కూలి పనికి వెళ్తున్న పద్మశ్రీ మొగులయ్య
On
కూలి పనికి వెళ్తున్న పద్మశ్రీ మొగులయ్య
హైదారాబాద్ మే 03:
కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ మొగులయ్య దీన స్థితిలో జీవితం గడుపుతున్నారు. పొట్ట కూటి కోసం దినసరి కూలీగా మారారు.
హైదరాబాద్ సమీపంలో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. ‘నా నెలవారీ గౌరవ వేతనం(రూ.10 వేలు) ఆగిపోయింది. కొడుకు మూర్ఛతో బాధపడుతున్నాడు. మా ఇద్దరికి మందుల కోసం నెలకు రూ.7,500 ఖర్చవుతోంది. నా కష్టాలపై అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరూ ఏమీ చేయడంలేదు' అని మొగులయ్య చెప్పారు.
Tags