జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్‌ కేంద్రం మంజూరు .

On
జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్‌ కేంద్రం మంజూరు .

 -సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్


జగిత్యాల  మే 20 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలో  వయోవృద్ధుల సంక్షేమం కోసం బహుళసేవల డేకేర్‌ సెంటర్  ఏర్పాటుకు   ప్రభుత్వం నిర్ణయించిందని  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.  సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశంలో డే కేర్ సెంటర్ల   ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం వివరాలను వెల్లడించారు.

తమ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహా రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేసిన వినతి మేరకు  కుటుంబసభ్యులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృద్ధుల  కోసం    రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 37 డే కేర్  కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందన్నారు. పగలంతా వృద్ధులు ఈ కేంద్రాల్లో సేదతీరవచ్చునని,. అటల్‌ వయో అభ్యుదయ యోజన నిబంధనల మేరకు ఈ డేకేర్‌ సెంటర్లు నిర్వహించేందుకు సిద్ధం చేసిన దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం అనంతరం ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారని వివరించారు.

వృద్ధుల్లో ఒంటరి భావనను పోగొట్టేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడనున్నాయని, వీటిని వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిర్వహించనుందని, నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.4.61 కోట్లు ఖర్చు చేయనుందని,
ఒక్కో కేంద్రంలో 50 మందికి సదుపాయాలు...
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హనుమకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున, మిగతా 29 జిల్లాల్లో ఒకటి చొప్పున ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో డేకేర్‌ సెంటర్లో 50 మందికి అవసరమైన ఏర్పాట్లు ఉంటాయని,కిచెన్, వైద్యుల గది, విశాలమైన హాల్, క్యారమ్స్, టెన్నిస్, చెస్‌ వంటి ఆటవస్తువులు, లైబ్రరీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తారని, ప్రతివారం రెండుసార్లు వైద్యులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. ఇక్కడికి వచ్చే వృద్ధులకు రాగి జావ, పండ్లు, పండ్ల రసాలు, ఉప్మా, టీ, బిస్కెట్లు అందించేలా ప్రణాళికలు రూపొందించారని ,ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో డే కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు పోవడం పట్ల తమ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ పక్షాన వారికి  హరి ఆశోక్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు పి.హన్మంత రెడ్డి, ఎం.డి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు,జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు వొజ్జల బుచ్చిరెడ్డి,జగిత్యాల రూరల్ మండలం అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య,జగిత్యాల పట్టణ అధ్యక్షుడు  సీనియర్  న్యాయవాది  పి.సతీష్ రాజు ,మహిళా నేతలు కరుణ,విజయలక్ష్మి,రాధ, మంజరి, పద్మ,తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్ మే 21 (ప్రజామంటలు) : టెక్నాలజీ రంగంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయి చౌరస్తాలోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వర్దంతి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే...
Read More...
Local News 

క్యూఆర్‌ కోడ్‌ & సిటీజన్ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

క్యూఆర్‌ కోడ్‌ & సిటీజన్ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 21(ప్రజా మంటలు)    మొదటి పది స్థానాలో జిల్లా కు రెండు స్థానాలు*  *రాష్ట్ర డిజిపి శ్రీ జితేందర్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న పోలీసు అధికారులు.* ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పి  అశోక్ కుమార్   ప్రజలకు, బాధితులకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ గురించి, స్టేషన్లలోని సిబ్బంది...
Read More...
National  State News 

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ... ఉద్యమ కెరటం (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్...9440595494) నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు భారతీయ విప్లవ రాజకీయ చరిత్రలో ఒక కీలక నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. జీవితాన్ని అజ్ఞాత రాజకీయాలకు అంకితం చేసిన ఆయన, అర్ధ శతాబ్దానికి పైగా మావోయిస్టు...
Read More...
Local News 

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్  కళాశాల ప్రారంభం

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం                                             సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  మేడిపల్లి మే  21 (ప్రజా మంటలు)    జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో 2025 -26  సంవత్సరం నుండి నూతనంగా జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నకు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్బుధవారం రోజున జగిత్యాల జిల్లా మేడిపల్లి...
Read More...
Local News 

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మే 20 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక ధారుడ్యం స్నేహ భావానికి దోహదపడతాయన్నారు. విద్య తో పాటు క్రీడలు ముఖ్యమేనన్నారు.   పట్టణంలో ఒక్కో జిమ్ 14లక్షలతో పట్టణ నలు వైపులా ఏర్పాటు చేయటం జరిగిందనీ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు తో నాణ్యమైన శిక్షణ,వసతులు...
Read More...
Local News 

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.    జగిత్యాల మే 20 (ప్రజా మంటలు)   హనుమాన్ పెద్ద జయంతి కి 800 మంది సిబ్బందితో పటిష్ట భద్రత సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ   -జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జగిత్యాల మే 20 )ప్రజా మంటలు)కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన  వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని  ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.పార్టీ కార్యాలయం లో  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన  వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని,...
Read More...
Local News  State News 

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 20 మే (ప్రజా మంటలు) :  కేసీఆర్‌ కు రాజ‌కీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వ‌రం క‌మిష‌న్ నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించిన జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ...  చావునోట్లో...
Read More...
Local News 

జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్‌ కేంద్రం మంజూరు .

జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్‌ కేంద్రం మంజూరు .   -సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జగిత్యాల  మే 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో  వయోవృద్ధుల సంక్షేమం కోసం బహుళసేవల డేకేర్‌ సెంటర్  ఏర్పాటుకు   ప్రభుత్వం నిర్ణయించిందని  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.  సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం.

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం. జగిత్యాల మే 20 (ప్రజా మంటలు): నిత్యజీవితంలో తూనికలు,కొలతలు కు ఎంతో ప్రాధాన్యత ఉందని,1875 మే 20 న ప్రపంచ  తూనికలు,కొలతలు శాఖ స్థాపించిన సందర్భంగా ఈ దినోత్సవం నుజరుపుకుంటున్నామని , ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవం ప్రతి ఏటా జరుపుతున్నామని  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి...
Read More...
Local News 

ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్‌లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు

ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్‌లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు “ఒక్క రోజు ఫ్రీజర్  అవసరమైంది... కానీ దానికోసం వారం రోజుల ఖర్చు పోయింది!” సేవా భావన మాటలా? ఫ్రీజర్ బాక్స్‌లపై రూ.1000 వసూలు - ప్రజల ఆవేదన భీమదేవరపల్లి, మే 20 (ప్రజామంటలు): ఒక సీనియర్ రిపోర్టర్, మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన ఓ పేద, మధ్య తరగతి కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబంలో...
Read More...
State News  Spiritual  

ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం

 ధర్మపురిలో హనుమాన్  జయంతికి ఏర్పాట్లు ముమ్మరం (రామ కిష్టయ్య సంగన భట్ల    9440595494).   ధర్మపురి క్షేత్రంలో హన్మాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వైశాఖ బహుళ దశమి హన్మాన్ జయంతిగా భావించ బడుతున్న ఆ సందర్భాన్ని పుర స్కరించుకుని ఏటా ధర్మపురి క్షేత్రస్థ దేవస్థానంలో సాంప్రదాయ రీతిలో స్వామి జయంతి వేడుకలను వైభ వంగావ...
Read More...