తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.
తెలంగాణలో బీఆర్ఎస్కు ఆస్కారం లేదు.
తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.
ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.
-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు
తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.
ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.
ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.
మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.
పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.
ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.
నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.
కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.
ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీడ్ బిల్లు–2025 పై రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహిస్తున్న టీడీఎఫ్ జైకిసాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సీడ్ బిల్–2025 పై రైతులు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలను సేకరించింది. ఆన్లైన్ కాన్ఫరెన్స్ లు, వెబినార్ ల ద్వారా తీసుకున్న అభిప్రాయాల నివేదికను గురువారం కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ... దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :
దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థగా సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రెజిమెంటల్ బజార్లో జరిగిన సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల హైస్కూల్ 175వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికల విద్యకు 175 ఏళ్లుగా సేవ చేస్తూ ఎందరో ఐఏఎస్, ఐపీఎస్,... అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం ప్రభుత్వ ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టికెట్ రేట్లు పెంచడానికి సరైన ఆధారాలు, సమగ్ర కారణాలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం చట్టానికి... నాన్బెయిలబుల్ వారెంట్ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేస్తున్న కొండా సురేఖపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ వివరణ... రోడ్డు భద్రతపై యమధర్మరాజుగా అవగాహన
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :
హైదరాబాద్ సిటీ కమిషనర్ వి.సీ. సజ్జనార్ పర్యవేక్షణలో, ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో బేగంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ సిగ్నల్, బోయిన్పల్లి జంక్షన్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.
సర్వేజనా ఫౌండేషన్,కిమ్స్ సన్షైన్ ఆస్పత్రుల సీఈఓ డా. గురవా రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్... మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్?
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై కేసు నమోదు చేసిన ఎస్ఐకి “పనిష్మెంట్ ట్రాన్స్ఫర్” విధించడంపై పెద్ద వివాదం మొదలైంది. వేకెన్సీ రిజర్వ్ పేరుతో సీఐ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ను ట్రాన్స్ఫర్ చేయించేందుకు మంత్రి ప్రభావం చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం జరిగింది?మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... అమెరికాకు 20-పాయింట్ల సవరించిన శాంతి ప్రతిపాదన అందజేసిన ఉక్రెయిన్
లండన్ డిసెంబర్ 11 :
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం, యుద్ధం ముగింపుకు దోహదపడే 20 పాయింట్ల శాంతి ప్రతిపాదనను సవరించి అమెరికాకు అందజేశారు.
ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రతిపాదనలో కొత్త ఆలోచనలు, ముఖ్యంగా ఆక్రమిత... హబ్సిపూర్ గ్రామంలో బిజెపి అభ్యర్థికి ప్రచారం నిర్వహించిన బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గ జగిత్యాల రూరల్ మండల్ హబ్సిపూర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ..
భారతీయ జనతా పార్టీ బలపరిచిన
ఈ... ప్రశాంత వాతావరణంలో మెదటి విడత పోలింగ్ నిర్వహణ పూర్తి *జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
కోరుట్ల /మెట్పల్లి /మేడిపల్లి డిసెంబర్ 11 ( ప్రజా మంటలు)మొదటి విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
మేడిపల్లి మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామం, భీమారం మండల కేంద్రంలోని కమ్మరిపేట, కోరుట్ల మండలంలోని మెట్... ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు)
గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఓట్ల... బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకి 9వ షెడ్యూల్ లో చేర్చాలి: జీవన్ రెడ్డి
జగిత్యాల, డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే, రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం తప్పనిసరి అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన, 50% రిజర్వేషన్ పరిమితిని అధిగమించడానికి ఇదే మార్గమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనలతో బలహీన... ముత్తారం సర్పంచ్ గా ఉరడి భారతి జైపాల్ రెడ్డి విజయం
అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తా - ఊరడి భారతి 