ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు
“ఒక్క రోజు ఫ్రీజర్
అవసరమైంది... కానీ దానికోసం వారం రోజుల ఖర్చు పోయింది!”
సేవా భావన మాటలా? ఫ్రీజర్ బాక్స్లపై రూ.1000 వసూలు - ప్రజల ఆవేదన
భీమదేవరపల్లి, మే 20 (ప్రజామంటలు):
ఒక సీనియర్ రిపోర్టర్, మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన ఓ పేద, మధ్య తరగతి కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబంలో తలకిందులైన దినాలు. మధ్యతరగతి జీవితంలో ఓ రోజు కూడా దినసరి ప్రణాళిక కదిలిపోతే కుటుంబం గడవడం కష్టమే. అలాంటిది, ఒక్క రోజు కోసం తీసుకున్న ఫ్రీజర్ బాక్స్కు రూ.1000 వసూలు చేయడం ఆ కుటుంబాలను ఆర్థికంగా బలహీనపరిచింది. “మనసుతో ఇచ్చిన దానం కదా అది... మరి ఇప్పుడు ఇలా వసూలు చేయడం ఎందుకు?” అని ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఈ ఘటన ముల్కనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇదొక్కటే కాదు మండలంలో ఎన్నో కుటుంబాలు అనుభవిస్తున్న తీరు ఇది. ముందుగా ముల్కనూరులో జెడ్పిహెచ్ఎస్ 1988-89 బ్యాచ్, ఎదులాపురం సోదరులు, సుద్దాల కుటుంబీకులు వారితో పాటు ఇంకొందరు వంటి అనేక దాతలు గ్రామ అభివృద్ధి కోసం ఫ్రీజర్ బాక్స్లను అందించారు. కానీ ఇప్పుడు ఆ ఫ్రీజర్లు దాతల ఆశయాలకు విరుద్ధంగా వాణిజ్య ధోరణితో ఉపయోగపడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“మరణం అన్నదే సమానమయితే, సేవల విషయంలో మాత్రం ధనికులకు వేరే, పేదలకు వేరేలా ఎందుకు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పేదలకు కనీస ఖర్చులు మోయడానికే కష్టపడాల్సిన పరిస్థితుల్లో, ఫ్రీజర్ బాక్స్ కోసం భారీగా వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
“ఇది సేవా ధోరణిగా ఉండాలి. దాతలు కోరినదే అదే. లేకపోతే వాళ్ల దాతృత్వాన్ని అవమానపరచినట్టే,” అంటూ గ్రామ పెద్దలు, యువత ఒకే స్వరంతో కోరుతున్నారు.
కరాకండిగా వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే – మెయింటెనెన్స్ ఫీజులతో మెంటల్ ఎక్కుతున్న మధ్యతరగతి కుటుంబీకులు
ప్రస్తుతం ఫ్రీజర్ బాక్స్ను ఉపయోగించాలంటే ముందే రూ.1000 ను నగదు రూపంలో చెల్లించాలి. “ఇది మెయింటెనెన్స్ పేరుతో చేస్తున్న వసూలే కానీ, అసలు సేవా లక్ష్యానికి ఇది అన్యాయం,” అని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.
“ఈ ఖర్చుతో పాటు మిగిలిన అంత్యక్రియల ఖర్చులు కలిపితే, పేదవాడికి ఇది పెను భారంగా మారుతోంది,” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రీజర్ బాక్స్ కు వెయ్యి రూపాయలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఖర్చులు అదనం. దూరపు గ్రామాలైతే ఇంకా ఎక్కువ ఫీజు. ఈ పరిస్థితిని పున:సమీక్షించి, వాస్తవ ఖర్చు మేరకే వసూలు చేయాలన్నది ప్రజల ఆకాంక్ష.
More News...
<%- node_title %>
<%- node_title %>
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
బండ్లగూడ, నాగోల్ మే 14(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణ సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ ఉత్సవం గురువారం బండ్లగూడ, నాగోల్... “తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ..
హైదరాబాద్ మే 14 (ప్రజా మంటలు):తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురిస్తున్న పునాస ఎప్రిల్-జూన్ 2026 సంచికలో ప్రచురితమైన “తెలుగు సాహిత్యంలో అంబేద్కర్ ప్రభావం” వ్యాసంపై ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత, బీసీ కమీషన్ తొలి చైర్మన్ బి.ఎస్. రాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కోయి కోటేశ్వరరావుకు బహిరంగ లేఖ రాశారు.... బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత
హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.బుధవారం... కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ
కొండగట్టు మే 12 ( ప్రజా మంటలు)హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం మ స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్* ( ఎం ఎస్ ఆర్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అరటి... కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి... ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి
జగిత్యాల మే 10 (ప్రజా మంటలు)
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, ఆపి ప్రైవేంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసే కార్యక్రమం జరిగింది.
జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు, శాసన... కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు
కొండగట్టు మే 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. విశేష సంఖ్యలో భక్తుల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి
వైదిక... విద్యార్థులకు బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి. ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ
జగిత్యాల మే 10 (ప్రజా మంటలు ) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా బాల్యం నుండే అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ అన్నారు. సేవా భారతి, గీతా విద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు నిర్వహించిన సంస్కార సాధన వర్గ ముగింపు సమావేశం ఆదివారం గీతా... ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి
సారంగపూర్ మీ 10 ( ప్రజా మంటలు)మండలం లచ్చక్క పేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్టా మరియు పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు దీవెనలు అందరి పైన పైన ఉండాలనీ
అన్నింటి కన్న ప్రమాదకరమైన వృత్తి... ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సారంగాపూర్ మే 10(ప్రజా మంటలు) మండలము లచ్చక్క పేట గ్రామంలో ఎల్లమ్మ తల్లీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
రేణుక ఎల్లమ్మ దయతో పాడి పంటలు ,ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
హిందూ ధర్మ రక్షణకు అందరూ పాటుపడాలన్నారు.
ఇతర... తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు జూన్ 2 వరకు కాంగ్రెస్కు గడువు
హైదరాబాద్ మే 10 (ప్రజా మంటలు):
ఉద్యమకారుల డిమాండ్లకు మద్దతుగా, హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ 2 వరకు గడువుఅమలు లేకపోతే ఉద్యమకారులతో కలిసి ఆందోళనకు హెచ్చరిక చేస్తూ, టి ఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘాల... మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల మే 8(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బీట్ బజార్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కొనుగోలు... 