బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)
జిల్లా
బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
జమ్ము కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో మరణించిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగినది.
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ
ఈ నెల 27 నాడు చలో వరంగల్ బి ఆర్ యస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం జగిత్యాల జిల్లాలో అన్ని
నియోజకవర్గల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని.. ప్రజలు, బి ఆర్ యస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని జగిత్యాల జిల్లా నుండి 20,000 (ఇరువై వేలు) మంది తరలి వెళ్తున్నామని..బస్సులు, కార్లు వాహనాలు సరిపోవడం లేదు..సర్దుబాటు చేసుకుంటున్నామని... కేసీఆర్ గారిని చూడటానికి ప్రజలు ఉత్సాహo కనబరుస్తున్నారని.. 15 నెలల దుర్మార్గపు పాలన.. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు.. ఏ శాఖ మంత్రి కూడా దానికి న్యాయం చేయడం లేదని, పోలీస్ వారు నిమిత్త మాతృలేనని, ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వం ఫై విసిగి పోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని, 27 నాడు బి ఆర్ యస్ జెండా ఆవిష్కరించి తరలి వెళ్లాలని దిశ నిర్దేశం చేశారు..
దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
25 వసంతాలు పూర్తి చేసుకొని 27 నాడు బి ఆర్ యస్ రజతోత్సవ సభ కోసం ప్రజలందరూ ఇంటి పార్టీ గా భావించి గులాబీ జెండా గుండెల్లో నింపుకున్నారని ప్రజలంతా
బి ఆర్ యస్ రజతోత్సవ సభ కు రావడానికి మరియు బీడీ కార్మికులు స్వచ్చందగా దారి ఖర్చుల కోసం విరాళం ఇవ్వడం చూస్తూ ఉంటే కేసీఆర్ పై ఎంతో అభిమానం చూపిస్తున్నారని, గ్రామ స్థాయి నుండి పట్టణం, మండలం, జగిత్యాల నియోజకవర్గంలో కుల సంఘాలను, వాకార్స్ అసోసియేషన్ కలిశామని,జగిత్యాల అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల కవితక్క మొన్న జగిత్యాల విచ్చేసి నియోజకవర్గం ప్రజలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.వారి ఆదేశానుసారం
జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో
ఎమ్మెల్సీ యల్ రమణ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్ ,
బి ఆర్ యస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో సమన్వయo చేసుకుంటూ సభ విజయవంతం కోసం జగిత్యాల నియోజకవర్గం నుండి 5000మంది తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు..
అనంతరం పట్టణ మరియు మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమావేశమై రజోత్సవ సభ గురించి సమీక్షించి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి సభను విజయవంతం చేయాలని బస్సులో బయలుదేరుటకు అన్ని సర్వం సిద్ధం చేసుకుని ఉండాలని అన్నారు. బస్సు ఎక్కే కార్యకర్తలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే దాకా బస్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకొని సభను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్ జగిత్యాల రూరల్ సారంగాపూర్ రాయికల్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు తెలు రాజు బర్కాం మల్లేష్ రాయికల్ కో ఆర్డినేటర్ శ్రీధర్ పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి మాజీ జడ్పీటీసీ మహేష్ మాజీ ఎంపీపీ సాయి రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు ఉప అధ్యక్షులు వొళ్ళేం మల్లేశం నాయకులు దామోదర్ రావు సమిండ్ల శ్రీను శీలం ప్రవీణ్ వెంకటేశ్వర్ రావు రాజేష్ సందయ్య హరీష్ ప్రతాప్ సన్నిత్ రావు మధు జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. టౌన్ సిఐ కరుణాకర్.
జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు)
గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి... మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు
మల్యాల, సెప్టెంబర్ 10 (ప్రజామంతలు):
మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత తన చిన్న కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం గుడిపేట శివారులోని వ్యవసాయ... *కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
జగిత్యాల, సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్... "ఫెడరల్ బ్యాంక్ "వారిచే మృత్తిక గణపతి ప్రతిమల వితరణ
ఈస్ట్ ఆనంద్ బాగ్ సెప్టెంబర్ 10( ప్రజా మంటలు)మేడ్చల్ మల్కాజ్గిరి లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో గల "ఫెడరల్ బ్యాంక్" శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సమకాలీన స్థితికి అనుకూలంగా ప్రకృతి పరిరక్షణ పేరిట మృత్తిక (మట్టి ) గణపతి ప్రతిమలను తమ బ్యాంకు ఖాతాదారులకు వితరణ చేయడానికి శ్రీకారం చుట్టారు.... #Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు
కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు.
చిన్నతనము నుండే హరుష్... ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు... జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన
జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత
హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు):
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.
హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్... కొడంగల్పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సభకు సంబంధించిన పోస్టర్ను ఆదివారం బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ... మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి... 