తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.
తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.
ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.
-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు
తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.
ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.
ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.
మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.
పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.
ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.
నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.
కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.
ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి అర్ధరాత్రి నుండి ఆటోల బంద్ _ప్రజలు సహకరించాలి
జగిత్యాల ఆగస్ట్ 23 (ప్రజా మంటలు)
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
నేటి అర్ధరాత్రి నుండి జగిత్యాల జిల్లా స్థాయిలో రాష్ట్ర పిలుపుమేరకు ఆటోలు బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. విధి లేని పరిస్థితుల్లోనే తాము బందుకు శ్రీకారం చుట్టామని ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో... మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం - ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్ వెల్లడి..
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్గా పనిచేసిన కొరపు లావణ్య చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తీవ్ర నిరాధారమైనవని హోటల్ 'ది మనోహర్' చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని హోటల్ 'ది మనోహర్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లావణ్య... యాదవులను కురుమ కులంలో కలపవద్దు
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
యాదవ సామాజిక వర్గాన్ని కురుమ కులంలో కలపడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం, కురుమ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు ఆర్. జయప్రకాష్, టి. సుదర్శన్లను కలిసి... జర్నలిస్టులపై ఇక అక్రమ కేసులు చెల్లవా? వైరల్ మెసేజ్లో నిజమెంత?
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చిందంటూ సోషల్ మీడియా, వాట్సాప్లో వైరల్ అవుతున్న ఓ సందేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “పెన్నుతో వార్తలు రాసే జర్నలిస్టులు, వీడియో కెమెరాలతో వార్తలను కవర్ చేసే రిపోర్టర్లు, శాటిలైట్ న్యూస్ చానళ్లు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే... ఘనంగా కుంకుమార్చనలు, విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళలు
జగిత్యాల ఆగస్టు 21 (ప్రజా మంటలు)పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నంబి వేణుగోపాల ఆచార్య ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజా ద్రవ్యాలు ఆలయం పక్షాన అందజేశారు .
కార్యక్రమం అనంతరం తీర్థ... అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రూ.32 కోట్లతో నూకలపల్లి 2బీహెచ్కే కాలనీకి మౌలిక వసతుల కల్పన
రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు మంత్రి ఆదేశాలు
భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- ఏడాదిన్నరలో రీ - సర్వే పూర్తి
ధర్మపురికి రెవెన్యూ డివిజన్, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి
- మంత్రి అడ్లూరి... ఎల్కతుర్తిలో కారులో అనుమానాస్పద మృతదేహం కలకలం
ఎల్కతుర్తి, ఆగస్టు 21 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డులో కారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రెండు రోజులుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో నుంచి శుక్రవారం దుర్వాసన రావడంతో బాటసారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు... వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్పై భార్య ఫిర్యాదు
వేములవాడ, ఆగస్టు 20 (ప్రజా మంటలు):
వేములవాడలోని రెడ్డి భవన్లో తన భర్త ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్తో ఒకే గదిలో గుర్తించానని ఆరోపిస్తూ ఆయన భార్య శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరణ్య ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఫోక్ సాంగ్స్లో నటించిన ఈశ్వర్ సాయి,... 2 వేల మంది అన్ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత
హైదరాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు):
సింగరేణిలో అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.
హెచ్ఎంఎస్ జనరల్... పేదల కోసం ‘భూలక్ష్మి’ పథకం - కల్వకుంట్ల కవిత
సామాజిక న్యాయం కోసం మళ్లీ భూ పంపిణీ జరగాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆగస్టు 18 (ప్రజా మంటలు):
తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధించాలంటే మళ్లీ భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధికారంలోకి... కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం* *బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
*
జగిత్యాల జిల్లా ఆగస్టు17 {ప్రజా మంటలు}
మల్యాల మండలం కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మందికి ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మల్యాల మండలం కొండగట్టు సమీపంలో జగిత్యాల నుంచి... బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని... 