నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి? తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?
నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి? తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు
గతంలో గెలిచిన 42 సీట్లు నిలబెట్టుకోలేని బిజేపి
కూటమిలో లేని ప్రాంతీయ పార్టీల మాటనే నెగ్గుతుందా ?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ మె 13 :
నాల్గవ దశ ఎన్నికలు పూర్తయిన తరువాత పోసింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు, ఈ దశలో బిజేపికి అనుకున్నన్ని సీట్లు రావడం సాధ్యంకాదనే అంచనాకు వచ్చారు. పది రాష్ట్రాలలో, 96 పార్లమెంట్ స్థానాలలో జరిగిన ఎన్నికల్లో గతంలో 42 స్థానాలను గెలుచుకొన్న బిజేపి, ఈసారి తన సీట్లను నిలుపుకోవడానికి తీవరపయత్నాలే చేసింది. బిజేపి మళ్ళీ అధికారంలోకి రావడానికి స్వంతంగా కానీ ఎన్ ది ఏ కూటమి కూడా, అధికారంలోకి రావడానికి కావాల్సిన 272 సీట్లు రావడామే కష్టమనే వార్తలు వస్తున్నాయి. ఈదశలో ఏ కూటమిలో లేని పార్టీలు గెలిచే సీట్లతో పాటు, తెలుగు రాష్ట్రాలలోని టిడిపి, వై ఎస్ ఆర్ సి పి లతో పాటు, తెలంగాణలో బి ఆర్ ఎస్ గెలిచే సీట్లు కూడా ప్రధానం కానున్నాయి.
ఎప్పుడు బిజేపికి మద్దతు ప్రకటిస్తు, స్వతంత్రంగా వ్యవహరించే ఒరిస్సా లోని బిజూ జనతాదళ్ గత (2019) ఎన్నికల్లో రాష్ట్రంలోని 20 సీట్లలో 12 సీట్లు గెలిచండి. బిజేపి 8 సీట్లు గెలిచింది. ఈసారి బిజూ జనతాదళ్ తొ పొత్తుపెట్టుకోవాలన్న బిజేపి ఆశలు అడియాసలే అయ్యాయి.ఇంతవరకు ఒరిస్సాలో జరిగిన ఎన్నికల్లో బిజేపి ప్రదర్శన అనుకున్నంత గొప్పగా లేదని చెప్పకొంటున్నారు.
బిజేపికి కానీ ఎన్ ది ఏ కి స్వంతంగా అనుకొన్నాన్ని సీట్లు రానపుడు, ఇండియా కూటమికి కూడా అదే పరిస్థితి వచ్చినపుడు, ఏ కూటమిలో లేని ఈ పార్టీలతో పాటు పశ్చిమ బెంగాల్ లో టి ఎం సి గెలిచే స్థానాలు, ఆయా పార్టీలు వ్యవహరించే తీరు దేశ రాజకీయాలను మార్చానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో వైఎస్ ఆర్ సిపి కాంగ్రెస్ తో కలవడానికి ఆసక్తి చూపకపోవచ్చని, అలాగే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బిజేపిటో జాతకట్టక పోవచ్చు. కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మాట మార్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు పూర్తయిన ఎన్నికల్లో 380 సీట్లలో బిజేపి అనుకూల మైన చోట కూడా కొంత నష్టం జరగనుందనే వార్తలు వస్తున్నాయి. గత 2019 ఎన్నికల్లో బిజేపి, రాజస్తాన్ లోని 25, గుజరాత్ లోని 26 సీట్లు, మధ్యప్రదేశ్ లోని 29 సీట్లలో 28 సీట్లు గెలుచుకోండి. అంటే మొత్తం 80 సీట్లలో 79 సీట్లు గెలుచుకోంది, కానీ ఈసారి ఈ రాజస్తాన్, గుజరాత్ లలో బలమైన రాజ్ పుత్ (క్షత్రీయులు) లు బలంగా బిజేపిని వ్యతిరేకించడం, పార్టీలోని అంతర్గత విభేదాలు పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో అధికారం చేజిక్కించుకొన్న బిజేపి, అప్పుడే అంతర్గత విభేదాలతో గతంలో సాధించినాన్ని సీట్లు సాధించకపోవచ్చని తెలుస్తుంది. గతంలో ఈ మూడు రాష్ట్రాలలో 2019 లో గెలుచుకొన్న 79 సీట్లలో కనీసం 20-25 సీట్ల నష్టం జరగవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
దక్షిణాన కర్ణాటక తో పాటు తెలంగాణలో మాత్రమే కొంత ఉనికిని చాటుకొన్న బిజేపి, ఈసారి కూడా తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా గెలవలేదనే అనుకొంటున్నారు. అయినా, తమిళనాడు, కేరళలో కనీసం ఒకటి రెండు స్థానలైనా గెలుస్తుందని ఇంకా బిజేపి నమ్ముతోంది. గత ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లలో, 27 సీట్లు గెలుచుకొన్న బిజేపి, ఈసారి అక్కడ అధికారంలో లేకపోవడమే కాకుండా, ప్రజ్వల రెవన్న ఉదంతం రెండవసారి జరిగిన పోలింగ్ పై పెద్ద ప్రభావమే చూపుతుందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చుతుందనే నమ్మకంతో ఓటర్ల లో కూడా మార్పు వచ్చిందని అనుకొంటున్నారు. ఈ పరిస్థితులలో బిజేపి కర్ణాటకలో కనీసం 10-12 సీట్లు కోల్పోవచ్చని భావిస్తున్నారు.
ఈ పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ తప్ప అన్నీ పార్టీలు అవసరం అయితే బిజేపి తో పెట్టుకోవచ్చని, టిడిపి, బి ఆర్ ఎస్, వి ఎస్ ఆర్ సి పి తమలోని విభేదాలను పక్కన పెట్టి అధికారంలోకి రావడానికి కూడా వెనుకడక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పార్టీలు కాంగ్రెస్ కూటమికి కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చని, అధికారం కొరకు వీరంతా ఆకలితో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అధికార, ప్రతిపక్ష కూటమీలు రెండు కూడా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అనుకొన్నాన్ని సీట్లు రాబట్టుకొనే దిశలో లేవని అనుకొంటున్నారు. అలాంటప్పుడు బిజూ జనతాదళ్ తో పాటు, తెలుగు రాష్ట్రాల పార్టీలే కీలకం కానున్నాయి.
ఇక ముందు జరగబోయే మూడు దశల ఎన్నికల్లో 164 సీట్లలో ఎవరెన్ని సీట్లను గెలుచుకొంతరనే దానిపైనే ఏ కూటమి అధికారంలోకి రావడం అన్నది తెలిపోతుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లలో గతంలో గెలిచిన సీట్లను నిలుపుకోలేని పార్టీ, హర్యానా, డిల్లీ, పంజాబ్ లలో కూడా గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను కూడా కొల్పవనున్నదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మప్రధాని మోడి అనుకున్నతళులు, హిందూత్వం, ముస్లిం, రామ మందిరం అంశాలు బజని రక్షించలేకపోవచ్చని, కానీ ఎటు కానీ మద్యంతర పార్టీలు కాపాడుతాయన్న ధైర్యంతో బిజేపి-ఆర్ ఎస్ ఎస్ లు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో RTC సమ్మెకు జీవన్ రెడ్డి మద్దతు | ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు
జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
పట్టణంలోని RTC డిపో ముందు జరుగుతున్న RTC కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, RTC కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరమని, ఈ పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఫలితమని విమర్శించారు.... కాలేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి కుట్రలకు చెంప దెబ్బ* *ఎవరు ఔనన్నా కాదన్నా* *తెలంగాణకు ప్రాణేశ్వరం ముమ్మాటికీ కాళేశ్వరమే* తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్
* జగిత్యాల ఏప్రిల్ 22 ( ప్రజా మంటలు) కాలేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సందర్భంగా ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో తాసిల్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నాయకులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* ఘోష్ కమిషన్... ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా… ఏప్రిల్ 24న గ్రాండ్ రిలీజ్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
‘పరమపద సోపానం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అర్జున్ అంబటి హీరోగా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు నిర్మించగా, నాగ శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ... ఈ రోజు ఉదయం10 గంటలకు సభాస్థలి పరిశీలించనున్న కవిత
:హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు.
ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం... వెయ్యి ఏండ్లయినా బీఆర్ఎస్ మారదు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, “వెయ్యి ఏండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదు” అని మండిపడ్డారు.బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలనే తప్పు పడుతోందని... జగిత్య BRS సభ మరో ఉద్యమానికి, కాంగ్రెస్ పతనానికి నాంది - బి ఆర్ ఎస్ నాయకులు
జగిత్యాల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావా వసంత, మార్క్ఫెడ్ లోక బాపురెడ్డి,... సిరిసిల్ల నుంచి కవిత పార్టీ ఆవిర్భావ సభకు పాదయాత్ర ప్రారంభం
సిరిసిల్ల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో, ఆమె అభిమానులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.తెలంగాణ జాగృతి నాయకులు వినయ్, సతీశ్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు మంగళవారం ఉదయం సిరిసిల్ల అంబేద్కర్... నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం - కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలుకుతూ ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని నాయకులు ప్రకటించారు. ఆ రోజు జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా కార్యకర్తలు కార్యక్రమ... జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు మే నెల 17 న..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల 21 ఏప్రిల్ (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు వచ్చె నెల 17 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్టు సంఘం ఎన్నికల కమిటీ కన్వీనర్ రాపర్తి. గంగాధర్, కో-కన్వీనర్ కొక్కు. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగినది.
ఈ సందర్బంగా కమిటీ... మల్కాజ్గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348322113.
హైదరాబాద్ 19 ఏప్రిల్ (ప్రజా మంటలు) :
మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది.
నేరేడ్మెట్ ప్రాంతంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం (భూమి) కేటాయింపును... హైకోర్టు జడ్జి శ్రీ రేణుక యార ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల ఏప్రిల్ 18(ప్రజా మంటలు)పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ & జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించేందుకు కోరుట్లకు విచ్చేసిన గౌరవ హైకోర్టు జడ్జి రేణుక యార ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ను అందజేశారు. తొలి జెడ్పి చైర్ పర్సన్ నివాసానికి కేటీఆర్ హరీష్ రావు రాక స్వాగతం పలికిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల ఏప్రిల్ 18 (ప్రజా మంటలు)ఈనెల 20వ తేదీ కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా సభ ప్రాంగణాన్ని పరిశీలించి అనంతరం జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరియు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు... 