బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)
జిల్లా
బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
జమ్ము కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో మరణించిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగినది.
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ
ఈ నెల 27 నాడు చలో వరంగల్ బి ఆర్ యస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం జగిత్యాల జిల్లాలో అన్ని
నియోజకవర్గల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని.. ప్రజలు, బి ఆర్ యస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని జగిత్యాల జిల్లా నుండి 20,000 (ఇరువై వేలు) మంది తరలి వెళ్తున్నామని..బస్సులు, కార్లు వాహనాలు సరిపోవడం లేదు..సర్దుబాటు చేసుకుంటున్నామని... కేసీఆర్ గారిని చూడటానికి ప్రజలు ఉత్సాహo కనబరుస్తున్నారని.. 15 నెలల దుర్మార్గపు పాలన.. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు.. ఏ శాఖ మంత్రి కూడా దానికి న్యాయం చేయడం లేదని, పోలీస్ వారు నిమిత్త మాతృలేనని, ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వం ఫై విసిగి పోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని, 27 నాడు బి ఆర్ యస్ జెండా ఆవిష్కరించి తరలి వెళ్లాలని దిశ నిర్దేశం చేశారు..
దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
25 వసంతాలు పూర్తి చేసుకొని 27 నాడు బి ఆర్ యస్ రజతోత్సవ సభ కోసం ప్రజలందరూ ఇంటి పార్టీ గా భావించి గులాబీ జెండా గుండెల్లో నింపుకున్నారని ప్రజలంతా
బి ఆర్ యస్ రజతోత్సవ సభ కు రావడానికి మరియు బీడీ కార్మికులు స్వచ్చందగా దారి ఖర్చుల కోసం విరాళం ఇవ్వడం చూస్తూ ఉంటే కేసీఆర్ పై ఎంతో అభిమానం చూపిస్తున్నారని, గ్రామ స్థాయి నుండి పట్టణం, మండలం, జగిత్యాల నియోజకవర్గంలో కుల సంఘాలను, వాకార్స్ అసోసియేషన్ కలిశామని,జగిత్యాల అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల కవితక్క మొన్న జగిత్యాల విచ్చేసి నియోజకవర్గం ప్రజలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.వారి ఆదేశానుసారం
జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో
ఎమ్మెల్సీ యల్ రమణ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్ ,
బి ఆర్ యస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో సమన్వయo చేసుకుంటూ సభ విజయవంతం కోసం జగిత్యాల నియోజకవర్గం నుండి 5000మంది తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు..
అనంతరం పట్టణ మరియు మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమావేశమై రజోత్సవ సభ గురించి సమీక్షించి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి సభను విజయవంతం చేయాలని బస్సులో బయలుదేరుటకు అన్ని సర్వం సిద్ధం చేసుకుని ఉండాలని అన్నారు. బస్సు ఎక్కే కార్యకర్తలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే దాకా బస్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకొని సభను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్ జగిత్యాల రూరల్ సారంగాపూర్ రాయికల్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు తెలు రాజు బర్కాం మల్లేష్ రాయికల్ కో ఆర్డినేటర్ శ్రీధర్ పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి మాజీ జడ్పీటీసీ మహేష్ మాజీ ఎంపీపీ సాయి రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు ఉప అధ్యక్షులు వొళ్ళేం మల్లేశం నాయకులు దామోదర్ రావు సమిండ్ల శ్రీను శీలం ప్రవీణ్ వెంకటేశ్వర్ రావు రాజేష్ సందయ్య హరీష్ ప్రతాప్ సన్నిత్ రావు మధు జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు)
గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఓట్ల... బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకి 9వ షెడ్యూల్ లో చేర్చాలి: జీవన్ రెడ్డి
జగిత్యాల, డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే, రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం తప్పనిసరి అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన, 50% రిజర్వేషన్ పరిమితిని అధిగమించడానికి ఇదే మార్గమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనలతో బలహీన... ముత్తారం సర్పంచ్ గా ఉరడి భారతి జైపాల్ రెడ్డి విజయం
అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తా - ఊరడి భారతి కొత్తగూడెం జాగృతి ఇన్చార్జీగా జగదీశ్ నియామకం
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా నమ్మి జగదీశ్ను నియమిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
అదే విధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సముద్రాల క్రాంతి కుమార్ను ... నేను ప్రస్తుతం బీఆర్ఎస్లో లేను. అయినా ప్రజల కోసం పోరాటం ఆగదు” : కవిత
మలక్పేట్–యాకుత్పురా "జనం బాట" పర్యటనలో కల్వకుంట్ల కవిత: విద్యార్థులు, వ్యాపారులు, వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వంపై మండిపాటు
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మలక్పేట్, సైదాబాద్, యాకుత్పురా ప్రాంతాల్లో పర్యటిస్తూ విద్యార్థులు, వ్యాపారులు, కుమ్మరి వృత్తిదారులు, స్థానిక ప్రజల సమస్యలను సమీక్షించారు.
నేను ప్రస్తుతం బీఆర్ఎస్లో లేను. అయినా... జగిత్యాల జిల్లా, గ్రామపంచాయతీ ఎన్నికల మొదటిదశలో పోలింగ్ మొత్తం 73.68% ఓటింగ్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
2025 గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అధికారిక ప్రొఫార్మా–II ప్రకారం, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,18,194 మంది నమోదైన ఓటర్లలో 1,60,761 మంది తమ ఓటు హక్కును వినియోగించారు. దీంతో జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం 73.68% వద్ద... సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ డిసెంబర్ 11(ప్రజా మంటలు)రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన ఏ.సుగుణ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 1లక్ష 20 వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వెంట నాయకులు నక్కల రవీందర్ రెడ్డి రౌతు గంగాధర్ తదితరులు... జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్నమొదటి విడత సర్పంచ్ ఎన్నికలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు)మొదటి విడత సర్పంచి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు... పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్
సికింద్రాబాద్, డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్లో 18ఏళ్ల యువతి పవిత్రపై జరిగిన క్రూరహత్య కేసులో నిందితుడు దుక్కా ఉమాశంకర్ను వారాసిగూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
డిసెంబర్ 8న జరిగిన... మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఎన్నికలు నిర్వహణకు 843 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.జగిత్యాల/కోరుట్ల మెట్పల్లి,డిసెంబర్ 10(ప్రజా మంటలు)
జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
బుధవారం బీమారం ,కోరుట్ల,మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన... శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (దొంగ మల్లన్న) జాతర కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ బుధవారం ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి కూడా స్వామి వారిని దర్శించుకుని... మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి
రాయికల్ డిసెంబర్ 10 ( ప్రజా మంటలు)మండలములోని మహితాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజనాల సుందరి-జయానందం గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో రాయికల్... 