సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జిగా మాజీ గవర్నర్ తమిళి సై..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 993349493/9348422113)
హైదరాబాద్ ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఇవాళ్టి నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు..
ఆమె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
మంగళవారం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆమె తెలంగాణ లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ గవర్నర్ గా సుదీర్ఘ కాలం పని చేయడంతో ఆమెకున్న పరిచయాలు ఈ ఎన్నికల్లో ఉపయోగ పడతాయని పార్టీ భావిస్తుంది.
దీంతో తమిళి సై సౌందర్ రాజన్ ను సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్ఛార్జిగా నియమించారు.
సికింద్రాబాద్ లోనే ఆమె మకాం వేసి అక్కడ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారాన్ని నిర్వహించ నున్నారు. కిషన్ రెడ్డి గెలుపు బాధ్యతలను ఆమె భుజానకెత్తు కుంటున్నారు.
దీంతో, తమిళి సై సౌందర్ రాజన్ ప్రచారంతో కిషన్ రెడ్డి విజయావకాశాలు మరింత మెరుగు పడతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు..