తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

On
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.

ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.

-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు  

తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.

ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.

 ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.

ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.

 మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.

పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.  

ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.  

నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.

కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.

ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.

Tags
Join WhatsApp

More News...

Local News 

బతికుండగానే సమాధి నిర్మించుకున్న నక్క ఇంద్రయ్య మృతి – సంతాపం 

బతికుండగానే సమాధి నిర్మించుకున్న నక్క ఇంద్రయ్య మృతి – సంతాపం  జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్, జగిత్యాల రూరల్ మండల సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన బతికుండగానే స్వయంగా నిర్మించుకున్న సమాధిలోనే ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని భూస్థాపితం చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని...
Read More...
National  Crime 

తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం

తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం పుణే, జనవరి 11:పదవి నుంచి తొలగించబడిన IAS ట్రైనీ అధికారి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా మరో ముగ్గురు పుణేలోని వారి బంగ్లాలో అచేతన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. బానెర్–ఆంధ్ ప్రాంతంలోని నివాసంలో జరిగిన ఈ ఘటనలో నిద్ర మందులు కలిపి వారిని అచేతనం చేసి దొంగతనం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం...
Read More...
National  International  

ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు

ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు టెహ్రాన్ జనవరి 11: నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, ఇరాన్ ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంది.ఆర్థిక వ్యవస్థపై నిరసనలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు నేషన్లవైడ్ స్థాయిలో విస్తరుతూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ నెట్వర్క్‌లను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు...
Read More...
Local News 

వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. గోవింద్‌పల్లె సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, వడ్డే...
Read More...

మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి 

మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి  సికింద్రాబాద్,  జనవరి 11 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్  ను ఆదివారం  జాతీయ ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.  దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి...
Read More...
Local News 

జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ వేములవాడ, జనవరి 11 (ప్రజా మంటలు): జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్‌ను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులబాంధవులందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి...
Read More...
Local News 

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి –కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ పిలుపు

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి –కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ పిలుపు రాయికల్, జనవరి 12 (ప్రజా మంటలు): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలోని ప్రగతి స్కూల్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...

ఓసి జేఏసీ సింహ గర్జనకు తరలి వెళ్లిన జగిత్యాల ఓసి జేఏసీ నాయకులు

ఓసి జేఏసీ సింహ గర్జనకు తరలి వెళ్లిన జగిత్యాల ఓసి జేఏసీ నాయకులు జగిత్యాల జనవరి 11 (ప్రజా మంటలు) ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాల నుండి ఓసి జెఏసి సభ్యులు ప్రత్యేక వాహనంలపై తరలి వెళ్లారు   ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న కో కన్వీనర్...
Read More...

ఒకినోవా స్కూల్లో కరాటే  బెల్టుల ప్రధానం 

ఒకినోవా స్కూల్లో కరాటే  బెల్టుల ప్రధానం  జగిత్యాల జనవరి 11 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఒకేనోవా స్కూల్ ఆఫ్ కరాటే స్కూల్లో బెల్టుల ప్రధానం జరిగింది. అంతకుముందు కరాటే శిక్షణార్థులు తమ పర్ఫార్మెన్స్ చూపించారు. అనంతరం బెల్టుల ప్రధానం చేశారు. మాస్టర్ మర్రిపల్లి లింగయ్య, ఇన్స్ట్రక్టర్ తిరుమల నరేష్ కరాటే శిక్షణార్థులు పాల్గొన్నారు.
Read More...

గుండె జబ్బుల నివారణను మిషన్‌గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి

గుండె జబ్బుల నివారణను మిషన్‌గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు): గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణను ఒక మిషన్‌గా తీసుకొని ప్రభుత్వం, వైద్యులు, సమాజం అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) శిక్షణ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దేశవ్యాప్తంగా...
Read More...

అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జగిత్యాల జనవరి 10 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ను జగిత్యాల శాసనసభ్యులు దా సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఆవిష్కరించారు   ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్...
Read More...
National  State News 

AIADMK–BJP కూటమిలో AMMK చేరికపై ఊహాగానాలు.

AIADMK–BJP కూటమిలో AMMK చేరికపై ఊహాగానాలు. అమిత్ షా ఫోన్ కాల్ తర్వాత మారిన దినకరన్ వ్యూహం! చెన్నై, జనవరి 11 (ప్రజా మంటలు): తంజావూరులో జనవరి 5న జరిగిన AMMK జనరల్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. AMMK ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రసంగం మధ్యలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
Read More...