శాంతి కళ్యాణం తో ముగిసిన మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు.
(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జమ్మూ, కాట్రా మే 21 (ప్రజా మంటలు) :
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు జమ్ములోని (కాట్రా )ప్రాంతంలో ఈనెల 17 నుండి కొనసాగుతుండగా మంగళవారం శ్రీ గణపతి, మహాలక్ష్మి, సుదర్శన, రుద్ర సహిత శత చండీయాగము ,మహా పూర్ణాహుతి మరియు శాంతి కళ్యాణము, కుంకుమార్చనలతో ఘనంగా ముగిశాయి.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సేవ పరిషత్తు సభ్యులు, బాధ్యులు ,భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైదిక క్రతువులు మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి కార్యనిర్వక సభ్యులు తదితరులచే నిర్వహించబడినది. వార్షికోత్సవంలో భాగంగా సాంస్కృతిక ,సాహిత్య కార్యక్రమాలు, భజనలు, ప్రతినిత్యం స్థాపిత దేవత ఆరాధన, మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం , నిత్య హోమాలు నిర్వహించారు.
చివరి రోజైన మంగళవారం వైదిక క్రతవుల్లో భాగంగా బలి ప్రధానము, కలుషోద్వాసనము, అవబృత స్నానము, కుంభ ప్రోక్షణ, మహదాశీర్వచనము, ఆచార్య, ఋత్విక్ సన్మానము ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు దోర్భల. కృష్ణమూర్తి శర్మ, ప్రధాన కార్యదర్శి ఘనపురం. రాంప్రసాద్ శర్మ, కోశాధికారి మహాదేవభట్ల. లక్ష్మణ ప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు వడిగచర్ల. విష్ణుమూర్తి శర్మ, జోషి. రమేష్, మహదేవ్ భట్ల. దిలీప్ కుమార్ శర్మ, చలివేంధ్రి. భవాని, సంయుక్త కార్యదర్శి జోషి. సత్యనారాయణరావు, రాజనాల. వెంకటేశ్వర శర్మ, యలమంచి. చంద్రశేఖర్ శర్మ, కశోజ్జుల. త్రివేణి, కార్యనిర్వాహక కార్యదర్శి సిరిసిల్ల. రాంప్రసాద్ శర్మ, వైదిక కార్యదర్శులు కొడకండ్ల. రాధాకృష్ణశర్మ, కూచి. వంశీకృష్ణ శర్మ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మదునూరి. మహాదేవ శర్మ, విఠల. మురళీధర శర్మ, శ్రవణ్ కుమారాచార్యులు, గోళ్ళ. గోవర్ధన్ శర్మ ,నిమ్మరాజు. చంద్రశేఖర్ శర్మ, దోమడాల. విశ్వనాథరావు, ముఖ్య సలహాదారులు నెమ్మాని. విష్ణుమూర్తి శర్మ, డా. తుమ్మూరి. లక్ష్మణరావు దామెర. సత్యనారాయణ శర్మ, యలమంచి విఠలేశ్వర శర్మ లు మరియు సమస్త సభ్యులు దాతల సహకారం చే వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు సేవా పరిషత్ అధ్యక్షులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హైదరాబాద్లో విద్యాసంస్థల దయనీయ పరిస్థితులపై ఆందోళన
హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాట కార్యక్రమం మూడో రోజు భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జిల్లాలోని అంబర్పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అంబర్పేట్ నియోజకవర్గంలో కాచిగూడ ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు చె నంబర్ బ్రిడ్జి కిందనున్న రోడ్డును ఆమె స్వయంగా పరిశీలించారు.
కాచిగూడ ప్రభుత్వ స్కూల్,... అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం – 9 మంది మృతి
విశాఖపట్నం డిసెంబర్ 12:
అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మరోసారి దారుణ ప్రమాదానికి వేదికైంది. శుక్రవారం ఉదయం రాజుగారి మెట్ట వద్ద ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడి భారీ విషాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న మొత్తం 35 మంది యాత్రికుల్లో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరికొందరు... వార్డు అభ్యర్థి చుక్క గంగారెడ్డి – ఐదు కోట్ల అభివృద్ధి పనులకు హామీ
బుగ్గారం, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా 12వ వార్డులో పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఇచ్చిన హామీలతో స్థానిక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో పాల్గొన్న... 2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య ప్రచారం
గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు):మండల కేంద్రంలోని 2వ వార్డులో ఎన్నికల సందడి మరింత వేడెక్కుతోంది. గౌను గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి అంకం విజయ భూమయ్య తన ప్రచారాన్ని భారీగా చేపట్టారు. ప్రజలను కలిసిన ఆమె,వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తెలుసుకుని… వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.... కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు
కోరుట్ల, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రక్రియలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరు బ్యాలెట్ పత్రాలను నమిలేయడంతో ప్రాంతంలో చిన్నపాటి కలకలం రేగింది.
గ్రామానికి చెందిన వృద్ధుడు పిట్టల వెంకటి మద్యం సేవించి 4వ వార్డు పోలింగ్... సీడ్ బిల్లు–2025 పై రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహిస్తున్న టీడీఎఫ్ జైకిసాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సీడ్ బిల్–2025 పై రైతులు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలను సేకరించింది. ఆన్లైన్ కాన్ఫరెన్స్ లు, వెబినార్ ల ద్వారా తీసుకున్న అభిప్రాయాల నివేదికను గురువారం కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ... దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :
దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థగా సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రెజిమెంటల్ బజార్లో జరిగిన సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల హైస్కూల్ 175వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికల విద్యకు 175 ఏళ్లుగా సేవ చేస్తూ ఎందరో ఐఏఎస్, ఐపీఎస్,... అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం ప్రభుత్వ ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టికెట్ రేట్లు పెంచడానికి సరైన ఆధారాలు, సమగ్ర కారణాలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం చట్టానికి... నాన్బెయిలబుల్ వారెంట్ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేస్తున్న కొండా సురేఖపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ వివరణ... రోడ్డు భద్రతపై యమధర్మరాజుగా అవగాహన
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :
హైదరాబాద్ సిటీ కమిషనర్ వి.సీ. సజ్జనార్ పర్యవేక్షణలో, ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో బేగంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ సిగ్నల్, బోయిన్పల్లి జంక్షన్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.
సర్వేజనా ఫౌండేషన్,కిమ్స్ సన్షైన్ ఆస్పత్రుల సీఈఓ డా. గురవా రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్... మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్?
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై కేసు నమోదు చేసిన ఎస్ఐకి “పనిష్మెంట్ ట్రాన్స్ఫర్” విధించడంపై పెద్ద వివాదం మొదలైంది. వేకెన్సీ రిజర్వ్ పేరుతో సీఐ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ను ట్రాన్స్ఫర్ చేయించేందుకు మంత్రి ప్రభావం చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం జరిగింది?మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... అమెరికాకు 20-పాయింట్ల సవరించిన శాంతి ప్రతిపాదన అందజేసిన ఉక్రెయిన్
లండన్ డిసెంబర్ 11 :
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం, యుద్ధం ముగింపుకు దోహదపడే 20 పాయింట్ల శాంతి ప్రతిపాదనను సవరించి అమెరికాకు అందజేశారు.
ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రతిపాదనలో కొత్త ఆలోచనలు, ముఖ్యంగా ఆక్రమిత... 