"ట్రావెల్ బ్యాన్" బాధితుడికి అండగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

- దుబాయిలో మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన జగిత్యాల వాసి.

On

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే19 ( ప్రజా మంటలు ) : 

 

ఉపాధికోసం దుబాయి వెళ్లిన రాజేష్ అనే వ్యక్తి అక్కడి బ్యాంక్ మోసాలకు పాల్పడే ముఠా ఉచ్చులో చిక్కి పోలీసులు స్వంత గ్రామానికి రాకుండా (ట్రావెల్ బ్యాన్) ప్రయాణ నిషేధం విధించగా కుటుంబం ఆందోళన చెందుతోంది.

ఈ విషయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి ఎలాగైనా రక్షించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు.

ఈ విషయాన్ని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే తగిన సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలో గల విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఈనెల18 న వైర్ లెస్ మెస్సేజ్ పంపించి రాజేష్ కుటుంబానికి జీవన్ రెడ్డి అండగా నిలిచారు.

కుటుంబ సభ్యులకథనం ప్రకారం...

జగిత్యాల పట్టణం కటికెవాడకు చెందిన గొల్లపెల్లి రాజేష్ (39) అనే యువకుడు బతుకుదెరువు కోసం గత డిసెంబర్ లో ఆజాద్ వీసాపై దుబాయికి వెళ్ళాడు.

ఎంప్లాయిమెంట్ వీసా ఉన్నప్పటికీ, సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులో ఇరుక్కుపోయారని తెలిపారు.

బ్యాంకుల ద్వారా అప్పు తీసుకుని ఏదైనా బిజినెస్ చేయొచ్చని ఒక ముఠా రాజేష్ ను నమ్మించి అతనితో 6 బ్యాంకుల్లో ఖాతాలను తీయించి డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు తీసుకున్నారని తెలిపారు.

అయితే రాజేష్ బ్యాంకు ఖాతాలు అనుమానాస్పద0గా ఉన్నాయని దర్యాప్తు కోసం దుబాయిలోని ఆల్ బరసహ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యేవరకు దుబాయి దాటి వెళ్లకుండా రాజేష్ పై 'ట్రావెల్ బ్యాన్' (ప్రయాణ నిషేధం) విధించారని కుటుంబ సభ్యులు వివరించారు.

దుబాయిలో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన రాజేష్ ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోగా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇస్తూనే రక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం

అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం * అభయాంజనేయ ఆశీస్సులతో ప్రచార ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి    భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు):  ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ...
Read More...
State News 

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు): ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు...
Read More...

IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు

IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): దేశంలో అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర...
Read More...

చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు

చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.   రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన కవిత రామంతపూర్ ఇందిరానగర్‌లోని చాకలి...
Read More...

ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం

ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం     జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక  కార్యక్రమ  క్రతువు నిర్వహించారు. సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,...
Read More...

పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ  ఆనంద్  కె డి సి...
Read More...
National 

బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్

బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్ కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): బెంగాల్‌లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది. హుమాయున్ కబీర్...
Read More...
National 

బీహార్ BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య

బీహార్ BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య ప్రతిపక్షం తీవ్ర విమర్శలు పాట్నా డిసెంబర్ 04: బీహార్‌లోని మోతిహారి నుంచి BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ కుమార్ మహిళల గురించి తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో కనిపించిన విషయంపై పత్రికారులు బుధవారం పాట్నాలో శాసనసభ బయట ప్రశ్నించగా,...
Read More...

ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)రూరల్ మండలము చర్లపల్లి, బీర్పూర్ మండలం గోండు గూడెం గ్రామాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం  ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా...
Read More...

హైదరాబాద్‌లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి

 హైదరాబాద్‌లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): సినిమా, సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పి ఒక 13 ఏళ్ల 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ను కుదిపేసింది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ షాకింగ్ కేసులో ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మరియు బాలిక పెద్దమ్మ అరెస్టయ్యారు.   నిందితులు:బండి...
Read More...

MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి

MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు) జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో  జిల్లా కలెక్టరేట్ లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ &మానిటరింగ్ కమిటీ మరియు సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే...
Read More...
State News  Crime 

రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్‌పై ఏసీబీ సోదాలు

రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్‌పై ఏసీబీ సోదాలు హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాస్ పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణల నడుమ ఏసీబీ (ACB) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సమాచారం ప్రకారం, రంగారెడ్డి...
Read More...