తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.
తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.
ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.
-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు
తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.
ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.
ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.
మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.
పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.
ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.
నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.
కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.
ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కొండగట్టు జనవరి 2 (ప్రజా మంటలు)1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్... రాష్ట్ర మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు
జగిత్యాల జనవరి 2 (ప్రజా మంటలు)నూతన సంవత్సరం 2026 పురస్కరించుకొని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు ఆడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్తెలంగాణ రాష్ట్ర మంత్రులకు పొన్నం ప్రభాకర్ కి, అడ్లూరి లక్ష్మణ్ మరియు శ్రీధర్ బాబులను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్యతో ప్రత్యక్షంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు... హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన పట్టణ సిఐ కరుణాకర్
జగిత్యాల జనవరి 2 (ప్రజా మంటలు)పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్యను జగిత్యాల పట్టణానికి చెందిన బాసోజి శ్రీనివాస్ ఇతని కొడుకు వేణు, చారి లు కలిసి డిసెంబర్ 31 న దాడి చేసి హత్య చేసినట్టు పట్టణ సిఐ కరుణాకర్ శుక్రవారం మీడియాతో వివరాలు తెలిపారు .
మృతుడు అంజయ్యకు నిందితుడు శ్రీనివాస్... వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి -జిల్లా రవాణా అధికారి యం. శ్రీనివాస్
జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు)జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవల సందర్భంగా జగిత్యాల జిల్లా రవాణా అధికారి యం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సీట్ బెల్ట్ పై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు
ఈ సందర్భంగా సీట్ బెల్ట్ ధరించిన వారిని గులాబీ పువ్వు... కరీంనగర్ మున్సిపల్ కౌన్సిల్ పై ఎంఐఎం జెండా ఎగురవేస్తాము నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పిలుపు
జగిత్యాల, జనవరి 02(ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎంఐఎం పార్టీదే మాత్రమే సూపర్ పవర్ అని, ఎంఐఎం మద్దతు లేనిదే ఆకు కూడా కదలదని, రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో ఎంఐఎం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా శ్రమించాలని, హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే, యూత్... రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్, జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త కాసుగుంటి సుధాకర్ రావు మృతికి ఘనంగా శ్రద్ధాంజలి
జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు)
రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ మరియు జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ఆవరణలో .....శుక్రవారం ఉదయం 11 గంటలకు విద్యావేత్త జగిత్యాల క్లబ్ మరియు రోటరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు కాసుగంటి సుధాకర్ రావు మృతి పట్ల సంతాప సమావేశం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూల... మెడిసిన్ అప్డేట్- 2026 లో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురణ. జగిత్యాల వైద్యుడికి దక్కిన అరుదైన అవకాశం.
జగిత్యాల. జనవరి 2( ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు అరుదైన అవకాశం దక్కింది. మెడిసిన్ అప్డేట్ - 2026 వైద్య గ్రంథంలో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురితమైంది.
వైద్య రంగంలో కొత్త కొత్త అంశాలు, ఆవిష్కరణలతో ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలోని జేపీ బ్రదర్స్... మూసీ పునరుజ్జీవానికి వేగం – మార్చి నాటికి టెండర్లు, త్వరలో పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును వేగవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లశాసన సభలో చెప్పారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి, కాలుష్య నివారణ, శుద్ధి నీటి ప్రవాహం... కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరు – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నేత కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరని ఆమె స్పష్టం చేశారు. శాసనమండలి ఆవరణలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు.
కేసీఆర్ సభకు హాజరై ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే... కౌన్సిల్లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
తాను చేసిన రాజీనామాను కౌన్సిల్లో మాట్లాడిన తర్వాతే ఆమోదింప చేయించుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఆమోదించలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఛైర్మన్ను కోరనున్నట్లు... తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
బీర్పూర్ జనవరి 1 (ప్రజా మంటలు)
బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీ స్టల దాత సర్పంచ్ రాజగోపాల్ రావు స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచాయతీ రాజ్ డి.ఈ. మిలింద్ కి... 