సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

On
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

 ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు

 (రామకిష్టయ్య సంగనభట్ల...
     9440595494)

కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి ఏదన్నా తింటారు. సంకట చతుర్థి ప్రాముఖ్యత భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణంలోనూ చెప్పబడింది.  సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడు యుధిష్టరునికి వివరించాడు. సంకట అంటే కష్టములు, ఇబ్బందులు, సమస్యలను హర అంటే హరించేది అని అర్థం.

ఋగ్వేదంలో గణపతి వేదాలు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వవ్యాపక భక్తుల ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని, సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు. గణపత్యధర్వ శీర్షోపనిషత్తులో గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త హర్త అని ఆనందమయుడని చిన్మయుడని, లంబోదరుడని, శూర్ప కర్ణుడు రక్తం గుడిగా అభివర్ణించారు. అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని సంకట హరుడుగా  పూజించడం అనాదిగా వస్తున్నదే. సంకటహరుని పూజించడానికి కృష్ణ పక్ష చతుర్థి ప్రసిద్ధి. సంకట హర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు, ధర్మ రాజుకు వివరించినట్లు పురాణ కథనం.

 

సంకట హర చతుర్థి ప్రత్యేకత

కృష్ణ పక్ష చతుర్థి సంకష్టహర, సంకటహర చతుర్థి అంటారు. ఈరోజు దినమంతా ఉపవాస ముండి, సాయంత్రం , నిశి పూజ, చంద్రదర్శనానంతరం భోజనాలు చేయడం, నిర్దేశిత ఆచారం. ఇలా చేస్తే సకల కష్టాలు, సంకటాలు తొలగి పోయి, సంకట నాశకుడైన విఘ్న నాయకుని కృపకు పాత్రులు, జన్మరాహిత్యం , మోక్షం సిద్ధించి, సప్త జన్మలు అవసరం లేకనే శాశ్వత గణేశ లోక ప్రాప్తి కలుగనున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. తలపెట్టిన పనులకు విఘ్నాలు కలుగుతూ అశాంతి, మానసిక, శారీరిక రుగ్మతలు, రుణ బాధలు, అనేక కష్టాలు కలుగుతున్నప్పుడు దుష్టగ్రహ పీడన నివారణ కొరకై ప్రతి నెలా సంకష్టహర చవితి నాడు యథాశక్తి విఘ్నేశ్వరుని పూజలు జరపడం సంప్రదాయం.
సంకట హర చతుర్థి నాడు కలశ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహా గణపతి అధర్వ శీర్ష పూజలు, అభిషేకం, అష్టోత్తర అర్చనలు, నివేదన, హారతి, మంత్రపుష్పం, నీరాజన, తీర్థ ప్రసాద వితరణాది సాంప్రదాయక క్రతువులను నిర్వహించడం, భక్తుల గోత్రనామాదులతో ప్రత్యేక అర్చనలు, గణపతి ఉపనిషత్ యుక్త అభిషేకా దులను నిర్వహించు కోవడం, భక్తులు తమ స్వగృహాల లోనూ గణపతి పూజ  లొనరించి రాత్రి చంద్ర దర్శనానంతరం అరగించడం సనాతన సంప్రదాయం. సంకష్ట చతుర్థి నాడు వినాయక వ్రతాచరణ ద్వారా కుజ దోష సమస్యలు తొలగి పోగలవని, సంకటాలన్ని తొలిగి సఫలత లభించగలదని వరం ప్రసాదించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

 ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు

శుక్ర వారం  కృష్ణ పక్ష చతుర్థి సందర్భంగా 
ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీరామ లింగేశ్వర ఆలయ సంబంధిత ఈశాన్య గణపతికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఉపనిషత్తులతో అబిషేకం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  గారు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు అద్యక్షులు జక్కు రవీందర్, సభ్యులు, మాజి దేవస్థానం అధ్యక్షులు సంగన భట్ల దినేష్,  సూపరింటెండెంట్ కిరణ్, వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , స్థానిక వేదపండితులు మధు రామ శర్మ , అర్చకులు  విశ్వనాథ శర్మ బొజ్జ సంపత్ కుమార్ రాజగోపాల్, ద్యావళ్ల సాయికుమార్ అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు హైదరాబాద్ మే 16 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో  పుణ్యశ్లోక లోకమాత రాణి  అహల్యబాయి హోల్కర్  300వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ జి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు...
Read More...
Local News 

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి . రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)జగిత్యాల లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై కలెక్టర్లకు...
Read More...
State News  Spiritual  

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి    ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు  (రామకిష్టయ్య సంగనభట్ల...          9440595494)కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి...
Read More...
Local News  State News 

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ. .(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో   జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి తెలంగాణ...
Read More...
Local News 

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు* *   తెలంగాణ విద్యాశాఖ పరిశీలకులు డి. దుర్గ ప్రసాద్ జగిత్యాల మే 16(ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఏక రూప దుస్తులను ప్రతి విద్యార్ధి కొలతల ప్రకారం మంచి నాణ్యతతో కుట్టించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు అన్నారు. జగిత్యాల అర్బన్...
Read More...
Local News 

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు *ఈరోజు వేడుకలు ప్రారంభం సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ  విశాల్ జాగరన్ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు బీఎన్.శ్రీనివాస్ తెలిపారు.శుక్రవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా వైష్ణో  దేవి జాగరన్ మండల్ ఆధ్వర్యములో ప్రతి ఏటా వైభవంగా...
Read More...
Local News 

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ సికింద్రాబాద్ మే16 (ప్రజామంటలు): జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఎంటమాలాజీ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం న్యూ బోయిగూడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచుకోవద్దని, డెంగ్యూ దోమలతో కలుగు ప్రాణాంతకమైన జబ్బుల గురించి స్థానికులకు వివరించారు. ప్రతివారం ఒకరోజు డ్రై డేగా పాటించి ఇంటి పరిసరాల్లో ఉన్న నిల్వ నీటిని...
Read More...
Local News 

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద  చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద  చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు - భోలక్ పూర్ లో ఉచిత వైద్య శిభిరం సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా వైద్యం పొందాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు అన్నారు. శుక్రవారం జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, కిమ్స్...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం అభా ఐడి తో రోగుల రికార్డులు డిజిటల్ నమోదుపై అధ్యయనంస్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపి పై ఆరా... సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): ఆయుష్మాన్ భారత్(అభా) డిజిటల్ మిషన్ వర్క్ షాప్ లో భాగంగా, 18 రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రల  నోడల్ అధికారులు శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.సికింద్రాబాద్ గాంధీ...
Read More...
Local News 

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం జగిత్యాల మే 16  (ప్రజా మంటలు)2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను SC/ST/BC/OC/MINORITY విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ (ఉపకార వేతనములు) లకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ:31-05-2025. 2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి SC/ST/BC/OC/MINORITY విద్యార్థులు అన్ లైన్...
Read More...
Local News 

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి      జగిత్యాల మే 16 (ప్రజా మంటలు) *ధాన్యం కొనుగోలు, రేషన్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్*   యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ  వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని ధాన్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శుక్రవారం...
Read More...
Local News 

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)   బుగ్గారం మండల కేంద్రంలో శనివారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జరుగనున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జిల్లా ఎస్పీ అశోక్...
Read More...