సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

On
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

 ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు

 (రామకిష్టయ్య సంగనభట్ల...
     9440595494)

కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి ఏదన్నా తింటారు. సంకట చతుర్థి ప్రాముఖ్యత భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణంలోనూ చెప్పబడింది.  సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడు యుధిష్టరునికి వివరించాడు. సంకట అంటే కష్టములు, ఇబ్బందులు, సమస్యలను హర అంటే హరించేది అని అర్థం.

ఋగ్వేదంలో గణపతి వేదాలు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వవ్యాపక భక్తుల ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని, సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు. గణపత్యధర్వ శీర్షోపనిషత్తులో గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త హర్త అని ఆనందమయుడని చిన్మయుడని, లంబోదరుడని, శూర్ప కర్ణుడు రక్తం గుడిగా అభివర్ణించారు. అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని సంకట హరుడుగా  పూజించడం అనాదిగా వస్తున్నదే. సంకటహరుని పూజించడానికి కృష్ణ పక్ష చతుర్థి ప్రసిద్ధి. సంకట హర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు, ధర్మ రాజుకు వివరించినట్లు పురాణ కథనం.

 

సంకట హర చతుర్థి ప్రత్యేకత

కృష్ణ పక్ష చతుర్థి సంకష్టహర, సంకటహర చతుర్థి అంటారు. ఈరోజు దినమంతా ఉపవాస ముండి, సాయంత్రం , నిశి పూజ, చంద్రదర్శనానంతరం భోజనాలు చేయడం, నిర్దేశిత ఆచారం. ఇలా చేస్తే సకల కష్టాలు, సంకటాలు తొలగి పోయి, సంకట నాశకుడైన విఘ్న నాయకుని కృపకు పాత్రులు, జన్మరాహిత్యం , మోక్షం సిద్ధించి, సప్త జన్మలు అవసరం లేకనే శాశ్వత గణేశ లోక ప్రాప్తి కలుగనున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. తలపెట్టిన పనులకు విఘ్నాలు కలుగుతూ అశాంతి, మానసిక, శారీరిక రుగ్మతలు, రుణ బాధలు, అనేక కష్టాలు కలుగుతున్నప్పుడు దుష్టగ్రహ పీడన నివారణ కొరకై ప్రతి నెలా సంకష్టహర చవితి నాడు యథాశక్తి విఘ్నేశ్వరుని పూజలు జరపడం సంప్రదాయం.
సంకట హర చతుర్థి నాడు కలశ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహా గణపతి అధర్వ శీర్ష పూజలు, అభిషేకం, అష్టోత్తర అర్చనలు, నివేదన, హారతి, మంత్రపుష్పం, నీరాజన, తీర్థ ప్రసాద వితరణాది సాంప్రదాయక క్రతువులను నిర్వహించడం, భక్తుల గోత్రనామాదులతో ప్రత్యేక అర్చనలు, గణపతి ఉపనిషత్ యుక్త అభిషేకా దులను నిర్వహించు కోవడం, భక్తులు తమ స్వగృహాల లోనూ గణపతి పూజ  లొనరించి రాత్రి చంద్ర దర్శనానంతరం అరగించడం సనాతన సంప్రదాయం. సంకష్ట చతుర్థి నాడు వినాయక వ్రతాచరణ ద్వారా కుజ దోష సమస్యలు తొలగి పోగలవని, సంకటాలన్ని తొలిగి సఫలత లభించగలదని వరం ప్రసాదించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

 ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు

శుక్ర వారం  కృష్ణ పక్ష చతుర్థి సందర్భంగా 
ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీరామ లింగేశ్వర ఆలయ సంబంధిత ఈశాన్య గణపతికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఉపనిషత్తులతో అబిషేకం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  గారు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు అద్యక్షులు జక్కు రవీందర్, సభ్యులు, మాజి దేవస్థానం అధ్యక్షులు సంగన భట్ల దినేష్,  సూపరింటెండెంట్ కిరణ్, వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , స్థానిక వేదపండితులు మధు రామ శర్మ , అర్చకులు  విశ్వనాథ శర్మ బొజ్జ సంపత్ కుమార్ రాజగోపాల్, ద్యావళ్ల సాయికుమార్ అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేక  జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసిన సందర్భంగా జగిత్యాల  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  మీడియా సమావేశం...
Read More...
National  State News 

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజా మంటలు): 13 ఏళ్ల బాలిక ఆకర్షణ సతీష్ తన చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా వరుసగా ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డిజిపి డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు.  బుధవారం హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ కాలనీ లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయంలో ఆకర్షణ...
Read More...
Local News 

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు మళ్లీ ఆర్డిఓ జిల్లా కలెక్టర్ స్థాయిలోకి పోతే రైతు సమస్యలు పరిష్కారం కావు గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పేద బీద వ్యవసాయ కుటుంబాల భూ బాధితుల సమస్యలు పరిష్కారానికి ఒక మంచి దారి చూపించినాదాని, రేవంత్ రెడ్డి ఆలోచన ఒక చరిత్ర అని కొనియాడుతున్నారని జాతీయ బిసిసంక్షేమ...
Read More...
Local News 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రంలో దేవిశ్రీ గార్డెన్ లో బుధవారం నాడు నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా మహాసభ కు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ . అనంతరం  టి డబ్ల్యూ...
Read More...
Local News 

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు. ముదిరాజ్ కుల బాంధవుల ఇంటి దైవం శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర పండుగ సందర్భంగా గురువారం నాడు హస్నాబాద్ లో గల ముదిరాజ్ ల కులదైవ పెద్దమ్మ తల్లి ఆలయానికి హాజరుకావాలని...
Read More...
Local News 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.  -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.   -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి  జగిత్యాల జూన్ బుధవారం 18 (ప్రజా మంటలు) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, ఐఎంఏ  ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు.  వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్...
Read More...
Local News 

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలందరికీ  న్యాయం గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): సమైఖ్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించారు. ఇందుకోసం  సబ్బండా వర్గాలు ఏకమై ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న కానీ పేదల ఆశలు మాత్రం  నెరవేరలేకపోయాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వo పది...
Read More...
State News 

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్ సహాయం కోసం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన కుటుంబం సభ్యులు  హైదరాబాద్ జూన్ 18: బహరేన్ లోని ఆల్ మోయ్యాద్ కంపెనిలో డ్రైవర్లు గా పని చేస్తున్న తొమ్మిది మంది తెలంగాణ వాసులను ఇందనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్టు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.  జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన డ్రైవర్...
Read More...
Local News 

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జగిత్యాల జూన్ 19 (ప్రజా మంటలు): బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు  భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ కార్యవర్గాన్ని ప్రకటించారు. పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ను నియమించారు. జగిత్యాల పట్టణంలో బిజెపి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పట్టణ కార్యవర్గంతో పాటు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసే రాబోయే మున్సిపల్...
Read More...
Local News 

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి.. ఎండోమెంట్ మినిస్టర్ సురేఖకు ఫిర్యాదు    సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు):    హైదరాబాద్ సిటీలోని బోనాల జాతరకు సంబంధించి 150 డివిజన్లలోని ఆయా ఆలయాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అచ్యుత రమేష్ బుధవారం దేవాదాయ మంత్రి కొండ సురేఖను కలసి  వినతిపత్రం ఇచ్చారు. ఒకే ఆలయానికి కొందరు రెండేసి కమిటీల...
Read More...
Local News 

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు) : ఉద్యోగ సిబ్బంది నిరంతరంగా అంకిత భావంతో చేసిన కృషితోనే దక్షిణ మద్య రైల్వే జోన్ కు దేశంలోనే నాలుగవ స్థానం దక్కిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. సౌత్ సెంట్రల్...
Read More...

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి  టిపిసిసి, ఎన్‌.ఆర్‌. సెల్‌ (కన్వీనర్‌), .షేక్‌ చాంద్‌ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.   ఎన్‌.ఆర్‌.ఐ గల్ఫ్‌ అడ్వైజరీ బొర్డు మీటింగ్‌లో ఈ క్రింద1....
Read More...