రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*
సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు):
రాజమాత అహల్యా బాయి హోల్కర్ త్రిశతాబ్ది (300) జయంతి సందర్భంగా కవాడిగూడ సి.జీ.ఓ. టవర్స్ నుండి గాంధీ నగర్ వరకు వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు జి. భరత్ గౌడ్, జయంతి ఉత్సవాల కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాణి అహల్యబాయ్ తన సంస్థానం నుండి వచ్చిన ఆదాయంతో దేశంలో అనేక సంస్థానాలలో హిందూ దేవాలయాలను నిర్మించారని అన్నారు. స్వతహాగా శివుని భక్తురాలైన అహల్యబాయి సేవకు దానధర్మాలకు మారుపేరుగా నిలిచారని అన్నారు. ముస్లిం రాజుల దాడులతో శిథిలమైన కాశీ,ద్వారక, మధుర, ఉజ్జయిని,రామేశ్వరం, అయోధ్య,హరిద్వార్, కృశ్నేశ్వర్ పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించారని కొనియాడారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఇండోర్ విమానాశ్రయానికి రాణి అహల్యబాయ్ హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మహంకాళి జిల్లా మాజీ అధ్యక్షులు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, బిజెపి మహిళా కార్పోరేటర్లు కేతినేని సరళ, చీర సుచిత్ర, కొంతం దీపిక, సుప్రియ, ఎ. పావని గారు, కుమారి జి. రచనశ్రీ, కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బాణుక నర్మద,జయంతి ఉత్సవాల సహా కన్వీనర్లు శారద, అనిత, అరవింద్, నాగేశ్వర్ రెడ్డి, అనూష, కెఎమ్ .కృష్ణ, వై. శ్రీనివాస్ ముదిరాజ్, బీజేపీ మీడియా ఇంచార్జ్ రామువర్మ, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు, మందుల పంపిణీ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
