తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.
తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.
ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.
-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు
తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.
ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.
ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.
మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.
పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.
ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.
నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.
కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.
ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి: వసంత సురేష్ తీవ్ర విమర్శలు
రాయికల్, డిసెంబర్ 7 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిన నిర్ణయం బీసీ వర్గాలపై తీవ్ర అన్యాయం చేసిందని, ఆ నిరాశతోనే బీసీ బిడ్డ ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మండిపడ్డారు. రాయికల్... పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సమావేశం. -టీ పి సీ ఏ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 7:పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశం తెలంగాణ పెన్షన ర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు.ఆదివారం జిల్లా టి. పి. సీ. ఏ. కార్యాలయంలో అయన విలేకరుల తో మాట్లాడుతూ హైదరాబాద్ లోని
ఈ... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా హరిహరాలయంలో ఫల ,పంచామృత అభిషేకాలు
జగిత్యాల డిసెంబర్ 7 (ప్రజా మంటలు)అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పరమశివునికి పంచామృతాలు ,వివిధ ఫల రసాలతో సూర్యోదయానికి పూర్వమే అభిషేకాలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ స్వహస్తాలతో సాంబశివుని కి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.... అగ్ని ప్రమాద బాధితులకు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యుల చేయూత
మల్యాల డిసెంబరు 7 ( ప్రజా మంటలు)స్థానిక కొండగట్టు లో ఒక దారుణ అగ్నిప్రమాదంలో దాదాపు 20 చిరువ్యాపారులు చేసుకొనే షాపులు పూర్తిగా కాలిపోయి , కుటుంబాలు అన్ని రోడ్డు మీదకి వచ్చాయి.
ఇతర స్థానిక కుటుంబీకులు సామ శ్రీనాథ్ గారి కుటుంబ సభ్యులు మరియు మహేష్ గారు మన సత్యసాయి సంస్థ ని... ఓటర్లకు భరోసా కల్పిస్తూ ఇబ్రహీంపట్నం లో పోలీసుల ఫ్లాగ్మార్చ్
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 07 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా హామీ ఇవ్వడం కోసం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్టుపల్లి... మహాభారత జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న మహాభారత జ్ఞాన యజ్ఞము రెండవ రోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అట్టహాసంగా శనివారం ప్రారంభమైన మహాభారత నవహాన్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం ఆదివారం రెండవ రోజుకు చేరింది.
విశ్వ కళ్యాణర్థం... సిటీలో క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్. : కేక్ మిక్సింగ్..ఫన్ గేమ్స్..శాంతాక్లాజ్ సందడి
సికింద్రాబాద్, డిసెంబర్ 07 (ప్రజామంటలు):
క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్ సిటీలో ఘనంగా మొదలయ్యాయి. బేగంపేట లోని మ్యారీగోల్డ్ హోటల్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈసందర్బంగా నీలిమా వేముల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో మహిళలు మెరిశారు.
ముఖ్య అతిథిగా బేబక్క, స్పీకర్ గా రజిత హాజరయ్యారు. సుధా నాయుడు, లావణ్య, ప్రణతి... మోంబాసా సాటర్ డే క్లబ్ ఫండ్ రైజింగ్లో MOMTA సభ్యుల ప్రదర్శన
సికింద్రాబాద్, డిసెంబర్ 07 ( ప్రజామంటలు) :
కెన్యా లోని మోంబాసా తెలుగు అసోసియేషన్ ( MOMTA) ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కొరకు "సాటర్ డే క్లబ్" నిర్వహించిన అసోసియేషన్ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. బోర్ వెల్లుల ఏర్పాటు, విద్యార్థుల విద్యా సహాయం, భారీ నీటి నిల్వ ట్యాంకుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు... కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సత్యసాయి సేవా సమితి చేయూత
కొండగట్టు, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):స్థానికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది చిరు వ్యాపారుల షాపులు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. పరిస్థితి తెలుసుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల తరఫున తక్షణ సహాయం అందించారు.
సామ శ్రీనాథ్ కుటుంబ సభ్యులు, మహేష్ మొదలైన వారు... కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?
నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన
(జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి)
ఇందాక ఆకలేసి, దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.
మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా.
(అంటే ఏనుగు అరుపు కాదు) -ed
"అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.
"ఓహ్,... జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర
జగిత్యాల డిసెంబర్ 07 (ప్రజా మంటలు):
కన్వెన్షన్ హాల్లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి మహాభారత ప్రవచన మహాయజ్ఞం రెండో రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రవచన కార్యక్రమాన్ని... ఇండిగో సీఈఓ కు dgca నోటీస్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 06;
ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని... 