మాదకద్రవ్యాల వినియోగం ద్వారా హింస ,అనారోగ్యం, నైతిక విలువల పతనం
జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)
మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని హింస, అనారోగ్యం, నైతిక విలువల పతనం వంటి అనేక దుష్ప్రభావాల వైపు నడిపిస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా గురువారం పొలాస వ్యవసాయ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని విద్యార్థి దశ నుండే మన ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉండాలని అలాంటి ఆలోచన వల్లే మనం జీవితంలో అనుకున్నా స్థాయిలో రాణించగలుగుతామని అన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో యువత పోటీ తత్వంతో ఉండాలని నేటి యువత పైన దేశ అభివృద్ధి ఆధారపడి వుంటుందని అన్నారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండాలని వాటికి బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించి న సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు.
అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు.
అవగాహన సమావేశం అనంతరం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్న యువతను జాగృతం చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ఎస్పి విద్యార్థులతో కలిసి తిలకించారు.
కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సైదా నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమ కో ఆర్డినేటర్, కళాశాల ఎన్ సి సి లెఫ్టినెంట్ అధికారి, డీ-అడిక్ట్ ట్రైనర్ పర్లపల్లి రాజు, సి సి ఎస్ సి.ఐ శ్రీనివాస్, రూరల్ సి.ఐ కృష్ణారెడ్డి, రూరల్ ఎస్ ఐ సదాకర్, కళాశాల ఎన్ఎస్ ఎస్ అధికారి ఎల్లాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిసి రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి
జగిత్యాల ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు) స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల తర్వాతనే జడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలకు వెళ్ళాలి. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బీసీ నాయకులు అన్నారు .
రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బిసిలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి, 42% రిజర్వేషన్లను కల్పించకుండానే సర్పంచ్... పలు ఆలయాలు సందర్శించిన మున్సిపల్ నూతన చైర్పర్సన్ దంపతులు
జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు) ఇటీవల జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జరగగా చైర్పర్సన్ గా ఎన్నికైన సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు జిల్లా కేంద్రంలోని ఎడ్లంగడి శ్రీ రామాలయం కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయాన్ని శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం... ఘనంగా శివాజీ జయంతి శోభాయాత్ర.
జగిత్యాల ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు)చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. శివాజీ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో భాగంగా మడేలేశ్వర స్వామి దేవాలయం వద్ద హిందూ ధర్మ ధ్వజాన్ని ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలక్ డాక్టర్ భీమనాతిని శంకర్ ఆవిష్కరించి శోభాయాత్ర... జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అవినీతీశాఖ వలలో నలుగురు ఉద్యోగులు
భూపాలపల్లి/మంథని ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు ప్రభుత్వ ఉద్యోగులను లంచం కేసుల్లో పట్టుకున్నారు.
భూపాలపల్లి జిల్లా కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్తో పాటు కోర్టు... కందేనకుంట కుల బహిష్కరణ ప్రచారం అవాస్తవం – సామాజిక సమరసత వేదిక నివేదిక
జగిత్యాల, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):బీరుపూర్ మండలం కందేనకుంట గ్రామంలో కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని సామాజిక సమరసత వేదిక (ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థ) నిజ నిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. సంఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు వేదిక సభ్యులు గ్రామాన్ని సందర్శించి... ఆర్డీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ
జగిత్యాల ఫిబ్రవరి 20(ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో జగిత్యాల ఆర్డీవో కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను రైతులకు త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ... అమీర్ పేట మైత్రీవనం చౌరస్తాలో అగ్ని ప్రమాదం – 60 మంది విద్యార్థులు సురక్షితం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
నగరంలోని హైదరాబాద్ అమీర్పేట మైత్రీవనం చౌరస్తాలో ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్లోని ఓ కోచింగ్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
కోచింగ్ సెంటర్లో మంటలు
ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు... ట్యాంక్ బండ్ పై ఫూలే విగ్రహ పనుల పరిశీలించిన కవిత–
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
ట్యాంక్ బండ్పై ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు.
అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి
రెండున్నరేళ్లుగా ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి... డీఎండీకే – డీఎంకే కూటమి: రాజకీయ లెక్కలు ఏమిటి?
చెన్నై ఫిబ్రవరి 20:
తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది.డీఎండీకే అధికార పార్టీ అయిన డీఎంకే కూటమిలో చేరింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల వరకు డీఎండీకే ఏ కూటమిలో చేరుతుందో స్పష్టత లేకుండా ఉంది. అధికార పార్టీ వైపు వెళ్తుందా? లేక ప్రతిపక్ష కూటమిలో చేరుతుందా? అనే సందేహాలు... నీట్–ఎస్ఎస్ ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
చెన్నై, ఫిబ్రవరి 19:
నీట్–ఎస్ఎస్ 2024–25 ప్రవేశాల విషయంలో కీలక తీర్పు వెలువడింది. కౌన్సెలింగ్కు నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత ఖాళీ సీట్లు ఉన్నాయనే కారణంతో అదనపు మాప్-అప్ కౌన్సెలింగ్కు అనుమతి ఇవ్వడం సరికాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్లతో కూడిన ధర్మాసనం... రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: తెలంగాణ అభివృద్ధి రోడ్మ్యాప్పై జాతీయ నేతలతో చర్చ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తెలంగాణ అభివృద్ధి దిశను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ప్రతినిధి బృందం మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీలను కలిసి తెలంగాణ... బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)::
బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పార్టీని లోపల నుంచే పీడిస్తున్న వారు ఇకనైనా పార్టీని విడిచిపెట్టాలని అన్నారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదిగిందని పేర్కొన్న అర్వింద్, దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత... 