సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..
జగిత్యాల మే 31(ప్రజా మంటలు)
పరిపాలనకు స్ఫూర్తి అహల్య భాయ్ జీవితమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి అన్నారు.
పుణ్యశ్లోక, రాజమాత రాణి అహల్యబాయి హోల్కర్ 30 ఏళ్ల పరిపాలన కాలం స్వర్ణయుగం లాంటిదని అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న కులవృత్తులను చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇచ్చి కులవృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.
అహల్య బాయి జన్మదినం సందర్బంగా జగిత్యాలలో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొన్న గంగారెడ్డి మాట్లాడుతూ రెండు వందల డెబ్భై సంవత్సరాల క్రితమే రాణి అహల్యబాయి తన ఏలుబడిలో ఉన్న రాజ్యంలోని మహేశ్వరం వద్ద వస్త్ర పరిశ్రమలను నెలకొల్పి చేనేత వృత్తిని ప్రోత్సహించినదని ఆకాలంలోనే బంగారు, వెండితో జరి, పట్టు చీరలు తయారుచేశారని ఆచీరలు మహేశ్వరం చీరలుగా ఎంతో ప్రాచుర్యం పొంది విదేశాలకు సైతం ఎగుమతి చేశారని అన్నారు.
రాణి అహల్యబాయి నిత్యం ప్రజాక్షేత్రంలో పర్యటించి రోజుకొక్క చేతివృత్తుల వారితో, కులవృత్తుల వారితో విడివిడిగా సమావేశమయి వారి సమస్యలకు పరిష్కారం చూపేవారని అంతేకాకుండ వారితో కుల, మత, వర్ణ, లింగ భేదం లేకుండా సహాపంక్తి భోజనాలు కూడా చేసేవారని అందుకే ఆమెను రాజమాత అని పిలిచేవారని అన్నారు
ఎలాంటి నేలల్లో ఎలాంటి పంటలు వేయాలి రైతులకు ఎంతమేరకు రాయితీ ఇవ్వాలో అని నిర్ణయించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. అహల్య బాయి యొక్క పాలనను స్ఫూర్తిగా తీసుకొని నేడు నరేంద్రమోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని అందుకే చేతి వృత్తులను, కులవృత్తులను ప్రోత్సహించడానికి విశ్వకర్మ యోజన పథకం, ఆత్మ నిర్భర్ భారత్,మేక్ ఇండియా, మేడ్ ఇండియా, స్కిల్ ఇండియా ద్వారా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ ఆర్ధికవ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 4వ స్థానానికి తీసుకువచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని దేశంలో ప్రాథమిక రంగం అయిన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఎరువులపై వేలకోట్లు రాయితీలు ఇచ్చి పెట్టుబడి సాయంగా ఏడాదికి ఎకరాకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అరువేల రూపాయలు ఇచ్చి రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో అహల్యబాయి,అంబెడ్కర్ గార్ల ఆలోచనలకు అనుగుణంగా అంత్యోదయ అనే మూల సిద్దాంతంతో నరేంద్రమోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని అందుకే పదకొండేళ్ల పాలనలో 18వేల ఆదివాసీ గ్రామాలకు, తండాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించారని అన్నారు. గూగుల్ సామ్రాజ్యంలో ధ్వంసం చేయబడ్డ 157 గుళ్లను పునరుద్ధరించి భక్తులకు కావలసిన ధర్మశాలలు రోడ్డు సౌకర్యాలు ఏర్పరిచి తన ఆధ్యాత్మిక దాతృత్వాన్ని చాటుకున్నారని అన్నారు.
ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, రుద్ర శ్రీనివాస్, గుంటుక సదశివ్ కమిటీ అధ్యక్షులు మర్రిపెల్లి సత్యమ్,సభ్యులు సాంబారి కళావతి, దురిశెట్టి మమత,కొక్కు గంగాధర్,నలువాల తిరుపతి, దశరథ రెడ్డి, ఆముద రాజు, భానుప్రియ, పుష్ప రెడ్డి,అన్ని మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు, మందుల పంపిణీ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
