గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్.

- జగిత్యాల డిఎస్పి రఘు చందర్ ప్రెస్ మీట్.

On
గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 20(ప్రజా మంటలు):

మే 16,24 గురువారం అర్ధరాత్రి గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నవీన్, జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @ మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్ అనే ఆరుగురు అదే గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్, అతని బాబాయ్ కొడుకు దీటి మహేష్ లను ఇంటి కొనుగోలు విషయంలో పాత గొడవలు మనసులో పెట్టుకొని ఇనుప పైపులు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయగా శ్రీనివాస్ అక్కడే చనిపోయాడు.

తీవ్రంగా గాయపడిన మహేష్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

దీనిపై బుగ్గారం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అక్క అటికేటి మమత ఫిర్యాదు మేరకు బుగ్గారం యస్ ఐ ఎం శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేయడం జరిగింది.

కేసు దర్యాప్తు లో భాగంగా గోపులాపూర్ గ్రామంలో దీటి తార, ఆమె కుమారుడు శ్రీనివాస్ లు 2018 సంవత్సరంలో తార తన బంధువు నాగుల అంజయ్య, అతని కుమారుడు రాజేష్ వద్ద ఇప్పుడు వాళ్లు ఉంటున్న ఇంటిని కొన్నారు.కానీ ఇదే ఇంటిని 2017 సంవత్సరంలో అంజయ్య తమకు అమ్మాడని తార ఇంటి పక్కనే ఉన్నటువంటి బుర్ర లక్ష్మి, ఆమె కొడుకులు నాగరాజు, నవీన్ లు కోర్టును ఆశ్రయించడం జరిగింది.

2023 లో కోర్టు ఆ సివిల్ కేసును కొట్టివేసింది.అప్పటి నుండి ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. మే 12,2024 రోజు జగిత్యాల లో ఉంటున్న బుర్ర లక్ష్మి, నాగరాజు, వెంకటమ్మ, పూజ, నవీన్ లు ఎల్లమ్మ పట్నాల గురించి గోపులాపూర్ గ్రామంలోని తమ ఇంటికి వచ్చి ఉంటున్నారు.

మే 16,2024 రోజు రాత్రి వారి ఇంటి పక్కన ఉన్న దీటి తార, కొడుకు శ్రీనివాస్, దీటి మహేష్ లు దారిలో మంచం వేసుకొని తమకు అడ్డంగా పెట్టారని గొడవ జరిగింది.

అట్టి గొడవ అనంతరం బుర్ర నవీన్ తమ ఇంటి పక్కన ఉన్న దీటి శ్రీనివాస్, అతనికి సహకరిస్తున్న దేటి మహేష్ లను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని అదే రోజు రాత్రి తమ స్నేహితులైన జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @ మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్ లను జగిత్యాల నుండి పిలిపించుకొని వారికి తమ గొడవ విషయం చెప్పి ఎలాగైనా శ్రీనివాసును, మహేష్ ను చంపాలని ఉద్దేశంతో వారు ఇంటి వద్ద ఉన్నది చూసి పై వారందరూ ఆ ఇంటికి వెళ్లి ఇనుప రాడ్లు కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి చుట్టుపక్కల వారు రాగా అక్కడి నుండి తమ వాహనాల్లో పారిపోయారు.

దీటి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా, మహేష్ వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ చనిపోయాడు.

సోమవారం బుగ్గారం ఎక్స్ రోడ్ లో వాహనాల తనిఖి చేస్తుండగా పై నిందితులు తమ వాహనాలలో వెళుతుండగా పట్టుకొని వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఇనుప పైపులు, కర్రలు, ఒక కారు,02 మోటార్ సైకిళ్లు,07 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి గొడవకు కారణమైన బుర్ర లక్ష్మి, నాగరాజు, వెంకటమ్మ, పూజ లపై కూడా చట్టరీత్య చర్యలు తీసుకోబడతాయి అని డీఎస్పీ రఘు చందర్ తెలియజేశారు.

ఈ ప్రెస్ మీట్ ధర్మపురి సర్కిల్ ఆఫీస్ లో నిర్వహించగా ధర్మపురి సీఐ ఏ రాం నరసింహారెడ్డి,బుగ్గారం, ధర్మపురి, వెల్గటూరు, గొల్లపల్లి యస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన

ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన హైదరాబాద్, డిసెంబర్ 27  (ప్రజా మంటలు): బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, అవసరమైతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. శుక్రవారం...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి

జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రజారోగ్య సేవల్లో అంకితభావంతో పనిచేసిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్, విధి నిర్వహణలో నిబద్ధత, మానవీయత...
Read More...
National  Local News  State News 

ఎన్.సి.సి. (NCC) ఆర్.డి (Republic Day) పరేడ్ కు ANO గా మన జగిత్యాల వాసి చేని.మంగ

ఎన్.సి.సి. (NCC) ఆర్.డి (Republic Day) పరేడ్ కు ANO గా మన జగిత్యాల వాసి చేని.మంగ సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113. జగిత్యాల/ హైదరాబాద్ డిసెంబర్ 27 (ప్రజా మంటలు) :  జనవరి 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో లో తెలంగాణ నుండి NCC క్యాడేట్స్ తో పాటు జగిత్యాలకు మౌంట్ కార్మెల్ స్కూల్ కు చెందిన అసోసియేట్ NCC ఆఫీసర్ పాఠశాల పి.ఈ.టి (వ్యాయామ ఉపాధ్యాయురాలు)...
Read More...
Local News 

అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు

అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్, డిసెంబర్ 26 (ప్రజా మంటలు): గౌడ్ అధికారిక మరియు వృత్తి సంఘం (GOPA) 50వ వార్షికోత్సవ వేడుకలు కాచిగూడ, హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు హాజరై సంఘానికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నెర్రెల్ల...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల ఆటో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న సైడ్‌వాల్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాద...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా -  కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా -  కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ డిసెంబర్ 26, (ప్రజా మంటలు): కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గం పూర్తిగా రైతులపై ఆధారపడిన...
Read More...

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి    జగిత్యాల డిసెంబర్ 26(ప్రజా మంటలు)రూరల్ మండల్ తక్కళ్లపెళ్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కచ్చు ముని రాజు , వార్డ్ సభ్యులు నరపాక రాజేష్ ,నాయకులు వడ్లూరి హరీష్, విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణిప్రవీణ్ ని స్వగృహంలో మర్యాదపూర్వక కలువగా వారిని శాలువతో...
Read More...

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్        జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు) భారతీయ నాగరిక విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన  మృతి చెందారు. విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు. జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు...
Read More...

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు): విద్యా, పారిశ్రామిక, సామాజిక రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త కాసుగంటి సుధాకర్ రావు మృతి జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, పారిశ్రామికవేత్తగా విశేష...
Read More...
National  State News 

ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం

 ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం అహ్మదాబాద్ డిసెంబర్ 26: గుజరాత్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాకు సమీప ప్రాంతమే భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత సుమారు 3.8 నుంచి 4.2గా నమోదైంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం...
Read More...
Local News  State News 

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం జగిత్యాల, డిసెంబర్ 26 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామిక వేత్త, సామాజిక సేవా ధురీణుడు కాసుగంటి సుధాకర్‌రావు(80)  అకాల మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన జీవితమంతా సమాజ హితానికే అంకితం చేసిన ఈ మహనీయుడు గురువారం (డిసెంబర్ 25) రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మాజీ...
Read More...