కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాల గోడ ప్రతిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) :
తేదీ. 30-05-2024 నుండి తేదీ. 01-06-2024 వరకు కొండగట్టు వేంచేసి యున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా క్షేత్ర సంప్రదాయ సారముగా హోమ, పూజ, అర్చనాది సేవలతో పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు.
ఈ సందర్భంగా జయంతోత్సవము ఆహ్వాన ప్రతులను, పోస్టర్ ను కలెక్టర్ సోమవారం రోజున తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.
శ్రీ హనుమాన్ జయంతి రోజు వారి కార్యక్రమ వివరాలు:
- 29-05-2024 ( బుధవారం) సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన.
- 30-05-2024 (గురువారం) ఉదయం 6 గంటలకు యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షాబంధనము, ఋత్విక్ వరణము, అరుణి మధనము, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ట హవనము, అభిషేకములు, ధ్వజారోహణము, నవగ్రహ స్థాపన, పారాయణాలు నైవేధ్యము, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం 5 గంటలకు హోమము, మహా నైవేధ్యము, మంత్ర పుష్పము, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు.
- 31-05-2024 (శుక్రవారం) ఉదయం 9 గంటలకు హోమము, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణము, అభిషేకము, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం 5 గంటలకు కుంకుమార్చన సహస్రనామార్చన (పుష్పాలతో), పారాయణాలు, హోమము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు.
- 01-06-2024 (శనివారం) ఉదయం 3 గంటలకు తిరుమంజనము మరియు ద్రావిడ ప్రబంధ పారాయణములు
- ఉదయం 9 గంటలకు హవనము, శ్రీస్వామి వారికి పంచామృత క్షీరాభిషేకం, సహస్రనాగవల్లి అర్చన
- ఉదయం 10 గంటలకు తులసి అర్చన హోమము
- మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఊయల సేవ, మంత్ర పుష్పము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము, సామూహిక భజన.
- సాయంత్రం 5 గంటలకు ఆరాధన
- సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
- సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి కుంకుమార్చన, ఓడిబియ్యము.
- సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సహస్ర దీపాలంకరణ
- సాయంత్రం 9 గంటలకు గరుడ వాహన సేవ
- సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు కంకణోద్వాసన, మంత్రపుష్పము, మహదశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగం.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దివాకర, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, కొండగట్టు ఆలయ ఈ. ఓ. చంద్ర శేఖర్, డిప్యూటీ ఈ . ఓ అంజయ్య పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శతాధిక ఆచార్యుని పరమపదం
లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు.
ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు... హైదరాబాద్లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి
జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్కు చెందిన చేట్పల్లి సంజయ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.
సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్కు బయలుదేరాడు. అయితే... కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది.
గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ... చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి... ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత
బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి... పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం
స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం
యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి.
పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146... ఇండియా టుడే రౌండ్టేబుల్లో అన్నామలై–కార్తీ చిదంబరం
మర్యాదకు, రాజకీయ పరిణితకు అద్దం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
ఇండియా టుడే నిర్వహించిన రౌండ్టేబుల్ చర్చలో తమిళనాడు రాజకీయాలకు చెందిన ప్రముఖ నాయకులు అన్నామలై కుప్పుస్వామి మరియు కార్తీ చిదంబరం పాల్గొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా నిలిచింది.
సాధారణంగా టెలివిజన్ డిబేట్లలో కనిపించేలా అసభ్య పదజాలం, వ్యక్తిగత విమర్శలు... ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్
వాషింగ్టన్ ఫిబ్రవరి 12:
:వైట్ హౌస్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మధ్య దాదాపు మూడు గంటల పాటు జరిగిన గోప్య సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు, మరియు భవిష్యత్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.... మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత ఉత్సాహం
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)
(శ్రీధర గణపతి జగిత్యాల)జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బుధవారం యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మీడియా ముందు సంకేతాన్ని ప్రదర్శించారు.
39వ వార్డుకు చెందిన గోలి... డాలర్ బలహీనమైనా రూపాయి ఎందుకు మరింత పడిపోయింది?
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
జనవరి నెలలో అమెరికా డాలర్ విలువ కొంత బలహీనపడింది. అయితే సాధారణంగా ఒక కరెన్సీ బలహీనపడితే, దాని ఎదురు కరెన్సీలు బలపడటం సహజం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్ బలహీనత కనిపించిన సమయంలోనే భారత రూపాయి మరింత క్షీణించింది. దీని వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి.
1️⃣ ... RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన State Finances నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గంభీరమైన సూచనలు ఉన్నాయి. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయి మరియు దీనికి గత బడ్జెట్ డేటా కూడా అద్దం పడుతుంది.
1. RBI తెలిపిన... మధ్యప్రదేశ్పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి
భోపాల్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రజా రుణ భారం రూ.5,31,012.8 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రుణం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ రుణభారం... 