హంపి విరూపాక్ష పీఠాధిపతులచే మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సంఘం క్రోధి నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ.

On
హంపి విరూపాక్ష పీఠాధిపతులచే మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సంఘం క్రోధి నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ.

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

హైదరాబాద్ ఏప్రిల్ 7( ప్రజా మంటలు)

సాయంత్రం 5 గంటలకు యతీoద్రులు హంపీ విరూపాక్ష పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారి కరకమలములచే మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి క్రోధినామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు బ్రహ్మశ్రీ దోర్బల కృష్ణమూర్తి శర్మ గారు ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ ఘణపురం రాంప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ వడ్గిచర్ల విష్ణుమూర్తి శర్మ, కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మశ్రీ సిరిసిల్ల రాంప్రసాద్ శర్మ, ముఖ్య సలహాదారు బ్రహ్మశ్రీ యలమంచివిఠలేశ్వర శర్మ, సంయుక్త కార్యదర్శులు బ్రహ్మ శ్రీ జోషి సత్యనారాయణ, శ్రీమతి కశోజ్జుల త్రివేణి, బ్రహ్మశ్రీ రాజనాల వెంకటేశ్వర శర్మ, యలమంచి చంద్రశేఖర శర్మ మరియు కార్యనిర్వాహక సభ్యులు బ్రహ్మశ్రీ మదునూరి మహాదేవ శర్మ,బ్రహ్మశ్రీ గోళ్ళ గోవర్ధన్ శర్మ, బ్రహ్మ శ్రీ విఠాలమురళీధర శర్మ,బ్రహ్మ శ్రీ దోమడాల విశ్వనాథ రావు, బ్రహ్మ శ్రీ రామొజ్జుల విజయ్ కుమార్ శర్మ హాజరైనారు.

Tags