బాలల హక్కుల కోసం పనిచేస్తున్న ఆశ్రిత సంస్థకు జాతీయ స్థాయి అవార్డు
సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు) :
బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఉత్తమ సంస్థ అవార్డు లభించింది. అమెరికాలోని వరల్డ్ లా కాంగ్రెస్ వరల్డ్ జురియస్ట్ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు, 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్' వ్యవస్థాపకుడు భువన్ రిభు చేతుల మీదుగా ఢిల్లీ లో జరిగిన సమావేశంలో తాను ఈ అవార్డు అందుకున్నానని ఆశ్రిత సంస్థ డైరెక్టర్ ఎస్.నాగరాజ తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా అరికట్టడానికి తాము చేసిన కృషికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం తమకు ఎంతో ఆనందంగా ఉన్నదని నాగరాజు అన్నారు. దేశవ్యాప్తంగా 250 స్వచ్ఛంద సంస్థలతో నడుస్తున్న జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ లో తమ ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ కూడా భాగస్వామి కావడం తమకు సంతోషంగా ఉన్నదని నాగరాజా అన్నారు. 2008 నుండి తమ ఆశ్రిత సంస్థ, జిల్లా బాలల సంక్షేమ కమిటీ, మరియు జిల్లా సంక్షేమ విభాగం,జిల్లా బాలల రక్షణ విభాగం, పోలీసులు, కార్మిక శాఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో ఇల్లు వదిలి పారిపోయిన పిల్లలను చేరదీసి, తిరిగి కన్నవారికి అప్పగించడం, ఎవరూ లేని వారికి ఆశ్రయం కల్పించి, చదివించడం, బాల్య వివాహాలు అరికట్టడం, బాలల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా నివారించడానికి పని చేస్తున్నామని నాగరాజ తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడంలో తమ సంస్థ సిబ్బంది కృషి కూడా ఉన్నదని ఆయన అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.
