తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

On
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.

ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.

-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు  

తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.

ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.

 ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.

ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.

 మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.

పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.  

ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.  

నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.

కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.

ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రధాన ప్రమాదాలు, రాజకీయ–సామాజిక ఘటనలు

జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రధాన ప్రమాదాలు, రాజకీయ–సామాజిక ఘటనలు జగిత్యాల జిల్లా – ముఖ్య ఘటనలు (2025)(సంక్షిప్తంగా – తేదీలతో) 🔴 ప్రమాదాలు / దుర్ఘటనలు జనవరి 6, 2025 – మెట్‌పల్లి సమీపంలో కారు–లారీ ఢీకొని ఇద్దరు మృతి. జనవరి 18, 2025 – కోరుట్ల మండలంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి. ఫిబ్రవరి 2, 2025 – జగిత్యాల పట్టణంలో అగ్ని...
Read More...
Local News  State News 

నూతన సంవత్సరానికి స్వాగతంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన స్కై ఫౌండేషన్.

నూతన సంవత్సరానికి స్వాగతంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన స్కై ఫౌండేషన్. సికింద్రాబాద్ డిసెంబర్ 31  (ప్రజా మంటలు): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులు, అనాధలకు మానవతా కార్యక్రమం నిర్వహించారు. విపరీతమైన చలితో ఇబ్బందులు పడుతున్న ఫుట్‌పాత్‌లపై నివసించే నిరాశ్రయుల్ని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వేళ దుప్పట్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ వై....
Read More...

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర(2026) కాలమణిని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు ఎం.సంజయ్ కుమార్ 

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర(2026) కాలమణిని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు ఎం.సంజయ్ కుమార్       జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల-వైద్యులు సూద కళ్యాణ్ కుమార్, బిల్డర్&సర్వేయర్ వెయ్య గంగయ్య గార్ల సౌజన్యంతో రూపొందించిన టీ.పీ.టీ.ఎఫ్ జగిత్యాల జిల్లాశాఖ టేబుల్ మరియు వాల్ క్యాలెండర్ లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్  ఆవిష్కరించడం జరిగినది.   ఈ సందర్భంగా ఈ...
Read More...

#Draft: Add Your Title

#Draft: Add Your Title తపోవన్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ కార్నివల్_ పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, జగిత్యాల 31 (ప్రజా మంటలు)ఇంగ్లీష్ భాష మీద అవగాహన కొరకు ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇంగ్లీష్ కార్నివల్. గ్లోబల్ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ భాష మీద పట్టు ఎలా సాధించాలి ? ఎలా నేర్చుకోవాలి అనే అవగాహన కొరకు బుధవారం నాడు...
Read More...

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్  బి.సత్య ప్రసాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ...
Read More...

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి న జగిత్యాల జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సుజాత

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి న జగిత్యాల జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సుజాత జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ఆరోగ్యశాఖ అధికారిగా  నియామకమైన సుజాత  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్  ఉన్నారు.
Read More...

ఏపి డిప్యూటీ సిఎం కొండగట్టు పర్యటన ఏర్పాట్లు పరిశీలన* *డిప్యూటీ సిఎం పర్యటన విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*

ఏపి డిప్యూటీ సిఎం కొండగట్టు పర్యటన ఏర్పాట్లు పరిశీలన*  *డిప్యూటీ సిఎం పర్యటన విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్* *జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజామంటలు) జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు. డిప్యూటీ సిఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా...
Read More...

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన ముఖ్య ప్రదేశాలు తదితర...
Read More...

పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు) పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో  ఎస్పీ అశోక్ కుమార్  పూలమాల వేసి శాలువ లతో ఘనంగా సన్మానించారు. సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖ లో...
Read More...

ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం

ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం ధర్మపురి, డిసెంబర్ 31 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణంలో రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రి ఎదుట నిన్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్

అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్ జగిత్యాల (రూరల్) డిసెంబర్ 31 (ప్రజా మంటలు): అసెంబ్లీ ఎన్నికల హామీల మేరకు పెన్షనర్ల పెండింగ్ బకాయిల విడుదల, పీఆర్‌సీ అమలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణను అసెంబ్లీలో ప్రకటించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాలో టీ.పి.సి.ఏ. ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాల్లో...
Read More...
Local News 

బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి 

బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి  రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల రూరల్, డిసెంబర్ 31 (ప్రజా మంటలు): బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టును మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణ పరిష్కార చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర...
Read More...