బీబీకే ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ అభినందనీయం
గొల్లపల్లి మే 19 (ప్రజా మంటలు):
బిబికే ( భీమ్ రాజ్ పల్లి బొమ్మెన కుమార్ ) ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల నిర్వహణ అభినందనీయమని గొల్లపల్లి ఎస్సై సతీష్ అన్నారు. మండలంలోని భీమ్ రాజ్ పల్లి గ్రామంలో గత ఐదు రోజుల నిర్వహిస్తున్న బి బి కే క్రికెట్ టోర్నమెంట్ లో విజయం సాధించిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
8 జట్లు పాల్గొనగా భీమ్ రాజ్ పల్లి జట్టు విన్నర్ గా నిలిచింది. చివరి నిమిషంలో ఒక్క బంతిలో ఆరు పరుగులు తీసి జట్టును గెలిపించిన ఎనగందుల రూపేష్ ను ఎస్సై ప్రత్యేకంగా అభినందించారు. అలాగే దట్నూరు జట్టు రన్నర్ గా నిలిచింది. ఇరుజట్ల కెప్టెన్లు కంది మహేష్, నిశాంత్, మిగతా టీం ప్లేయర్లకు ఎస్ఐ సతీష్ చేతుల మీదుగా టోపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన భీమ్ రాజు పల్లి గ్రామంలో బి బి కే ట్రస్ట్ పేరిట సామాజిక సేవలు, యువతను ప్రోత్సహించేందుకు క్రీడా పోటీలు నిర్వహించడం ట్రస్ట్ ఫౌండర్ బొమ్మన కుమార్ అభినందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాడు ఆటలు పాటలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేదని నేడు సెల్ ఫోన్, డ్రగ్స్ మాయలో పడి యువత పోటీలకు దూరంగా ఉంటున్నారు అన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో యువతను ప్రోత్సహించేందుకు సామాజిక సేవలతో పాటు , క్రీడా పోటీలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. ఇలాంటి క్రీడలను యువత సద్వినియోగం చేసుకున్నట్లయితే గ్రామీణ యువతకు క్రీడలు మానసిక శారీరకంగా దోహదం చేస్తాయన్నారు. యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని జిల్లా,రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలన్నారు. మారుమూల పల్లెల నుంచి ఎందరో క్రీడాకారులు రాణించారన్నారు. డ్రగ్స్ మాయలో పడి బతుకులు నాశనం చేసుకోకుండా భవిష్యత్తులో ఎదగాలన్నారు.
బి బి కే ట్రస్ట్ అండ్ ఫౌండర్ బొమ్మన కుమార్ మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి బి బి కే ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ట్రస్టు సేవలు ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు, యువతకు ధన్యవాదాలు తెలిపారు.లీడ్ ఇండియా సామాన్వయ కర్త తాడూరి శ్రీనివాస, వంశీ కృష్ణ, తిరుపతి రావు, కాంగ్రెస్ నాయకులు కిష్టం పేట రమేష్ రెడ్డి, ములకాల శ్రీనివాస్, మద్దూరి నవీన్, నర్సింహా రెడ్డి, రాజలింగ్, సింగారపు దొంగన్న, లచ్చయ్య, కంది సత్తయ్య, రఘపతి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్ కేంద్రం మంజూరు .

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం.

ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు

ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
