తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.
తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.
ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.
-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు
తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.
ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.
ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.
మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.
పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.
ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.
నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.
కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.
ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్లో కలకలం
లండన్ / అంతర్జాతీయ మార్కెట్లు జనవరి 10:
2026 సంవత్సరంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తొలి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. కమోడిటీ ఇండెక్స్లలో జరిగే వార్షిక పునఃసంఘటన (Index Rebalancing) కారణంగా బంగారం, వెండిలో $10 బిలియన్లకు పైగా విలువైన అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి.
2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు... పిల్లల సిరప్పై తెలంగాణ DCA హెచ్చరిక Almont-Kid Syrup వాడకూడదని ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
పిల్లలకు ఉపయోగించే Almont-Kid Syrup విషయంలో తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (DCA) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ సిరప్లో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) మోతాదుకు మించి ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
బిహార్కు చెందిన ట్రిడస్ రెమెడీస్ తయారు చేసిన ఈ... జగిత్యాల జిల్లాలో పొలం బాట పట్టిన ట్రైనీ ఐఏఎస్ హరిణి
జగిత్యాల, జనవరి 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు నియమితులైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి గ్రామీణ జీవన విధానాన్ని సమీపంగా తెలుసుకునేందుకు పొలం బాట పట్టారు. ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో ఆమె క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మమేకమై, స్వయంగా వరి నాట్లు... సర్పంచ్గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం
జగిత్యాల, జనవరి 09 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గట్టు శారద గంగారాం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుగ్గారం... నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి
మహేశ్వరం జనవరి 9 (ప్రజా మంటలు):
నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చలు మరియు పరస్పర సహకారం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలి” అని... వీడియో కాల్లో తుపాకులతో బెదిరింపులు… ముగ్గురు అరెస్ట్
కోరుట్ల జనవరి 09 (ప్రజా మంటలు):
కోరుట్ల పట్టణంలో వీడియో కాల్ ద్వారా తుపాకులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం… కోరుట్ల పట్టణంలోని “కోరుట్ల సెల్ పాయింట్ అసోసియేషన్” పేరిట మార్త శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగడ్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఎయిర్టెల్ నెట్వర్క్ బిజినెస్... ‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత
హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు):
గత ఆరు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న ‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజుల్ రహమాన్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని సామాజిక... ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్
జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు)ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఆకస్మిక తనిఖీ కి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ రమణ రావు జగిత్యాల జిల్లాలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, రాబోయే ఐ పి ఈ మార్చ్ 2026 అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు సంబంధించిన మౌలిక... ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన టీఎన్జీవో నాయకులు
జగిత్యాల జనవరి 9( ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ సమస్యల గురించి చర్చించారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీవో ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ
జగిత్యాల జనవరి 9 ( ప్రజా మంటలు)
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న సిరిసిల్ల రాజేంద్ర శర్మ లు కేంద్ర రాష్ట్ర... కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్
కొండగట్టు జనవరి 9 ( ప్రజా మంటలు)మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో జరిగిన ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన 31 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 83 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి... అరగుండాల ప్రాజెక్టుతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు – మాజీ మంత్రి జీవన్ రెడ్డి
బీర్పూర్, జనవరి 09 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని అరగుండాల ప్రాజెక్టు ముత్తడి ప్రాంతాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల ప్రాజెక్టు స్లూయిస్ గేట్ దెబ్బతినడంతో పాటు కాలువ మరమ్మత్తుల అవసరాన్ని రైతులు తన దృష్టికి తీసుకురావడంతో, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో చర్చించి తక్షణ చర్యలు చేపట్టించినట్లు... 