కరీంనగర్ లో కాంగ్రెస్ జన ప్రభంజనం వెలిచాల "శక్తి ప్రదర్శన"- 70 వేల మందితో భారీ ప్రదర్శన. గెలుపు ఖాయమని రాజేందర్ రావు వెల్లడి
కరీంనగర్ లో కాంగ్రెస్ జన ప్రభంజనం
వెలిచాల "శక్తి ప్రదర్శన"- 70 వేల మందితో భారీ ప్రదర్శన.
గెలుపు ఖాయమని రాజేందర్ రావు వెల్లడి
- వెయ్యి మంది కళాకారులతో కాంగ్రెస్ మీటింగ్ జన సంద్రం
కరీంనగర్ మే 11 (ప్రజా మంటలు) :. ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా, దాదాపు 70 వేల మంది హాజరైన ప్రజలతో గీతా భవన్ చౌరస్తాలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన నిర్వహించారు. శక్తి యాత్ర పేరుతో ప్రచారం చివరి రోజు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జన ప్రభంజనం కాంగ్రెస్ నాయకుల ఉత్సాహాన్ని పెంచింది.
వెయ్యి మంది కళాకారులు భిన్న ప్రదర్శనల్లో అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హుషారుగా పాల్గొని, తన గెలుపు కోసం స్వచ్చందంగా తరలివచ్చిన జన సమూహాన్ని చూసి రాజేందర్ రావు రెట్టించిన ఉత్సాహంతో కళాకారుల స్టెప్పులకు జత కలిశారు. నృత్యం చేస్తూ, డప్పు వాయిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిన పూనిన కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం నెరవేరడం ఖాయంగా శక్తి యాత్ర నిరూపించిందని, భారీ సందడి, ప్రముఖ నేతల ప్రసంగం అనంతరం గీతా భవన్ చౌరస్తా నుంచి బస్ స్టేషన్ వరకు ఓపెన్ టాప్ వాహనంపై నిల్చుని వెలిచాల రాజేందర్ రావు భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రచారం చివరి రోజైనా శనివారం నాటి శక్తి యాత్రకు హాజరైన జన ప్రభంజనం కాంగ్రెస్ గెలుపుకహాయమని నిరూపించిందని వెలిచాల రాజేందర్ రావు తనప్రసంగంలో అన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతికి పాల్పడి 30శాతం కమిషన్ పంచుకున్న అవినీతిపరులు, కరీంనగర్ ప్రజల సమస్యలపై కనీస అవగాహనలేని దద్దమ్మలు మనకి అవసరమా? అని వెలిచాల రాజేందర్ రావు ప్రశ్నించారు. గత పదేళ్లపాటు ఎంపీలుగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్, బండి సంజయ్ లు నయా పైసా అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. బండి సంజయ్ కి మరోసారి అవకాశం కల్పిస్తే కరీంనగర్ ను అభివృద్ధి చేయడని, తానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడని పేర్కొన్నారు. 2014లో నామినేషన్ పత్రాలు కొనేందుకు భార్య పుస్తల తాడు అమ్మిన బండి సంజయ్ ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని నిలదీశారు. ఎన్నికల సమయంలో వందల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నాడని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బహిర్గతంగానే చెబుతోందని, అలాంటి బిజెపికి ఓటు వేయటం అవసరమా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలు తొలగించి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అంటున్న బిజెపిని బండకేసి కొట్టాలని రాజేందర్ రావు పిలుపునిచ్చారు.
--------
More News...
<%- node_title %>
<%- node_title %>
నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో... వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,
గంగమ్మ గుడి కట్టపైన నుండి చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు... మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,... చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు.... సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత... రాయికల్లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం... రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా... శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.
దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు... 