తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.
.(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494)
అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.
మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో, జాండిస్ వ్యాధితో
జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి ఆపరేషన్ చేయించుకుని, కోలుకుని, తిరిగి అస్వస్తులై , మే 15 వతేదీ గురువారం అర్ధరాత్రి తరువాత తుది శ్వాస విడిచారు.
తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ. జగిత్యాల జైత్రయాత్రను ముందుండి నడిపించిన సారథిగా, ప్రజా ఉద్యమాలకు సిద్ధాంతాన్ని అందించిన బోధకుడిగా, నక్సలైట్ ఉద్యమం తొలి రోజుల్లో కీలకమైన నాయకుడిగా ఆయన నిలిచారు. విద్యావంతుల్లో , పౌరహక్కుల ఉద్యమ నిర్మాతల్లో ఆయన చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగి పోనివి.
ఉత్తర తెలంగాణను భూస్వామ్య పెత్తందారీతనం నుండి విముక్తి చేయడానికి జరిగిన పోరాటంలో నారాయణ ఒక గొప్ప గురువుగా ప్రజల మన్ననలు పొందారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు నిర్వహించే వారు.
ఉద్యమంలో ఉన్నా, జైలు గోడల మధ్య ఉన్నా ప్రజల చైతన్యం కోసం నిరంతరం తపించిన ఆయనను అందరూ ప్రేమగా "నారాయణ సార్" అని పిలుచు కున్నారు.
పల్లెమీది నారాయణ, కల్లూరు నారాయణ అని కూడా పిలుస్తారు.
1950లో కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్ పల్లెలో జన్మించిన పండుగ నారాయణ విద్యార్థి దశ నుండే చైతన్యంతో నిండారు. ఆ చైతన్యాన్ని ఆయన జీవితాంతం ఉద్యమంగా మలిచారు. తొలుత ఒక ప్రైవేటు పాఠశాలను నడిపిన ఆయన, 1968లో ప్రజల పక్షాన నిలిచారు. నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో వ్యాపిస్తున్న సమయంలో ఆయన ఒక సిద్ధాంత కర్తగా, ప్రజలను చైతన్యపరిచే వాగ్ధాటి కలిగిన వక్తగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. జైలు జీవితం అనుభవించినప్పటికీ, అక్కడ కూడా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనలను బోధిస్తూ ఉద్యమానికి బలమైన పునాదులు వేశారు.
1978 జూలై 17న జరిగిన జగిత్యాల రైతు కూలీ మహాసభ, ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయిన జగిత్యాల జైత్రయాత్రకు ఆయన ముఖ్య సూత్రధారుల్లో ఒకరు. ఈ యాత్ర తెలంగాణ గ్రామీణ ప్రజల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాట స్ఫూర్తిని రగిలించింది. విద్యార్థులు, యువకులు గ్రామాల్లో నిర్వహించిన చైతన్య కార్యక్రమాలతో రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములయ్యేలా చేసిన కృషిలో నారాయణ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయన వేసిన వ్యూహాలు ఉద్యమాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకువెళ్లాయి.
అయితే, కాలక్రమంలో పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై నారాయణ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేయాలన్న ఆయన ఆలోచనలకు విరుద్ధంగా పార్టీ గెరిల్లా పోరాటాలకు ప్రాధాన్యత ఇచ్చింది. రహస్య మార్గాల కంటే ప్రజలకు చేరువగా ఉండే పోరాట పద్ధతుల వైపు ఆయన మొగ్గు చూపారు. ఈ విభేదాల కారణంగానే 1982లో జైలు పాలై,1984లో జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. పార్టీని వీడినా, కేసులు కొట్టేయ బడినా, భూస్వాముల పాత పగలు ఎక్కడ వెంటాడతాయోనని, కొంత కాలం రహస్య జీవితాన్నే ఎంచుకుని, కుటుంబంతో కలిసి, నారాయణ హైదరాబాద్ వెళ్ళి, సిటీ బస్ కండక్టర్ గా కుశాయి గూడ బస్ డిపోలో మూడో నెంబర్ రూట్ పై పని చేసి రిటర్ అయ్యారు.
పార్టీని వీడినప్పటికీ, ఆయన ఆశయాలు మాత్రం మారలేదు. భూస్వాముల దోపిడీని ఆయన ఎప్పటికీ మరచిపోలేదు. కష్టాల చీకటి ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. హైదరాబాద్లో సిటీ బస్సు కండక్టర్గా పనిచేసి పదవీ విరమణ తర్వాత, పట్టణ వాతావరణం వీడి, తిరిగి జన్మ నిచ్చిన స్వగ్రామానికే తిరిగి వచ్చారు. ఉద్యమం రూపురేఖలు మారినా, ఆయన లక్ష్యం మాత్రం చెక్కుచెదరలేదు. గ్రామాల్లో సామాజిక మార్పు ఆయన హృదయంలో నిత్యం మెదులుతూనే ఉంది. తన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఆయన మిగిలిన జీవితాన్ని గడిపారు.
నేటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి తొలి బీజాలు వేసి చరిత్ర సృష్టించిన కార్య కర్తగా, నాయకుడిగా, మార్గదర్శిగా,
నారాయణను విప్లవ చరిత్ర గుర్తుంచు కుంటుంది. నారాయణ ఆలోచనలు సాకారమైతే, ఆ పంథాలో
ఉద్యమాలు సాగితే గ్రామ స్వరాజ్యం, స్థానిక పాలన , బహుజన సామాజిక అధికారం మార్పిడి ఎపుడో జరిగి వుండేదని ఆయన అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు.
నారాయణ కేవలం చరిత్రలోని ఒక పేజీ మాత్రమే కాదు, ఉద్యమాల స్ఫూర్తి. ఆయన చూపిన మార్గం నేటికీ గ్రామాల్లోని ప్రజలకు, రైతులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. నేటి మావోయిస్టు ఉద్యమానికి, పీపుల్స్ వార్కు ఆయన నాటిన విప్లవ బీజాలే మూలం. జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో నిలిచి ఉన్నంత కాలం, పల్లెమీది నారాయణ పేరు తరతరాలకూ గుర్తుండి పోతుంది.
ఆయన పేరు అమరవీరుల జాబితాలో కనిపించక పోయినా, ఆయన జీవితం ఒక గొప్ప శిల్పం. మానవత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఒక నిరంతర ప్రయాణం. తెలంగాణ చరిత్రలో ఉద్యమం అంటే ఏమిటో తన జీవితం ద్వారా చూపించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన.
పల్లెమీది నారాయణ సార్ ఒక యుగపురుషుడు అంటే అతిశయోక్తి కాదేమో...
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
