గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్.

- జగిత్యాల డిఎస్పి రఘు చందర్ ప్రెస్ మీట్.

On
గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 20(ప్రజా మంటలు):

మే 16,24 గురువారం అర్ధరాత్రి గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నవీన్, జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @ మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్ అనే ఆరుగురు అదే గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్, అతని బాబాయ్ కొడుకు దీటి మహేష్ లను ఇంటి కొనుగోలు విషయంలో పాత గొడవలు మనసులో పెట్టుకొని ఇనుప పైపులు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయగా శ్రీనివాస్ అక్కడే చనిపోయాడు.

తీవ్రంగా గాయపడిన మహేష్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

దీనిపై బుగ్గారం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అక్క అటికేటి మమత ఫిర్యాదు మేరకు బుగ్గారం యస్ ఐ ఎం శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేయడం జరిగింది.

కేసు దర్యాప్తు లో భాగంగా గోపులాపూర్ గ్రామంలో దీటి తార, ఆమె కుమారుడు శ్రీనివాస్ లు 2018 సంవత్సరంలో తార తన బంధువు నాగుల అంజయ్య, అతని కుమారుడు రాజేష్ వద్ద ఇప్పుడు వాళ్లు ఉంటున్న ఇంటిని కొన్నారు.కానీ ఇదే ఇంటిని 2017 సంవత్సరంలో అంజయ్య తమకు అమ్మాడని తార ఇంటి పక్కనే ఉన్నటువంటి బుర్ర లక్ష్మి, ఆమె కొడుకులు నాగరాజు, నవీన్ లు కోర్టును ఆశ్రయించడం జరిగింది.

2023 లో కోర్టు ఆ సివిల్ కేసును కొట్టివేసింది.అప్పటి నుండి ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. మే 12,2024 రోజు జగిత్యాల లో ఉంటున్న బుర్ర లక్ష్మి, నాగరాజు, వెంకటమ్మ, పూజ, నవీన్ లు ఎల్లమ్మ పట్నాల గురించి గోపులాపూర్ గ్రామంలోని తమ ఇంటికి వచ్చి ఉంటున్నారు.

మే 16,2024 రోజు రాత్రి వారి ఇంటి పక్కన ఉన్న దీటి తార, కొడుకు శ్రీనివాస్, దీటి మహేష్ లు దారిలో మంచం వేసుకొని తమకు అడ్డంగా పెట్టారని గొడవ జరిగింది.

అట్టి గొడవ అనంతరం బుర్ర నవీన్ తమ ఇంటి పక్కన ఉన్న దీటి శ్రీనివాస్, అతనికి సహకరిస్తున్న దేటి మహేష్ లను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని అదే రోజు రాత్రి తమ స్నేహితులైన జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @ మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్ లను జగిత్యాల నుండి పిలిపించుకొని వారికి తమ గొడవ విషయం చెప్పి ఎలాగైనా శ్రీనివాసును, మహేష్ ను చంపాలని ఉద్దేశంతో వారు ఇంటి వద్ద ఉన్నది చూసి పై వారందరూ ఆ ఇంటికి వెళ్లి ఇనుప రాడ్లు కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి చుట్టుపక్కల వారు రాగా అక్కడి నుండి తమ వాహనాల్లో పారిపోయారు.

దీటి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా, మహేష్ వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ చనిపోయాడు.

సోమవారం బుగ్గారం ఎక్స్ రోడ్ లో వాహనాల తనిఖి చేస్తుండగా పై నిందితులు తమ వాహనాలలో వెళుతుండగా పట్టుకొని వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఇనుప పైపులు, కర్రలు, ఒక కారు,02 మోటార్ సైకిళ్లు,07 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి గొడవకు కారణమైన బుర్ర లక్ష్మి, నాగరాజు, వెంకటమ్మ, పూజ లపై కూడా చట్టరీత్య చర్యలు తీసుకోబడతాయి అని డీఎస్పీ రఘు చందర్ తెలియజేశారు.

ఈ ప్రెస్ మీట్ ధర్మపురి సర్కిల్ ఆఫీస్ లో నిర్వహించగా ధర్మపురి సీఐ ఏ రాం నరసింహారెడ్డి,బుగ్గారం, ధర్మపురి, వెల్గటూరు, గొల్లపల్లి యస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కోలుకుంటున్నారు

సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కోలుకుంటున్నారు తాడోంగ్ (సిక్కిం) నవంబర్ 14: సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (గోలే), తేలికపాటి ముక్కు రక్తస్రావం మరియు రక్తపోటు పెరగడం కారణంగా శుక్రవారం సెంట్రల్ రిఫరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రి వైద్య బృందం వెంటనే చికిత్స ప్రారంభించడంతో ఆయన పరిస్థితి తక్షణమే స్థిరపడింది. డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం సీఎం...
Read More...
State News 

రైతుల,విద్యార్థుల, సామాన్యులతో కవిత మమేకం

రైతుల,విద్యార్థుల, సామాన్యులతో కవిత మమేకం మెదక్ నవంబర్ 14 (ప్రజా మంటలు): మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట తొలి రోజు పర్యటన నిర్వహించారు. నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, ఘనపూర్, వనదుర్గ, మెదక్ వంటి ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకున్నారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, ఆలయాలు, కాలనీలు—అన్ని రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా...
Read More...

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా స్థానికంగా కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ సంబరాలు కొనసాగాయి. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాల్లో భాగమయ్యారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్...
Read More...

గంజాయి పెంపకం – సరఫరా – అమ్మకానికి పాల్పడిన ముగ్గురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష

గంజాయి పెంపకం – సరఫరా – అమ్మకానికి పాల్పడిన ముగ్గురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా గౌరవ మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి శ్రీ నారాయణ గారు కఠినమైన తీర్పును ప్రకటించారు. గంజాయి పెంపకం, సరఫరా మరియు అమ్మకానికి పాల్పడినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో...
Read More...

జ్యోతి హై స్కూల్, ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం

జ్యోతి హై స్కూల్, ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం నాయకత్వం – బాధ్యత – స్వయం నియంత్రణ: డైరెక్టర్ హరి చరణ్ రావు జగిత్యాల (రూరల్), నవంబర్ 14 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం పురస్కరించుకొని సెల్ఫ్ గవర్నెన్స్ డే ను హర్షాతిరేకాలతో నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు, బాధ్యతా భావం, పాఠశాల...
Read More...

జూబ్లీహిల్స్ విజయంలో సంబరాలు – ఎమ్మెల్యే డా. సంజయ్ ఆదేశాల మేరకు ఘనంగా వేడుకలు

జూబ్లీహిల్స్ విజయంలో సంబరాలు – ఎమ్మెల్యే డా. సంజయ్ ఆదేశాల మేరకు ఘనంగా వేడుకలు జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం సందర్భంగా జగిత్యాల పట్టణంలో భారీ సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొత్త బస్టాండ్‌ చౌరస్తా వద్ద...
Read More...

మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం

మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్.9440595494) ధర్మపురి క్షేత్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మధుమేహ అవగాహన కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిన ప్రాముఖ్యమైన వేదికగా నిలిచింది. మధుమేహం పెరుగుతున్న నేపథ్యం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అవసరం దృష్ట్యా, ఈ కార్యక్రమానికి ప్రజలు...
Read More...
Local News  State News 

గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 3647.67 కోట్ల వ్యాపారం దాటింది :: డిజిటల్ సేవల విస్తరణ

గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 3647.67 కోట్ల వ్యాపారం దాటింది :: డిజిటల్ సేవల విస్తరణ జగిత్యాల,నవంబర్ 14 (ప్రజా మంటలు):72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా, జగిత్యాలలోని గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో సహకార పతాకాన్ని బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం “డిజిటలైజేషన్‌ ప్రమోషన్” అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో సహకార విభాగ అధికారులు, బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్లు, సిబ్బంది...
Read More...
Local News 

వర్షకొండ అక్షర స్కూల్ లో బాలల దినోత్సవం వేడుకలు 

వర్షకొండ అక్షర స్కూల్ లో బాలల దినోత్సవం వేడుకలు  ఇబ్రహీంపట్నం నవంబర్ 14(ప్రజామంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున పాఠశాలలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది.
Read More...
National  State News 

ఎన్డీఏపై నమ్మకం ఉంచిన బిహార్ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ

ఎన్డీఏపై నమ్మకం ఉంచిన బిహార్ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ న్యూఢిల్లీ నవంబర్ 14: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజలు ఎన్డీఏపై చూపిన నమ్మకాన్ని ఆయన అభినందించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమని, అభివృద్ధి పట్ల ప్రజల నిబద్ధత మరోసారి రుజువైందని అన్నారు. బిహార్‌ తీర్పు చరిత్రాత్మకం – మోదీ ప్రధాని మోదీ మాట్లాడుతూ, బిహార్...
Read More...

శ్రీశ్రీనివాసఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా కుంకుమార్చనలు 

శ్రీశ్రీనివాసఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా కుంకుమార్చనలు  జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో గల శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.    వైదిక క్రతువును నంబి నరసింహ ఆచార్య (చిన్న స్వామి) నిర్వహించగా కార్యక్రమంలో మేడిపల్లి రాజన్న శర్మ శశాంక మౌళి భార్గవ్ శర్మ రుద్రంగి గోపాలకృష్ణశర్మ సిరిసిల్ల...
Read More...
Local News  State News 

“కర్మ తిరిగి వచ్చింది” జూబ్లీహిల్స్ ఓటమిపై భారీ చర్చ:  కవిత సంచలన ట్వీట్‌

“కర్మ తిరిగి వచ్చింది” జూబ్లీహిల్స్ ఓటమిపై భారీ చర్చ:  కవిత సంచలన ట్వీట్‌ హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై చేసిన ట్వీట్‌ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.బీఆర్ఎస్ అభ్యర్థి పరాజయంపై స్పందించిన ఆమె, “కర్మ తిరిగి వచ్చింది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. కవితను...
Read More...