ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*
గొల్లపల్లి మే 17 (ప్రజా మంటలు):
*రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో బాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో శనివారం రోజున బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన భూ భారతి సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ తో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,జిల్లా కలెక్టర్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు నుండి ఇట్టి చట్టం పైన ఉన్న సందేహాలను,సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని అట్టి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.అనంతరం ఇట్టి చట్టం కింద పరిష్కరించిన పలు సమస్యలకు సంబంధిచిన ప్రొసీడింగ్స్ కాపీలను దరఖాస్తుదారుల అందజేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవిప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.ఖమ్మం గడ్డపైన అప్పటి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం రావడం జరిగిందనీ,ఎన్నికల్లో గెలిచిన ఓడిన నిరంతరం ప్రజల మధ్య ఉండటం జరిగిందని,ఒక దళిత వర్గం నుండి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎస్సీ కార్పరేషన్ చైర్మన్గా ఎమ్మెల్యేగా,విప్ గా ఈ హోదాలో కొనసాగడం జరుగుతుందని,ఇటీవల గోదావరిలో నీటి మట్టం తక్కువ ఉన్నందున గోదావరిలో నీటిని విడుదల చేయాలని సీఎం దృష్టికి, మంత్రివర్యులు ఉత్తం కుమార్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు స్పందించి ఇరిగేషన్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి జీవన్ రెడ్డి తో కలిసి వెళ్ళి నీటిని విడుదల చేయించడం జరిగిందని తెలిపారు.
లిఫ్ట్ ల మీద అదరపడి సాగు చేసుకునే రైతాంగానికి మేలు జరిగే విధానంగా వాటిని మరమ్మతులు చేయించి వాటి నిర్వహణ కూడా ప్రభుత్వమే నిర్వహించే బాధ్యత తీసుకోవాలని ఉత్తం కుమార్ రెడ్డి ని కోరడం జరిగిందనీ,తలపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రాంతానికి నీటిని అందించకుండా అదనపు టీఎంసీ పేరిట వెల్గటూర్ మండలానికి చెందిన ఎంతో విలువ గల రైతుల భూములను లాకున్న అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ కనీసం పట్టించుకోలేదనీ,ధర్మపురి ప్రాంతానికి సంబంధించి 6 మండలాలు ఉంటాయని,ఇక్కడ రెవెన్యూ పరంగా కొంత ఇబ్బందులు ఉన్నాయని,కావున రెవెన్యూ డివిజన్ ఏర్పాటూ చేయాలని,అదే విధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ధర్మపురిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గమాట్లాడుతూ.
చాలా సుదీర్ఘమైన కష్ట నష్టలు ఎదుర్కొని ఎటువంటి ఇబ్బందులు ఉన్న కష్టాన్ని దిగమింగుకొని,మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ ఉన్న కూడా లక్ష్మణ్ కుమార్ ప్రజలు గెలిపించుకోవడం జరిగిందనీ,దొర మధ్య ఒక నలుగురు కలిసి రూపించింది ధరణి ఐతే ప్రజలతో,అధికారులతో చర్చించి అద్భుతంగా రూపించిందింది భూ భారతి చట్టం అని,ప్రతి ఒక్కరికీ చుట్టంల ఉండే చట్టం భూ భారతి చట్టమని,మొదటి సారిగా రెవెన్యూ అధికారులను ప్రజల వద్దకే పంపి భూ సమాస్యలను పరిష్కరించడం జరుగుతుందని,ఏ అధికారులైన ఉద్దేశ పూర్వకంగా తప్పు చేస్తే వారి పైన చట్ట పరంగా చర్యలు తీసుకునే విదంగా చట్టంలో పొందు పర్చడం జరిగిందని,గత ప్రభుత్వంలో సదా బైనామలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రచారం చేశారు కానీ,అది ఆచరణలో అమలు కాలేదని,ధరణి కారణంగా జరిగిన పొరపాట్లను తిరిగి పరిష్కరించే విధంగా ఈ పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగిందనీ,మీకు సంబంధించి ఏటువంటి తప్పు జరిగిన దాన్ని మీ పై అధికారికి దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇవ్వడం జరిగిందనీ,ఏ రైతు అన్న స్వచ్ఛందగా సర్వే చేయించుకున్న అట్టి మ్యాప్ ను కూడా పాస్ బుక్కులో నమోదు చేయడం జరుగుతుందనీ,దీని గురించి ప్రత్యేకంగా 6 వేల మంది సర్వేయర్లకు లైసెన్స్ ఇచ్చి నియమించడం జరుగుతుందనీ,గతంలో వంశ పరాపర్యంగా వచ్చిన భూమిని మ్యుటేషన్ చేసుకునేందుకు 30 రోజులు గడువును ఇచ్చి మ్యుటేషన్ ఇవ్వడం జరుగుతుందనీ,ప్రభుత్వ భూములను కబ్జాదారుల ఇవ్వకుండా అధికారులు పనిచేయాలని ఆదేశిస్తున్నామని,రైతులు ఏదైనా ఆవసరం కోసం వస్తే అధికారులు చిదరించుకోకుండా అట్టి సమస్యలను పరిష్కరించాలని,ఎండపెల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు పక్క భవనం లేదని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని దాని శాంక్షన్ చేస్తున్నామని,అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఒక్క రెవెన్యూ డివిజన్ ప్రభుత్వం నుండి మంజూరు చేస్తే అది ధర్మపురికి వచ్చే విధంగా నేను చూస్తాననీ,సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ధర్మపురిలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలని,పేదవారికి ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందనీ,డబ్బులు ఉన్న లేకున్న తల తాకట్టు పెట్టీ అయినా ఇల్లు కట్టుకుందాం అనే వారికి ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు వివిధ శాఖల అధికారులు వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, ముస్కు నిశాంత్ రెడ్డి, శైలేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే కోవిడ్ కేసులు నమోదు

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్
