గాంధీ అలుమ్నీ, మాజీ ప్రెసిడెంట్ ప్రతాప్రెడ్డి మృతి
సికింద్రాబాద్ మే 18 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ అసోషియేషన్ మాజీ ప్రెసిడెంట్, సీనియర్ డాక్టర్ ప్రతాప్రెడ్డి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇండో అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసారు. గాంధీ మెడికల్ కాలేజీ 1967 బ్యాచ్కు చెందిన ప్రతాప్రెడ్డి స్టూడెంట్ యూనియన్ లీడర్గా పలు పదవులు నిర్వహించారు. అనంతరం గాంధీ అలుమ్నీ అసోషియేషన్ అధ్యక్షునిగా, ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ) తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా సమర్ధవంతమైన సేవలు అందించారు. గాంధీ అలుమ్నీ హెరిటేజ్ భవనంలో సోమవారం ఉదయం గాంధీ వైద్యుల సందర్శనార్ధం ప్రతాప్రెడ్డి పార్ధివదేహాన్ని ఉంచిన అనంతరం వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీ అనాటమీ విభాగానికి ఆయన భౌతికకాయాన్ని అప్పగించనున్నట్లు గాంధీ అలుమ్నీ అసోషియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జీఆర్ లింగమూర్తి తెలిపారు. ప్రతాప్ రెడ్డి మృతి పట్ల గాంధీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ వైద్యులు,అధికారులు దిగ్ర్బాంతి వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్ కేంద్రం మంజూరు .

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం.

ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు

ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
