ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అల్లాఉద్దీన్ కోటి ప్రాంతంలో డా.కోట నీలిమ పర్యటన
సికింద్రాబాద్, మే 31 ( ప్రజామంటలు):
ప్రస్తుత వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సనత్నగర్ కాంగ్రెస్ డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు. శనివారం ఆమె జీహెచ్ఎమ్సీ, టీజీఎస్పీడీసీఎల్, మెట్రో వాటర్ శాఖల అధికారులతో కలసి సనత్ నగర్ డివిజన్ అల్లాఉద్దీన్ కోటి ప్రాంతంలో పర్యటించారు. ఈసందర్బంగా ప్రజలతో మమేకమై, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసారి వర్షాలు ఎక్కువగా కురుస్తాయానే వాతావరణ శాఖ సూచనలను ఆయా శాఖల అధికారులు పరిగణలోనికి తీసుకొని, ముంపు ప్రాంతాల్లో వరదలు, నీటి నిల్వ లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి నిల్వ వలన దోమలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి, రోగాల బారిన పడకుండా అధికారుల సూచనలను పాటిస్తూ, జాగ్రత్తగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్, రహదారుల పరిస్థితి,మౌళిక సదుపాయలపై ఆమె స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎమ్సీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, ఇంజనీరింగ్ ఏఈ జమీల్,శానిటేషన్ అధికారి అరవింద్,కరెంట్ ఏఈ శేఖర్, మెట్రోవాటర్ అధికారి హిందూజా నాయకులు అజ్జుభాయ్,ఎలీషా,ఇవాన్,మోహిసిన్,అతీక్, సవిత,కమల్,అనిత,అబేదాబీ,మతీన్,భూలక్ష్మీ,షాహిద్, కనాల్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు, మందుల పంపిణీ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
