కరీంనగర్ లో కాంగ్రెస్ జన ప్రభంజనం వెలిచాల "శక్తి ప్రదర్శన"- 70 వేల మందితో భారీ ప్రదర్శన. గెలుపు ఖాయమని రాజేందర్ రావు వెల్లడి
కరీంనగర్ లో కాంగ్రెస్ జన ప్రభంజనం
వెలిచాల "శక్తి ప్రదర్శన"- 70 వేల మందితో భారీ ప్రదర్శన.
గెలుపు ఖాయమని రాజేందర్ రావు వెల్లడి
- వెయ్యి మంది కళాకారులతో కాంగ్రెస్ మీటింగ్ జన సంద్రం
కరీంనగర్ మే 11 (ప్రజా మంటలు) :. ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా, దాదాపు 70 వేల మంది హాజరైన ప్రజలతో గీతా భవన్ చౌరస్తాలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన నిర్వహించారు. శక్తి యాత్ర పేరుతో ప్రచారం చివరి రోజు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జన ప్రభంజనం కాంగ్రెస్ నాయకుల ఉత్సాహాన్ని పెంచింది.
వెయ్యి మంది కళాకారులు భిన్న ప్రదర్శనల్లో అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హుషారుగా పాల్గొని, తన గెలుపు కోసం స్వచ్చందంగా తరలివచ్చిన జన సమూహాన్ని చూసి రాజేందర్ రావు రెట్టించిన ఉత్సాహంతో కళాకారుల స్టెప్పులకు జత కలిశారు. నృత్యం చేస్తూ, డప్పు వాయిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిన పూనిన కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం నెరవేరడం ఖాయంగా శక్తి యాత్ర నిరూపించిందని, భారీ సందడి, ప్రముఖ నేతల ప్రసంగం అనంతరం గీతా భవన్ చౌరస్తా నుంచి బస్ స్టేషన్ వరకు ఓపెన్ టాప్ వాహనంపై నిల్చుని వెలిచాల రాజేందర్ రావు భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రచారం చివరి రోజైనా శనివారం నాటి శక్తి యాత్రకు హాజరైన జన ప్రభంజనం కాంగ్రెస్ గెలుపుకహాయమని నిరూపించిందని వెలిచాల రాజేందర్ రావు తనప్రసంగంలో అన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతికి పాల్పడి 30శాతం కమిషన్ పంచుకున్న అవినీతిపరులు, కరీంనగర్ ప్రజల సమస్యలపై కనీస అవగాహనలేని దద్దమ్మలు మనకి అవసరమా? అని వెలిచాల రాజేందర్ రావు ప్రశ్నించారు. గత పదేళ్లపాటు ఎంపీలుగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్, బండి సంజయ్ లు నయా పైసా అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. బండి సంజయ్ కి మరోసారి అవకాశం కల్పిస్తే కరీంనగర్ ను అభివృద్ధి చేయడని, తానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడని పేర్కొన్నారు. 2014లో నామినేషన్ పత్రాలు కొనేందుకు భార్య పుస్తల తాడు అమ్మిన బండి సంజయ్ ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని నిలదీశారు. ఎన్నికల సమయంలో వందల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నాడని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బహిర్గతంగానే చెబుతోందని, అలాంటి బిజెపికి ఓటు వేయటం అవసరమా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలు తొలగించి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అంటున్న బిజెపిని బండకేసి కొట్టాలని రాజేందర్ రావు పిలుపునిచ్చారు.
--------
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ని ఆహ్వానించారు.
రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ... క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కౌన్సిలింగ్ తో వృద్ధుల కేసులు పరిష్కారం..
జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు):
తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి... దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్
దుబాయ్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్.ఏ.ఎల్ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది.
విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ... కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ
గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు):
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం... ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో... తెలంగాణలో 32 మంది IPS అధికారుల – సంచలన రీషఫుల్
హైదరాబాద్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు భారీ స్థాయిలో పోలీస్ శాఖలో మార్పులు చేపట్టింది. మొత్తం 32 మంది IPS అధికారుల బదిలీలు, కొత్త పోస్టింగులను ప్రకటిస్తూ జి.ఓ. 1632ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కీలక కమిషనరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలు, స్పెషల్ బ్రాంచ్లలో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.... హైదరాబాద్లో రూ.5 లక్షల కోట్లు భూ కుంభకోణం
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాలను మరోసారి కుదిపేసేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారీ భూ కుంభకోణ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని 9,500 ఎకరాల పారిశ్రామిక వాడల భూములు రేవంత్ రెడ్డి తన బంధువులు, స్నేహితులకు కట్టబెడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
"₹4... సందేశాత్మక చిత్రాలను ప్రజలు అదరించాలి తెలంగాణ సినీ నిర్మాత లు భరత్ కుమార్ అంకతి,పుల్లురి నవిన్
మెట్ పెల్లి నవంబర్ 21(ప్రజా మంటలు)సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఆదరించాలని తెలంగాణ సినీ నిర్మాతలు భరత్ కుమార్ అంకతి పుల్లూరి నవీన్ లు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన దర్శకుడు రాజ్ నరేంద్ర... ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ
ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కవిత మాట్లాడుతూ—“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం... గవర్నర్ కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసులో విచారించడానికి అనుమతించడం బిజెపి, కాంగ్రెస్ ల రాజకీయ కుట్ర
రాయికల్ నవంబర్ 21(ప్రజా మంటలు)ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ ని విచారించడానికి అనుమతించడం అంటే కాంగ్రెస్ బిజెపి పార్టీల రాజకీయ కుట్ర అన్నారు దావ వసంత సురేష్
రాయికల్ పట్టణంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్ పై పెట్టిన ఫార్ములా ఈ రేస్ కేసుపై స్పందించిన జిల్లా తొలి జడ్పీ... బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ
కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్ ) గారి వర్ధంతి జ్ఞాపకం !
- బండ్ల మాధవరావు
(మహమ్మద్ గౌస్ FB నుండి)
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో... 