భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం
..
బుగ్గారం మే 17 (ప్రజా మంటలు)
ప్రజలు మేధావులతో చర్చించాకే
చట్టంగా రూపొందించాం..
బుగ్గారం రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
బుగ్గారంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సు ప్రారంభం
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ హాజరు..
రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసిన మంత్రి, విప్, కలెక్టర్
భూభారతి చట్టం రైతుల చుట్టమని, రైతులు, ప్రజల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో లక్షలాదిమంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు సేకరించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
శనివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం దేశంలోని రోల్ మోడల్ గా నిలుస్తుందని, 18 రాష్ట్రాలలో భూ చట్టాలపై అధ్యయనం చేశామని, అక్కడ భూ సమస్యలకు సంబంధించి ఏమేం చర్యలు చేపట్టారు తెలుసుకున్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు ఆకాంక్షల మేరకు భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదవారికి న్యాయం జరగాలని, భూమి ఉన్న ఆసాములకు ఇబ్బందులు కలగవద్దని ఉద్దేశంతోనే అద్భుతమైన చట్టాన్ని తెచ్చామని తెలిపారు.
రాష్ట్రంలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే జూన్ రెండు నుంచి రాష్ట్రంలోని పదివేల పైగా రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులకు కేటాయిస్తామని చెప్పారు. గతంలో కేసీఆర్ నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కలిసి ధరణి అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను తిప్పలు పెట్టారని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన రెవెన్యూ గ్రామ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వివిధ భూ సమస్యలకు సంబంధించి 13వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సత్వరమే పరిష్కరించేందుకు దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ప్రతి భూ సమస్యకు పరిష్కారం లభించే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించామని, తాసిల్దార్ స్థాయి నుంచి సిసిఎల్ఏ వరకు అధికారాలను వికేంద్రీకరించి రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. భూ సమస్యలకు సంబంధించి ఆపిల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నెల ఆఖరి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి పూర్తి చేస్తామని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించి తీరుతామని ఈ కార్యక్రమము ఐదేళ్ల వరకు కొనసాగుతుందని, ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ఈ నెలాఖరు వరకు ప్రతి నియోజకవర్గానికి 3500 రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఇండ్లు కట్టించి ఇస్తామని, పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు.
ధరణిలో ఉన్న లోపాల వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేకపోయాయని, గత ప్రభుత్వ హాయంలో ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పది లక్షల భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు కంప్యూటర్లోనే ఉంచింది తప్పా పరిష్కారం చూపలేకపోయిందన్నారు. భూభారతి చట్టంలో ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, భూమికి సరిహద్దులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భూ పంచాయతీలు రాకుండా చట్టంలో పలు అంశాలను పొందుపరీచామని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా భూమిని సర్వే చేసుకునే రైతులకు సంబంధించి
భవిష్యత్తులో భూ సమస్యలు రాకుండా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఇందులో భాగంగా 10956 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను కేటాయిస్తామని తెలిపారు. డిసెంబర్ 31 కి భూమి అమ్మకాలు..కొనుగోలు సంబంధించి పక్కాగా లెక్కలు తీసేలా భూభారతి చట్టంలో రూపొందించామని తెలిపారు. భూభారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజలు మెప్పు పొందే చట్టమని, అద్భుతమైన భూభారతి పథకాన్ని రైతులంతా చక్కగా వినియోగించుకోవాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టకుండా భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ధర్మపురి లో ఆర్డీవో కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ప్రకటించే జాబితాలో ధర్మపురి పేరే మొదటగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ పాలన అంటేనే పేదల కష్టాలు తీరుస్తుందన్నారు. అదేవిధంగా ఎండపల్లి బీర్పూర్ మండలాలకు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు రైతులను ప్రేమగా బాధ్యతాయుతంగా అక్కున చేర్చుకొని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం..
రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ విప్
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
రైతులు ఇబ్బందులు పడకుండా వారి భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణకుమార్ పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు తెచ్చిన ధరణి వల్ల రైతుల అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. . గత బిఆర్ఎస్ పాలకులు నాడు అధికారంలో ఉండగా బిఆర్ఎస్ పాలకులు ధర్మపురి అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసి పట్టించుకోలేదని పేర్కొన్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల అండదండలతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించానని తెలిపారు. నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. మాట్లాడుతూ
గతంలో ఎన్నడూ చూడని విధంగా కనివిని ఎరుగని రీతిలో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా పని చేస్తున్నదని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. 1975 సంవత్సరంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇందిరమ్మ ఇండ్లు నేటికీ గ్రామాల్లో చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు .
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ
రైతులు ప్రజలకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుగ్గారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, భూ సమస్యలకు సంబంధించి 844 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో అత్యధికంగా సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయనీ, భూ సమస్యలను అన్నింటిని సత్వరమే పరిష్కరిస్తామన్నారు.
గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డులు భూ రికార్డులు భద్రంగా ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు భూభారతి చట్టం ఎంతో మేలు చేస్తుందని సమస్యల పరిష్కారానికి చక్కగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పలువురు రైతులకు భూమి హక్కు పత్రాలను అందించారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి శేష వస్త్రం, గజమాలతో ఘనంగా సన్మానించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే కోవిడ్ కేసులు నమోదు

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్
