హుజారాబాద్‌లో విషాద ఘటన - టిప్పర్‌ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం

On
హుజారాబాద్‌లో విషాద ఘటన - టిప్పర్‌ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం

హుజారాబాద్‌లో విషాద ఘటన - టిప్పర్‌ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం

కరీంనగర్‌,ఏప్రిల్‌6(ఆర్‌ఎన్‌ఎ):

హుజూరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ బోల్తాపడి అందులో ఉన్న మట్టి విూద పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. సైదాపూర్‌ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్‌కు మట్టితో ట్రక్కు బయలుదేరింది. ఈ క్రమంలో బోర్నపల్లి మూలమలుపు వద్ద డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో ట్రక్కు అదుపుతప్పింది. అదే సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువతీయువకులపై మట్టి పడిరది. దీంతో వెంటనే వారిని హుజూరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విజయ్‌, సింధుజ ఇద్దరు మృతిచెందారు. వర్ష అనే యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. మృతులు బోర్నపల్లికి చెందిన వారే. వారంతా పెద్దమ్మ బోనాల జాతరకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింంది. మృతదేహాలను హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Tags