కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)
జగిత్యాల లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి సమీక్ష నిర్వహించారు.
భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేసారు.
హాజరైన ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణకుమార్, ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు భూ సమస్యలను పరిష్కరించాలనీ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టరేట్లో పైలెట్ మండలాల్లో భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరు తెన్నులు.. భూ సమస్యల పరిష్కారం.. ఆయా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో
ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణకుమార్, ఆది శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఆయా జిల్లాల్లో పైలెట్ మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
. ఉమ్మడిజిల్లా కలెక్టర్లు సమన్వయంతో కలిసి పనిచేస్తూ భూ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రజలు రైతులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజల శ్రేయస్ కోసం నిరంతరం పాటుపడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మంత్రి కలెక్టర్లకు సూచనలు సలహాలు అందజేశారు.నిర్లక్ష్యంగా వ్యవహరించే రెవెన్యూ అధికారులపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా విధంగా పనిచేసేలా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. ప్రజలు రైతుల సంక్షేమం కోసమే అధికారులు పనిచేయాలని సూచించారు. అలాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా చేపట్టాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లతా, పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
