ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ? అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?
మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ? హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ? ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ? రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?
ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?
అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?
మొదటి దశలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు దూరంగా ఉన్నారా ?
బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు బిజేపి నాయకులు పార్టీని విడుతున్నారు?
మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ?
హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ?
ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ?
రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?
ప్రధాని ద్వంద నీతికి, ఆధికార దాహానికి ప్రతీకా?
బిజేపికి - ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో దూరం పేరుగుతుందా?
సబ్ కా సాత్ – సబ్ కా సాత్ లో ముస్లింలు లేరా?
మొదటి దశలో తగ్గిన పోలింగ్ బిజేపికి వ్యతిరేకమా?
(మోడి ప్రసంగ ప్రభావం, బిజేపి భయానికి నిదర్శనమా .. పూర్తి విశ్లేషణ )
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ ఏప్రిల్ 23 :
మొదటి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే బిజేపికి అందిన సమాచారంతో , బిజేపి నాయకులలో అలజడి మొదలైనట్లు హిందీ రాష్ట్రాల నుండి వస్తున్న వార్తలు చేఉతున్నాయి. అందుకే మోడి కాంగ్రెస్ ను ముస్లింలకు లబ్ది చేకూర్చే పార్టీల అభివర్ణిస్తూ, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. రాజస్తాన్ సభలో మోడి చేసిన విద్వేష పోర్టియా ప్రసంగం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో, రెండు రోజులకే అలీగఢ్త్ సభలో హజ్ యాత్రికులకు లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పుకొన్నారు. రాజస్తాన్ లో చెప్పిన కాంగ్రెస్ మేనిఫెస్టో, ఉత్తర ప్రదేశ్ లో వర్తించాడా లేక అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు వేరా అని చర్చించుకొంటూన్నారు.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం సహజం. గల్లీ లీడర్ నుండి డిల్లీ లీడర్ వరకు ఎదుటి పక్షం పై విమర్శలు చేయడం సహజం. కానీ వారి భాషలో, మాటలో కొంత తేడా ఉంటుంది. దేశ ప్రధాని స్థాయి నాయకుడు కూడా గల్లీ లీడర్ స్థాయిలో మాట్లాడితేనే దేశ ప్రజలకు అభ్యంతరం వ్యక్తం చేయని తప్పని సారి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వ గురువు స్థాయి నేత మాటలను దేశ ప్రజలే కాకుండా, విదేశ ప్రజలు, నాయకులు గమనిస్తారనే కనీస అవగాహన ఉండాలనుకోవడం అత్యాశ కాదు.
రాజస్తాన్ లోని బాన్స్ వాఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సభలో ఏప్రిల్ 21, ఆదివారం మాట్లాడిన మాటలు రాజకీయ, ప్రతిపక్ష నాయకులనే కాదు సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి.
కాంగ్రెస్ మంగళసూత్రాలను లాగేసుకొంటుందా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అందరి ఆస్తులను, చివరికి మంగళ సూత్రాలను కూడా లాక్కొని ఎక్కువ పిల్లలు ఉన్నా వారికి, రబాటుదారులకు(ముస్లింలకు) ఇస్తారని చెప్పడం, దిగజారిన రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముందు నుండి బిజేపికి, అందులో నరేంద్ర మోడీకి ముస్లిం లు అంటే మరీ ద్వేషమని అందరికీ తెలుసు.
రాజస్తాన్ లో మొదటి దశ పోలింగ్ జరిగిన 12 లోక సభ స్థానాలలో గతంలో కంటే దాదాపు 6 శాతం ఓటింగ్ తగ్గిందని లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాలలో ప్రజలు వోటు వేయడానికి సుముఖత చూపలేదని సమాచారం. బిజేపి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు పోలింగ్ రోజు నిరాసక్తతతో, నిర్లిప్తంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా బిజేపికి అనుకున్న రీతిలో వోట్లు పడలేదని, గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేక పోతున్నట్లు నిఘా వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా, ఆదివాసీలు, ముస్లిములు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వోటు వేసినా, మద్యతరగతి ప్రజలు ఓటింగ్ పట్ల నిరాసక్తత చూపినట్లు తెలుస్తుంది.
నాగపూర్ ఆర్ ఎస్ ఎస్ కేంద్రంలో ఏం జరిగింది?
అంతకు ముందే అంటే ఏప్రిల్ 19 న నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన మోడిని, సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ కూడా కాలవలేదనే సమాచారం. ఒక రాత్రంతా నాగపూర్ లో ఉన్నా, నితిన్ గడ్కారీ ని కూడా కలవలేదు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్యలు ఎందుకు ప్రధానిని కాలవలేక పోయారు? ఆర్ ఎస్ ఎస్ తో ప్రధాని కి ఛేదిందా? ఇవన్నీ భేతాళ ప్రశ్నలే. నాగపూర్ లో మోడి అనుకున్న రీతిలో, ఆర్ ఎస్ ఎస్ నుండి స్పందన రాలేదనే ప్రచారం జరుగుతుంది. అదే వేడిలో రాజస్తాన్ వచ్చిన మోడి, కాంగ్రెస్ పార్టీ “న్యాయ పత్ర” (మానిఫెస్టో)లో దేశ సంపాదనంతా ముస్లింలకే పంచుతారని, చివరికి మంగళ సూత్రాలను కూడా దక్కనీయరాని మాట్లాడారు.
నిజానికి “మంగళ సూత్రం: అనేది దక్షిణ భారత దేశ ప్రజల పవిత్రమైన భార్యాభర్తల బంధానికి ప్రతీక. ఈ ఆచారం, మంగళసూత్రం కట్టడం అనేది ఉత్తర భారత దేశంలో లేనే లేదు. అక్కడ నుదుట కుంకుమ దిద్దాడమే ఆచారం. మరో రకమైన ఆచారం లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మారిన కాలంలో, సినిమా, సటివి సీరియల్ ల ప్రభావంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నగరాలలో మంగళ సూత్రం అనే దానికి కొంత ప్రాధాన్యత ఏర్పడుతుందని అనుకొంటున్నారు. లేని “మంగళ సూత్రం” ను కాంగ్రెస్ లాగేసుకొని, ముస్లిం లకు ఇస్తుందనడం, ప్రధాని లో ఏర్పడ్డ నిరాశ,నిస్పృహలకు నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.
అలిగఢ్ లో ముస్లింలపై పొంగిన ప్రేమ
రెండు రోజుల్లో ప్రధాని మాటలలో మళ్ళీ ప్రేమ పొంగిపొరలడం, ఆయా ప్రాంతాలలో తమ అవసరాలకు అనుగుణంగా ముస్లింలను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారనడానికి, ఆయనకు ఎన్నికలు, వోట్లు, అధికారం కన్నా ఏది ప్రధానం కాదని మోడి అలిగఢ్ లో చేసిన ప్రసంగమే చెపుతుంది. రాజస్తాన్ లో ముస్లిం ల వోట్ల కన్నా హిందువుల వవట్లే ఎక్కువ. కానీ అలిగఢ్ చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల వోట్లు ఎక్కువ. వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రధాని మోడి “ హజ్ యాతరలో ముస్లిం మహిళలు, భారత దేశం నుండి పోయే వారికి సులువైన వీసా సౌకర్యం, ఎక్కువ కోటా” లాంటి విషయాలలో తాను సౌదీ దేశ అధికారుయాలతో, రాజుతో మాట్లాడి, భారతీయ ముస్లిం లకు ఎంతో మేలు చేసానని చెప్పుకొన్నారు.
వోట్ల కొరకు జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడరాని ఈ రెండు చోట్ల జరిగిన సభలలో ప్రధాని మోడి చేసిన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. మాట విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఎన్నికల నిబందనల ప్రకారం నిషేదం. దీనిపై ఎన్నికల కమీషన్ కు వందలాది ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా, ఇలాంటి అన్నిరకాల బిజేపి ప్రచారాన్ని చూసి, చూడనట్లుగా ఉండడం ప్రజాస్వామ్యానికి చెడు అని పరిశీలకులు భావిస్తున్నారు.
----
More News...
<%- node_title %>
<%- node_title %>
"చల్ ఉరుకుండ్రి..! వాస్తవ కథనం
అల్లే రమేష్.సిరిసిల్ల :సెల్: 9030391963.
కుర్చిలకుసోనిబాపు సోచైస్తుండు.ఇంతాజేసిన వంగుతలేరు.ఎంత మర్శిపోధమన్నా కోడి కండ్ల ముందే మెదులుతుంది.బాపు గిట్ల జేస్తుండేదని కిందోల్లంతా మాడుపు మొకాం పెట్టుకున్నారు. ఎన్నిజేయల్నో అన్ని జేసిన ఇగ ఇప్పుడు ఏం జేయలే...అసలే ముంగిట పెద్దుర్ల్ల జాతరలు ఉ ఉన్నాయీ బాపు మనుసుల లేదు.ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.ఇంతట్ల చేయికింది ఉత్తయ్యి ఉరుకుంటొచ్చిండు. బాపు
మునుపటి... వంగర పోలీస్ స్టేషన్లో ఏసీపీ వార్షిక తనిఖీలు
స్వాగతం పలికిన ఎస్సై దివ్య పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలో మూడో విడత జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు మండల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటరు... గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_ 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ నేటితో ముగింపు
రాయికల్ డిసెంబర్ 2 (ప్రజా మంటలు)-నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్ బోర్డుపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయి, అలాగే నామినేషన్ల... కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం
కొండగట్టు డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)
ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకర సంఘటన బాధాకరమైన విషయమని మాకు చేతనైన సహాయాన్ని అందజేస్తున్నామని మేము అందజేసిన నగదు ద్వారా మళ్లీ చిరు వ్యాపారాన్ని కొనసాగించుకొని వారి జీవితాలను ముందుకు సాగించుకునే ప్రక్రియ కు తోడ్పడాలని కోరుకుంటూ ప్రజలంతా ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించకుండా... రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం
మెట్ పెల్లి డిసెంబర్ 2(ప్రజా మంటలు)(సౌడాల కమలాకర్)
రెడ్ కో జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ ను ప్రభుత్వం నియమించింది. కాగా
ఈ పదవిలో అతను ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి... Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ
న్యూ ఢిల్లీ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
భారత ప్రభుత్వం 2026 మార్చి నుంచి మార్కెట్లో అమ్మకానికి వచ్చే అన్ని స్మార్ట్ఫోన్లలో Sanchar Saathi యాప్ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలని టెలికం శాఖ (DoT) ఇచ్చిన తాజా ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వినియోగదారుల గోప్యత, డిజిటల్ ఫ్రీడమ్, ఫోన్ కంపెనీల విధానాలు వంటి... పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి
నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం(డిసెంబర్ 2వ తేదీ )
--డాక్టర్. వై. సంజీవ కుమార్, ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్. 9393613555,9493613555.
సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో... తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రక్తదానం చేసి, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, యువతను ఉత్సాహపరచారు.
కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం... రేపు హుస్నాబాద్లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ
హుస్నాబాద్, డిసెంబర్ 3, 2025 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ పట్టణం మరో భారీ కాంగ్రెస్ శక్తి ప్రదర్శనకు సాక్ష్యమవుతోంది. బుధవారం (03-12-2025) జరుగనున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
సీఎం హోదాలో మొదటిసారి హుస్నాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి, ఏమిస్టారో అని సామాన్యులే... గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ
సికింద్రాబాద్, డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతిని మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.బిజెపి నాయకులు... సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము దొంగల మర్రి చెక్పోస్ట్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
,
మల్యాల డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు. కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా... 