కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాల గోడ ప్రతిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) :
తేదీ. 30-05-2024 నుండి తేదీ. 01-06-2024 వరకు కొండగట్టు వేంచేసి యున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా క్షేత్ర సంప్రదాయ సారముగా హోమ, పూజ, అర్చనాది సేవలతో పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు.
ఈ సందర్భంగా జయంతోత్సవము ఆహ్వాన ప్రతులను, పోస్టర్ ను కలెక్టర్ సోమవారం రోజున తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.
శ్రీ హనుమాన్ జయంతి రోజు వారి కార్యక్రమ వివరాలు:
- 29-05-2024 ( బుధవారం) సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన.
- 30-05-2024 (గురువారం) ఉదయం 6 గంటలకు యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షాబంధనము, ఋత్విక్ వరణము, అరుణి మధనము, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ట హవనము, అభిషేకములు, ధ్వజారోహణము, నవగ్రహ స్థాపన, పారాయణాలు నైవేధ్యము, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం 5 గంటలకు హోమము, మహా నైవేధ్యము, మంత్ర పుష్పము, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు.
- 31-05-2024 (శుక్రవారం) ఉదయం 9 గంటలకు హోమము, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణము, అభిషేకము, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం 5 గంటలకు కుంకుమార్చన సహస్రనామార్చన (పుష్పాలతో), పారాయణాలు, హోమము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు.
- 01-06-2024 (శనివారం) ఉదయం 3 గంటలకు తిరుమంజనము మరియు ద్రావిడ ప్రబంధ పారాయణములు
- ఉదయం 9 గంటలకు హవనము, శ్రీస్వామి వారికి పంచామృత క్షీరాభిషేకం, సహస్రనాగవల్లి అర్చన
- ఉదయం 10 గంటలకు తులసి అర్చన హోమము
- మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఊయల సేవ, మంత్ర పుష్పము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము, సామూహిక భజన.
- సాయంత్రం 5 గంటలకు ఆరాధన
- సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
- సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి కుంకుమార్చన, ఓడిబియ్యము.
- సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సహస్ర దీపాలంకరణ
- సాయంత్రం 9 గంటలకు గరుడ వాహన సేవ
- సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు కంకణోద్వాసన, మంత్రపుష్పము, మహదశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగం.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దివాకర, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, కొండగట్టు ఆలయ ఈ. ఓ. చంద్ర శేఖర్, డిప్యూటీ ఈ . ఓ అంజయ్య పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
24 గంటల్లో దారిదోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
జగిత్యాల నవంబర్ 30 (ప్రజా మంటలు)దారి దోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు
డీఎస్పీ రఘు చందర్ తెలిపారు..
శనివారం అర్ధరాత్రి జగిత్యాల పట్టణ శివారులోని గాంధీ నగర్ వద్ద ...
మంచిర్యాల జిల్లాకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ శనివారం అర్ధరాత్రి జగిత్యాల శివారులో గాంధీనగర్ వద్ద డీసీఎం వ్యాన్ పార్క్... కొండగట్టు షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
కొండగట్టు నవంబర్ 30 (ప్రజా మంటలు)శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో మల్యాల మండలం కొండగట్టులోని సుమారు 30 దుకాణాలు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగగా ఆదివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ప్రమాదానికి జరిగిన కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి తక్షణ సహాయం కటుంబానికి... దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జున మల్లన్న పేట దొంగ మల్లన్న జాతర బెట్టింగ్ టోకెన్స్ ద్వారా గ్యాంబ్లింగ్ (అందర్ బహార్) ఆట నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి అతని వద్దనుండి నుండి 4000 నగదు తొ పాటు మూడు బెట్టింగ్ టోకన్ స్వాధీనం చేసుకుని కేసు... కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు
స్టాక్టన్ (కేలిఫోర్నియా), నవంబర్ 30:
అమెరికా కేలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్టన్ నగరంలో ఉన్న ఒక బ్యాంక్వెట్ హాల్లో, శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నాలుగు మంది మృతి, పది మంది గాయపడిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటనపై సాన్ జోక్విన్ కౌంటీ శెరీఫ్ కార్యాలయం అత్యవసర ప్రకటన... కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు
కరీంనగర్, నవంబర్ 30 (ప్రజా మంటలు):
కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేడు నగరంలోని పలువురు ప్రముఖులను, వివిధ కుల సంఘాల అధ్యక్షులు మరియు రాజకీయ నేతలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.
అంజన్ కుమార్ను కలిసిన వారిలో
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,... జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం
హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 25న నిజామాబాద్లో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తి చేశారు — మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్–హన్మకొండ, నల్గొండ, మెదక్,... కొండగట్టు అగ్నిప్రమాదంపై కల్వకుంట్ల కవిత ఆందోళన
హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు):
కొండగట్టు బస్టాండ్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 35 దుకాణాలు దగ్ధమై, చిరువ్యాపారులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్న విషయం మనసును కలచివేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మక్క జాతర సందర్భంలో భక్తుల రద్దీ దృష్ట్యా పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన బొమ్మలు,... జగిత్యాల కొండగట్టు అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి, ప్రజాప్రతినిధులు
కొండగట్టు నవంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో, బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈరోజు దగ్ధమైన దుకాణాల వద్ద సందర్శించారు.
బాధిత... ఫుట్ పాత్ అనాధలకు దుస్తుల పంపిణీ
సికింద్రాబాద్, నవంబర్ 30 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన, ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న సంచార జాతులు మరియు నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ అండగా నిలిచింది. వారిని గుర్తించి, వారికి అవసరమైన దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లను ఆదివారం పంపిణీ చేశారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి అవసరమైన ఔషధాలను అందించారు. ప్రమాదాలకు గురైన వారికి... లక్ష్మీపూర్లో వెంకటేశ్వర స్వామి ఆలయ సప్తవింశతి వార్షికోత్సవం
పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్పరసన్ దావ వసంత సురేష్
జగిత్యాల రూరల్, నవంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన 27వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ... పవర్ ప్రాజెక్టులకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు – ప్రభుత్వ విధానాలకే వ్యతిరేకం: కొప్పుల ఈశ్వర్
జగిత్యాల (రూరల్), నవంబర్ 30 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న విద్యుత్ విధానాలు, పెరుగుతున్న ఖర్చులు మరియు భారీ అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇటీవల... కొండగట్టు భారీ అగ్నిప్రమాదం – కోట్లలో ఆస్తి నష్టం, 30 కుటుంబాల జీవితం చిద్రమ్
కేంద్ర మంత్రి సంజయ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ లో సంప్రదింపు
మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం
మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ₹5 వేల ఆర్థిక సహాయం
కొండగట్టు, నవంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వద్ద నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఘోర అగ్నిప్రమాదం... 