గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్.

- జగిత్యాల డిఎస్పి రఘు చందర్ ప్రెస్ మీట్.

On
గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 20(ప్రజా మంటలు):

మే 16,24 గురువారం అర్ధరాత్రి గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నవీన్, జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @ మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్ అనే ఆరుగురు అదే గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్, అతని బాబాయ్ కొడుకు దీటి మహేష్ లను ఇంటి కొనుగోలు విషయంలో పాత గొడవలు మనసులో పెట్టుకొని ఇనుప పైపులు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయగా శ్రీనివాస్ అక్కడే చనిపోయాడు.

తీవ్రంగా గాయపడిన మహేష్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

దీనిపై బుగ్గారం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అక్క అటికేటి మమత ఫిర్యాదు మేరకు బుగ్గారం యస్ ఐ ఎం శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేయడం జరిగింది.

కేసు దర్యాప్తు లో భాగంగా గోపులాపూర్ గ్రామంలో దీటి తార, ఆమె కుమారుడు శ్రీనివాస్ లు 2018 సంవత్సరంలో తార తన బంధువు నాగుల అంజయ్య, అతని కుమారుడు రాజేష్ వద్ద ఇప్పుడు వాళ్లు ఉంటున్న ఇంటిని కొన్నారు.కానీ ఇదే ఇంటిని 2017 సంవత్సరంలో అంజయ్య తమకు అమ్మాడని తార ఇంటి పక్కనే ఉన్నటువంటి బుర్ర లక్ష్మి, ఆమె కొడుకులు నాగరాజు, నవీన్ లు కోర్టును ఆశ్రయించడం జరిగింది.

2023 లో కోర్టు ఆ సివిల్ కేసును కొట్టివేసింది.అప్పటి నుండి ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. మే 12,2024 రోజు జగిత్యాల లో ఉంటున్న బుర్ర లక్ష్మి, నాగరాజు, వెంకటమ్మ, పూజ, నవీన్ లు ఎల్లమ్మ పట్నాల గురించి గోపులాపూర్ గ్రామంలోని తమ ఇంటికి వచ్చి ఉంటున్నారు.

మే 16,2024 రోజు రాత్రి వారి ఇంటి పక్కన ఉన్న దీటి తార, కొడుకు శ్రీనివాస్, దీటి మహేష్ లు దారిలో మంచం వేసుకొని తమకు అడ్డంగా పెట్టారని గొడవ జరిగింది.

అట్టి గొడవ అనంతరం బుర్ర నవీన్ తమ ఇంటి పక్కన ఉన్న దీటి శ్రీనివాస్, అతనికి సహకరిస్తున్న దేటి మహేష్ లను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని అదే రోజు రాత్రి తమ స్నేహితులైన జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @ మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్ లను జగిత్యాల నుండి పిలిపించుకొని వారికి తమ గొడవ విషయం చెప్పి ఎలాగైనా శ్రీనివాసును, మహేష్ ను చంపాలని ఉద్దేశంతో వారు ఇంటి వద్ద ఉన్నది చూసి పై వారందరూ ఆ ఇంటికి వెళ్లి ఇనుప రాడ్లు కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి చుట్టుపక్కల వారు రాగా అక్కడి నుండి తమ వాహనాల్లో పారిపోయారు.

దీటి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా, మహేష్ వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ చనిపోయాడు.

సోమవారం బుగ్గారం ఎక్స్ రోడ్ లో వాహనాల తనిఖి చేస్తుండగా పై నిందితులు తమ వాహనాలలో వెళుతుండగా పట్టుకొని వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఇనుప పైపులు, కర్రలు, ఒక కారు,02 మోటార్ సైకిళ్లు,07 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి గొడవకు కారణమైన బుర్ర లక్ష్మి, నాగరాజు, వెంకటమ్మ, పూజ లపై కూడా చట్టరీత్య చర్యలు తీసుకోబడతాయి అని డీఎస్పీ రఘు చందర్ తెలియజేశారు.

ఈ ప్రెస్ మీట్ ధర్మపురి సర్కిల్ ఆఫీస్ లో నిర్వహించగా ధర్మపురి సీఐ ఏ రాం నరసింహారెడ్డి,బుగ్గారం, ధర్మపురి, వెల్గటూరు, గొల్లపల్లి యస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి 

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  జగిత్యాల/ కోరుట్ల/ మెట్పల్లి జనవరి 30 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, జగిత్యాల, కోరుట్ల,మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు...
Read More...

ఆధార్  సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత

ఆధార్  సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత             జగిత్యాల జనవరి 30 (ప్రజా మంటలు)  జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరము లో  శుక్రవారం రోజున   జిల్లా  కలెక్టర్, బి. సత్యప్రసాద్,  ఆదేశాల క్రమము జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత   జిల్లాలోని ఆధార్ సెంటర్ ఆపరేటర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.    యు ఐ డి ఏ ఐ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలని ఎవరైనా...
Read More...
State News 

సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత

సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత మేడారం, జనవరి 30 (ప్రజా మంటలు): సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. కాకతీయుల వంటి రాజులతో పోరాడిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు తమ జాతి కోసం నిలబడి పోరాడిన వీరవనితలని అన్నారు. గోవిందరాజు, పడిగిద్దరాజు వంశానికి చెందిన గొప్ప...
Read More...
Local News 

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి గొల్లపల్లి, జనవరి 30 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన స్టార్ బిర్యాణి సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఘటన వివరాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు. గతంలో కూడా యాజమానికి చెందిన టెంట్ సామగ్రి అగ్ని ప్రమాదంలో నష్టపోయిందని, ఇప్పుడు బిర్యాణి సెంటర్...
Read More...
Local News 

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు : జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు : జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం కరీంనగర్, జనవరి 30 (ప్రజా మంటలు): హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీలా మాట్లాడటం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ మాట్లాడారు. వీణవంకలో...
Read More...
Local News  State News 

మారేడు ఆకుపై అమ్మవార్లు…

మారేడు ఆకుపై అమ్మవార్లు… జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు): జగిత్యాలకు చెందిన చిత్రకారుడు, కళాశ్రీ గుండేటి రాజు తన ప్రత్యేక కళా నైపుణ్యంతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నారు. పవిత్రమైన మారేడు ఆకుపై సమ్మక్క–సారక్క అమ్మవార్ల ప్రతిమలను తన కుంచెతో అద్భుతంగా చిత్రీకరించి భక్తుల మనసులు గెలుచుకున్నారు. శుక్రవారం సమ్మక్క–సారక్క ఇద్దరూ గద్దెపై కొలువుదీరిన సందర్భంగా, అపారమైన భక్తితో...
Read More...
State News 

తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు

తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు హైదరాబాద్, జనవరి 30 (ప్రజా మంటలు): రాజకీయాలకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన… రాష్ట్రానికి జరుగుతున్న తీవ్రమైన జల ద్రోహాన్ని దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పరిస్థితిని...
Read More...

భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే

భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26 భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ స్థితిని సంఖ్యలతో స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వ ప్రచార వాదనలకు భిన్నంగా, ఈ సర్వే భారత ఆర్థిక నిర్మాణంలో ఉన్న బలహీనతలను బహిర్గతం చేస్తోంది. ఎగుమతులు–దిగుమతులు: అసమతుల్యత స్పష్టం ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం, భారత...
Read More...
State News 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత  హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత బాధాకరమైన అంశంపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా లేదని అన్నారు....
Read More...
Local News 

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. ఓమాన్‌లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్‌కు చేరింది. డిసెంబర్ 9న ‘ఇబ్రి’ ఎడారిలో మృతి చెందిన ఆయన మృతదేహం 52 రోజుల అనంతరం స్వదేశానికి వచ్చింది. కుటుంబం...
Read More...
Crime  State News 

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. నోటీసుల్లో భాగంగా,...
Read More...
Local News  State News 

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత
Read More...