ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల సమన్వయ సమావేశం.

On
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల సమన్వయ సమావేశం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల మే 20 ( ప్రజా మంటలు ) : 

 ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సమన్వయ సమావేశము జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధ్యక్షతన జిల్లాలోని లైన్ డిపార్ట్మెంట్స్ మరియు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించారు.

ఈ పరీక్షలు జిల్లాలో మే 24 నుండి జూన్ 1వ తారీకు మధ్యన జరగనున్నాయి ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఉదయము 9 గంటల నుండి 12 గంటల వరకు మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మద్యాహ్నము 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు జిల్లాలో 19 పరీక్షా కేంద్రాల్లో జరగనున్నాయి.

ఈ సమావేశంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలని లైన్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఐదు నిమిషాల లేటు నిబంధన అమల్లో ఉంది కావున ప్రథమ సంవత్సర విద్యార్థులు ఉదయము ఎనిమిది గంటల 15 నిమిషాల వరకు, మధ్యాహ్నము ద్వితీయ సంవత్సర విద్యార్థులు 1.45 నిమిషాలకు పరీక్షా కేంద్రాన్ని చేరడానికి సకాలంలో ఆర్టీసీ బస్సులు సుదూర ప్రాంతాల నుంచి నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

పరీక్షా కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేటట్టుగా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

వైద్యశాఖ సిబ్బందిని పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే మందులను తమ సిబ్బంది ద్వారా అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు

అగ్నిమాపక దళ అధికారులకు ప్రమాద నివారణకు సూచనలు చేయాలని ఆదేశించారు.

అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్ మరియు పరీక్షల కన్వీనర్ బి నారాయణ, డిఎంఅండ్ హెచ్ ఓ పి శ్రీధర్ మొదలైన వారు పాల్గొన్నారు.

Tags