ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ? అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

On
ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?  అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ? హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ? ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ?  రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ఉత్తర భారతాన పట్టు తప్పుతున్న బిజేపి చాణక్యం ?

అధికారానికి దూరం అవుతామనే మోడి భయమా?

మొదటి దశలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు దూరంగా ఉన్నారా ?

బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎందుకు బిజేపి నాయకులు పార్టీని విడుతున్నారు?

మళ్ళీ ఎందుకు ముస్లింల ప్రస్తావన ?

హజ్ యాత్రికులకు ఎందుకు మరిన్ని సౌకర్యాలు ?

ఎక్కువ హజ్ వీసాల కొరకు మోడి ప్రయత్నం ? 

రాజస్తాన్ లో ముస్లింలపై ద్వేషం – అలీగఢ్ ముస్లింలపై ప్రేమ ?

ప్రధాని ద్వంద నీతికి, ఆధికార దాహానికి ప్రతీకా?

బిజేపికి - ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో దూరం పేరుగుతుందా? 

సబ్ కా సాత్ – సబ్ కా సాత్ లో ముస్లింలు లేరా?

మొదటి దశలో తగ్గిన పోలింగ్ బిజేపికి వ్యతిరేకమా?

(మోడి ప్రసంగ ప్రభావం, బిజేపి భయానికి నిదర్శనమా .. పూర్తి విశ్లేషణ )

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు)

హైదరాబాద్ ఏప్రిల్ 23 :

మొదటి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే బిజేపికి అందిన సమాచారంతో , బిజేపి నాయకులలో అలజడి మొదలైనట్లు హిందీ రాష్ట్రాల నుండి వస్తున్న వార్తలు చేఉతున్నాయి. అందుకే మోడి కాంగ్రెస్ ను ముస్లింలకు లబ్ది చేకూర్చే పార్టీల అభివర్ణిస్తూ, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. రాజస్తాన్ సభలో మోడి చేసిన విద్వేష పోర్టియా ప్రసంగం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో, రెండు రోజులకే అలీగఢ్త్ సభలో హజ్ యాత్రికులకు లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పుకొన్నారు. రాజస్తాన్ లో చెప్పిన కాంగ్రెస్ మేనిఫెస్టో, ఉత్తర ప్రదేశ్ లో  వర్తించాడా లేక అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు వేరా అని చర్చించుకొంటూన్నారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం సహజం. గల్లీ లీడర్ నుండి డిల్లీ లీడర్ వరకు ఎదుటి పక్షం పై విమర్శలు చేయడం సహజం. కానీ వారి భాషలో, మాటలో కొంత తేడా ఉంటుంది. దేశ ప్రధాని స్థాయి నాయకుడు కూడా గల్లీ లీడర్ స్థాయిలో మాట్లాడితేనే దేశ ప్రజలకు అభ్యంతరం వ్యక్తం చేయని తప్పని సారి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వ గురువు స్థాయి నేత మాటలను దేశ ప్రజలే కాకుండా, విదేశ ప్రజలు, నాయకులు గమనిస్తారనే కనీస అవగాహన ఉండాలనుకోవడం అత్యాశ కాదు.

   రాజస్తాన్ లోని    బాన్స్ వాఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సభలో ఏప్రిల్ 21, ఆదివారం మాట్లాడిన మాటలు రాజకీయ, ప్రతిపక్ష నాయకులనే కాదు సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి.

కాంగ్రెస్ మంగళసూత్రాలను లాగేసుకొంటుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అందరి ఆస్తులను, చివరికి మంగళ సూత్రాలను కూడా లాక్కొని ఎక్కువ పిల్లలు ఉన్నా వారికి, రబాటుదారులకు(ముస్లింలకు) ఇస్తారని చెప్పడం, దిగజారిన రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ముందు నుండి  బిజేపికి, అందులో నరేంద్ర మోడీకి ముస్లిం లు అంటే మరీ ద్వేషమని అందరికీ తెలుసు.

రాజస్తాన్ లో మొదటి దశ పోలింగ్ జరిగిన 12 లోక సభ స్థానాలలో గతంలో కంటే దాదాపు 6 శాతం ఓటింగ్ తగ్గిందని లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాలలో ప్రజలు వోటు వేయడానికి సుముఖత చూపలేదని సమాచారం. బిజేపి, ఆర్ ఎస్ ఎస్  కార్యకర్తలు పోలింగ్ రోజు నిరాసక్తతతో, నిర్లిప్తంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా బిజేపికి అనుకున్న రీతిలో వోట్లు పడలేదని, గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేక పోతున్నట్లు నిఘా వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా, ఆదివాసీలు, ముస్లిములు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వోటు వేసినా, మద్యతరగతి ప్రజలు ఓటింగ్ పట్ల నిరాసక్తత చూపినట్లు తెలుస్తుంది.

నాగపూర్ ఆర్ ఎస్ ఎస్  కేంద్రంలో ఏం జరిగింది?

అంతకు ముందే అంటే ఏప్రిల్ 19 న నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన మోడిని, సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ కూడా కాలవలేదనే సమాచారం. ఒక రాత్రంతా నాగపూర్ లో ఉన్నా, నితిన్ గడ్కారీ ని కూడా కలవలేదు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్యలు ఎందుకు ప్రధానిని కాలవలేక పోయారు? ఆర్ ఎస్ ఎస్ తో ప్రధాని కి ఛేదిందా? ఇవన్నీ భేతాళ ప్రశ్నలే.  నాగపూర్ లో మోడి అనుకున్న రీతిలో, ఆర్ ఎస్ ఎస్ నుండి స్పందన రాలేదనే ప్రచారం జరుగుతుంది. అదే వేడిలో రాజస్తాన్ వచ్చిన మోడి, కాంగ్రెస్ పార్టీ “న్యాయ పత్ర” (మానిఫెస్టో)లో దేశ సంపాదనంతా ముస్లింలకే పంచుతారని, చివరికి మంగళ సూత్రాలను కూడా దక్కనీయరాని మాట్లాడారు.

నిజానికి “మంగళ సూత్రం: అనేది దక్షిణ భారత దేశ ప్రజల పవిత్రమైన భార్యాభర్తల బంధానికి ప్రతీక.  ఈ ఆచారం, మంగళసూత్రం కట్టడం అనేది ఉత్తర భారత దేశంలో లేనే లేదు. అక్కడ నుదుట కుంకుమ దిద్దాడమే ఆచారం. మరో రకమైన ఆచారం లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మారిన కాలంలో, సినిమా, సటివి సీరియల్ ల ప్రభావంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నగరాలలో మంగళ సూత్రం అనే దానికి కొంత ప్రాధాన్యత ఏర్పడుతుందని అనుకొంటున్నారు. లేని “మంగళ సూత్రం” ను కాంగ్రెస్ లాగేసుకొని, ముస్లిం లకు ఇస్తుందనడం, ప్రధాని లో ఏర్పడ్డ నిరాశ,నిస్పృహలకు నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.

అలిగఢ్ లో ముస్లింలపై  పొంగిన ప్రేమ

రెండు రోజుల్లో ప్రధాని మాటలలో మళ్ళీ ప్రేమ పొంగిపొరలడం, ఆయా ప్రాంతాలలో తమ అవసరాలకు అనుగుణంగా ముస్లింలను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారనడానికి, ఆయనకు ఎన్నికలు, వోట్లు, అధికారం కన్నా ఏది ప్రధానం కాదని మోడి అలిగఢ్ లో చేసిన ప్రసంగమే చెపుతుంది. రాజస్తాన్ లో ముస్లిం ల వోట్ల కన్నా హిందువుల వవట్లే ఎక్కువ. కానీ అలిగఢ్  చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల వోట్లు ఎక్కువ. వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రధాని మోడి “ హజ్ యాతరలో ముస్లిం మహిళలు, భారత దేశం నుండి పోయే వారికి సులువైన వీసా సౌకర్యం, ఎక్కువ కోటా” లాంటి  విషయాలలో తాను సౌదీ  దేశ అధికారుయాలతో, రాజుతో మాట్లాడి, భారతీయ ముస్లిం లకు ఎంతో మేలు చేసానని చెప్పుకొన్నారు.

వోట్ల కొరకు జాతుల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడరాని ఈ రెండు చోట్ల జరిగిన సభలలో ప్రధాని మోడి చేసిన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి.  మాట విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం ఎన్నికల నిబందనల ప్రకారం నిషేదం.  దీనిపై ఎన్నికల కమీషన్ కు వందలాది ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా, ఇలాంటి అన్నిరకాల బిజేపి ప్రచారాన్ని చూసి, చూడనట్లుగా ఉండడం ప్రజాస్వామ్యానికి చెడు అని పరిశీలకులు భావిస్తున్నారు.

 

----

 

 

 

 

Tags
Join WhatsApp

More News...

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ.. . ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు) శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2...
Read More...

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి  -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్    జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక...
Read More...
Local News  Crime 

ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (ప్రజామంటలు)  : మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొమ్ముల అంజి (20) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇందిరానగర్ దాటాక మోడల్ స్కూల్ ఎదుట బైక్‌పై వెళ్తున్న అంజిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన...
Read More...
Local News  State News 

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు): వచ్చే ఏడాది జరగనున్న ఎస్‌ఐఆర్‌, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సికింద్రాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):  నగర పరిధిలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయ కుటుంబాల చిన్నారులతో స్కై ఫౌండేషన్ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, ఆటవస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటవస్తువులు, బహుమతులు అందుకోవడంతో చిన్నారులు అపారమైన...
Read More...
Crime  State News 

కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం

కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం బెంగళూరు డిసెంబర్ 25: కర్ణాటకలో ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 1:30–2:00 గంటల మధ్య చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలో ప్రయాణికులతో ఉన్న బస్సు మంటల్లో చిక్కడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. అధికారులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read More...

భర్త అడ్డుగా ఉన్నాడని హత్య..అక్రమ సంబంధంతో భార్య దారుణం

   భర్త అడ్డుగా ఉన్నాడని హత్య..అక్రమ సంబంధంతో భార్య దారుణం అచ్చంపేట డిసెంబర్ 25 (ప్రజా మంటలు): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళే ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా తేలడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో నివాసం...
Read More...
Local News 

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –   క్రైస్తవులకు శుభాకాంక్షలు జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు): క్రిస్మస్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు....
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖల్ల సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు 50 మంది నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖల్ల సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు 50 మంది నాయకులు బుగ్గారం డిసెంబర్ 25 (ప్రజా మంటలు):శేఖల్ల గ్రామానికి చెందిన సర్పంచ్ పర్సా రమేష్, ఉపసర్పంచ్ నార్ల బుచ్చయ్యతో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారందరికీ కాంగ్రెస్...
Read More...
Local News 

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ డిసెంబర్ 25:శంషాబాద్ నుంచి హైదరాబాద్‌లోని జలవిహార్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొనడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మందికి...
Read More...
National  Crime  State News 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి కడలూరు, డిసెంబర్ 24: తమిళనాడులోని కడలూరు జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తిట్టకుడి ప్రాంతం సమీపంలోని తిరుచ్చి హైవేపై రాత్రి సుమారు...
Read More...
Local News 

కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం

కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు): కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఆయిలన్న కురుమ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు మెమొంటో...
Read More...