అపస్మారకస్థితిలో ఉన్న వ్యక్తిని రక్షించి మానవత్వం చాటుకున్న మహిళ.
108 వ్యవస్థ నిర్వీర్యం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
రాయికల్ మే 3 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని ఇటిక్యాల క్రాస్రోడ్ వద్ద ఓ బట్టల దుకాణం ముందు ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో ఉండగా, బట్టల దుకాణం యజమాని 108కు కాల్చేశాడు.
108 వాహనం వారు వచ్చి పరిశీలించి మద్యం మత్తులో ఉన్నాడేమో అని ఊహించుకుని వదిలిపెట్టి వెళ్లారు.
దీంతో కాలినడకన వెళ్తున్న రాయికల్ మండలం వస్తాపూర్ గ్రామానికి చెందిన మహిళ అతన్ని చూసి చలించి పక్కింటి వారి వద్దకు వెళ్లి మంచినీరు తీసుకువచ్చి అతన్ని కూర్చోబెట్టి నీరు తాగించి సమీపంలో ఉన్న నీడ ప్రాంతానికి చేర్చారు.
దీంతో అపస్మారక స్థితి నుండి ఆ వ్యక్తి కోలుకున్నాడు.
ఈ సందర్భంగా స్థానికులు మహిళ మానవత్వాన్ని చూసి అభినందించారు.
గత కొన్ని రోజుల క్రితం ఆ మహిళ భర్త చనిపోయాడని అప్పుడు ఎవరు కూడా తనకు సహాయం చేయలేదని తన పరిస్థితి ఎవరికి రాకూడదని ఒక తోబుట్టులాగా అనుకోని ఆ వ్యక్తికి సహాయం చేసానని మీడియా కు తెలిపింది ఆ మహిళ.