ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ? అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

On
ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?  అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ? హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ? ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ?  రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?

అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మొదటి దశలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు దూరంగా ఉన్నారా ?

బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు బిజేపి నాయకులు పార్టీని విడుతున్నారు?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ?

హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ?

ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ? 

రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ప్రధాని ద్వంద నీతికి, ఆధికార దాహానికి ప్రతీకా?

బిజేపికి - ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో దూరం పేరుగుతుందా? 

సబ్ కా సాత్ – సబ్ కా సాత్ లో ముస్లింలు లేరా?

మొదటి దశలో తగ్గిన పోలింగ్ బిజేపికి వ్యతిరేకమా?

(మోడి ప్రసంగ ప్రభావం, బిజేపి భయానికి నిదర్శనమా .. పూర్తి విశ్లేషణ )

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు)

హైదరాబాద్ ఏప్రిల్ 23 :

మొదటి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే బిజేపికి అందిన సమాచారంతో , బిజేపి నాయకులలో అలజడి మొదలైనట్లు హిందీ రాష్ట్రాల నుండి వస్తున్న వార్తలు చేఉతున్నాయి. అందుకే మోడి కాంగ్రెస్ ను ముస్లింలకు లబ్ది చేకూర్చే పార్టీల అభివర్ణిస్తూ, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. రాజస్తాన్ సభలో మోడి చేసిన విద్వేష పోర్టియా ప్రసంగం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో, రెండు రోజులకే అలీగఢ్త్ సభలో హజ్ యాత్రికులకు లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పుకొన్నారు. రాజస్తాన్ లో చెప్పిన కాంగ్రెస్ మేనిఫెస్టో, ఉత్తర ప్రదేశ్ లో  వర్తించాడా లేక అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు వేరా అని చర్చించుకొంటూన్నారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం సహజం. గల్లీ లీడర్ నుండి డిల్లీ లీడర్ వరకు ఎదుటి పక్షం పై విమర్శలు చేయడం సహజం. కానీ వారి భాషలో, మాటలో కొంత తేడా ఉంటుంది. దేశ ప్రధాని స్థాయి నాయకుడు కూడా గల్లీ లీడర్ స్థాయిలో మాట్లాడితేనే దేశ ప్రజలకు అభ్యంతరం వ్యక్తం చేయని తప్పని సారి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వ గురువు స్థాయి నేత మాటలను దేశ ప్రజలే కాకుండా, విదేశ ప్రజలు, నాయకులు గమనిస్తారనే కనీస అవగాహన ఉండాలనుకోవడం అత్యాశ కాదు.

   రాజస్తాన్ లోని    బాన్స్ వాఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సభలో ఏప్రిల్ 21, ఆదివారం మాట్లాడిన మాటలు రాజకీయ, ప్రతిపక్ష నాయకులనే కాదు సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి.

కాంగ్రెస్ మంగళసూత్రాలను లాగేసుకొంటుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అందరి ఆస్తులను, చివరికి మంగళ సూత్రాలను కూడా లాక్కొని ఎక్కువ పిల్లలు ఉన్నా వారికి, రబాటుదారులకు(ముస్లింలకు) ఇస్తారని చెప్పడం, దిగజారిన రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ముందు నుండి  బిజేపికి, అందులో నరేంద్ర మోడీకి ముస్లిం లు అంటే మరీ ద్వేషమని అందరికీ తెలుసు.

రాజస్తాన్ లో మొదటి దశ పోలింగ్ జరిగిన 12 లోక సభ స్థానాలలో గతంలో కంటే దాదాపు 6 శాతం ఓటింగ్ తగ్గిందని లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాలలో ప్రజలు వోటు వేయడానికి సుముఖత చూపలేదని సమాచారం. బిజేపి, ఆర్ ఎస్ ఎస్  కార్యకర్తలు పోలింగ్ రోజు నిరాసక్తతతో, నిర్లిప్తంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా బిజేపికి అనుకున్న రీతిలో వోట్లు పడలేదని, గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేక పోతున్నట్లు నిఘా వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా, ఆదివాసీలు, ముస్లిములు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వోటు వేసినా, మద్యతరగతి ప్రజలు ఓటింగ్ పట్ల నిరాసక్తత చూపినట్లు తెలుస్తుంది.

నాగపూర్ ఆర్ ఎస్ ఎస్  కేంద్రంలో ఏం జరిగింది?

అంతకు ముందే అంటే ఏప్రిల్ 19 న నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన మోడిని, సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ కూడా కాలవలేదనే సమాచారం. ఒక రాత్రంతా నాగపూర్ లో ఉన్నా, నితిన్ గడ్కారీ ని కూడా కలవలేదు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్యలు ఎందుకు ప్రధానిని కాలవలేక పోయారు? ఆర్ ఎస్ ఎస్ తో ప్రధాని కి ఛేదిందా? ఇవన్నీ భేతాళ ప్రశ్నలే.  నాగపూర్ లో మోడి అనుకున్న రీతిలో, ఆర్ ఎస్ ఎస్ నుండి స్పందన రాలేదనే ప్రచారం జరుగుతుంది. అదే వేడిలో రాజస్తాన్ వచ్చిన మోడి, కాంగ్రెస్ పార్టీ “న్యాయ పత్ర” (మానిఫెస్టో)లో దేశ సంపాదనంతా ముస్లింలకే పంచుతారని, చివరికి మంగళ సూత్రాలను కూడా దక్కనీయరాని మాట్లాడారు.

నిజానికి “మంగళ సూత్రం: అనేది దక్షిణ భారత దేశ ప్రజల పవిత్రమైన భార్యాభర్తల బంధానికి ప్రతీక.  ఈ ఆచారం, మంగళసూత్రం కట్టడం అనేది ఉత్తర భారత దేశంలో లేనే లేదు. అక్కడ నుదుట కుంకుమ దిద్దాడమే ఆచారం. మరో రకమైన ఆచారం లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మారిన కాలంలో, సినిమా, సటివి సీరియల్ ల ప్రభావంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నగరాలలో మంగళ సూత్రం అనే దానికి కొంత ప్రాధాన్యత ఏర్పడుతుందని అనుకొంటున్నారు. లేని “మంగళ సూత్రం” ను కాంగ్రెస్ లాగేసుకొని, ముస్లిం లకు ఇస్తుందనడం, ప్రధాని లో ఏర్పడ్డ నిరాశ,నిస్పృహలకు నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.

అలిగఢ్ లో ముస్లింలపై  పొంగిన ప్రేమ

రెండు రోజుల్లో ప్రధాని మాటలలో మళ్ళీ ప్రేమ పొంగిపొరలడం, ఆయా ప్రాంతాలలో తమ అవసరాలకు అనుగుణంగా ముస్లింలను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారనడానికి, ఆయనకు ఎన్నికలు, వోట్లు, అధికారం కన్నా ఏది ప్రధానం కాదని మోడి అలిగఢ్ లో చేసిన ప్రసంగమే చెపుతుంది. రాజస్తాన్ లో ముస్లిం ల వోట్ల కన్నా హిందువుల వవట్లే ఎక్కువ. కానీ అలిగఢ్  చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల వోట్లు ఎక్కువ. వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రధాని మోడి “ హజ్ యాతరలో ముస్లిం మహిళలు, భారత దేశం నుండి పోయే వారికి సులువైన వీసా సౌకర్యం, ఎక్కువ కోటా” లాంటి  విషయాలలో తాను సౌదీ  దేశ అధికారుయాలతో, రాజుతో మాట్లాడి, భారతీయ ముస్లిం లకు ఎంతో మేలు చేసానని చెప్పుకొన్నారు.

వోట్ల కొరకు జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడరాని ఈ రెండు చోట్ల జరిగిన సభలలో ప్రధాని మోడి చేసిన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి.  మాట విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఎన్నికల నిబందనల ప్రకారం నిషేదం.  దీనిపై ఎన్నికల కమీషన్ కు వందలాది ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా, ఇలాంటి అన్నిరకాల బిజేపి ప్రచారాన్ని చూసి, చూడనట్లుగా ఉండడం ప్రజాస్వామ్యానికి చెడు అని పరిశీలకులు భావిస్తున్నారు.

 

----

 

 

 

 

Tags

More News...

Local News 

ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ధర్మపురి మం ఢిల్లీ ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేయాలని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్  *కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేయగా దాన్ని తరలించకుండ...
Read More...
Local News 

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మం అంబర్ పేట గ్రామములో కొండపై స్వయంభుగా వెలసినశ్రీవేంకటేశ్వర స్వామి వారి 25 వ వార్షిక బ్రహ్మోత్సవాలు  లో భాగంగా  మంగళవారం రెండవ రోజులో భాగంగా ఘనంగానిర్వహించిన కార్యక్రమాలు విశ్వక్సేన విధి వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురారోపణ ముత్సాంగ్గ్రహణం, ఆచార్య రిత్వికరణం, వైనతేయ ప్రతిష్టా విధి...
Read More...
Local News  State News 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు పదేళ్ల కాలంలో రైతులకు బీ.ఆర్.ఎస్. చేసిందేమీ లేదు  - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి  హైదరాబాద్ ఫిబ్రవరి 11: కాంగ్రెస్...
Read More...
Local News 

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి  సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 ( సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి,రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్​ రెడ్డి మంగళవారం సందర్శించారు. తైపూసం పాల్గుడి కావడి పౌర్ణమి వేడుకల సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మర్రిశశిధర్​ రెడ్డిని శాలువాతో...
Read More...
Local News 

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం సికింద్రాబాద్​, ఫిబ్రవరి 11 ( ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యునిటీ హాలులో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.  రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైయిన్ బో కమ్యూనిటీ కేర్...
Read More...

#Draft: Add Your Title

#Draft: Add Your Title మహాంకాళి పీఎస్​ పరిధిలో యువతి మిస్సింగ్​సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ మహాంకాళి పీఎస్​ పరిధిలో ఓ యువతి మిస్సింగ్​ అయింది. ఇన్​స్పెక్టర్​ పరశురామ్​ తెలిపిన వివరాల ప్రకారం..సుభాష్​ నగర్​ కు చెందిన బట్టిన్వర్​ నేహా(19) ప్యాట్నీ సెంటర్​ లోని చెన్నై షాపింగ్​ మాల్​ లో సేల్స్​ గర్ల్​ గా పనిచేస్తోంది. ఈనెల...
Read More...
Local News 

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు) : పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో మంగళవారం తైపూసం పాలకావడి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, శ్రీసుబ్రహ్మాణ్యస్వామి వార్లను దర్శించుకున్నారు. భుజాన పాల కలశంతో కూడిన కావడిని ఎత్తుకొని ఆలయం చుట్టు ప్రదక్షిణ...
Read More...
Local News 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్  ▪️ జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)  హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్  తెలంగాణ మైనార్టీ జూనియర్ కాలేజ్ విద్యార్థి  ఎండీ అయా నొద్దీన్ ( ఏం పీ సి 1 సం:) గోల్డ్ మెడల్ సాధించినందుకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  గారు అభినందించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ జూనియర్ కళాశాల...
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పురాని పేట , బోయవాడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో హాజరు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ  కి ఆహ్వాన పత్రిక అందజేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి...
Read More...
National  International   State News 

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి అమెరికా విదేశీ అవినీతి చట్టాన్ని ట్రంప్ సస్పెండ్ చేశారు; అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ అధికారులకు లంచం ఇవ్వకుండా అమెరికా కంపెనీలు నిషేధించే చట్టం అమలును నిలిపివేయడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన తర్వాత,...
Read More...