మాదకద్రవ్యాల వినియోగం ద్వారా హింస ,అనారోగ్యం, నైతిక విలువల పతనం
జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)
మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని హింస, అనారోగ్యం, నైతిక విలువల పతనం వంటి అనేక దుష్ప్రభావాల వైపు నడిపిస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా గురువారం పొలాస వ్యవసాయ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని విద్యార్థి దశ నుండే మన ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉండాలని అలాంటి ఆలోచన వల్లే మనం జీవితంలో అనుకున్నా స్థాయిలో రాణించగలుగుతామని అన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో యువత పోటీ తత్వంతో ఉండాలని నేటి యువత పైన దేశ అభివృద్ధి ఆధారపడి వుంటుందని అన్నారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండాలని వాటికి బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించి న సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు.
అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు.
అవగాహన సమావేశం అనంతరం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్న యువతను జాగృతం చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ఎస్పి విద్యార్థులతో కలిసి తిలకించారు.
కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సైదా నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమ కో ఆర్డినేటర్, కళాశాల ఎన్ సి సి లెఫ్టినెంట్ అధికారి, డీ-అడిక్ట్ ట్రైనర్ పర్లపల్లి రాజు, సి సి ఎస్ సి.ఐ శ్రీనివాస్, రూరల్ సి.ఐ కృష్ణారెడ్డి, రూరల్ ఎస్ ఐ సదాకర్, కళాశాల ఎన్ఎస్ ఎస్ అధికారి ఎల్లాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హైదరాబాద్-ఢిల్లీ విమానాల రద్దు: సాంకేతిక లోపాలతో విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి
హైదరాబాద్ నవంబర్ 08 (ప్రజా మంటలు):
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport) లో ఈరోజు (శనివారం) పలు విమాన సర్వీసులు సాంకేతిక లోపాల కారణంగా రద్దు అయ్యాయి.
విమానాశ్రయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం –
హైదరాబాద్–ఢిల్లీ, హైదరాబాద్–ముంబై, హైదరాబాద్–శివమొగ్గ విమానాలను రద్దు చేశారు.
అంతేకాకుండా, హైదరాబాద్–కౌలాలంపూర్, ... ఇంటర్స్టెల్లర్ ధూమకేతువు 3I/ATLAS రహస్య ప్రవర్తనతో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది
🌠 రహస్యమయమైన అతిథి — 3 I/ATLAS
నవంబర్ 8, 2025అంతరిక్షం / సౌరవ్యవస్థ సరిహద్దు: అంతరిక్ష శాస్త్రం, ఖగోళం
భూమికి బయట నుంచి వచ్చిన ఒక ఇంటర్స్టెల్లర్ ధూమకేతువు (Interstellar Comet) అయిన 3I/ATLAS, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది అక్టోబర్ 29న సూర్యుడి దగ్గరగుండా... ఎబిజెఎఫ్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాదస్తు రాజేష్
మెట్టుపల్లి నవంబర్ 07 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ కార్యాలయంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ (ఎబిజెఎఫ్) రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మహ్మద్ అబ్దుల్ ముస్సావీర్ ఆదేశాల మేరకు (ఎబిజెఎఫ్) జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా విజన్ ఆంధ్ర పేపర్ కోరుట్ల
ఈ... ఢిల్లీ విమానాశ్రయంలో ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు
400 లకు వందలకు పైగా విమాన రాకపోకలు ఆలస్యం, కొన్ని రద్దు.
ఇప్పటికీ ఇంకా సాధారణ స్థితికి రాని డిల్లీ విమానరాకపోకలు
హైదరాబాద్, నవంబర్ 07, ప్రజా మంటలు:
దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) ఈ రోజు మధ్యాహ్నం భారీ సాంకేతిక లోపం (Technical Glitch) సంభవించింది.... చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత
– బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయి ప్రియ, నందిని, తనూష కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత... హైదరాబాద్లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం ఆది బజార్–2025’
గిరిజన కళాకారులకు మార్కెట్ వేదికను అందిస్తోంది ఆది బజార్: దివ్య దేవరాజన్
హైదరాబాద్, నవంబర్ 7 ( ప్రజా మంటలు):
హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జాతీయ గిరిజన ఉత్సవం ‘ఆది బజార్–2025’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈవో దివ్య దేవరాజన్,... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.... ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు
జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు):
రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–... అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..
బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి...
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్
రాజ్యాంగాన్ని... మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ
జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం డిసెంబర్ 6_ 2025 శనివారం నుండి డిసెంబర్ 14 _2025 ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్... ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ
హైదరాబాద్, నవంబర్ 07 – ప్రజా మంటలు:
ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా కళాశాల యాజమాన్యాలు తమ బంద్ మరియు నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం... వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
దేశభక్తి, ఐక్యత ప్రతీకగా నిలిచిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పీఐబీ హైదరాబాద్ ఘనంగా నిర్వహించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది... 