సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

On
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

జగిత్యాల జూన్ 2:

తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అవతరణ  దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్  రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆవరణలో  ఆవిష్కరించారు.

అనంతరం  తెలంగాణ ఉద్యమం లో ఉద్యమించిన టీ ఉద్యోగుల జేఏసి జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి, కో చైర్మన్ ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎం.డి.వకీల్,పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు కే.అరుణ,సీనియర్  సిటీజేన్స్ సెక్షన్ అసిస్టెంట్ పద్మజ,  రిటైర్డ్ తహశీల్దార్ పి.హన్మంత రెడ్డి,సిటీజేన్స్ నేతలు  అత్తినేని రాజ మల్లయ్య,కేసెట్టి ప్రసాద్, ఆలిశెట్టి నారాయణ,నాయిని సంజీవ రావు,నీలగిరిజగదీశ్వర్ రావు,మేరుగు సత్యనారాయణ,ఎం.డి.యాకూబ్,నక్క ఇంద్రయ్య,దేవేందర్ రావు,రాపర్తి రాజేశం,వీరారెడ్డి,గంగం జలజ,లతో సహా 16 మందిని ఆర్డీవో పి.మధుసూదన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.అనంతరంహరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ 1969 లో తాను జగిత్యాల డివిజన్ తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఉద్యమాన్ని ఉదృతం చేశామన్నారు.ఎన్నో సార్లు అరెస్ట్ ,జైలు కు గురయ్యామన్నారు.కరీంనగర్ కలెక్టరేట్ పై తెలంగాణ జెండా ఆవిష్కరించిన క్రమంలో పోలీసుల లాఠీ దెబ్బలకు గురై 15 రోజులు ఆస్పత్రి పాలయ్యామని,వారం రోజులు జైలు శిక్షకు గురయ్యామని,తొలి,మలి  దశ ఉద్యమాల్లో ట్రెసా జగిత్యాల డివిజన్  అధ్యక్షుడుగా,ఎం.డి.వకీల్ కార్యదర్శి గా డివిజన్ వ్యాప్తంగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నామని,కోరుట్ల నియోజకవర్గములో 42 రోజుల సమ్మె లో చిరుద్యోగులకు  అప్పటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రూ.6 లక్షలు ఇవ్వగా ఎం.డి.వకీల్,టీ ఎన్జీఓ అధ్యక్షుడు హన్మంత రెడ్డి ల సహకారం తో  అందజేశామని గుర్తు చేశారు.ఉద్యమ సమయంలో ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడుగా ఉన్న నా ఇంటిపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఒక రోజు స్టేషన్ లో ఉంచి బైన్డ్ ఓవర్ చేశారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమ సంబరాల్లో సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వేల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షుడు పి.సి హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు,కె.సత్యనారాయణ,నాయకులు కొక్కుల నారాయణ,నక్క ఇంద్రయ్య,జిల్లా,డివిజన్,వివిధ మండల,గ్రామాల సీనియర్ సిటీజేన్స్ ,పెన్షనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఎండపల్లి  గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో  తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

ఎండపల్లి  గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో  తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. గొల్లపల్లి, వెలుగటూర్ జూన్ 4 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా లోని ఎండపల్లి మండలంలోని గొడిశెలపేట్, వెల్గటూర్ మండలంలోని మొక్కరావుపేట్, గోల్లపెల్లి మండలంలోని దట్నూర్ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .  తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భూ సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుటకై ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం–2025 మరియు...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే..                                - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్  

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే..                                - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్     కోరుట్ల జూన్ 04  : వయోవృద్ధులైన కన్న తల్లి,దండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షార్హులేనని ,జైలు శిక్ష ,జరిమానా తదితర   చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్ హెచ్చరించారు.బుధవారం కోరుట్ల  డివిజన్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ,సంరక్షణ...
Read More...
Local News 

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి  మెటుపల్లి డీఈ గంగారాం మెటుపల్లి జూన్ 4 ( ప్రజా మంటలు) డివిజన్ వ్యాప్తంగా రెండు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయితీలు మరియు అన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను తమ నెట్వర్క్ విస్తరణకు వాడే కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పోల్ టాక్స్ చెల్లించాలని మెటుపల్లి డీఈ గంగారాం కోరారు. డివిజన్ లోని సమస్త...
Read More...
Local News 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం  గొల్లపల్లి జూన్ 04 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని  బొంకూర్ గ్రామంలో నేడు 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం ఉత్సాహంగా జూన్ 5 నుండి 18, వరకు  వ్యవసాయ శాస్త్రవేత్తలకు మరియు రైతులకు ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్య నిర్వహణ, పంట మార్పిడి, యూరియా యొక్క సరైన వినియోగం, వ్యవసాయంలో...
Read More...
Local News 

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ 

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్  జగిత్యాల జూన్ 4( ప్రజా మంటలు) గంగమ్మ తల్లి బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమని జగిత్యాల జిల్లా వాణి నగర్, బిగ్ బజార్, బోయవాడ, పురానిపేట లో గంగమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు.  ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్   హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్...
Read More...
Local News 

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్    జగిత్యాల జూన్ 4 ( ప్రజా మంటలు)  పట్టణములోని 4 వార్డు సంబంధించి  టి యు ఎఫ్ ఐ డి సి ఫేస్ 1 లో భాగంగా 30 లక్షల నిధులతో సీసీ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల ఈ...
Read More...
Local News  State News 

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే... మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే  - కాళేశ్వరం కమిషన్ కాదు... అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ?ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది ? ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం  హైదరాబాద్ జూన్ 04: కాళేశ్వరం కమిషన్ కేసీఆర్...
Read More...
Local News 

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్  – అమీర్పేట లో సెలబ్రేషన్స్

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్  – అమీర్పేట లో సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, జూన్ 4, (ప్రజా మంటలు):  18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సంచలనాత్మక ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.చివరి బంతి వేయగానే...
Read More...
Local News  State News 

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్ అందరి సహకారంతో ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలి  - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 4( ప్రజా మంటలు)ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ బ్రాహ్మణ సమాజానికి సూచించారు.జగిత్యాల బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో బుధవారం, ధ్యాన మందిరం నిర్మాణం...
Read More...
Local News 

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి 

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి  సికింద్రాబాద్ జూన్ 04 (ప్రజా మంటలు): రానున్న బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  స్థానిక ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆయా శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ట్రాఫిక్, శానిటేషన్ రూల్స్ పాటించాలని సూచించారు. అత్యవసరమైతే...
Read More...
Local News 

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం భీమదేవరపల్లి జూన్ 3 (ప్రజామంటలు) : వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు జాగృతి పోలీస్ కళా బృందం నిర్వహించిన అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షించింది....
Read More...
Local News 

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఇబ్రహీంపట్నం జూన్ 03 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):   తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం 2025 అమలు చేయుటకు గాను, ఇబ్రహీంపట్నం మండలంలో గల రెవెన్యూ గ్రామాలలో గ్రామాల వారిగా పకీర్ కొండాపూర్, ఎర్రపూర్ గ్రామాలలో   భూ భారతి రెవెన్యూ
Read More...