తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

On
తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

.(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494)


అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.
మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో 
 జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి ఆపరేషన్ చేయించుకుని, కోలుకుని, తిరిగి అస్వస్తులై , మే 15 వతేదీ గురువారం అర్ధరాత్రి తరువాత తుది శ్వాస విడిచారు. 

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.  జగిత్యాల జైత్రయాత్రను ముందుండి నడిపించిన సారథిగా, ప్రజా ఉద్యమాలకు సిద్ధాంతాన్ని అందించిన బోధకుడిగా, నక్సలైట్ ఉద్యమం తొలి రోజుల్లో కీలకమైన నాయకుడిగా ఆయన నిలిచారు. విద్యావంతుల్లో , పౌరహక్కుల ఉద్యమ నిర్మాతల్లో ఆయన చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగి పోనివి.

ఉత్తర తెలంగాణను భూస్వామ్య పెత్తందారీతనం నుండి విముక్తి చేయడానికి జరిగిన పోరాటంలో నారాయణ ఒక గొప్ప గురువుగా ప్రజల మన్ననలు పొందారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు నిర్వహించే వారు.
 ఉద్యమంలో ఉన్నా, జైలు గోడల మధ్య ఉన్నా ప్రజల చైతన్యం కోసం నిరంతరం తపించిన ఆయనను అందరూ ప్రేమగా "నారాయణ సార్" అని పిలుచు కున్నారు.
పల్లెమీది నారాయణ, కల్లూరు  నారాయణ అని కూడా పిలుస్తారు.

1950లో కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్‌ పల్లెలో జన్మించిన పండుగ నారాయణ విద్యార్థి దశ నుండే చైతన్యంతో నిండారు. ఆ చైతన్యాన్ని ఆయన జీవితాంతం ఉద్యమంగా మలిచారు. తొలుత ఒక ప్రైవేటు పాఠశాలను నడిపిన ఆయన, 1968లో ప్రజల పక్షాన నిలిచారు. నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో వ్యాపిస్తున్న సమయంలో ఆయన ఒక సిద్ధాంత కర్తగా, ప్రజలను చైతన్యపరిచే వాగ్ధాటి కలిగిన వక్తగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. జైలు జీవితం అనుభవించినప్పటికీ, అక్కడ కూడా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనలను బోధిస్తూ ఉద్యమానికి బలమైన పునాదులు వేశారు.
1978 జూలై 17న జరిగిన జగిత్యాల రైతు కూలీ మహాసభ, ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయిన జగిత్యాల జైత్రయాత్రకు ఆయన ముఖ్య సూత్రధారుల్లో ఒకరు. ఈ యాత్ర తెలంగాణ గ్రామీణ ప్రజల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాట స్ఫూర్తిని రగిలించింది. విద్యార్థులు, యువకులు గ్రామాల్లో నిర్వహించిన చైతన్య కార్యక్రమాలతో రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములయ్యేలా చేసిన కృషిలో నారాయణ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయన వేసిన వ్యూహాలు ఉద్యమాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకువెళ్లాయి.
అయితే, కాలక్రమంలో పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై నారాయణ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేయాలన్న ఆయన ఆలోచనలకు విరుద్ధంగా పార్టీ గెరిల్లా పోరాటాలకు ప్రాధాన్యత ఇచ్చింది. రహస్య మార్గాల కంటే ప్రజలకు చేరువగా ఉండే పోరాట పద్ధతుల వైపు ఆయన మొగ్గు చూపారు. ఈ విభేదాల కారణంగానే 1982లో జైలు పాలై,1984లో జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. పార్టీని వీడినా, కేసులు కొట్టేయ బడినా, భూస్వాముల పాత పగలు ఎక్కడ వెంటాడతాయోనని, కొంత కాలం రహస్య జీవితాన్నే ఎంచుకుని, కుటుంబంతో కలిసి, నారాయణ హైదరాబాద్ వెళ్ళి,  సిటీ బస్ కండక్టర్ గా కుశాయి గూడ బస్ డిపోలో మూడో నెంబర్ రూట్ పై పని చేసి రిటర్ అయ్యారు.

పార్టీని వీడినప్పటికీ, ఆయన ఆశయాలు మాత్రం మారలేదు. భూస్వాముల దోపిడీని ఆయన ఎప్పటికీ మరచిపోలేదు. కష్టాల చీకటి ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. హైదరాబాద్‌లో సిటీ బస్సు కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ తర్వాత, పట్టణ వాతావరణం వీడి, తిరిగి జన్మ నిచ్చిన స్వగ్రామానికే తిరిగి వచ్చారు. ఉద్యమం రూపురేఖలు మారినా, ఆయన లక్ష్యం మాత్రం చెక్కుచెదరలేదు. గ్రామాల్లో సామాజిక మార్పు ఆయన హృదయంలో నిత్యం మెదులుతూనే ఉంది. తన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఆయన మిగిలిన జీవితాన్ని గడిపారు.

నేటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి తొలి బీజాలు వేసి చరిత్ర సృష్టించిన కార్య కర్తగా, నాయకుడిగా, మార్గదర్శిగా, 
నారాయణను విప్లవ చరిత్ర గుర్తుంచు కుంటుంది. నారాయణ ఆలోచనలు సాకారమైతే, ఆ పంథాలో 
 ఉద్యమాలు సాగితే  గ్రామ స్వరాజ్యం, స్థానిక పాలన , బహుజన సామాజిక అధికారం మార్పిడి ఎపుడో జరిగి వుండేదని ఆయన అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు.

నారాయణ కేవలం చరిత్రలోని ఒక పేజీ మాత్రమే కాదు, ఉద్యమాల స్ఫూర్తి. ఆయన చూపిన మార్గం నేటికీ గ్రామాల్లోని ప్రజలకు, రైతులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. నేటి మావోయిస్టు ఉద్యమానికి, పీపుల్స్ వార్‌కు ఆయన నాటిన విప్లవ బీజాలే మూలం. జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో నిలిచి ఉన్నంత కాలం, పల్లెమీది నారాయణ పేరు తరతరాలకూ గుర్తుండి పోతుంది.
ఆయన పేరు అమరవీరుల జాబితాలో కనిపించక పోయినా, ఆయన జీవితం ఒక గొప్ప శిల్పం. మానవత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఒక నిరంతర ప్రయాణం. తెలంగాణ చరిత్రలో ఉద్యమం అంటే ఏమిటో తన జీవితం ద్వారా చూపించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన.
పల్లెమీది నారాయణ సార్ ఒక యుగపురుషుడు అంటే అతిశయోక్తి కాదేమో...

Tags

More News...

Local News 

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేక  జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసిన సందర్భంగా జగిత్యాల  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  మీడియా సమావేశం...
Read More...
National  State News 

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజా మంటలు): 13 ఏళ్ల బాలిక ఆకర్షణ సతీష్ తన చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా వరుసగా ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డిజిపి డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు.  బుధవారం హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ కాలనీ లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయంలో ఆకర్షణ...
Read More...
Local News 

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు మళ్లీ ఆర్డిఓ జిల్లా కలెక్టర్ స్థాయిలోకి పోతే రైతు సమస్యలు పరిష్కారం కావు గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పేద బీద వ్యవసాయ కుటుంబాల భూ బాధితుల సమస్యలు పరిష్కారానికి ఒక మంచి దారి చూపించినాదాని, రేవంత్ రెడ్డి ఆలోచన ఒక చరిత్ర అని కొనియాడుతున్నారని జాతీయ బిసిసంక్షేమ...
Read More...
Local News 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రంలో దేవిశ్రీ గార్డెన్ లో బుధవారం నాడు నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా మహాసభ కు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ . అనంతరం  టి డబ్ల్యూ...
Read More...
Local News 

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు. ముదిరాజ్ కుల బాంధవుల ఇంటి దైవం శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర పండుగ సందర్భంగా గురువారం నాడు హస్నాబాద్ లో గల ముదిరాజ్ ల కులదైవ పెద్దమ్మ తల్లి ఆలయానికి హాజరుకావాలని...
Read More...
Local News 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.  -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.   -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి  జగిత్యాల జూన్ బుధవారం 18 (ప్రజా మంటలు) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, ఐఎంఏ  ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు.  వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్...
Read More...
Local News 

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలందరికీ  న్యాయం గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): సమైఖ్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించారు. ఇందుకోసం  సబ్బండా వర్గాలు ఏకమై ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న కానీ పేదల ఆశలు మాత్రం  నెరవేరలేకపోయాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వo పది...
Read More...
State News 

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్ సహాయం కోసం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన కుటుంబం సభ్యులు  హైదరాబాద్ జూన్ 18: బహరేన్ లోని ఆల్ మోయ్యాద్ కంపెనిలో డ్రైవర్లు గా పని చేస్తున్న తొమ్మిది మంది తెలంగాణ వాసులను ఇందనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్టు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.  జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన డ్రైవర్...
Read More...
Local News 

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జగిత్యాల జూన్ 19 (ప్రజా మంటలు): బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు  భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ కార్యవర్గాన్ని ప్రకటించారు. పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ను నియమించారు. జగిత్యాల పట్టణంలో బిజెపి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పట్టణ కార్యవర్గంతో పాటు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసే రాబోయే మున్సిపల్...
Read More...
Local News 

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి.. ఎండోమెంట్ మినిస్టర్ సురేఖకు ఫిర్యాదు    సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు):    హైదరాబాద్ సిటీలోని బోనాల జాతరకు సంబంధించి 150 డివిజన్లలోని ఆయా ఆలయాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అచ్యుత రమేష్ బుధవారం దేవాదాయ మంత్రి కొండ సురేఖను కలసి  వినతిపత్రం ఇచ్చారు. ఒకే ఆలయానికి కొందరు రెండేసి కమిటీల...
Read More...
Local News 

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు) : ఉద్యోగ సిబ్బంది నిరంతరంగా అంకిత భావంతో చేసిన కృషితోనే దక్షిణ మద్య రైల్వే జోన్ కు దేశంలోనే నాలుగవ స్థానం దక్కిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. సౌత్ సెంట్రల్...
Read More...

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి  టిపిసిసి, ఎన్‌.ఆర్‌. సెల్‌ (కన్వీనర్‌), .షేక్‌ చాంద్‌ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.   ఎన్‌.ఆర్‌.ఐ గల్ఫ్‌ అడ్వైజరీ బొర్డు మీటింగ్‌లో ఈ క్రింద1....
Read More...