"ట్రావెల్ బ్యాన్" బాధితుడికి అండగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
- దుబాయిలో మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన జగిత్యాల వాసి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే19 ( ప్రజా మంటలు ) :
ఉపాధికోసం దుబాయి వెళ్లిన రాజేష్ అనే వ్యక్తి అక్కడి బ్యాంక్ మోసాలకు పాల్పడే ముఠా ఉచ్చులో చిక్కి పోలీసులు స్వంత గ్రామానికి రాకుండా (ట్రావెల్ బ్యాన్) ప్రయాణ నిషేధం విధించగా కుటుంబం ఆందోళన చెందుతోంది.
ఈ విషయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి ఎలాగైనా రక్షించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
ఈ విషయాన్ని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే తగిన సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలో గల విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఈనెల18 న వైర్ లెస్ మెస్సేజ్ పంపించి రాజేష్ కుటుంబానికి జీవన్ రెడ్డి అండగా నిలిచారు.
కుటుంబ సభ్యులకథనం ప్రకారం...
జగిత్యాల పట్టణం కటికెవాడకు చెందిన గొల్లపెల్లి రాజేష్ (39) అనే యువకుడు బతుకుదెరువు కోసం గత డిసెంబర్ లో ఆజాద్ వీసాపై దుబాయికి వెళ్ళాడు.
ఎంప్లాయిమెంట్ వీసా ఉన్నప్పటికీ, సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులో ఇరుక్కుపోయారని తెలిపారు.
బ్యాంకుల ద్వారా అప్పు తీసుకుని ఏదైనా బిజినెస్ చేయొచ్చని ఒక ముఠా రాజేష్ ను నమ్మించి అతనితో 6 బ్యాంకుల్లో ఖాతాలను తీయించి డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు తీసుకున్నారని తెలిపారు.
అయితే రాజేష్ బ్యాంకు ఖాతాలు అనుమానాస్పద0గా ఉన్నాయని దర్యాప్తు కోసం దుబాయిలోని ఆల్ బరసహ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యేవరకు దుబాయి దాటి వెళ్లకుండా రాజేష్ పై 'ట్రావెల్ బ్యాన్' (ప్రయాణ నిషేధం) విధించారని కుటుంబ సభ్యులు వివరించారు.
దుబాయిలో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన రాజేష్ ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోగా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇస్తూనే రక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బతికుండగానే సమాధి నిర్మించుకున్న నక్క ఇంద్రయ్య మృతి – సంతాపం
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్, జగిత్యాల రూరల్ మండల సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన బతికుండగానే స్వయంగా నిర్మించుకున్న సమాధిలోనే ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని భూస్థాపితం చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని... తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం
పుణే, జనవరి 11:పదవి నుంచి తొలగించబడిన IAS ట్రైనీ అధికారి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా మరో ముగ్గురు పుణేలోని వారి బంగ్లాలో అచేతన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. బానెర్–ఆంధ్ ప్రాంతంలోని నివాసంలో జరిగిన ఈ ఘటనలో నిద్ర మందులు కలిపి వారిని అచేతనం చేసి దొంగతనం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
సమాచారం... ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు
టెహ్రాన్ జనవరి 11:
నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, ఇరాన్ ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంది.ఆర్థిక వ్యవస్థపై నిరసనలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు నేషన్లవైడ్ స్థాయిలో విస్తరుతూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ నెట్వర్క్లను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు... వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు.
గోవింద్పల్లె సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, వడ్డే... మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను ఆదివారం జాతీయ ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి... జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
వేములవాడ, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులబాంధవులందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి... మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి –కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ పిలుపు
రాయికల్, జనవరి 12 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలోని ప్రగతి స్కూల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... ఓసి జేఏసీ సింహ గర్జనకు తరలి వెళ్లిన జగిత్యాల ఓసి జేఏసీ నాయకులు
జగిత్యాల జనవరి 11 (ప్రజా మంటలు)
ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాల నుండి ఓసి జెఏసి సభ్యులు ప్రత్యేక వాహనంలపై తరలి వెళ్లారు
ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న కో కన్వీనర్... ఒకినోవా స్కూల్లో కరాటే బెల్టుల ప్రధానం
జగిత్యాల జనవరి 11 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఒకేనోవా స్కూల్ ఆఫ్ కరాటే స్కూల్లో బెల్టుల ప్రధానం జరిగింది. అంతకుముందు కరాటే శిక్షణార్థులు తమ పర్ఫార్మెన్స్ చూపించారు. అనంతరం బెల్టుల ప్రధానం చేశారు. మాస్టర్ మర్రిపల్లి లింగయ్య, ఇన్స్ట్రక్టర్ తిరుమల నరేష్ కరాటే శిక్షణార్థులు పాల్గొన్నారు. గుండె జబ్బుల నివారణను మిషన్గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణను ఒక మిషన్గా తీసుకొని ప్రభుత్వం, వైద్యులు, సమాజం అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) శిక్షణ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దేశవ్యాప్తంగా... అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 10 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ను జగిత్యాల శాసనసభ్యులు దా సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్... AIADMK–BJP కూటమిలో AMMK చేరికపై ఊహాగానాలు.
అమిత్ షా ఫోన్ కాల్ తర్వాత మారిన దినకరన్ వ్యూహం!
చెన్నై, జనవరి 11 (ప్రజా మంటలు):
తంజావూరులో జనవరి 5న జరిగిన AMMK జనరల్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. AMMK ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రసంగం మధ్యలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా... 