కరీంనగర్ లో కాంగ్రెస్ జన ప్రభంజనం వెలిచాల "శక్తి ప్రదర్శన"- 70 వేల మందితో భారీ ప్రదర్శన. గెలుపు ఖాయమని రాజేందర్ రావు వెల్లడి
కరీంనగర్ లో కాంగ్రెస్ జన ప్రభంజనం
వెలిచాల "శక్తి ప్రదర్శన"- 70 వేల మందితో భారీ ప్రదర్శన.
గెలుపు ఖాయమని రాజేందర్ రావు వెల్లడి
- వెయ్యి మంది కళాకారులతో కాంగ్రెస్ మీటింగ్ జన సంద్రం
కరీంనగర్ మే 11 (ప్రజా మంటలు) :. ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా, దాదాపు 70 వేల మంది హాజరైన ప్రజలతో గీతా భవన్ చౌరస్తాలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన నిర్వహించారు. శక్తి యాత్ర పేరుతో ప్రచారం చివరి రోజు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జన ప్రభంజనం కాంగ్రెస్ నాయకుల ఉత్సాహాన్ని పెంచింది.
వెయ్యి మంది కళాకారులు భిన్న ప్రదర్శనల్లో అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హుషారుగా పాల్గొని, తన గెలుపు కోసం స్వచ్చందంగా తరలివచ్చిన జన సమూహాన్ని చూసి రాజేందర్ రావు రెట్టించిన ఉత్సాహంతో కళాకారుల స్టెప్పులకు జత కలిశారు. నృత్యం చేస్తూ, డప్పు వాయిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిన పూనిన కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం నెరవేరడం ఖాయంగా శక్తి యాత్ర నిరూపించిందని, భారీ సందడి, ప్రముఖ నేతల ప్రసంగం అనంతరం గీతా భవన్ చౌరస్తా నుంచి బస్ స్టేషన్ వరకు ఓపెన్ టాప్ వాహనంపై నిల్చుని వెలిచాల రాజేందర్ రావు భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రచారం చివరి రోజైనా శనివారం నాటి శక్తి యాత్రకు హాజరైన జన ప్రభంజనం కాంగ్రెస్ గెలుపుకహాయమని నిరూపించిందని వెలిచాల రాజేందర్ రావు తనప్రసంగంలో అన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతికి పాల్పడి 30శాతం కమిషన్ పంచుకున్న అవినీతిపరులు, కరీంనగర్ ప్రజల సమస్యలపై కనీస అవగాహనలేని దద్దమ్మలు మనకి అవసరమా? అని వెలిచాల రాజేందర్ రావు ప్రశ్నించారు. గత పదేళ్లపాటు ఎంపీలుగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్, బండి సంజయ్ లు నయా పైసా అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. బండి సంజయ్ కి మరోసారి అవకాశం కల్పిస్తే కరీంనగర్ ను అభివృద్ధి చేయడని, తానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడని పేర్కొన్నారు. 2014లో నామినేషన్ పత్రాలు కొనేందుకు భార్య పుస్తల తాడు అమ్మిన బండి సంజయ్ ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని నిలదీశారు. ఎన్నికల సమయంలో వందల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నాడని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బహిర్గతంగానే చెబుతోందని, అలాంటి బిజెపికి ఓటు వేయటం అవసరమా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలు తొలగించి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అంటున్న బిజెపిని బండకేసి కొట్టాలని రాజేందర్ రావు పిలుపునిచ్చారు.
--------
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత ఇకపై తప్పనిసరి కానుంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ టెట్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం, 2009 తర్వాత నియమితులైన ప్రతి టీచర్కు టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి.
సుప్రీంకోర్టు తీర్పు... జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు
జగిత్యాల, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆత్మ, సాహిత్య స్పూర్తికి ప్రతీక అయిన ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో ఘనంగా స్మరణ సభ జరిగింది.స్థానిక దేవిశ్రీ గార్డెన్లో కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవులు, కవయిత్రులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.... పుణెలో భయంకర రోడ్డు ప్రమాదం – రెండు కంటెయినర్ లారీల మధ్య నలిగిన కారు, ఐదుగురు దుర్మరణం
పుణె, నవంబర్ 13 (ప్రజా మంటలు):
ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపై పుణె నగర అవుట్స్కర్ట్స్లో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ప్రమాదం నవలే బ్రిడ్జ్ వద్ద చోటుచేసుకుంది. ఒక కారు రెండు భారీ కంటెయినర్ ట్రక్కుల మధ్య నలిగిపోవడంతో, అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో... అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఆయన అమర జ్యోతి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, నిర్మాణ పనులను... అందెశ్రీ - నీ కీర్తి మా స్ఫూర్తి
నీ కీర్తి మా స్ఫూర్తి
-- చెన్నాడి వెంకటరమణారావు 9912114028-
తెలుగువారికి కీర్తిభావి తరము స్ఫూర్తిమనిషి మనిషిలో ఆర్తివసివాడని కవితామూర్తిజాతి కులములనెవ్వడడిగేనువిశ్వకవిగా ఎదను నింపుకున్నరు నిన్నుమనిషి జాతికి నువ్వు శివుని మూడో కన్నుమరువలేము నిన్నుఎందరెందరో మరెందరెందరోనీ పాటను పలవరించుతారుకాలమున్నన్నాళ్ళు తెలుగు కాళిదాసుగ... వారాసిగూడ లో వ్యక్తి అదృశ్యం
సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వీదెం రాఘవేందర్ (38) అనే యువకుడు వారాసిగూడ పీఎస్ పరిధిలోని సంజీవపురం ప్రాంతంలో తండ్రి జగన్నాథం(84) తో కలసి నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 4న సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్ళిన రాఘవేందర్... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు.
.సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు):
ఢిల్లీలోని ఎర్రకోటలో ఇటీవల జరిగిన పేలుడు సంఘటన దృష్ట్యాముందస్తు భద్ర తా చర్యలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గురువారం ఆర్పీఎఫ్,జీఆర్పీ బీడీడీఎస్ పోలీసులు ముమ్మర తనిఖీ లు నిర్వహించారు.ప్రయాణీకుల లగేజీలు,ఇతరత్రా వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలలో బ్లేజ్ అనే స్నిప్ప ర్ డాగ్ స్క్వాడ్ తో రైల్వేస్టేషన్లోని... మొక్క జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
వెయ్యి క్వింటల్ల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసాం.. మొక్కజొన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలి..మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలో అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డులో స్థలం లేకపోవడం వలన శ్రీరాముల పల్లె... శ్రీ మల్లికార్జున దేవస్థానం స్వామి జాతర టెండర్లకు ఆహ్వానం.
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని మల్లికార్జున స్వామి జాతరకు సంబంధించిన టెండర్లను ఈనెల 15,వ శనివారం ఉదయం 11 గంటలకు దేవాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు పత్రికా ప్రకటనలో తెలిపారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో గల ప్రసిద్ద శ్రీ మల్లికార్జున స్వామి
కావున... జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్), నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల శ్రమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు... జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్ )నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు.
🎓 విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్
మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు... ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్
RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
హైదరాబాద్లోని ఆర్టీసీ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు.
🔹 2021... 