తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

On
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.

ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.

-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు  

తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.

ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.

 ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.

ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.

 మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.

పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.  

ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.  

నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.

కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.

ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.

Tags
Join WhatsApp

More News...

Local News 

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి కొండగట్టు మార్చి 31 (ప్రజా మంటలు)  హనుమాన్ చిన్న జయంతికి  914  మంది సిబ్బందితో పటిష్ట భద్రత సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  మల్యాల ఎక్స్ రోడ్ వద్దగల ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బందోబస్తు పై పోలీసు అధికారులతో ఎస్పి సమీక్ష నిర్వహించారు. ప్రసిద్ధ...
Read More...
State News 

“రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం

 “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం :హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్...
Read More...
Local News 

అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు  పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత 

అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు  పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత       రాయికల్ మార్చి 31 (ప్రజా మంటలు)మండలం కిష్టంపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన మామిడి మరియు వరి పంట పొలాలను  బి ఆర్ ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  ఈ సందర్భంగా వారు...
Read More...
Spiritual   State News 

కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు

కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు చల్లపల్లె, మార్చ్ 31 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ పరిధిలో అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించడంతో సిబ్బంది, సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఘటన స్థలాన్ని...
Read More...

మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్

మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)పట్టణం లో ట్రాఫిక్ ఎస్ ఐ, టౌన్ ఎస్ ఐ ఆద్వర్యం లో  సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న దాదాపు 50 మంది మైనర్ లను పట్టుకున్న ట్రాఫిక్ మరియు పట్టణ పోలీసులు... ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్  ఇక పై మైనర్...
Read More...
Local News 

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి    జగిత్యాల మార్చి 30 ( ప్రజా మంటలు)పట్టణానికి చెందిన ఇల్లు లేని నిరుపేదల కొరకు నూకపెల్లి వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 4520 కట్టడం జరిగింది. వాటిలో 520 ఇండ్ల నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ కొరకు సంపు ఏర్పాటు చేసి దాని నుండి మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేసే విధానం...
Read More...
State News 

రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు –

రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు  – హైదరాబాద్ మార్చ్ 30 (ప్రజా మంటలు); శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి A. Revanth Reddy జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka...
Read More...
Local News 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మార్చ్ 30 (ప్రజా మంటలు): ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల...
Read More...
Local News 

విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

 విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మార్చ్ 29 (ప్రజా మంటలు): విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గం గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన గడ్డం మహిపాల్ రెడ్డి గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం అంతర్గం...
Read More...
National  Opinion  State News 

చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం 

చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం  - సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్ జర్నలిస్ట్  🔹 ప్రారంభ జీవితం మరియు నేపథ్యండా॥ జైశెట్టి రమణయ్యగారు 9 మే 1938న జగిత్యాలలో జన్మించారు. నిండు జీవితం అనుభవించి, 88 ఏళ్ల వయసులో,  శ్రీరామనవమి, మార్చ్ 27, 2026 రోజున పరమపదించారు. నడిచే గ్రంథాలయంగా చెప్పుకొనే రమణయ్య గారి మరణం జగిత్యాల విద్యావేత్తలకు,...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా శ్రీ రాములవారి పట్టాభిషేకం

అంగరంగ వైభవంగా శ్రీ రాములవారి పట్టాభిషేకం    జగిత్యాల మార్చి 28 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సీతారామచంద్రస్వామి ఆలయం (ఎడ్లంగడి) లో శుక్రవారం సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించగా శనివారం పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విషెస్ సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ప్రత్యేక వేదికపై సీతారాముల పరివారం ఉత్సవమూర్తులను...
Read More...
State News 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం  ధర్మపురి, మార్చ్ 28 (ప్రజా మంటలు): ధర్మపురికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంఘనబట్ల దినేష్‌కు కీలక పదవి దక్కింది. తెలంగాణ పబ్లిక్ లైబ్రరీల చట్టం, 1960 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు, ఆయనను జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ (జిల్లా గ్రంథాలయ సమస్థ) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి....
Read More...