లీగల్ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల ఏప్రిల్ 12 ( ప్రజా మంటలు ) :
జగిత్యాల జిల్లా లీగల్ సెల్ అధారిటీ ఆధ్వర్యంలో డా.బి ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి నీలిమ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి మాట్లాడుతూూ....
భారత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ అని రాజ్యాంగానికి లోబడి అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి.
ఈ దేశ మొదటి న్యాయశాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహించిన గొప్ప నాయకుడు అని అన్నారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ సివిల్ జడ్జి కె. ప్రసాద్, మొదటి జూనియర్ సివిల్ జడ్జి కుమారి శ్రీనిజ, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె. వినీల్, బార్ అద్యక్షులు డబ్బు లక్షమ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూమి రమణ కుమార్, సీనియర్ న్యాయవాదులు బండ భాస్కర్ రెడ్డి, వేంకటేశ్వర రావు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు.