సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్
-ముగ్గురు పేద విద్యార్థులకు సైకిళ్ళ బహుకరణ
సీనియర్ సిటిజెన్ల ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం.
-అవగాహన కల్పించిన హరి ఆశోక్ కుమార్. జగిత్యాల జూన్ 03:
సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షులు హరి ఆశోక్ కుమార్ అన్నారు.మంగళవారం ప్రపంచ సైకిల్ దినోత్సవంను జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర సైకిళ్ల డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా సేవలందించిన జగిత్యాల పట్టణ ప్రముఖులు స్వర్గీయ పుప్పాల నారాయణ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ తండ్రి పుప్పాల నారాయణ యాదిలో ముగ్గురు పేద విద్యార్థులకు సైకిళ్ళు హరి ఆశోక్ కుమార్,పుప్పాల నర్సింగా రావు,పుప్పాల కిశోర్ కుమార్ లు బహుకరించారు.అనంతరం హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ 2018 ఏప్రిల్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించిదన్నారు. సైకిల్ వాడకం వలన కలిగే ప్రయోజనాలను వివేకానంద స్టేడియంలో హరి ఆశోక్ కుమార్ సైకిల్ తొక్కుతూ విద్యార్థి జేఏసి ప్రతినిధులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విష్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు బొల్లం విజయ్,పి.హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్, విద్యార్థి జేఏసి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దోనూరి భూమాచారి, పెన్షనర్స్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కే.సత్యనారాయణ,సంయుక్త కార్యదర్శులు దిండిగాల విట్ఠల్, పట్టణ కోశాధికారి సింగం గంగాధర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,మెట్ పల్లి అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,మల్యాల అధ్యక్షుడు ముకుంద దేవరెడ్డి,సయ్యద్ యూసుఫ్,యాకూబ్ హుస్సేన్,విజయ లక్ష్మీ,జలజ,వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
