శ్రీ నిలయంలో శ్రీయాగం - వసంత నవరాత్రి ఉత్సవాలు.

On
శ్రీ నిలయంలో శ్రీయాగం - వసంత నవరాత్రి ఉత్సవాలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

కరీంనగర్ ఏప్రిల్ 12( ప్రజా మంటలు ) : 

స్థానిక తిరుమల నగర్ లోని శ్రీ నిలయంలో వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.. మయూరగిరి పీఠాధిపతులు, నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో నాల్గవరోజు లక్ష్మీ అమ్మవారికి రామచంద్రస్వామికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించారు.

శ్రీయాగం మహా లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు..

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే..రామ నామము రాగద్వేషాలను తొలగిస్తుందని సకల శుభాలను కలిగిస్తుందని పండితులు పేర్కొన్నారు..

పలు ప్రాంతాల నుండి భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు..

ఈ కార్యక్రమంలో పండితులు రామకృష్ణ మాచార్యులు. వేణుగోపాలాచార్యులు, గోపి శర్మ, శివరామకృష్ణ శర్మ మొదలగు పండితులు పాల్గొన్నారు.

Tags