బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం.
- జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారం మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఏప్రిల్ 20 (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.....
*బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం*
ఏ ఇంటికి వెళ్లిన ప్రజలు స్పందిస్తూ ప్రతి ఒక్కరు మేమే కాదు మాతోపాటు ప్రతి ఒక్కరికి చెప్తూ జీవన్ అన్న గెలుపు కోసం మేము ఓట్లు వేపిస్తామని తెలుపుతున్నారు చాలా సంతోషంగా ఉంది
జీవన్ అన్న ఒక 40 సంవత్సరాలుగా జగిత్యాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు జీవన్ రెడ్డి ఎలా పనిచేస్తారు ఎలాంటి నాయకుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకే ఒక ఫోన్ కాల్ తో ఏ పని అయిన చేయిస్తారని జగిత్యాల ప్రజలకు అందరికీ తెలుసు
ఈ రోజు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటింటికి చెప్పడం జరిగింది ప్రతి ఒక మహిళ మాకు వస్తున్నాయి అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది
జగిత్యాలలో పిఎఫ్ ఆఫీస్ లేదు ఎన్నికల తదుపరి పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకువచ్చేలా కృషి చేస్తానని మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి తెలిపారు
మా మహిళలు బీడీ కార్మికులకు 230 రూపాయలు మజూరు వస్తుందని 300 రూపాయలు చేపిస్తానని జీవన్ రెడ్డి గారు తెలిపారు అలాగే బీడీ కార్మికులకు ఆసుపత్రి కూడా తీసుకొస్తానని తెలిపారు ఆ విషయంలో మహిళలంతా సంతోషం తెలియజేస్తున్నారు
జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడిన తదుపరి పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం దురదృష్టకరం పాస్పోర్ట్ కార్యాలయం కూడా జీవన్ రెడ్డి చొరవ తీసుకొని పాస్పోర్ట్ కార్యాలయం కూడా తీసుకువస్తానని తెలిపారు
గతంలో ఉన్న ఎంపీ గారు ఈ కార్యక్రమాలు చేపట్టాల్సింది కానీ ఎప్పుడూ కూడా శ్రద్ధ తీసుకోలేదు.
కానీ జీవన్ అన్న దృష్టికి రాగానే చొరవ తీసుకొని ఇవన్నీ తీసుకొస్తానని తెలిపారు
యావర్ రోడ్డు చాలా ప్రధానమైనది. ఆనాడు 40 ఫీట్లు ఉన్న యావర్ రోడ్డు 60 ఫీట్లు చేసింది జీవన్ రెడ్డి గారు ఈరోజు 100 ఫీట్లు చేసేది కూడా జీవన్ రెడ్డి గారు అందుకే మనం అందరం జీవన్ అన్నని గెలిపించుకోవాలి
37 వ వార్డులో కోర్ట్ శీను కౌన్సిలర్ ఉన్నప్పుడు జీవన్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడున్న రోడ్లు గాని డ్రైనేజీలు గాని ప్రతి ఒక్కటి జీవన్ అన్న హయాంలోనే జరిగింది
జీవన్ అన్న మాత్రమే అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాలు గాని మన నిరుపేదల సమస్యలు పరిష్కారానికి కానీ మనకు తోడుగా ఉంటారు కనుక మనం జీవన్ అన్నని గెలిపించుకోవాలి అని జగిత్యాల ప్రజానీకానికి కోరుతున్నాను.
More News...
<%- node_title %>
<%- node_title %>
సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ
చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్
హైదరాబాద్ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.
చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల... చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
ఆర్ఎన్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఉద్యోగులు కృష్ణజ్యోతి, కీర్తిల ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి ఎంసీహెచ్ విభాగంలో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణీలకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని ప్రతి... శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
నవ జాత శిశు సంరక్షణపై తల్లులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. గాంధీ మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రి (ఎంసీహెచ్) లో గైనకాలజీ, పిడియాట్రిక్ విభాగాల సంయుక్త నేతృత్వంలో న్యూబోర్న్ బేబీ వారోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం పలు అవేర్నెస్ కార్యక్రమాలు... దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ
ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు.
ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం మరియు భక్తి గీతం... ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత
ధర్మపురి నవంబర్ 21(ప్రజా మంటలు)
కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత అన్నారు.
శుక్రవారం ధర్మపురి మండలం రాజారాం , దమ్మన్నపేట్ మరియు దుబ్బల గూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాట్లాడుతూ... రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ని ఆహ్వానించారు.
రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ... క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కౌన్సిలింగ్ తో వృద్ధుల కేసులు పరిష్కారం..
జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు):
తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి... దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్
దుబాయ్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్.ఏ.ఎల్ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది.
విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ... కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ
గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు):
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం... ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో... 