కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం - పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం - పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి
కామారెడ్డి ఏప్రిల్ 28 :
పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) మృతి చెందారు.
కొద్ది రోజుల పాటు ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్లో హెడ్ కాని స్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న 1995 బ్యాచ్కు చెందిన శ్రీనివాస్ గౌడ్ నిన్న రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
గతంలో గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో సైతం హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేన్కు బదిలీపై వెళ్లారు.
శ్రీనివాస్ గౌడ్ సొంత గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ కాగా గతంలోనే వారి కుటుంబం కామారెడ్డి లో స్థిరపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మృతి పట్ల ఎల్లారెడ్డి పేట రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్ గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్, కోనరా వుపేట ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.