"ట్రావెల్ బ్యాన్" బాధితుడికి అండగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
- దుబాయిలో మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన జగిత్యాల వాసి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే19 ( ప్రజా మంటలు ) :
ఉపాధికోసం దుబాయి వెళ్లిన రాజేష్ అనే వ్యక్తి అక్కడి బ్యాంక్ మోసాలకు పాల్పడే ముఠా ఉచ్చులో చిక్కి పోలీసులు స్వంత గ్రామానికి రాకుండా (ట్రావెల్ బ్యాన్) ప్రయాణ నిషేధం విధించగా కుటుంబం ఆందోళన చెందుతోంది.
ఈ విషయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి ఎలాగైనా రక్షించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
ఈ విషయాన్ని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే తగిన సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలో గల విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఈనెల18 న వైర్ లెస్ మెస్సేజ్ పంపించి రాజేష్ కుటుంబానికి జీవన్ రెడ్డి అండగా నిలిచారు.
కుటుంబ సభ్యులకథనం ప్రకారం...
జగిత్యాల పట్టణం కటికెవాడకు చెందిన గొల్లపెల్లి రాజేష్ (39) అనే యువకుడు బతుకుదెరువు కోసం గత డిసెంబర్ లో ఆజాద్ వీసాపై దుబాయికి వెళ్ళాడు.
ఎంప్లాయిమెంట్ వీసా ఉన్నప్పటికీ, సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులో ఇరుక్కుపోయారని తెలిపారు.
బ్యాంకుల ద్వారా అప్పు తీసుకుని ఏదైనా బిజినెస్ చేయొచ్చని ఒక ముఠా రాజేష్ ను నమ్మించి అతనితో 6 బ్యాంకుల్లో ఖాతాలను తీయించి డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు తీసుకున్నారని తెలిపారు.
అయితే రాజేష్ బ్యాంకు ఖాతాలు అనుమానాస్పద0గా ఉన్నాయని దర్యాప్తు కోసం దుబాయిలోని ఆల్ బరసహ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యేవరకు దుబాయి దాటి వెళ్లకుండా రాజేష్ పై 'ట్రావెల్ బ్యాన్' (ప్రయాణ నిషేధం) విధించారని కుటుంబ సభ్యులు వివరించారు.
దుబాయిలో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన రాజేష్ ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోగా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇస్తూనే రక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్కు శాశ్వత భవనం మంజూరు చేయాలి
ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్కు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు.
ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎంకు లేఖ రాసి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్... ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు):
ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వచ్చిన డిప్యూటీ సీఎంకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల MLA సంజయ్... ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా
మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత
హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా... వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్
వడ్డెర సంఘం సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తా. మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు.
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జోగిపేట 21 జనవరి (ప్రజా మంటలు) :
మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళలు.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీసిన మహిళలు
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ... చరిత్రలో ఈరోజు జనవరి 21.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
చరిత్రలో ఈరోజు జనవరి 21
సంఘటనలు :
1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
జననాలు :
1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995)
1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
1939: సత్యమూర్తి, వ్యంగ్య... సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్
హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్... 450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో 235 కోట్ల తో నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి కి భూమిపూజ చేసి,23.5 కోట్ల తో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ,3 కోట్ల తో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ,1.5 కోట్ల తో టి ఆర్ నగర్ లో... 15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)పట్టణ 15వ వార్డ్ కి చెందిన న్యాయవాది అవుసం భాగ్యశ్రీ మరియు 28వ వార్డ్ కి చెందిన అడ్డగట్ల అక్షయ్ కుమార్-మాధురి మరియు 28వ,15వ వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ... బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన నితిన్ నబీన్ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా భారతీయ జనత పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు... తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక
హైదరాబాద్, జనవరి 20 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అలాగే రాష్ట్ర వనరుల సమర్థ వినియోగంపై లోతైన అధ్యయనం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అధ్యయన కమిటీల సభ్యులతో బంజారాహిల్స్లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి... శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఘనంగా ప్రారంభమైంది.
గుట్టపై రాజేశ్వరుని దర్శించి, ప్రత్యేక పూజలు... 