కెసిఆర్‌ చేసిన ద్రోహానికి బొదంపెట్టాల్సిందే - -మండిపడ్డ మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి, పొన్నం

On
కెసిఆర్‌ చేసిన ద్రోహానికి బొదంపెట్టాల్సిందే - -మండిపడ్డ మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి, పొన్నం

కెసిఆర్‌ చేసిన ద్రోహానికి బొదంపెట్టాల్సిందే - కాళేశ్వరం పేరుతో భారీ దోపిడికి పాల్పడ్డారు  మిషన్‌ భగీరథలో వేలకోట్ల కుంభకోణం - చేనేతకు చేసిన ద్రోమం అంతాఇంతాకాదు
-మండిపడ్డ మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి, పొన్నం

హైదరాబాద్‌,ఏప్రిల్‌6(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణకు భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ చేసిన ద్రోహానికి వెయ్యి గజాల లోతులో పాతిపెట్టాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు,ఉత్తమ్‌, పొన్నం ప్రభాకర్‌లు పిలుపునిచ్చారు. కరీంనగర్‌ పర్యటన సందర్భంగా ప్రభుత్వంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్లే రాష్ట్రంలో కరవు వచ్చిందని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ కెసిఆర్‌ తెచ్చిన కరువు అన్నారు. కేసీఆర్‌ హయాంలో మిషన్‌ భగీరథ పేరుతో రూ. వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. చేనేత కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందే కేసీఆర్‌ అని, మంత్రి పొన్నం ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులను సృష్టించిందే భారాస ప్రభుత్వమని అన్నారు. సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులను ఇంటికి భోజనానికి పిలిపించి చెప్పిన ఒక్క మాటైనా అమలు చేయలేదని విమర్శించారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ డిజైన్‌ మార్చిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. వరద కాల్వలు ఎండిపోవడానికి అప్పటి భారాస ప్రభుత్వమే కారణమని, నిపుణుల అభిప్రాయం మేరకే ప్రాజెక్టులపై ముందుకెళ్తామని అన్నారు. కృష్ణా జలాలను ఏపీ సీఎం జగన్‌ తీసుకుపోతుంటే కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన పాలనలోనే కృష్ణా జలాలను అక్రమంగా ఏపీకి తరలించారని ఆరోపించారు. రూ.90 వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టు కట్టలేకపోయావు. కేసీఆర్‌ చేసిన దోపిడీకి వేరే దేశాల్లో ఉరిశిక్ష వేస్తారు. ఉన్న నీటిని రైతులకు ఏవిధంగా ఉపయోగించాలో వారం వారం సవిూక్షిస్తున్నాం. వారి ఇబ్బందులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.  26 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. కేసీఆర్‌ పొగరు వల్లే భారాసకు అతి తక్కువ సీట్లు వచ్చాయని విమర్శించారు. ఆయన మాటలను ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదన్నారు.

Tags