తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ
కాంగ్రెస్ సనత్ నగర్ ఇంచార్జి డా. కోట నీలిమ నేతృత్వంలో ఘనంగా నిర్వహణ
*బేగంపేట నుండి రసూల్పుర వరకు ఉత్సాహభరితంగా సాగిన ర్యాలీ
సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు):
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ, ఏఐసీసీ మెంటర్ డా. కోట నీలిమ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన విభాగాలు, కార్యకర్తలు, సైక్లింగ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ర్యాలీ బేగంపేట్ విమానాశ్రయ రోడ్డులో ప్రారంభమై రసూల్పుర సర్కిల్వరకు సాగింది. ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం కోసం జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, ఆ ఉద్యమం ఆవిర్భావ స్ఫూర్తిని మరలా ప్రజల్లో కలిగించే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా డా. కోట నీలిమ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం సాగిన ఉద్యమం అని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి, వారి అభివృద్ధికి కృషి చేస్తోంది" అని తెలిపారు. ర్యాలీ అనంతరం సామూహికంగా తెలంగాణ గీతం ఆలపించారు. స్థానికులకు మిఠాయిలను పంచిపెట్టారు.ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
