మహిళా చట్టాలపై జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు
జగిత్యాల మే 31 (ప్రజా మంటలు)
మహిళల రక్షణ,వారి చట్టాలపై అవగాహన లక్ష్యంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మహిళల పై జరిగే నేరాలపై పోలీసులకు సంప్రదించవలసిన తీరుపై, షీ టీం, భరోసా సెంటర్ యొక్క పనితీరు గురించి జిల్లా కేంద్రం లోని జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ , ధరూర్ క్యాంప్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భం గా బరోసా కేంద్రం, షీ టీం వారు పిల్లలు, మహిళలు అనుభవించే వేధింపులు, హింసకు చట్ట పరంగా ఉన్న పరిష్కారాలను వివరించారు. అవసరమైనప్పుడు పోలీసుల సహాయాన్ని తీసుకోవాలంటూ సూచించారు.
నేరుగా సంప్రదించలేను వారు షీ టీం నెంబర్ కి 8712670783 సంప్రదించాలని అన్నారు. ఉపాధ్యాయులు సమాజాన్ని మౌల్డ్ చేసే ముఖ్యమైన స్థంభాలని అభివర్ణించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మహిళా చట్టాలు, లైంగిక వేధింపుల నివారణ చట్టం (పోస్కో యాక్ట్ ), వంటి చట్టాలపై అవగాహన కలిగించాలన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల నైతిక అభివృద్ధికి మద్దతుగా ఉండాలని వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని చట్టబద్ధంగా పరిష్కరించే దిశగా ముందడుగు వేయాలన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో సీసీఎస్ ఎస్.ఐ రవీందర్ , భరోసా సెంటర్ కోఆర్డినేటర్ అనూష , సపోర్ట్ పర్సన్స్ సుజాత ,సౌజన్య మహిళా కానిస్టేబుల్ లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.
