ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

On
ప్రతి ఒక్కరికీ

గొల్లపల్లి మే 17 (ప్రజా మంటలు):

*రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో బాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో శనివారం రోజున బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన భూ భారతి సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ తో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,జిల్లా కలెక్టర్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు నుండి ఇట్టి చట్టం పైన ఉన్న సందేహాలను,సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని అట్టి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.అనంతరం ఇట్టి చట్టం కింద పరిష్కరించిన పలు సమస్యలకు సంబంధిచిన ప్రొసీడింగ్స్ కాపీలను దరఖాస్తుదారుల అందజేసారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవిప్ లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ.ఖమ్మం గడ్డపైన అప్పటి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం రావడం జరిగిందనీ,ఎన్నికల్లో గెలిచిన ఓడిన నిరంతరం ప్రజల మధ్య ఉండటం జరిగిందని,ఒక దళిత వర్గం నుండి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎస్సీ కార్పరేషన్ చైర్మన్గా ఎమ్మెల్యేగా,విప్ గా ఈ హోదాలో కొనసాగడం జరుగుతుందని,ఇటీవల గోదావరిలో నీటి మట్టం తక్కువ ఉన్నందున గోదావరిలో నీటిని విడుదల చేయాలని సీఎం దృష్టికి, మంత్రివర్యులు ఉత్తం కుమార్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు స్పందించి ఇరిగేషన్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి జీవన్ రెడ్డి తో కలిసి వెళ్ళి నీటిని విడుదల చేయించడం జరిగిందని తెలిపారు.

లిఫ్ట్ ల మీద అదరపడి సాగు చేసుకునే రైతాంగానికి మేలు జరిగే విధానంగా వాటిని మరమ్మతులు చేయించి వాటి నిర్వహణ కూడా ప్రభుత్వమే నిర్వహించే బాధ్యత తీసుకోవాలని ఉత్తం కుమార్ రెడ్డి ని కోరడం జరిగిందనీ,తలపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రాంతానికి నీటిని అందించకుండా అదనపు టీఎంసీ పేరిట వెల్గటూర్ మండలానికి చెందిన ఎంతో విలువ గల రైతుల భూములను లాకున్న అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ కనీసం పట్టించుకోలేదనీ,ధర్మపురి ప్రాంతానికి సంబంధించి 6 మండలాలు ఉంటాయని,ఇక్కడ రెవెన్యూ పరంగా కొంత ఇబ్బందులు ఉన్నాయని,కావున రెవెన్యూ డివిజన్ ఏర్పాటూ చేయాలని,అదే విధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ధర్మపురిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గమాట్లాడుతూ.
చాలా సుదీర్ఘమైన కష్ట నష్టలు ఎదుర్కొని ఎటువంటి ఇబ్బందులు ఉన్న కష్టాన్ని దిగమింగుకొని,మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ ఉన్న కూడా లక్ష్మణ్ కుమార్  ప్రజలు గెలిపించుకోవడం జరిగిందనీ,దొర మధ్య ఒక నలుగురు కలిసి రూపించింది ధరణి ఐతే ప్రజలతో,అధికారులతో చర్చించి అద్భుతంగా రూపించిందింది భూ భారతి చట్టం అని,ప్రతి ఒక్కరికీ చుట్టంల ఉండే చట్టం భూ భారతి చట్టమని,మొదటి సారిగా రెవెన్యూ అధికారులను ప్రజల వద్దకే పంపి భూ సమాస్యలను పరిష్కరించడం జరుగుతుందని,ఏ అధికారులైన ఉద్దేశ పూర్వకంగా తప్పు చేస్తే వారి పైన చట్ట పరంగా చర్యలు తీసుకునే విదంగా చట్టంలో పొందు పర్చడం జరిగిందని,గత ప్రభుత్వంలో సదా బైనామలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు  అని ప్రచారం చేశారు  కానీ,అది ఆచరణలో అమలు కాలేదని,ధరణి కారణంగా జరిగిన పొరపాట్లను తిరిగి పరిష్కరించే విధంగా ఈ పోర్టల్ను  ఏర్పాటు చేయడం జరిగిందనీ,మీకు సంబంధించి ఏటువంటి తప్పు జరిగిన దాన్ని మీ పై అధికారికి దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇవ్వడం జరిగిందనీ,ఏ రైతు అన్న స్వచ్ఛందగా సర్వే చేయించుకున్న అట్టి మ్యాప్ ను కూడా పాస్ బుక్కులో నమోదు చేయడం జరుగుతుందనీ,దీని గురించి ప్రత్యేకంగా 6 వేల మంది సర్వేయర్లకు లైసెన్స్ ఇచ్చి నియమించడం జరుగుతుందనీ,గతంలో వంశ పరాపర్యంగా వచ్చిన భూమిని మ్యుటేషన్ చేసుకునేందుకు 30 రోజులు గడువును ఇచ్చి మ్యుటేషన్ ఇవ్వడం జరుగుతుందనీ,ప్రభుత్వ భూములను కబ్జాదారుల ఇవ్వకుండా అధికారులు పనిచేయాలని ఆదేశిస్తున్నామని,రైతులు ఏదైనా ఆవసరం కోసం వస్తే అధికారులు చిదరించుకోకుండా అట్టి సమస్యలను పరిష్కరించాలని,ఎండపెల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు పక్క భవనం లేదని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని దాని శాంక్షన్ చేస్తున్నామని,అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఒక్క రెవెన్యూ డివిజన్ ప్రభుత్వం నుండి మంజూరు చేస్తే అది ధర్మపురికి వచ్చే విధంగా నేను చూస్తాననీ,సబ్  రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ధర్మపురిలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలని,పేదవారికి ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందనీ,డబ్బులు ఉన్న లేకున్న తల తాకట్టు పెట్టీ అయినా ఇల్లు కట్టుకుందాం అనే వారికి ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు వివిధ శాఖల అధికారులు వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, ముస్కు నిశాంత్ రెడ్డి, శైలేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

Local News 

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేక  జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసిన సందర్భంగా జగిత్యాల  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  మీడియా సమావేశం...
Read More...
National  State News 

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజా మంటలు): 13 ఏళ్ల బాలిక ఆకర్షణ సతీష్ తన చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా వరుసగా ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డిజిపి డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు.  బుధవారం హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ కాలనీ లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయంలో ఆకర్షణ...
Read More...
Local News 

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు మళ్లీ ఆర్డిఓ జిల్లా కలెక్టర్ స్థాయిలోకి పోతే రైతు సమస్యలు పరిష్కారం కావు గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పేద బీద వ్యవసాయ కుటుంబాల భూ బాధితుల సమస్యలు పరిష్కారానికి ఒక మంచి దారి చూపించినాదాని, రేవంత్ రెడ్డి ఆలోచన ఒక చరిత్ర అని కొనియాడుతున్నారని జాతీయ బిసిసంక్షేమ...
Read More...
Local News 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రంలో దేవిశ్రీ గార్డెన్ లో బుధవారం నాడు నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా మహాసభ కు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ . అనంతరం  టి డబ్ల్యూ...
Read More...
Local News 

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు. ముదిరాజ్ కుల బాంధవుల ఇంటి దైవం శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర పండుగ సందర్భంగా గురువారం నాడు హస్నాబాద్ లో గల ముదిరాజ్ ల కులదైవ పెద్దమ్మ తల్లి ఆలయానికి హాజరుకావాలని...
Read More...
Local News 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.  -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.   -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి  జగిత్యాల జూన్ బుధవారం 18 (ప్రజా మంటలు) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, ఐఎంఏ  ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు.  వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్...
Read More...
Local News 

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలందరికీ  న్యాయం గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): సమైఖ్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించారు. ఇందుకోసం  సబ్బండా వర్గాలు ఏకమై ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న కానీ పేదల ఆశలు మాత్రం  నెరవేరలేకపోయాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వo పది...
Read More...
State News 

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్ సహాయం కోసం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన కుటుంబం సభ్యులు  హైదరాబాద్ జూన్ 18: బహరేన్ లోని ఆల్ మోయ్యాద్ కంపెనిలో డ్రైవర్లు గా పని చేస్తున్న తొమ్మిది మంది తెలంగాణ వాసులను ఇందనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్టు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.  జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన డ్రైవర్...
Read More...
Local News 

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జగిత్యాల జూన్ 19 (ప్రజా మంటలు): బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు  భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ కార్యవర్గాన్ని ప్రకటించారు. పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ను నియమించారు. జగిత్యాల పట్టణంలో బిజెపి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పట్టణ కార్యవర్గంతో పాటు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసే రాబోయే మున్సిపల్...
Read More...
Local News 

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి.. ఎండోమెంట్ మినిస్టర్ సురేఖకు ఫిర్యాదు    సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు):    హైదరాబాద్ సిటీలోని బోనాల జాతరకు సంబంధించి 150 డివిజన్లలోని ఆయా ఆలయాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అచ్యుత రమేష్ బుధవారం దేవాదాయ మంత్రి కొండ సురేఖను కలసి  వినతిపత్రం ఇచ్చారు. ఒకే ఆలయానికి కొందరు రెండేసి కమిటీల...
Read More...
Local News 

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు) : ఉద్యోగ సిబ్బంది నిరంతరంగా అంకిత భావంతో చేసిన కృషితోనే దక్షిణ మద్య రైల్వే జోన్ కు దేశంలోనే నాలుగవ స్థానం దక్కిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. సౌత్ సెంట్రల్...
Read More...

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి  టిపిసిసి, ఎన్‌.ఆర్‌. సెల్‌ (కన్వీనర్‌), .షేక్‌ చాంద్‌ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.   ఎన్‌.ఆర్‌.ఐ గల్ఫ్‌ అడ్వైజరీ బొర్డు మీటింగ్‌లో ఈ క్రింద1....
Read More...