ... సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
జగిత్యాల జనవరి 07 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని శ్రీ గాయత్రీ అనాధ వృద్దాశ్రమంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ సంక్రాంతి పర్వదినం విశిష్టతను తెలిపి,,వయో వృద్ధుల చట్టం పై... 