ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ? అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

On
ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?  అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ? హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ? ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ?  రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?

అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మొదటి దశలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు దూరంగా ఉన్నారా ?

బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు బిజేపి నాయకులు పార్టీని విడుతున్నారు?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ?

హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ?

ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ? 

రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ప్రధాని ద్వంద నీతికి, ఆధికార దాహానికి ప్రతీకా?

బిజేపికి - ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో దూరం పేరుగుతుందా? 

సబ్ కా సాత్ – సబ్ కా సాత్ లో ముస్లింలు లేరా?

మొదటి దశలో తగ్గిన పోలింగ్ బిజేపికి వ్యతిరేకమా?

(మోడి ప్రసంగ ప్రభావం, బిజేపి భయానికి నిదర్శనమా .. పూర్తి విశ్లేషణ )

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు)

హైదరాబాద్ ఏప్రిల్ 23 :

మొదటి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే బిజేపికి అందిన సమాచారంతో , బిజేపి నాయకులలో అలజడి మొదలైనట్లు హిందీ రాష్ట్రాల నుండి వస్తున్న వార్తలు చేఉతున్నాయి. అందుకే మోడి కాంగ్రెస్ ను ముస్లింలకు లబ్ది చేకూర్చే పార్టీల అభివర్ణిస్తూ, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. రాజస్తాన్ సభలో మోడి చేసిన విద్వేష పోర్టియా ప్రసంగం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో, రెండు రోజులకే అలీగఢ్త్ సభలో హజ్ యాత్రికులకు లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పుకొన్నారు. రాజస్తాన్ లో చెప్పిన కాంగ్రెస్ మేనిఫెస్టో, ఉత్తర ప్రదేశ్ లో  వర్తించాడా లేక అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు వేరా అని చర్చించుకొంటూన్నారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం సహజం. గల్లీ లీడర్ నుండి డిల్లీ లీడర్ వరకు ఎదుటి పక్షం పై విమర్శలు చేయడం సహజం. కానీ వారి భాషలో, మాటలో కొంత తేడా ఉంటుంది. దేశ ప్రధాని స్థాయి నాయకుడు కూడా గల్లీ లీడర్ స్థాయిలో మాట్లాడితేనే దేశ ప్రజలకు అభ్యంతరం వ్యక్తం చేయని తప్పని సారి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వ గురువు స్థాయి నేత మాటలను దేశ ప్రజలే కాకుండా, విదేశ ప్రజలు, నాయకులు గమనిస్తారనే కనీస అవగాహన ఉండాలనుకోవడం అత్యాశ కాదు.

   రాజస్తాన్ లోని    బాన్స్ వాఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సభలో ఏప్రిల్ 21, ఆదివారం మాట్లాడిన మాటలు రాజకీయ, ప్రతిపక్ష నాయకులనే కాదు సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి.

కాంగ్రెస్ మంగళసూత్రాలను లాగేసుకొంటుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అందరి ఆస్తులను, చివరికి మంగళ సూత్రాలను కూడా లాక్కొని ఎక్కువ పిల్లలు ఉన్నా వారికి, రబాటుదారులకు(ముస్లింలకు) ఇస్తారని చెప్పడం, దిగజారిన రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ముందు నుండి  బిజేపికి, అందులో నరేంద్ర మోడీకి ముస్లిం లు అంటే మరీ ద్వేషమని అందరికీ తెలుసు.

రాజస్తాన్ లో మొదటి దశ పోలింగ్ జరిగిన 12 లోక సభ స్థానాలలో గతంలో కంటే దాదాపు 6 శాతం ఓటింగ్ తగ్గిందని లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాలలో ప్రజలు వోటు వేయడానికి సుముఖత చూపలేదని సమాచారం. బిజేపి, ఆర్ ఎస్ ఎస్  కార్యకర్తలు పోలింగ్ రోజు నిరాసక్తతతో, నిర్లిప్తంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా బిజేపికి అనుకున్న రీతిలో వోట్లు పడలేదని, గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేక పోతున్నట్లు నిఘా వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా, ఆదివాసీలు, ముస్లిములు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వోటు వేసినా, మద్యతరగతి ప్రజలు ఓటింగ్ పట్ల నిరాసక్తత చూపినట్లు తెలుస్తుంది.

నాగపూర్ ఆర్ ఎస్ ఎస్  కేంద్రంలో ఏం జరిగింది?

అంతకు ముందే అంటే ఏప్రిల్ 19 న నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన మోడిని, సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ కూడా కాలవలేదనే సమాచారం. ఒక రాత్రంతా నాగపూర్ లో ఉన్నా, నితిన్ గడ్కారీ ని కూడా కలవలేదు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్యలు ఎందుకు ప్రధానిని కాలవలేక పోయారు? ఆర్ ఎస్ ఎస్ తో ప్రధాని కి ఛేదిందా? ఇవన్నీ భేతాళ ప్రశ్నలే.  నాగపూర్ లో మోడి అనుకున్న రీతిలో, ఆర్ ఎస్ ఎస్ నుండి స్పందన రాలేదనే ప్రచారం జరుగుతుంది. అదే వేడిలో రాజస్తాన్ వచ్చిన మోడి, కాంగ్రెస్ పార్టీ “న్యాయ పత్ర” (మానిఫెస్టో)లో దేశ సంపాదనంతా ముస్లింలకే పంచుతారని, చివరికి మంగళ సూత్రాలను కూడా దక్కనీయరాని మాట్లాడారు.

నిజానికి “మంగళ సూత్రం: అనేది దక్షిణ భారత దేశ ప్రజల పవిత్రమైన భార్యాభర్తల బంధానికి ప్రతీక.  ఈ ఆచారం, మంగళసూత్రం కట్టడం అనేది ఉత్తర భారత దేశంలో లేనే లేదు. అక్కడ నుదుట కుంకుమ దిద్దాడమే ఆచారం. మరో రకమైన ఆచారం లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మారిన కాలంలో, సినిమా, సటివి సీరియల్ ల ప్రభావంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నగరాలలో మంగళ సూత్రం అనే దానికి కొంత ప్రాధాన్యత ఏర్పడుతుందని అనుకొంటున్నారు. లేని “మంగళ సూత్రం” ను కాంగ్రెస్ లాగేసుకొని, ముస్లిం లకు ఇస్తుందనడం, ప్రధాని లో ఏర్పడ్డ నిరాశ,నిస్పృహలకు నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.

అలిగఢ్ లో ముస్లింలపై  పొంగిన ప్రేమ

రెండు రోజుల్లో ప్రధాని మాటలలో మళ్ళీ ప్రేమ పొంగిపొరలడం, ఆయా ప్రాంతాలలో తమ అవసరాలకు అనుగుణంగా ముస్లింలను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారనడానికి, ఆయనకు ఎన్నికలు, వోట్లు, అధికారం కన్నా ఏది ప్రధానం కాదని మోడి అలిగఢ్ లో చేసిన ప్రసంగమే చెపుతుంది. రాజస్తాన్ లో ముస్లిం ల వోట్ల కన్నా హిందువుల వవట్లే ఎక్కువ. కానీ అలిగఢ్  చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల వోట్లు ఎక్కువ. వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రధాని మోడి “ హజ్ యాతరలో ముస్లిం మహిళలు, భారత దేశం నుండి పోయే వారికి సులువైన వీసా సౌకర్యం, ఎక్కువ కోటా” లాంటి  విషయాలలో తాను సౌదీ  దేశ అధికారుయాలతో, రాజుతో మాట్లాడి, భారతీయ ముస్లిం లకు ఎంతో మేలు చేసానని చెప్పుకొన్నారు.

వోట్ల కొరకు జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడరాని ఈ రెండు చోట్ల జరిగిన సభలలో ప్రధాని మోడి చేసిన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి.  మాట విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఎన్నికల నిబందనల ప్రకారం నిషేదం.  దీనిపై ఎన్నికల కమీషన్ కు వందలాది ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా, ఇలాంటి అన్నిరకాల బిజేపి ప్రచారాన్ని చూసి, చూడనట్లుగా ఉండడం ప్రజాస్వామ్యానికి చెడు అని పరిశీలకులు భావిస్తున్నారు.

 

----

 

 

 

 

Tags
Join WhatsApp

More News...

Local News  Crime 

జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి,

జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి, జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జగిత్యాలకు చెందిన నవనీత్, సాయి తేజ, ధరూర్‌కు చెందిన సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల సందర్భంగా జగిత్యాలకు వచ్చారు....
Read More...
National  Comment  International  

యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి?

యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి? న్యూఢిల్లీ, జనవరి 17: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీ ల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాల నేపధ్యంలో ఈ పర్యటన వెనుక గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ...
Read More...
National  State News 

పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన

పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన న్యూఢిల్లీ, జనవరి 17 (ప్రజా మంటలు): తమిళనాడు కాంగ్రెస్ నాయకులు కూటములు, సీట్ల పంపకం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వప్పెరుంధగై వెల్లడించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పూర్తిగా అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ...
Read More...
State News 

రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి 

రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి  వివరాలు వెల్లడించిన గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్ సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):  రాష్ర్టంలో కొత్తగా రాజకీయ కూటమి ఏర్పాటు అయింది. తెలంగాణ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) లో నమోదైన తొమ్మిది రాజకీయ పార్టీలు కలసి కొత్తగా తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాజకీయ కూటమి కి సంబందించిన వివరాలను కూటమి...
Read More...
National  Comment  International  

అమెరికా కు వ్యతిరేకంగా డెన్మార్క్ ప్రజల నిరసన ప్రదర్శనలు

అమెరికా కు వ్యతిరేకంగా డెన్మార్క్ ప్రజల నిరసన ప్రదర్శనలు కోపెన్‌హేగెన్, జనవరి 17 : విరోధ భావాలతో వేలాది ప్రజలు డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగెన్‌లో రోడ్డులకు దిగారు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనంగా పొందాలని పునఃప్రచారం చేస్తున్నారని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్టిక్ ద్వీపం స్వయంప్రభుత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆదేశం దేనికి సరిపోయేది కాదని నిరూపించాలని అక్కడి ప్రజలు తీవ్రంగా...
Read More...

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు): గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె...
Read More...

జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల

జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల    జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)   జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు అధ్యక్షతన జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహకపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ , కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ , జగిత్యాల జిల్లా బీఆర్ఎస్...
Read More...
State News 

లక్ష్యం ఉన్నతంగా ఉండాలి – చదువే జీవితాన్ని మార్చుతుంది – సీఎం రేవంత్ రెడ్డి

లక్ష్యం ఉన్నతంగా ఉండాలి – చదువే జీవితాన్ని మార్చుతుంది – సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు): లక్ష్యం ఉన్నతంగా పెట్టుకుని కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ...
Read More...
Local News  State News 

అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ–బీఆర్ఎస్ – డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ–బీఆర్ఎస్ – డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్, జనవరి 17 (ప్రజా మంటలు): బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనలో కరీంనగర్ నగరంలో అభివృద్ధి జరగలేదని, అవినీతే రాజ్యమేలిందని డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అవినీతి కవలలుగా మారి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాయని విమర్శించారు. నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కరీంనగర్ అసెంబ్లీ...
Read More...
Local News 

మెటుపల్లి మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

మెటుపల్లి మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు మెటుపల్లి, జనవరి 17 (ప్రజా మంటలు): మెటుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులకు సంబంధించి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వర్గాల వారీగా వార్డుల విభజన ఈ విధంగా ఉంది. జనరల్ (ఓపెన్) వార్డులు వార్డు నంబర్లు 01, 03, 17, 21, 23 మొత్తం : 5 వార్డులు జనరల్ – మహిళ వార్డులు వార్డు...
Read More...
State News 

తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు: వర్గాలవారిగా రిజర్వేషన్ల వివరాలు

 తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు: వర్గాలవారిగా రిజర్వేషన్ల వివరాలు హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ పదవులుBC, SC, మహిళ (Women), జనరల్ (Unreserved) — వర్గాల వారీగా విడివిడిగా జాబితాలు  ) BC (బీసీ) కేటగిరీ – మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు 🔹 BC మహిళ మున్సిపాలిటీ ఎల్లందు జగిత్యాల కామారెడ్డి బాన్సువాడ...
Read More...
State News 

జగిత్యాల బిసి మహిళా, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ, రాయికల్, మెటుపల్లి జనరల్ చైర్మన్ సీట్లు

జగిత్యాల బిసి మహిళా,  కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ, రాయికల్, మెటుపల్లి జనరల్ చైర్మన్ సీట్లు హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం వర్గాల వారీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ST, SC, BC, అన్‌రిజర్వ్డ్ (జనరల్ + మహిళ) కేటగిరీల్లో మున్సిపాలిటీలను కేటాయించింది. జగిత్యాల బిసి మహిళకు, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళకు, రాయికల్, మెటుపల్లి జనరల్...
Read More...