ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ? అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

On
ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?  అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ? హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ? ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ?  రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?

అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మొదటి దశలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు దూరంగా ఉన్నారా ?

బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు బిజేపి నాయకులు పార్టీని విడుతున్నారు?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ?

హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ?

ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ? 

రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ప్రధాని ద్వంద నీతికి, ఆధికార దాహానికి ప్రతీకా?

బిజేపికి - ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో దూరం పేరుగుతుందా? 

సబ్ కా సాత్ – సబ్ కా సాత్ లో ముస్లింలు లేరా?

మొదటి దశలో తగ్గిన పోలింగ్ బిజేపికి వ్యతిరేకమా?

(మోడి ప్రసంగ ప్రభావం, బిజేపి భయానికి నిదర్శనమా .. పూర్తి విశ్లేషణ )

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు)

హైదరాబాద్ ఏప్రిల్ 23 :

మొదటి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే బిజేపికి అందిన సమాచారంతో , బిజేపి నాయకులలో అలజడి మొదలైనట్లు హిందీ రాష్ట్రాల నుండి వస్తున్న వార్తలు చేఉతున్నాయి. అందుకే మోడి కాంగ్రెస్ ను ముస్లింలకు లబ్ది చేకూర్చే పార్టీల అభివర్ణిస్తూ, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. రాజస్తాన్ సభలో మోడి చేసిన విద్వేష పోర్టియా ప్రసంగం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో, రెండు రోజులకే అలీగఢ్త్ సభలో హజ్ యాత్రికులకు లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పుకొన్నారు. రాజస్తాన్ లో చెప్పిన కాంగ్రెస్ మేనిఫెస్టో, ఉత్తర ప్రదేశ్ లో  వర్తించాడా లేక అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు వేరా అని చర్చించుకొంటూన్నారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం సహజం. గల్లీ లీడర్ నుండి డిల్లీ లీడర్ వరకు ఎదుటి పక్షం పై విమర్శలు చేయడం సహజం. కానీ వారి భాషలో, మాటలో కొంత తేడా ఉంటుంది. దేశ ప్రధాని స్థాయి నాయకుడు కూడా గల్లీ లీడర్ స్థాయిలో మాట్లాడితేనే దేశ ప్రజలకు అభ్యంతరం వ్యక్తం చేయని తప్పని సారి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వ గురువు స్థాయి నేత మాటలను దేశ ప్రజలే కాకుండా, విదేశ ప్రజలు, నాయకులు గమనిస్తారనే కనీస అవగాహన ఉండాలనుకోవడం అత్యాశ కాదు.

   రాజస్తాన్ లోని    బాన్స్ వాఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సభలో ఏప్రిల్ 21, ఆదివారం మాట్లాడిన మాటలు రాజకీయ, ప్రతిపక్ష నాయకులనే కాదు సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి.

కాంగ్రెస్ మంగళసూత్రాలను లాగేసుకొంటుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అందరి ఆస్తులను, చివరికి మంగళ సూత్రాలను కూడా లాక్కొని ఎక్కువ పిల్లలు ఉన్నా వారికి, రబాటుదారులకు(ముస్లింలకు) ఇస్తారని చెప్పడం, దిగజారిన రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ముందు నుండి  బిజేపికి, అందులో నరేంద్ర మోడీకి ముస్లిం లు అంటే మరీ ద్వేషమని అందరికీ తెలుసు.

రాజస్తాన్ లో మొదటి దశ పోలింగ్ జరిగిన 12 లోక సభ స్థానాలలో గతంలో కంటే దాదాపు 6 శాతం ఓటింగ్ తగ్గిందని లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాలలో ప్రజలు వోటు వేయడానికి సుముఖత చూపలేదని సమాచారం. బిజేపి, ఆర్ ఎస్ ఎస్  కార్యకర్తలు పోలింగ్ రోజు నిరాసక్తతతో, నిర్లిప్తంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా బిజేపికి అనుకున్న రీతిలో వోట్లు పడలేదని, గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేక పోతున్నట్లు నిఘా వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా, ఆదివాసీలు, ముస్లిములు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వోటు వేసినా, మద్యతరగతి ప్రజలు ఓటింగ్ పట్ల నిరాసక్తత చూపినట్లు తెలుస్తుంది.

నాగపూర్ ఆర్ ఎస్ ఎస్  కేంద్రంలో ఏం జరిగింది?

అంతకు ముందే అంటే ఏప్రిల్ 19 న నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన మోడిని, సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ కూడా కాలవలేదనే సమాచారం. ఒక రాత్రంతా నాగపూర్ లో ఉన్నా, నితిన్ గడ్కారీ ని కూడా కలవలేదు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్యలు ఎందుకు ప్రధానిని కాలవలేక పోయారు? ఆర్ ఎస్ ఎస్ తో ప్రధాని కి ఛేదిందా? ఇవన్నీ భేతాళ ప్రశ్నలే.  నాగపూర్ లో మోడి అనుకున్న రీతిలో, ఆర్ ఎస్ ఎస్ నుండి స్పందన రాలేదనే ప్రచారం జరుగుతుంది. అదే వేడిలో రాజస్తాన్ వచ్చిన మోడి, కాంగ్రెస్ పార్టీ “న్యాయ పత్ర” (మానిఫెస్టో)లో దేశ సంపాదనంతా ముస్లింలకే పంచుతారని, చివరికి మంగళ సూత్రాలను కూడా దక్కనీయరాని మాట్లాడారు.

నిజానికి “మంగళ సూత్రం: అనేది దక్షిణ భారత దేశ ప్రజల పవిత్రమైన భార్యాభర్తల బంధానికి ప్రతీక.  ఈ ఆచారం, మంగళసూత్రం కట్టడం అనేది ఉత్తర భారత దేశంలో లేనే లేదు. అక్కడ నుదుట కుంకుమ దిద్దాడమే ఆచారం. మరో రకమైన ఆచారం లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మారిన కాలంలో, సినిమా, సటివి సీరియల్ ల ప్రభావంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నగరాలలో మంగళ సూత్రం అనే దానికి కొంత ప్రాధాన్యత ఏర్పడుతుందని అనుకొంటున్నారు. లేని “మంగళ సూత్రం” ను కాంగ్రెస్ లాగేసుకొని, ముస్లిం లకు ఇస్తుందనడం, ప్రధాని లో ఏర్పడ్డ నిరాశ,నిస్పృహలకు నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.

అలిగఢ్ లో ముస్లింలపై  పొంగిన ప్రేమ

రెండు రోజుల్లో ప్రధాని మాటలలో మళ్ళీ ప్రేమ పొంగిపొరలడం, ఆయా ప్రాంతాలలో తమ అవసరాలకు అనుగుణంగా ముస్లింలను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారనడానికి, ఆయనకు ఎన్నికలు, వోట్లు, అధికారం కన్నా ఏది ప్రధానం కాదని మోడి అలిగఢ్ లో చేసిన ప్రసంగమే చెపుతుంది. రాజస్తాన్ లో ముస్లిం ల వోట్ల కన్నా హిందువుల వవట్లే ఎక్కువ. కానీ అలిగఢ్  చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల వోట్లు ఎక్కువ. వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రధాని మోడి “ హజ్ యాతరలో ముస్లిం మహిళలు, భారత దేశం నుండి పోయే వారికి సులువైన వీసా సౌకర్యం, ఎక్కువ కోటా” లాంటి  విషయాలలో తాను సౌదీ  దేశ అధికారుయాలతో, రాజుతో మాట్లాడి, భారతీయ ముస్లిం లకు ఎంతో మేలు చేసానని చెప్పుకొన్నారు.

వోట్ల కొరకు జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడరాని ఈ రెండు చోట్ల జరిగిన సభలలో ప్రధాని మోడి చేసిన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి.  మాట విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఎన్నికల నిబందనల ప్రకారం నిషేదం.  దీనిపై ఎన్నికల కమీషన్ కు వందలాది ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా, ఇలాంటి అన్నిరకాల బిజేపి ప్రచారాన్ని చూసి, చూడనట్లుగా ఉండడం ప్రజాస్వామ్యానికి చెడు అని పరిశీలకులు భావిస్తున్నారు.

 

----

 

 

 

 

Tags
Join WhatsApp

More News...

Local News 

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు   జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు  ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా...
Read More...
Local News 

జ్ఞాన  స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

జ్ఞాన  స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు .జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని  స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరి చరణ్ రావు మాట్లాడుతూ...
Read More...
Local News 

సంత్ రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ

సంత్ రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ "" జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)సంత్ రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని సామాజిక సమరసతా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో గల మోచి సంఘంలో సంఘ నాయకుల సమక్షంలో సంతు రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరించి క్యాలెండర్ తో పాటు అతని బోధనలతో కూడిన పుస్తకాన్ని కూడా సభ్యులందరికీ పంచటం...
Read More...
Local News 

సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా బాబు జగ్జీవన్ రామ్_జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా బాబు జగ్జీవన్ రామ్_జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)    డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి  సందర్భంగా  ఘన నివాళి  అర్పించిన జిల్లా ఎస్పీ  స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్  జయంతిని పురస్కరించుకొని  జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా...
Read More...
Local News 

జగిత్యాలలో నిజామాబాద్ రోడ్ పై వంతెన పనులు – ట్రాఫిక్ మళ్లింపు అమలు

జగిత్యాలలో నిజామాబాద్ రోడ్ పై వంతెన పనులు – ట్రాఫిక్ మళ్లింపు అమలు జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేలో హ్యాంగౌట్ హోటల్ సమీపంలో వంతెన నిర్మాణ పనులు ఏప్రిల్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు పోలీసులు మార్గ మళ్లింపులు అమలు చేస్తున్నారు.ముఖ్య మార్పులు ఇలా ఉన్నాయి:జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్లే RTC బస్సులు,...
Read More...
Local News  Crime 

గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు

గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు    గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):  బుగ్గారం మండలానికి  చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న  దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ  మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్  ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ...
Read More...
Local News 

ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య

ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఒంటరితనం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జంబుక ఆశన్న (78), తండ్రి గంగారం, ఎస్సీ మాల వర్గానికి చెందినవాడు.ఆశన్న గతంలో గ్రామ సుంకరి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2025...
Read More...
Local News 

బాబు జగ్జీవన్ సేవలు చిరస్మరనీయం -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు 

బాబు జగ్జీవన్ సేవలు చిరస్మరనీయం -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు  మెటుపల్లి ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )   బాబు జాగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరనీయం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. బార్ అసోసియేషన్ మరియు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్  119 వ జయంతి కార్మికుల...
Read More...
Local News 

ప్రజా ప్రతినిధుల శిక్షణ బుగ్గారంలోనే పెట్టాలి - చుక్క శ్రీలత

ప్రజా ప్రతినిధుల శిక్షణ బుగ్గారంలోనే పెట్టాలి - చుక్క శ్రీలత బుగ్గారం, ఏప్రిల్ 05(ప్రజా మంటలు):బుగ్గారం మండల కేంద్రాన్ని పక్కనబెట్టి శేఖల్లలో వార్డ్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల వార్డ్ సభ్యులు హాజరు కావాల్సిన ఈ శిక్షణను దూర ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.“ఇది...
Read More...
State News 

సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం - తెలంగాణ జాగృతి హెచ్చరిక

సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం - తెలంగాణ జాగృతి హెచ్చరిక హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి, hms కార్మిక సంఘం ఇతర స.మతాలతో కలిసి, నిర్వహించిన “సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి సంస్థపై ప్రభుత్వ వైఖరిని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. కార్మికుల నియామకాలపై విచారణ పేరుతో ఒత్తిడి చేయడం కంటే, ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్...
Read More...
Local News 

మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా? డిసిసి అధ్యక్షుడు నందయ్య

మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా? డిసిసి అధ్యక్షుడు నందయ్య జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు)మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా అని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య జీవన్ రెడ్డిని ఉద్దేశించి జిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై  విమర్శల అస్త్రాలు ఎక్కు పెట్టారు.కాంగ్రెస్...
Read More...
Local News 

2047 నాటికి తెలంగాణ టెక్స్‌టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.

2047 నాటికి తెలంగాణ టెక్స్‌టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. (సిరిసిల్ల .రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్ 03 ఏప్రిల్ (ప్రజా మంటలు) :  వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో...
Read More...