సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.
జగిత్యాల జూన్ 2:
తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆవరణలో ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ ఉద్యమం లో ఉద్యమించిన టీ ఉద్యోగుల జేఏసి జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి, కో చైర్మన్ ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎం.డి.వకీల్,పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు కే.అరుణ,సీనియర్ సిటీజేన్స్ సెక్షన్ అసిస్టెంట్ పద్మజ, రిటైర్డ్ తహశీల్దార్ పి.హన్మంత రెడ్డి,సిటీజేన్స్ నేతలు అత్తినేని రాజ మల్లయ్య,కేసెట్టి ప్రసాద్, ఆలిశెట్టి నారాయణ,నాయిని సంజీవ రావు,నీలగిరిజగదీశ్వర్ రావు,మేరుగు సత్యనారాయణ,ఎం.డి.యాకూబ్,నక్క ఇంద్రయ్య,దేవేందర్ రావు,రాపర్తి రాజేశం,వీరారెడ్డి,గంగం జలజ,లతో సహా 16 మందిని ఆర్డీవో పి.మధుసూదన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.అనంతరంహరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ 1969 లో తాను జగిత్యాల డివిజన్ తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఉద్యమాన్ని ఉదృతం చేశామన్నారు.ఎన్నో సార్లు అరెస్ట్ ,జైలు కు గురయ్యామన్నారు.కరీంనగర్ కలెక్టరేట్ పై తెలంగాణ జెండా ఆవిష్కరించిన క్రమంలో పోలీసుల లాఠీ దెబ్బలకు గురై 15 రోజులు ఆస్పత్రి పాలయ్యామని,వారం రోజులు జైలు శిక్షకు గురయ్యామని,తొలి,మలి దశ ఉద్యమాల్లో ట్రెసా జగిత్యాల డివిజన్ అధ్యక్షుడుగా,ఎం.డి.వకీల్ కార్యదర్శి గా డివిజన్ వ్యాప్తంగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నామని,కోరుట్ల నియోజకవర్గములో 42 రోజుల సమ్మె లో చిరుద్యోగులకు అప్పటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రూ.6 లక్షలు ఇవ్వగా ఎం.డి.వకీల్,టీ ఎన్జీఓ అధ్యక్షుడు హన్మంత రెడ్డి ల సహకారం తో అందజేశామని గుర్తు చేశారు.ఉద్యమ సమయంలో ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడుగా ఉన్న నా ఇంటిపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఒక రోజు స్టేషన్ లో ఉంచి బైన్డ్ ఓవర్ చేశారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమ సంబరాల్లో సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వేల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షుడు పి.సి హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు,కె.సత్యనారాయణ,నాయకులు కొక్కుల నారాయణ,నక్క ఇంద్రయ్య,జిల్లా,డివిజన్,వివిధ మండల,గ్రామాల సీనియర్ సిటీజేన్స్ ,పెన్షనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
