నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..
On
*మూడు బయోమెట్రిక్ లకు కాస్తా గ్యాప్ అవసరం
*సన్నబియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి
*అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఏఆర్ కృష్ణవేణి
సికింద్రాబాద్ మే31 (ప్రజామంటలు):
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు ఇవ్వనున్న రేషన్ సన్న బియ్యం మూడు నెలలకు సంబందించిన పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈసారి వర్షాలు ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో అందించే విధంగా రాష్ట్ర పౌర సరఫరాల (సివిల్ సప్లై) అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జూన్ 1 నుండి 30 తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రంలోని డీలర్లు నెల మొత్తంలో మూడుసార్లు బయోమెట్రిక్ లను ఉపయోగించి లబ్దిదారులకు మూడు నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయన్నారు.వరసగా మూడు నెలలకు సంబందించిన మూడు బయోమెట్రిక్ వేలి ముద్రలకు ఒక్కో దానికి కనీసం సమయం గ్యాప్ అవసరం ఉన్నందున మూడు నెలల రేషన్ ఒకేసారి కాకుండా ఒక్కో రోజు గ్యాప్ ఇచ్చి లబ్దిదారులు తీసుకోవాలని సికింద్రాబాద్ సహాయ పౌరసరఫరాల శాఖాధికారి ఏఆర్ కృష్ణవేణి తెలిపారు. ఈ రేషన్ బియ్యం పంపిణీలపై ఎటువంటి అపోహలు నమ్మవద్దని ఆమె అన్నారు. రేషన్ దుకాణాల వద్ద అవగాహన కోసం తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో బ్యానర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. రేషన్ డీలర్లు కార్డు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఈ రేషన్ బియ్యాన్ని అందజేస్తారని ఆమె తెలిపారు.
సాఫ్ట్ వేర్ అప్డేట్ లోపం కారణంగా ఏమైనా ఆలస్యం అయితే కార్డు లబ్ధిదారులు సంయమానం పాటించాలని ఆమె సూచించారు. జూన్ నెల ఒకటి నుండి 30 వరకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని పొందే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని, రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సహాయ పౌరసరఫరాల అధికారి ఏ. ఆర్. కృష్ణవేణి కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ
Published On
By Special Reporter

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.
Published On
By Special Reporter

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి
Published On
By Special Reporter

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు, మందుల పంపిణీ
Published On
By Special Reporter

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ
Published On
By Siricilla Rajendar sharma

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
Published On
By Special Reporter
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
Published On
By Special Reporter
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం
Published On
By Special Reporter

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*
Published On
By Special Reporter

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
Published On
By Special Reporter
